రాష్ట్రంలో మరోసారి ఐటీదాడులు జరుగుతాయన్న సమాచారం తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖపట్నంలో రేపు భారీగా ఐటీ దాడులు జరిగే అవకాముందని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు విశాఖ నగరానికి చేరుకున్నారని, వారంతా వివిధ హోటళ్లలో బసచేసినట్లు సమాచారం. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు నగరాల నుంచి ఐటీ అధికారులు వివిధ మార్గాల నుంచి విశాఖ చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని కీలక నేతలు, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వేత్తలపై ఐటీ శాఖ అధికారులు దృష్టి పడినట్టు తెలుస్తోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి దాడులకు సిద్ధంగా ఉండాలని టీమ్ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చినట్లుగా తెలియవచ్చింది.

it 241020018 2

అయితే ఈ దాడులు జరుగుతున్న సందర్భం చూస్తే, మన రాష్ట్రం పై, ఢిల్లీ పెద్దలు ఎంత కక్ష కట్టారో అర్ధమవుతుంది. తెలుగుదేశం నాయకులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. అమరావతి, తిరుపతి, వైజాగ్ నగరాలని, చంద్రబాబు ఒక పధ్ధతి ప్రకారం అభివృద్ది వైపు పరుగులు పెట్టిస్తుంటే, మోడీ కావాలనే టార్గెట్ చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ టైములో, మోడీ నజర్ విశాఖపట్నం పై పడటానికి కారణం చెప్తూ, "విశాఖపట్నం కి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది...ఫింటెక్ రంగంలో ప్రపంచంలోనే 4వ ఉత్తమ వేదిక గా విశాఖ ఎదిగింది. ఐటీ కంపెనీలు అన్ని విశాఖకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశమే మోడీకి నచ్చలేదు. ఎలా ఆయినా అలజడి సృష్టించాలి...విశాఖ కి వస్తున్న వారిని భయబ్రాంతులకు గురిచేయ్యాలి, విశాఖపట్నం కి వస్తున్న కంపెనీలు అన్ని గుజరాత్ కి తరలించాలి అనే కుట్ర తో విశాఖపట్నం పై టార్గెట్ పెట్టాడు మోడీ" అంటూ ఓ సీనియర్ మంత్రి వాపోయారు.

it 241020018 3

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫింటెక్ ఫెస్టివల్ ఒక పక్క, మరో పక్క ఇండియా,వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో విశాఖ ని కొట్టాలి అని మోడీ ఆదేశించారు. దింతో విశాఖలో 20 ఐటీ బృందాలు దిగాయి..ఇతర రాష్ట్రాల బృందాలను కూడా విశాఖకి పంపారు మోడీ. అంతర్జాతీయ ప్రతినిధులు విశాఖ లో ఉన్న సమయంలోనే ఐటీ దాడుల వార్తలు వచ్చి...వారంతా ఆంధ్రప్రదేశ్ కి వచ్చే ఆలోచన విరమించుకోవాలి...అందరూ గుజరాత్ వెళ్లాలి అనేది మోడీ గారి ఆలోచన" అంటూ ఆ సీనియర్ మంత్రి చెప్పుకొచ్చారు. మొత్తానికి, విశాఖలో రేపు ఐటి వాళ్ళు ఏమి చేస్తారో చూడాలి.

అమెరికాలో బాంబ్ పార్శిళ్లు తీవ్రకలకం రేపుతున్నాయి. వైట్‌హౌజ్ సహా అమెరికా మాజీ ప్రెసిడెంట్స్ బరాక్ ఒబామా, బిల్ క్లింటన్‌ దంపతులను దుండగులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇళ్లు, కార్యాలయాలకు పేలుడు పదార్థాల పార్శిళ్లను పంపించారు. ఈ కుట్రను సీక్రెట్ సర్వీస్ అధికారులు బుధవారం భగ్నం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా‌, మాజీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ హిల్లరీ క్లింటన్‌ అడ్రస్ మీద పేలుడు పదార్థాల పార్శిల్స్‌ వచ్చినట్లు సీక్రెట్‌ సర్వీసెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణ తనిఖీల్లో భాగంగా హిల్లరీ ఆఫీస్‌కు వచ్చిన పార్శిల్‌ను తనిఖీ‌ చేయగా ఇవి లభ్యమైనట్లు తెలిపంది. ఈ వ్యవహారంపై యూఎస్‌ ఎఫ్‌బీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.

usa 24102018 2

ఇటీవలే బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ ఇంటికి వచ్చినటువంటి పార్శిళ్లే ఒబామా, హిల్లరీ కార్యాలయాలకు కూడా రావడం కలకలం రేపుతోంది. సాధారణ తనిఖీల్లో భాగంగా హిల్లరీ ఆఫీస్‌కు వచ్చిన పార్శిల్‌ను తనిఖీ‌ చేయగా ఇవి లభ్యమైనట్లు సీక్రెట్‌ సర్వీసెస్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. దీనిపై యూఎస్‌ ఎఫ్‌బీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆ పార్శిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయనే విషయం తెలియరాలేదు. సోరోస్‌ ఇంటికి వచ్చిన పార్శిల్‌ను స్కానింగ్‌ చేస్తున్న సమయంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ ప్యాకెట్‌ను తీసుకెళ్లి బాంబును నిర్వీర్యం చేసినట్లు యూఎస్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి.

usa 24102018 3

న్యూయార్క్‌లో మీడియా కార్యాలయాలు ఉన్న టైమ్‌ వార్నర్‌ సెంటర్‌ భవనంలో పోలీసులు అనుమానాస్పద వస్తువును కనుగొన్నట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ఈ భవనంలోని అన్ని కార్యాలయాలను ఖాళీ చేయించారు. ఈ విషయాన్ని సీఎన్‌ఎన్‌ అధ్యక్షుడు జెఫ్‌ జుకెర్‌ కూడా ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌ లో వెల్లడించారు. మరో పక్క శ్వేత సౌధం చిరునామాతో కూడా ఒక అనుమానాస్పద పార్శిల్‌ వచ్చినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. దీనిపై సీక్రెట్‌ సర్వీస్‌ స్పందిస్తూ తాము కేవలం ఒబామా, క్లింటన్‌ కార్యాలయాలకు వచ్చిన పార్శిళ్లను మాత్రమే స్వాధీనం చేసుకొన్నామని పేర్కొంది. ఒబామా, బిల్‌ క్లింటన్‌‌పై జరిగిన కుట్రను ఖండిస్తున్నట్లు ప్రతినిధి సారా శాండర్స్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలను సహించేది లేదని..కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కేంద్రం పగ బట్టేసింది. గ్యాప్ కూడా ఇవ్వకుండా, మన రాష్ట్రం పై విరుచుకుపడుతుంది. ఇప్పటికే విజయవాడలో ఐటి దాడులు చేసిన ఐటి అధికారులు, కొన్ని రోజుల క్రిందట సియం రమేష్ పై దాడులు చేసారు. మొత్తం వాతావరణం అంతా టెన్షన్ లో దింపుతున్నారు. ఆపరేషన్ గరుడలో చెప్పిన ప్రతి ఒక్కటి పొల్లు పోకుండా, షడ్యుల్ ప్రకారం జరుగుతుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, మోడీ పై చంద్రబాబు చేస్తున్న రాజకీయ పోరాటంతో, గుజరాత్ బ్రదర్స్ మోడీ, షాలు చంద్రబాబు పై కక్ష పెంచుకున్నారు. గత మూడు నాలుగు నెలలుగా చంద్రబాబు అంతు చూస్తాం, చంద్రబాబుని జైల్లో పెడతాం, చంద్రబాబుని పదవిలో నుంచి దించేస్తాం అంటూ బహిరంగంగానే బీజేపీ నేతలు మాట్లాడటం చూసాం. దానికి తగ్గట్టుగానే కోర్ట్ ల్లో కేసులు వేసినా, ఏమి లాభం లేకపోవటంతో, ఇప్పుడు తమ చేతుల్లో ఉన్న ఐటి, ఈడీ, సిబిఐ లకు ఢిల్లీ పెద్దలు పని చెప్పారు.

it 241020018 2

చంద్రబాబు, లోకేష్ మీద డైరెక్ట్ గా దాడి చేస్తే, అది దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యి, అన్ని విపక్షాలు మరింత బలంగా ఏకం అయ్యే అవకాసం ఉండటంతో, తెలుగుదేశం పార్టీలో ఆర్ధికంగా బలంగా ఉన్న నేతల పై, తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న వ్యాపార వేత్తల పై, దాడులకు ఢిల్లీ నేతలు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా, ఇప్పటికే విజయవాడ, గుంటూరులో దాడి చేసిన ఐటి అధికారులు, ఇప్పుడు వైజాగ్ పై దాడికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా విశాఖకు భారీగా ఐటీ ఉన్నతాధికారులు చేరుకున్నారు. రేపు విశాఖలో భారీగా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారం వస్తుంది. నగరంలో పలు హోటళ్లలో ఐటీ అధికారులు బస చేసారు.

it 241020018 3

తెలంగాణ, ఒడిశా, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు, దాదపు 200 మంది ఉన్నారని తెలుస్తుంది. వివిధ మార్గాల నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విశాఖకు ఐటీ అధికారులు చేరుకున్నారు. ప్రధానంగా తెలుగుదేశం మంత్రి టార్గెట్ గా ఈ దాడులు చేస్తామని ఐటి అధికారులు లీకులు ఇస్తున్నారు. మొన్న చనిపోయిన మూర్తి వ్యాపార సంస్థల పై కూడా దాడులు చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే విజయవాడలో చేసినట్టు, తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న వ్యాపార వర్గాల పై కూడా దాడులు చేస్తారని సమాచారం. మొత్తంగా, నవ్యాంధ్రకు ఆయువపట్టు లాంటి వైజాగ్ లో, ఇప్పుడిప్పుడే ఫిన్టెక్ హబ్ గా, ఐటి హబ్ గా రూపాంతరం చెందుతున్న వైజాగ్ పై తప్పుడు ముద్ర వేసేందుకు, ఇలా దాడులు చేపిస్తున్నారు.

సీబీఐ నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్న అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను రాత్రికి రాత్రి సెలవు పై పంపి తాత్కాలిక సీబీఐ చీఫ్‌గా ఎం.నాగేశ్వరరావును కేంద్రం నియమించడం, అలాగే సీబీఐలో జరుగుతున్న రచ్చ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మోదీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందన్నారు. రాఫెల్ స్కాంపై విచారణ చేస్తారనే భయంతోనే సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారని చెప్పారు. ప్రధాని వద్ద పనిచేసే ఆస్థానాను కాపాడటం కోసమే డైరెక్టర్‌ను మార్చారన్నారు. సీవీసీ అనుమతులు లేకుండా సీబీఐ డైరెక్ట్‌ను ఎలా మారుస్తారని ప్రశ్నించారు. సీబీఐ డైరెక్టరుగా నియామకం జరిగిన తర్వాత రెండేళ్లు కొనసాగించాలని చెప్పారు.

cbi cn 24102018 2

సీబీఐలో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదని మొదట నుంచి పోరాడుతున్నామని అని అన్నారు. డైరెక్టర్ వద్ద డాక్యుమెంట్ ఉంటే ఇబ్బందని ఆయన్ను అనధికారికంగా తప్పించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ చాలా కుట్రాలు పన్నుతోందని అన్నారు. మరో పక్క, డీఎంకే అధ్యక్షుడు ఎం.స్టాలిన్ కు మోడీని తప్పుపట్టారు. మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, నాగేశ్వరరావు పై సీబీఐ డైరెక్టర్ (అలోక్‌ వర్మ)కు చాలా ఫిర్యాదులు వెళ్లాయని, దీనిపై దర్యాప్తు ప్రారంభించాలని కూడా అలోక్‌వర్మ అనుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో అలోక్‌వర్మను సెలవుపై పంపి నాగేశ్వరరావుకు సీబీఐ పగ్గాలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రాఫెల్‌పై విచారణ జరక్కుండా ఉండేందుకు తీసుకున్న చర్యగా ఈ నియామకాన్ని భావించవచ్చా? అని స్టాలిన్ విమర్శించారు.

cbi cn 24102018 3

పశ్చిమ్ బంగా ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సీబీఐని బీబీఐ అంటూ కొత్త పేరు పెట్టారు. ‘సీబీఐ ఇప్పుడు అతి తెలివి బీబీఐ (భాజపా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) గా మారిపోయింది. చాలా దురదృష్టకరం’ అని ఆమె ట్వీట్‌ చేశారు. సీబీఐ కార్యాలయాల వేదికగా చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ పలు ఆరోపణలు గుప్పించారు. ‘సీబీఐ డైరెక్టర్ ని సెలవుల మీద ఎందుకు పంపారు? లోక్‌పాల్‌ చట్టం ద్వారా నియమించిన దర్యాప్తు సంస్థ అధికారి పై మోదీ ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం చర్యలకు ఆదేశించింది? ఆయన సర్కారు ఏ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది?’ అని ఆయన ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read