కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పై, రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ లో భాగంగా, సుజనా చౌదరి, సెంట్ భూమి కూడా అమరావతిలో లేదని చెబుతున్నారని, కాని ఆయనకు చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాలు ఉన్నాయని, అలాగే సుజనా సోదరుడి కుమార్తె రుషికన్యకి వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉన్నాయని బొత్సా చెప్పారు. సుజనాచౌదరికి ఉన్న 120 కంపెనీల్లో ఒకటైన గ్రీన్‌టెక్‌ కంపెనీ పేరుతొ, అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేసారని ఆరోపించారు. అయితే బొత్సా వ్యాఖ్యల పై అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు సుజనా చౌదరి. బొత్సా ప్రెస్ మీట్ పెట్టిన గంటలోనే, వివిధ ఛానెల్స్ లో మాట్లాడిన సుజనా, బొత్సా వ్యాఖ్యలను తిప్పి కొట్టారు.

sujana 27082019 2

బొత్సా ఎందుకు ఇంత లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదని అన్నారు. సీనియర్ అయిన బొత్సా తలతిక్క మాటలు మాట్లాడుతూ, ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారని బొత్సా అన్నారు. వాళ్ళ ప్రభుత్వ లోపాలు , కప్పిపుచ్చుకునే పాట్లు లాగా ఇవి కనిపిస్తున్నాయని సుజనా అన్నారు. నాకు 120 కంపెనీలు ఉన్నాయని బొత్స అన్నారని, కాని ఆయన చెప్పిన కంపెనీ పేరు మాత్రం నాకు ఉన్న కంపెనీల్లో లేదని అన్నారు. అమరావతి రాజధాని పరిధిలో ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి, కృష్ణా జిల్లాలో లెక్కలు చెప్తున్నారని అన్నారు. బొత్సకు సీడ్‌ కేపిటల్‌ ఏదో, సీఆర్డీఏ పరిధి ఏదో తెలియదని సుజనా కౌంటర్ ఇచ్చారు. వీరులపాడు మండలం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అని, అక్కడ మాకు ఎప్పటి నుంచి భూములున్నాయో తెలుసుకోవాలని అన్నారు.

sujana 27082019 3

ఆ భూములు ఎప్పుడూ కొన్నమో, ఆ రికార్డులు ఏంటో చూసుకుని మాట్లాడితే బాగుండేది అని అన్నారు. గుంటూరు జిల్లాలో రాజధాని ఉంటే, కృష్ణా జిల్లా పరిధిలో నాకు ఉన్న భూములు పై ఆరోపణలు చేసి, ఏదో జరిగి పోయింది అంటూ, తల తోక లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజధాని అంటే 29 గ్రామాలు అని, ఇక్కడ అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారనే విషయం బొత్సా గ్రహించాలని సుజనా అన్నారు. ఒక పక్క రాజధాని పై రోజుకి ఒక గందరగోళ ప్రకటన ఇస్తూ, అక్కడ రైతులకు క్లారిటీ ఇవ్వకుండా, ఆ విషయం డైవర్ట్ చెయ్యటానికి నా పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇన్ని విషయాలు చెప్పారు కదా, నిజంగానే దీంట్లో తేడా ఉంటే, నా పైన కేసు పెట్టుకుని, విచారించుకోండి అంటూ బొత్సాకు ఛాలెంజ్ విసిరారు.

రాష్ట్రంలో అమరావతి చుట్టూ రాజకీయం నడుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళే ముందు, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ని కలిసి, అమరావతికి నిధులు ఇవ్వక పోయినా పరవాలేదు , అమరావతిని కొన్నాళ్ళు పక్కన పెట్టి, ఆ నిధులు మిగతా వాటికి ఇవ్వండి అంటూ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి అమరావతి పై మొదలైన రగడ, మంత్రి బొత్సా వ్యాఖ్యలతో, తారా స్థాయికి చేరింది. అమరావతి రాజధానిగా ఉండాలా వద్దా అని ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని, అమరావతి నిర్మాణానికి ఎక్కువ డబ్బులు అవుతాయని, ప్రజా ధనం వృధా చెయ్యటం మాకు ఇష్టం లేదని, అందుకే రాజధాని అమరావతి పై, రాష్ట్ర ప్రభుత్వం తరుపున త్వరలోనే పూర్తీ ప్రకటన చేస్తామని బొత్సా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై ప్రతిపక్షాలు అన్నీ ప్రభుత్వం పై విమర్శలు ఎక్కు పెట్టాయి.

uma 27082019 2

ఒక పక్క బొత్సా చేసిన వ్యాఖ్యలు, హాట్ టాపిక్ గా మారితే, మరో పక్క ఇదే అంశం పై దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు కూడా, అంతకు మించిన హాట్ గా మారాయి. అమరావతి పై జగన్ ఎదో కుట్ర చేస్తున్నారని, దేవినేని ఉమా, నెల రోజుల నుంచి ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే అమెరికా వెళ్ళే ముందు ప్రధాని మోడీ, అమిత్ షా ని కలిసి, అమరావతి పై ఒక వినతి పత్రం ఇచ్చారని, అది ఏమిటో బయట పెట్టాలని దేవినేని ఉమా డిమాండ్ చేసారు. ప్రధాని మోడీ, అమిత్ షా లను కలిసిన సమయంలో అమరావతి గురించి ఏమి మాట్లాడుకున్నారు ? జగన్ ఇచ్చిన లేఖలో ఏముందో ప్రజలకు చెప్పాలి అంటూ దేవినేని ఉమా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో, బొత్సా చేసిన వ్యాఖ్యలతో, దేవినేని ఉమా చేస్తున్న ఆరోపణలు నిజం అయ్యాయి.

uma 27082019 3

దీంతో దేవినేని ఉమా, బొత్సా వ్యాఖ్యల తరువాత, మరో బాంబు పేల్చారు. దీంతో వైసిపీలో దేవినేని ఉమా వ్యాఖ్యలు కలకలం రేపాయి. జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్ళే ముందే, కడప జిల్లాకు చెందిన ఒక కీలక వైసిపీ నేతను తన వద్దకు పిలిపించుకుని, దోనకొండలో భూములు కొనుక్కోవాలని సూచించారని, దేవినేని ఉమా ఆరోపించారు. ఆ నేతకు టికెట్ ఇవ్వని కారణంగా, ఈ విధంగా అయినా ఆయనకు ఆర్ధికంగా లబ్ది చేకూర్చటానికి, జగన్ ప్లాన్ చేసారని, ఇది అబద్ధమని జగన్ చెప్పగలరా అని దేవినేని ఉమా ఛాలెంజ్ చేసారు. దీంతో, ఆ నేత ఎవరు అనే విషయం అటు టిడిపి పార్టీలోనూ, అటు వైసీపీలోను ఆసక్తి నెలకొంది. నిజంగానే జగన్ చెప్పరా, నిజం అయితే చెప్పండి, మేము కూడా అక్కడ భూములు కొనుక్కుంటాం అంటూ, కొంత మంది వైసిపీ నేతలు కూడా దేవినేని ఉమాకు ఫోన్ చేసి వాకబు చేస్తున్నారు అంట. మొత్తానికి, అమరావతి పై గందరగోళ పరిస్థితి పెట్టి, దొనకొండ చుట్టూ రియల్ భూం తేవటంలో మాత్రం వైసీపీ సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి.

తిరుమల పై రోజుకి ఒక సంఘటన వెలుగులోకి వస్తుంది. ఎంతో పవిత్రంగా ఉండాల్సిన తిరుమలలో, ప్రతి విషయం వివాదాస్పదం అవుతుంది. మొన్నటికి మొన్న, తిరుమల వెళ్ళే బస్ టికెట్ల పై జేరసులాం యాత్ర ఉచితం అనే ప్రభుత్వ ప్రకటన ఉన్న టికెట్లు ఇచ్చారు. అదేమంటే చంద్రబాబు మీదకు తోసేసారు. నెల్లూరులో ఉండాల్సిన ఈ టికెట్లు, చంద్రబాబు చెప్తే తిరుమల వచ్చాయని చెప్పి, ప్రజలు ఎలా నమ్ముతారో అనికూడా లేకుండా ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ రోజు తిరుమల పై మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారం ఉంగరాలు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఏకంగా ట్రెజరీలో నుంచే, నగలు మాయం అవ్వటం పై, శ్రీవారి భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

ttd 27082019 1

అయితే ఈ నగలు మాయం వెనుక, టీటీడీ ఏఈవో శ్రీనివాసులును బాధ్యత వహిస్తూ, ఆయన పై చర్యలు తీసుకుంది టిటిడి. ఆయన నిర్లక్షంగా వ్యవహరించటం వలనే, నగలు పోయాయి అని తేల్చి ఆయన్ను బాద్యుడిని చేసారు. మాయమైన ఆ మూడు ఆభరణాల విలువను అతని నెలవారీ జీతం నుంచి రికవరీ చేయాలని టిటిడి అధికారులు నిర్ణయించారు. అయితే టీటీడీ ఏఈవో శ్రీనివాసులు పై, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై టిటిడి ఉద్యోగుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరో పక్క, ఆ నగలు మాయం చేసిన వాళ్ళని పట్టుకుని, కఠిన చర్యలు తీసుకోకుండా, ఇలా కేవలం ఎవరినో బాధ్యత చూపుతూ, రికవరీ మాత్రమే చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

ttd 27082019 1

ఆయన జీతం కేవలం 30 వేలు అని, ఆ ఆభరణాల విలువ, ఆయన జీతంలో ఎన్ని సంవత్సరాలు రికవరీ చేస్తారాని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు స్వామి వారికి, దాదపుగా, 290 ఆభరణాలతో అలంకరణ చేస్తారు. ఈ 290 భరణాలు తప్పితే, మిగతా బంగారం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం, ట్రెజరీలో భద్రంగా ఉంచుతారు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు, ఇక్కడ నుంచి నగలు తీసుకెళ్ళి అలంకరిస్తారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం, ట్రెజరీలో, 2012లో కూడా ఇలాగే నగలు మాయం అయ్యాయి. అప్పటి నుంచి, అక్కడ భద్రత పెంచి, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఇంత భద్రత ఉన్నా కూడా, ఇలా నగలు ఎలా మాయం అయ్యయో, ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు దీని పై విచారణ జరపకుండా, కేవలం రికవరీ మాత్రం చెయ్యటం పై కూడా విమర్శలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పై జగన్ ప్రభుత్వంలోని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రెండు రోజులు నుంచి అమరావతి రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగుతునే ఉన్నారు. ఈ రోజు రాజధాని ప్రాంతానికి చెందిన మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు జగన్ ప్రభుత్వానికి నిరసనగా ఆందోళన బాట పట్టారు. అమరావతి రాజధాని పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతులు రోడ్డు పై భైఠాయించారు. అమరావతిని ఇక్కడే రాజధానిగా కొనసాగించాలని, మంత్రి బొత్స, రైతులు కౌలు డబ్బులు కోసమే ఆందోళన చేస్తున్నారు అంటూ చసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. అమరావతిలోని గ్రామాలు కానీ, కొండవీటి వాగు ఎప్పుడూ మునగలేదని, రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చెయ్యొద్దని రైతులు మండిపడ్డారు.

jagan 27082019 2

ఈ రోజు రాజధాని అమరావతి మార్పు అంశం పై రైతుల ఆందోళన సెగ ఒక్కసారిగా జగన్ మోహన్ రెడ్డికి తగిలింది. జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సెక్రటేరియట్ కు వెళ్తూ ఉండగా, మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం వద్ద రాజధాని రైతులు జగన్ కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసారు. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రైతుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాడ్లు చేసారు. అమరావతి ఇక్కడే కొనసాగించాలని, నినదించారు. అయితే ఈ పరిణామంతో, పోలీసులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. ఎక్కడ వారు జగన్ కాన్వాయ్ ని ఆపుతారో అని ఫుల్ పోలీస్ ఫోర్సు పెట్టారు. వారిని జగన్ కాన్వాయ్ ని అడ్డుకోకుండా, పోలీసులు నియంత్రించారు. అయినప్పటికీ, జగన్ కారుని చూడగానే, జగన్ కు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు సెహ్సారు.

jagan 27082019 3

పోలీసులు ఈ పరిణామంతో ఒక్కసారిగా వారిని అడ్డుకుని, పక్కకు తరలించారు. అయితే మొదటి సారి, తాను ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, ప్రజా వ్యతిరేకత డైరెక్ట్ గా చూడటంతో, ఈ సంఘటన పై జగన్ ఒక్కసారిగా నివ్వెరపోయారు. అక్కడ ఆందోళన చేస్తున్న రైతులకు అభివాదం చేస్తూ, జగన్ వెళ్ళిపోయారు. మరో పక్క, ఈ రోజు బీజేపీ నేతలు అమరావతి ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. బీజేపీ ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారయణ, అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం అవినీతి చేస్తే అది బయట పెట్టి, వారికి శిక్ష పడేలా చెయ్యచ్చు కాని, ఇలా రాజకీయం కోసం, ఒక ప్రాంతాన్ని, ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టటం కరెక్ట్ కాదని వారు అభిప్రాయ పడ్డారు.

Advertisements

Latest Articles

Most Read