రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వలస కార్మికుల సమస్యల పై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కొద్ది రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని పై శనివారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మీదుగా నడిచి వెళ్తున్న వలస కార్మికులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. కార్మికులను స్వసలాలకు చేర్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించింది. అంతే కాకుండా వారికి నగదు సాయం అందించాలని, ఆహార భద్రత కల్పించాలని ఆదేశించింది. మరోవైపు వలస కార్మికుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తరలించేందుకు అవసరమైన సదుపాయాలను ఆయా ప్రభుత్వాలే కల్పించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు.

చాలా మంది కార్మికులు కాలినడకన సొంతూర్లకు వెళ్తు న్నారని, వారంతా రోడ్లు, రైల్వే ట్రాక్ పై నడిచి వెళ్లకుండా రవాణా సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆహారం తోపాటు అవసరమైన చోట్ల షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు కూడా రాసింది. ఈ నేపథ్యంలో, హైకోర్ట్ తీర్పు, కేంద్రం ఆదేశాలతో, రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. వలస కార్మికుల కోసం బస్సులు నడపాలని జగన్ అధికారులను ఆదేశించారు. కాగా.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి కె.రామకృష్ణహర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు సూచించిన విధంగా వలస కార్మికులను ఆదుకుని, ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న పోలీసులు కార్మికులను కొట్టటం పై, ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరో పక్క, విజయవాడ పటమటలో ఉంటున్న వలస కార్మికుల పై పోలీసుల లాఠీ ఛార్జ్ ను టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండించారు. వలస కార్మికుల గదుల్లోకి వెళ్లి లాఠీఛార్జి చేయడాన్ని తప్పుబట్టారు. పనుల్లేవు, ఉపాధి లేదు, ఆకలి దప్పులతో అవస్థలు పడుతుంటే... సహాయం చేయాల్సింది పోయి దాడి చేయడం ఏమిటి.? నిన్న ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో కూడా ఇలానే దాడి చేశారు. ఎక్కడెక్కడి నుండో కాలి నడకన స్వస్థలాలకు వెళ్తున్న వారిపై జాలి చూపించకుండా లాఠీ చార్జి చేయడం దుర్మార్గం అన్నారు. కేంద్రం, సుప్రీం కోర్టు సూచనల మేరకు వెంటనే వాళ్లకు భోజనం, వసతి, స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

విశాఖపట్నంలోని, నర్సీపట్నంలో నిజాయతీగా పని చేసి పేరు తెచ్చుకున్న దళిత డాక్టర్ సుధాకర్, కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు వైద్య సిబ్బందికి సరిపడా యన్-95 మాస్కులు, పి.పి.ఇ.లు లేవని అనటంతో, ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తరువాత డా.సుధాకర్ ని సస్పెండ్ చేయటం, ఆయన కుమారుడు నిబంధనలు ఉల్లంఘించాడని కేసులు పెట్టటం, ఇప్పుడాయన్ని చావబాది అరెస్ట్ చేయటం చూసాం. డా.సుధాకర్ ను నడిరోడ్డుపై చొక్కా విప్పి పెడరెక్కలు వెనక్కి విరిచి, కట్టి లాఠీలతో కొడుతూ అరెస్ట్ చేసారు. అయితే నిన్న సాయంత్రం ఆయన తాగి ఉన్నాడని చెప్పిన పోలీసులు, నిన్న రాత్రి ఆయనకు మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని చెప్పారు. దీంతో ఆయన్ను మెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. అయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎవరికైనా ఇదే గతి అనే కాదు, ఈ ఘటన దళితుల పట్ల వైకాపా ప్రభుత్వాని కున్న చులకన భావానికి నిదర్శనమంటు, దళిత నేతలు ఆందోళన చేస్తున్నారు.

అయితే ఈ విషయం పై, వైసీపీ కీలక నాయకుడు, విజయసాయి రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, నిన్న డాక్తర సుధాకర్ ఘటన మొత్తం, చంద్రబాబు స్క్రిప్ట్ అంటూ, ఒక్క ముక్కలో తీసి పడేసారు. సుధాకర్ ఘటనకు చంద్రబాబు కారణం అని, ఎప్పుడూ చెప్పినట్టే చెప్పారు. గతంలో కూడా ఏ వ్యతిరేక సంఘటన జరిగినా, వారికి కులం అంటగట్టటం, వారికి తెలుగుదేశం పార్టీ రంగు పులమటం చేస్తూ ఉన్నట్టే, ఈ సారి కూడా, చంద్రబాబు మీద తోసేసారు విజయసాయి రెడ్డి. ఆయన ట్వీట్ ఇది. "బాబు వాడకం ఎలా ఉంటుందంటే జీవితకాలంలో వాళ్లు చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా గంగలో కలిసిపోతుంది. ఎల్లోవైరస్ ప్రభావంతో వైజాగ్ లో మత్తు డాక్టర్ చేసిన వీరంగం చూస్తే అర్థం కావడం లేదా నెక్స్ట్ ఎవరని! అయ్యో అంత అన్యాయం జరిగిందా అని ఒక ప్రెస్ నోటు రిలీజవుతుంది."

అయితే ఈ ఘటన పై తెలుగుదేశం పార్టీ, మాజీ మంత్రి వర్యులు పీతల సుజాత స్పందించారు. "విశాఖపట్నంలో దళిత డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడికి, ఆయన ఆరోగ్య స్థితికి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలి. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసులు పెట్టాలి. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ ను వెంటనే రద్దు చేయాలి. డాక్టర్ సుధాకర్ పై ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత డాక్టర్ పై దాడి చేయడం, దళితుల నుండి వేలాది ఎకరాల అసైన్డ్ భూములు లాక్కోవడం, దళిత నియోజకవర్గంలో ఉన్న రాజధానిని నాశనం చేయడమేనా వైసీపీ దళితులకు చేస్తున్న మేలు.? నాడు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని వైఎస్ఆర్ ఇడుపులపాయకు, హైదరాబాద్ రింగ్ రోడ్డుకు మళ్లించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని నవరత్నాలకు మళ్లిస్తున్నారు. ఇదేనా దళితులకు చేస్తున్న మేలు.? వేలాది దళిత కుటుంబాలు వైసీపీ నేతల దాడులకు, దౌర్జన్యాలకు భయపడి ఎక్కడెక్కడో తలదాచుకునే పరిస్థితి కల్పించడమేనా దళితుల సంక్షేమం.? గత ప్రభుత్వ హయాంలో దళితులకు అందే ప్రతి సంక్షేమ పథకాన్ని నిలిపివేయడమేనా దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రేమ.? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక చర్యలను విడనాడాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని గుర్తుంచుకోవాలి." అని అన్నారు.

విశాఖపట్నంలో, ఈ రోజు డాక్టర్‌ సుధాకర్‌, అర్ధనగ్నంగా ఉంటూ, పోలీసులు చేతులు వెనక్కు విరిచేసి, చేతులు కట్టేసి, ఆయన్ను ఆటో ఎక్కిస్తూ ఉన్న దృశ్యాలు అందరూ చూసారు. నర్సీపట్నం హాస్పిటల్ లో, మాస్కులు ఇవ్వలేదు అని అడిగినందుకు, అప్పట్లో ప్రభుత్వ డాక్టర్ గా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ ను , ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఈ రోజు ఆయన ఆందోళన చెయ్యటం, అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు, ఆయన చేతులు వెనక్కు విరగదీసి తాళ్లు కట్టి పోలీస్ స్టేషన్ కు తరలించటం చూసాం. ఈ ఘటన చూసిన అందరూ, ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. దళితుడుగా పుట్టి, పేదరికంలో పెరిగి, అన్నీ తట్టుకుని, కష్టపడి చదువుకుని డాక్టర్ అయ్యి, 20 ఏళ్ళు సర్వీస్ చేసిన ఒక డాక్టర్ కు, ఈ రోజు ఈ పరిస్థితి పట్టింది అంటే, అది కేవలం ప్రభుత్వ వైఖరి వల్లే అని విపక్షాలు విమర్శించాయి. తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఉదంతం పై, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక దళితుడు, మిమ్మల్ని ప్రశ్నిస్తే తట్టుకోలేక, ఈ పరిస్థితికి తెచ్చారా అని ప్రశ్నించారు.

అయితే ఈ మొత్తం ఘటన పై, విశాఖపట్నం పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా స్పందించారు. ముందుగా తమకు పోర్ట్ ఆసుపత్రి వద్ద ఒక వ్యక్తి నడి రోడ్డు పై, అనుచితంగా ప్రవర్తించారని, తమకు డయిల్ 100 కు ఫోన్ వచ్చిందని చెప్పారు. తమకు ఫిర్యాదు రాగానే, అక్కడ దగ్గరలో ఉన్న పోలీసులను స్పాట్ కు పంపించామని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. డాక్టర్ సుధాకర్ చిత్తుగా తాగి ఉన్నారని, కమీషనర్ చెప్పారు. తాగి ఉండటంతో, ఆయన మాట వినలేదని, అందుకే ఫోర్సు తో అరెస్ట్ చేసి, వైద్య పరీక్షలు కోసం, కేజీహెచ్‌కు తరలించామని చెప్పారు. అయితే, మరో పక్క, అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కూడా సస్పెండ్ చేసినట్టు, ఆర్కే మీనా మీడియాకు చెప్పారు.

అంటే పోలీసులు తప్పు ఉందని ఒప్పుకున్నారు. ఒక వేళ డాక్టర్ తాగి ఉన్నా, ఆయన్ను అలా చేతులు వెనక్కు విరగదీసి, తాడులతో కట్టేసి, అంత మంది పోలీసులు ఆయన్ను అలా ఈడ్చుకుని వెళ్ళటం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎంతో మంది తాగి రోడ్డుల మీద తిరుగుతుంటే, ఇలాగే కట్టేసి, ఈడ్చుకుని స్టేషన్ లో పడేస్తున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఇలా మందు తాగి రోడ్డుల మీదకు రావటానికి ప్రభుత్వం కాదా, కరోనా టైంలో ఎందుకు షాపులు ఓపెన్ చేసారు అని ప్రశ్నిస్తున్నారు. సుధాకర్ ను అలా ఈడ్చుకుని వెళ్ళటం తప్పు కాబట్టే, అన్ని వైపుల నుంచి విమర్శలు రావటంతోనే, ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసారని, ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకాలని ప్రభుత్వం చూస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు.

నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుధాకర్, కరోనా నియంత్రణకు పాటుపడుతున్న డాక్టర్లకు కనీసం మాస్కులు , పీపీఈ కిట్లు కూడా అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. దీని పై తట్టుకోలేని ప్రభుత్వం సుధాకర్ ను విధులనుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి తీవ్ర మనో వేదనకు గురైన సుధాకర్ శనివారం సాయంత్రం పోర్టు హాస్పటల్ ఎదుట హైవేలో నడి రోడ్డు పై కనిపించారు. ఒంటి మీద షర్టు లేకుండా, రోడ్డుపై పడి ఉన్నాడు. అతని చేతులు వెనక్కు విరిచి తాళ్ళతో కట్టేసి ఉన్నాయి. పోలీసులు అతన్ని ఆటోలో ఎక్కించుకుని నాల్గవ వట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీని పై పోలీసులను ప్రశ్నించగా మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ వచ్చి హడావుడి చేశాడని అందుకే అరెస్ట్ చేసామని చెప్పారు. దీనిపై నగర పోలీసు కమిషనర్ స్పందిస్తూ, డాక్టర్ సుధాకర్ చిత్తుగా తాగి నడి రోడ్డు పై అనుచితంగా ప్రవర్తించినట్టు 100కి ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో విధుల్లో ఉన్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని వైద్య వరీక్షల నిమిత్తం సుధాకర్‌ను కేజీహెకు తరలించామన్నారు.

అయితే ఇదంతా ఇలా ఉండగా, నిన్న తాగి ఉన్నాడని, చెప్పిన ప్రభుత్వం, పోలీసులు, నిన్న రాత్రి, సుధాకర్ కు మెంటల్ కండీషన్ సరిగ్గా లేదని, డాక్టర్లు చెప్పారని, అందుకే, అతన్ని మెంటల్ హాస్పిటల్ లో చేర్పించామని చెప్పారు. అయితే, నిన్న తాగి ఇష్టం వచ్చినట్టు చేసాడు అని చెప్పిన ప్రభుత్వం, ఈ రోజు అతనికి మెంటల్ కండీషన్ సరిగ్గా లేదని, మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తున్నాం అని చెప్పటం పతి, తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.నిన్న ఈ ఘటన చూసిన వెంటనే, ప్రభుత్వం ఇలాంటిది ఏదో చేస్తుంది అని అనుకున్నాం అని, అందరూ అనుకున్నట్టె అదే చేసారని, మాస్కులు అడిగినందుకు సస్పెండ్ చేసారు అనే పేరు రాకుండా, చివరకు అతనికి మెంటల్ అని ముద్ర వేసారని ఆగహ్రం వ్యక్తం చేసింది.

ఇలాంటివి సినిమాల్లో చూస్తాం అని, ఇప్పుడు రియల్ లైఫ్ లో చూస్తున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ "అంకితభావంతో కరోనా వంటి విపత్కర పరిస్థితులను అత్యంత సమర్ధవంతంగా ఎదుర్కొంటు యన్ 95 మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని సస్పెండ్ చేయడం దేనికి సంకేతం? ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గం. తన అవినీతి అక్రమాలు ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం జగన్ క్రూర మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఒక దళిత డాక్టర్ ను తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టించడం జగన్ ఉన్మాదానికి పరాకాష్ట. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపు, కక్ష సాధింపు చర్యలతో దళిత ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న జగన్ ప్రభుత్వం పై ఉద్యోగ సంఘాలు,దళిత సంఘాలు, వ్యతిరేకంగా ఉద్యమించి హక్కులను కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడికి, ఆయన ఆరోగ్య స్థితికి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలి. డాక్టర్ సుధాకర్ పై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసులు పెట్టాలి. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ ను వెంటనే రద్దు చేయాలి. డాక్టర్ సుధాకర్ ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం." అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read