తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. చాలా రోజుల తరువాత, మారిన రాజకీయ సమీకరణల నేపధ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఇది రాజకీయ పర్యటన కాదు. కేంద్ర మాజీమంత్రి, భాజపా సీనియర్‌ నేత అరుణ్‌జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించటానికి ఢిల్లీ వెళ్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తారు. అయితే ఆ కార్యక్రమం చూసుకుని వచ్చేస్తారా ? లేక ఇంకేమైనా రాజకీయ పరమైన భేటీలు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. అయితే పార్టీ వర్గాలు మాత్రం, కేవలం అరుణ్‌జైట్లీ భౌతికకాయానికి నివాళులు అర్పించటానికే వెళ్తున్నారని, మరే రకమైన రాజకీయ భేటీలు ఉండవని చెప్తున్నారు. బీజేపీ నాయకులతో చంద్రబాబుకి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపధ్యంలో, వారితో భేటీ అవుతారో లేదో చూడాలి.

delhi 25082019 2

అరుణ్ జైట్లీ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాలో ఆర్థిక, రక్షణ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వచించిన జైట్లీ, శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్‌ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడారు. నిన్న పరిస్థితి క్షీణించటంతో, శాశ్వత నిద్రలోకి వెళిపోయారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జైట్లీ ఆరోగ్య పరిస్థితి శుక్రవారమే విషమించింది. ఈ వార్తా తెలియటంతోనే, బీజేపీ ముఖ్యనేతలందరూ ఆయన్ను పరామర్శించటానికి, ఎయిమ్స్‌కు వచ్చారు. ఆరోగ్యం క్షీణించటంతో శనివారం మధ్యాహ్నం ఆయన మరణ వార్త వెలువడింది. భారత రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, బీజేపీ అగ్రనేతలు ఎయిమ్స్ కు వచ్చి జైట్లీకి నివాళులు అర్పించారు. అనంతరం జైట్లీ భౌతిక కాయాన్ని ఆయన నివాసానికి తరలించారు.

delhi 25082019 3

అరుణ్ జైట్లీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా మంచి అనుబంధమే ఉంది. కాకపోతే ఆయన చేసిన కొన్ని ప్రకటనలు, ప్రజల ఆగ్రహం కూడా తెప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే, జైట్లీ, 2014లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, విభజన బిల్లు చర్చకు వచ్చిన సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున పోరాడారు. తరువాత, అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, ఆ హామీలను పట్టించుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. అయితే జైట్లీ అమరావతి విషయంలో మాత్రం, మంచి చేసారు. రాజధాని రైతులకు క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ నుంచి రెండేళ్ల పాటు మినహాయింపు ఇవ్వడం వంటి అంశాల్లో ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఇక అమరావతిలో కొన్ని భవనాల శంకుస్థాపన ఆయన చేతుల మీదుగానే జరిగింది.

కృష్ణా వరదల్లో, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా జిల్లలో, ఎన్నో ఊళ్ళు మునిగాయి. ఇళ్ళు, పంట పొలాలు నాశనం అయ్యాయి. అయితే ఈ వరదలు ముంచెత్తటం పై ప్రభుత్వ అసమర్ధత ఉండనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు, దాదపుగా జూలై 20 ఆ టైంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, వరదలు అధికంగా ఉంటాయి, కృష్ణా ప్రవాహం అధికంగా ఉంటుంది అంటూ, హెచ్చరించాయి. జూలై 31న శ్రీశైలంకు వరద పోటెత్తింది. అవుట్ ఫ్లో మొదలైంది. ఆగష్టు 3న శ్రీశైలం 854 టచ్ అయినా, పోతిరెడ్డి పాడుకు నీళ్ళు వదలలేదు. 6వ తేదీకి నీటిమట్టం 866.10 అడుగులకు చేరింది. ఇంకా ఎందుకు విడుదల చెయ్యలేదు అని రాయలసీమ రైతులు ఆందోళనకు సిద్దం అవుతున్నారని తెలిసి, ఎట్టకేలకు గేట్లెత్తి 6వ తేదీ 2 వేల క్యూసెక్కులను, 7వ తేదీన దీనిని 5వేల క్యూసెక్కులు మాత్రమే వదిలారు. తరువాత 15 వేలకు పెంచారు. 16వ తారీఖు నుంచి మాత్రమే 40 వేల క్యూసెక్కులు వదిలారు.

cbvn 230820198 2

కాని పూర్తిస్థాయి సామర్థ్యం 44 వేల క్యూసెక్కులు. అంటే ఆగష్టు 5 నుంచి, ఆగష్టు 16 దాకా, పోతిరెడ్డిపాడు నుంచి, పూర్తీ స్థాయిలో రాయలసీమాకు నీళ్ళు వదలలేదు. ఇక హంద్రీ నీవా ప్రధాన ఎత్తిపోతల అయిన మాల్యాల నుంచి 835 అడుగుల లెవెల్‌లో నీటిని తోడే అవకాశమున్నా, ఈనెల 5న 860.90 అడుగుల వద్ద 2 పంపులు ఆన్‌ చేసి 675 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. నిజానికి.. 2500 క్యూసెక్కులను తోడవచ్చు. ఈ వరదలు సడన్ గా వచ్చినవి కావు. 15 రోజుల నుంచి సరైన వాటర్ మ్యానేజ్మెంట్ చేస్తే, రాయలసీమకు మరో 30 టిఎంసీ దాకా నీరు తీసుకువెళ్ళే అవకాసం ఉండేది. ప్రకాశం బ్యారేజీ కింద లంకలు కూడా మునిగేవి కాదు. ఇంత పెద్ద వరద వచ్చినా, రాయలసీమకు కేవలం 26.35 టీఎంసీలు మాత్రమే ఆగష్టు 17 వరకు తీసుకు వెళ్లారు.

cbvn 230820198 3

శ్రీశైలం జలాశయం నుంచి ఒక్క కర్నూలులోని ప్రాజెక్టుల్లోనే 42.8 టీఎంసీలను నింపే అవకాశముంది. కడప, అనంతపురంలో రిజర్వాయర్లు కలిపితే 85 టీఎంసీ లు నిల్వ చేయవచ్చు. సోమశిల దీనికి అదనం. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తుంది. కేవలం అమరవతి టార్గెట్ గా, అటు రాయలసీమకు నీళ్ళు మళ్ళించక, ఇటు సముద్రంలోకి ఒకేసారి వదిలి, లంకలు ముంచారని ఆరోపిస్తుంది. అందుకే ఈ విషయం పై ప్రజలకు చెప్పటానికి, ప్రభుత్వం ఏ విధంగా కుట్ర పన్నిందనే అంశంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ రోజు, రేపట్లో చంద్రబాబు ఈ అంశం పై పూర్తీ వివరాలతో ప్రజల ముందుకు వచ్చి, వివరించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన విధానం పై, ఇప్పటికే కేంద్రం గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, కేంద్రానికి కూడా చెడ్డ పేరు వచ్చింది. జగన్ చేసిన పనుల వల్ల, జపాన్ ప్రభుత్వం, కేంద్రానికి కూడా లేఖ రాసి, ఇలా అయితే ఎవరూ విదేశీ పెట్టుబడులు పెట్టరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విద్యుత్ ఒప్పందాల విషయం పై కేంద్రం చెప్పీ చెప్పీ, రాష్ట్రంతో విసుగెత్తిపోయింది. మళ్ళీ పోలవరం విషయంలో కూడా ఇదే తంతు. కేంద్రం హెచ్చరికలు ఇస్తున్నా, రాష్ట్రం పట్టించుకోవటం లేదు. అయితే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో సమీక్షతో రెడీ అవ్వటంతో, ఇక కేంద్రానికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మీకు అసలు ప్రాజెక్ట్ లు అయ్యే ఉద్దేశం ఉందా అంటూ, రాష్ట్ర అధికారుల పై, కేంద్ర ప్రభుత్వ అధికారులు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు.

review 23082019 2

కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, రాష్ట్రంలో రూ.1600కోట్ల వ్యయంతో ‘సమీకృత నీటిపారుదల, వ్యవసాయ పరివర్తనా పథకం’ అమలవుతోంది. దీని పై ఢిల్లీలో సమీక్ష జరిగింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి, ప్రపంచ బ్యాంకు కుద సహాయం చేస్తూ ఉండటంతో, వారు కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పై, ప్రపంచ బ్యాంక్ అధికారుల ముందే, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సమీర్‌కుమార్‌ఖరే, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. చివరకు చిన్న నీతి తరహా ప్రాజెక్ట్ ల పై కూడా మీరు సమీక్షల పేరుతొ పనులు నిలిపివేస్తే ఎలా ? అనుకున్న సమయానికి పనులు పుర్తవుతాయా అంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై అసహనం వ్యక్తం చేసారు.

review 23082019 3

ఆ సమయంలో, ప్రపంచబ్యాంకు భారత్‌ డైరెక్టర్‌ జునాయ్డ్‌ కమల్‌ అహ్మద్‌ కూడా అక్కడే ఉన్నారు. ఇలా సమీక్షల పేరుతొ, పనులు ఆపేస్తే, ప్రపంచ బ్యాంకు నుంచి, కేంద్రం నుంచి మీకు నిధులు ఎలా వస్తాయి అని నిలదీశారు. కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సమీర్‌కుమార్‌ఖరే అడిగిన ప్రశ్నలకు, రాష్ట్ర అధికారులు సమాధానం చెప్పలేక పోయారు. ఈ పనులు తప్ప మిగతవి సజావుగా జరుగుతున్నాయని, పూర్తయిన పనులకు బిల్లులు కేంద్రం నుంచి రావాలని రాష్ట్ర అధికారులు కోరారు. వీటి పై నిబంధల ప్రకారం చూస్తామని, మిగతా పనులు విషయంలో ప్రత్యెక శ్రద్ధ పెట్టి, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా చూడాలని, రాష్ట్ర అధికారులకు, కేంద్ర అధికారులు కోరారు.

బీజేపీ, వైసిపీ మధ్య గ్యాప్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. మొన్నటి దాక, రాష్ట్రంలో ఎలా ఉన్నా, కేంద్రంలో జగన్, విజయసాయి రెడ్డిలకు మంచి పట్టు ఉందని అనుకునే వారు. కాని ఇప్పుడు అది కూడా సడలిపోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న విజయసాయి రెడ్డి చేసినవ వ్యాఖ్యలతో, ఢిల్లీ బీజేపీ నేతలు కూడా తీవ్ర ఆగహ్రంతో ఉన్నారు. తమ చేతకాని తనాన్ని, మోడీ, అమిత్ షా ల పై విజయ్సాయి రెడ్డి నేట్టేయటం ఏంటి అంటూ, ఢిల్లీ వర్గాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ ఒప్పందాల సమీక్షలు కాని, పోలవరం రీ టెండరింగ్ కాని, అన్నీ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లకు చెప్పి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో జరిగే అన్ని పనులు, మోడీ, అమిత్ షా ఆశీస్సులతోనే జరుగుతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.

vsreddy 23082019 2

అయితే ఈ విషయం పై, రాష్ట్ర బీజేపీ నేతలు, అధిష్టానికి తెలియ పరిచారు. మరో పక్క మీడియాలో వచ్చిన వార్తలు చూసిన, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పోలవరం రీటెండరింగ్ విషయంలో, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే, స్పష్టమైన ఆదేశాలు రాష్ట్రానికి ఇచ్చిందని, స్వయంగా పార్లిమెంట్ లో అది తప్పు అని కేంద్రం తరుపున స్పందించినా కూడా, ఈ విషయం మోడీ, అమిత్ షా ఆశీస్సులతోనే జరుగుతుని అంటూ, విజయసాయి రెడ్డి ఎలా చెప్తారు అంటూ, ఆయన బీజేపీ నేతల వద్ద అగ్రహం వ్యక్తం చేసారు. నిన్న హైకోర్ట్ తీర్పు నేపధ్యంలో, రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ను కలిసారు.

vsreddy 23082019 3

పోలవరం విషయం పై మరో వారం రోజుల్లో కేంద్రం నుంచి స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై తదుపరి నిర్ణయం తీసుకునే ముందు మోదీ, అమిత్‌ షాతో చర్చిస్తానని మంత్రి వారికి చెప్పినట్లు తెలిసింది. విజయసాయి రెడ్డి హద్దు మీరి మాట్లడుతున్నారని, కేంద్రం తరుపున ఈ వ్యాఖ్యలు ఖండించాలని, లేకపోతే, ప్రజలు వీళ్ళ అసమర్ధతను, మన పై నెట్టేసే ప్రయత్నం చేస్తారని, అందుకే దీన్ని ఖండించాలని అన్నారు. మరో పక్క, పోలవరం రీటెండరింగ్‌ పై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందనే విషయం తెలియడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ హుటాహుటిన ఢిల్లీ వచ్చారు. ఈ విషయం పై, కేంద్ర జలవనరుల అధికారులతో చర్చించారు.

Advertisements

Latest Articles

Most Read