విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటన పై పూర్తి వివరాలు తెలుసుకోవటానికి, కేంద్రప్రభుత్వం సొంతగా ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. కేంద్ర మంత్రిత్వహోంశాఖ, రసాయన మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఈ కమిటీని నియమించింది. గురువారం విశాఖ దురటనపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, కిషన్ రెడ్డి, కేబినెట్, హోం, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల తో గురువారం సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో గ్యాస్ లీకేజీ మటనకు దారి తీసిన అంశాలపై సుదీర్ఘంగా చరించారు. అనంతరం ఘటనపై ప్రత్యేక కమిటీని నియమించారు. అయితే, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ మంత్రులతో కమిటీ వేసింది. అయితే, ఇది పరిగణలోకి తీసుకోకుండా, కేంద్రమే ఒక కమిటీ వెయ్యటం, తామే పూర్తీ వివరాలు తెలుసుకుంటాం అని, కేంద్రం చెప్పటంతో, కేంద్రం ఈ విషయంలో, ఎంతో సీరియస్ గా ఉందని అర్ధం అవుతుంది.

ఇక మరో పక్క, మోడీ గురువారం ఉదయమే జగన్ కు ఫోన్ చేశారు. ఆయన గ్యాస్ లీకేజీ కారణాలను, విశాఖలో పరిస్థితుల పై జగన్ ను ఆరా తీసారు. గ్యాస్ లీకేజీ బాధితులను ఆదుకునే విషయంలోను, సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందని, ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ రంగలోకి దిగిన విషయాన్నీ చెప్పారు. ఘటనపట్ల ప్రధాని తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసారు.ఎల్జీ పాలిమర్స్ రసాయన ఎరువుల కంపెనీలో ప్రమాదంపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలను ముఖ్యమంత్రి జగనకు ప్రధాని నరేంద్రమోడీకి వివరించారు. గ్యాస్ లీకేజీ ప్రభావం అయిదు గ్రామాల పైన, 15 వేలమందికి పైగా ప్రజలపైన ఉందని తెలిపారు. ఘటన ప్రాంతం లోను, ప్రభావిత గ్రామాల్లోను రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయక చర్యలను చేపట్టినట్లు వివరించారు.

ప్రస్తు తానికి పరిస్థితి అదువులో ఉందని తెలిపారు. బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. దీనికి స్పందించిన ప్రధాని మోడీ ఈ విషయంలో కేంద్రం సహాయకారిగా ఉంటుందని, అవసరమయైన వైద్య,సహాయక బృందాలను పంపిస్తుందని తెలియచేసారు. ప్రధాని నరేంద్రమోడీ జరిగిన మటనపై ట్వీటరు వేదికగాను ప్రధాని మోడీ విచారాన్ని వ్యక్తం చేసారు. ప్రమాదంపై కేంద్ర మంత్రిత్వ శాఖ. జాతీయ విపత్తుల నివారణశాఖ అధికారులతో మాట్లాడానని ప్రధాని ట్వీటరులో వివరించారు. బాధితులను ఆదుకునే విధంగా తక్షణ సహాయచర్యలకు ఆదేశించినట్లు వివరించారు. ఘటనపై వరిస్థితులను ఎప్పటికప్పుడు విచారిస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేసారు. విశాఖ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్ర్భాంతిని వ్యక్తం చేసారు.

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. దీనిపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమ ఎందుకు ఉందని ప్రశ్నించింది. విచారణను వారంపాటు వాయిదా వేసింది. అలాగే, విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఘటనను సుమోటోగా స్వీకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం... మానవ తప్పిదం కారణంగానో, నిర్లక్ష్యం వల్లనో ఘటన జరిగినట్లు రుజువు కాకపోయినా... అమాయక ప్రజల ప్రాణాలు పోయాయని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

ఒకవైపు కరోనా ప్రభావంతో దేశంలో ప్రజల ప్రాణాలు ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం అని మానవహక్కుల సంఘం అభిప్రాయపడింది. పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టి నివేదిక అందజేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించి.. నియమ నిబంధనలు ఉల్లంఘన, సంబంధిత వ్యవహారాలపై నివేదిక ఇవ్వాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి కూడా ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసిన ఎన్​హెచ్ఆర్సీ.

విశాఖ గ్యాస్​ ఘటనలో ప్రభావితులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎయిమ్స్​ డైరెక్టర్​ రణదీప్​ గులేరియా సూచించారు. గ్యాస్ పీల్చిన వారికి కళ్లు, గొంతునొప్పి, వాంతులు అయ్యాయని అన్నారు. ప్రమాదకర రసాయనం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుందని వెల్లడించారు. విష వాయువు ఎక్కువ మోతాదులో పీలిస్తే శ్వాస తీసుకోవడం ఆగిపోయి ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు ఏర్పడతాయని వివరించారు. తీవ్రమైన హృద్రోగ సమస్యలు వస్తాయన్నారు. బాధితులు వెంటనే ఆక్సిజన్​ థెరపీ తీసుకోవాలని.. మంచినీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలని ఎయిమ్స్​ డైరెక్టర్​ పేర్కొన్నారు. పరిశ్రమలన్నీ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలన్న ఆయన.. కార్మికులు భౌతిక దూరం పాటించాలన్నారు.

విశాఖ గ్యాస్ లీక్ ఘటన పై ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగారు. ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష చేస్తున్నారు. ఈ సమీక్షలో హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గున్నారు. అలాగే సమీక్షలో కిషన్‌రెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గున్నారు. ఎల్జీ పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్యాస్‌ లీకేజి పై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేసిన పోలీసులు, సిబ్బంది, అక్కడ వారిని తరలించారు. ఇప్పటివరకూ 2వేల మందికి పైగా స్థానికులకు అస్వస్థతకు గురయ్యారు. అంబులెన్స్‌లు, ఆటోలు, కార్లలో ఆస్పత్రులకు తరలించారు. ఇళ్లు వదిలేసి ఐదు గ్రామాల ప్రజలు బయటికొచ్చారు. ఇప్పటి వరకూ ఊపిరాడక ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. చుట్టు పక్కల నివాసముంటున్న ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని సైరన్‌లు మోగించి పోలీసులు హెచ్చరించారు. వెంకటాపురంలో పెద్ద ఎత్తున పశువులు మృత్యువాత పడ్డాయి. పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల్లో చెట్లు మాడిపోయాయి.

విశాఖ దుర్ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఘటన తీవ్రంగా కలిచివేసిందన్న ఉపరాష్ట్రపతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వెంకయ్య నాయుడు. పెట్రోలియం మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్, కిషన్ రెడ్డితో మాట్లాడిన వెంకయ్య నాయుడు. బాధితులకు అన్ని రకాల సహాయం అందించాలని సంబంధిత శాఖలకు వెంకయ్య నాయుడు ఆదేశం. ఇక విశాఖ ఆర్.ఆర్ వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. పలువురు మృతి చెందడం, ఆస్పత్రిపాలు కావడం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. "ఆర్.ఆర్ వెంకటాపురం దుర్ఘటన బాధాకరం. మనుషులే కాదు ముగజీవాలు కూడా మృతి చెందాయి. కొనఊపిరిలో ఉన్న ప్రజలను, ముగజీవాలను కాపాడాలి.

చెట్లన్నీ రంగుమారడం విషవాయువు తీవ్రతకు నిదర్శనం. యుద్ధప్రాతిపదికన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. బాధితులకు అత్యున్నత వైద్య సాయం అందించాలి. సహాయక చర్యలు వేగపరచాలి.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి" అని చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం సెహ్సారు. ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన లోకేశ్ . ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ - సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా పార్టీశ్రేణులకు పిలుపునిచ్చిన లోకేశ్

విశాఖలో పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువు లీక్ అయిన దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన స్పందించారు. పలువురు మృతి చెందడం, అనేకమంది ఆసుపత్రి పాలు కావడంపై దిగ్భ్రాంతి చెందారు. హుటాహుటిన చంద్రబాబు స్పందించి విశాఖ టిడిపి నాయకులను అప్రమత్తం చేశారు. దుర్ఘటనా స్థలానికి వెంటనే వెళ్లాలని, బాధితులను ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని ఆదేశించారు. స్థానిక టిడిపి ఎమ్మెల్యే గణబాబు తెల్లవారుజామునే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఒకవైపు మృతుల కుటుంబాలను ఊరడించడం, మరోవైపు బాధితులను తరలించడంపై అధికారులను అప్రమత్తం చేశారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు చంద్రబాబుకు నివేదిస్తున్నారు.

జిల్లా పార్టీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కు మెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రధానమంత్రి ప్రత్యేక కార్యదర్శికి మెయిల్ పంపారు. ఒకవైపు కేంద్రంలో అధికారులకు సమాచారం పంపిస్తూ, మరోవైపు విశాఖ నాయకులతో, అధికారులతో సంప్రదిస్తూ సహాయ చర్యలను వేగిరపర్చేలా చేశారు.

‘‘గాలిలో విష వాయువుల తీవ్రత ఎంత ఉంది అధ్యయనం చేయాలి. ఎంత పరిధిలో ప్రజలు ప్రభావితం అవుతారు అనేది అంచనావేయాలి. ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, విష వాయువుల ప్రస్తుత ప్రభావం, దీర్ఘకాలిక ప్రభావం, సాధారణ పరిస్థితి ఎప్పటికి నెలకొంటుంది అనేవాటిపై నిపుణులతో చర్చించాలి. వారిచ్చిన సూచనల మేరకు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. బాధితులకు అత్యున్నత వైద్యం సత్వరమే అందించాలి. ప్రాణనష్టం నివారించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Advertisements

Latest Articles

Most Read