అమరావతి శ్మశానమని, అక్కడ పందులు, గేదెలు తిరుగుతున్నాయి తప్ప, ఎవరూ నివాసముండటం లేదని చెప్పిన ప్రభుత్వపెద్దలు నేడు అదే అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఎలా ఇస్తున్నారో చెప్పాలని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వహయాంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు ఇవ్వాల్సిన రూ.1100కోట్లను ప్రభుత్వం 9నెలలైనా ఎందుకు చెల్లించడం లేదని ఉమా నిలదీశారు. పేదలు తమవంతు వాటాగా అప్పులు తెచ్చి ఇళ్లు నిర్మించుకుంటే, జగన్ ప్రభుత్వం వారిని రోడ్లపాలుచేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కేంద్రం నుంచి రాబట్టడంలో విఫలమైన జగన్ ప్రభుత్వంలోని మంత్రులు, చివరకు ఉపరాష్ట్రపతిని వేడుకునే స్థితికి దిగజారారన్నారు. ప్రభుత్వం విక్రయిస్తున్న పిచ్చిమందు (లిక్కర్)తాగి జనం చనిపోతున్నారని చెబితే, డిస్టిలరీ కంపెనీలకు జగన్ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని, అవి చెల్లించడంలేదు కాబట్టి, రాష్ట్రంలో పిచ్చిమందు అమ్ముతున్నామని మరో మంత్రి నిస్సిగ్గుగా సమాధానంచెబుతున్నాడని బొండా మండిపడ్డారు.

డిస్టిలరీలకు చెల్లించాల్సిన రూ.1600కోట్లను వాడుకున్న ప్రభుత్వం, ఆమొత్తం రుణంగా ఇవ్వమంటూ ప్రపంచబ్యాంక్ ని అడగటం సిగ్గుచేటన్నారు. ఇటువంటి దారుణాలు ఈ రాష్ట్రంలో తప్పమరెక్కడా ఉండవని, ఇటువంటి తుగ్లక్ చర్యలను కూడా మరెక్కడా చూడబోమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పేదలకు ఇవ్వడానికి ఏజిల్లాలో ఎంతెంతభూమి కొన్నదో, ఎన్ని వేలఎకరాలు పంచిందో వెల్లడించాలని బొండా డిమాండ్ చేశారు. 26లక్షల మందికి ఇవ్వడానికి అవసరమైన 25వేల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళికలేమిటో, ఎకరం ఎంతచొప్పున కొని, పేదలకు పంచుతున్నారో పూర్తివివరాలు బయటపెట్టాలని, దానిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చించడానికి టీడీపీ సిద్ధంగా ఉందని ఉమా తేల్చిచెప్పారు. జగన్ ప్రభుత్వం సాగిస్తున్న మద్యం మాఫియాపై రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వెల్లడించడానికే, ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న కల్తీమద్యం సీసాలను తాము విలేకరుల సమావేశంలో చూపించామని బొండా స్పష్టంచేశారు. తాము అడిగిన వివరాలపై సమాధానం చెప్పకుండా నోటికొచ్చినట్లు పిచ్చిపిచ్చిగా రోజానో, మరొకరో మాట్లాడితే వాస్తవాలు అవాస్తవాలు కావన్నారు. జే-ట్యాక్స్ వసూలు తట్టుకోలేక ప్రధానమైన డిస్టిలరీ కంపెనీలన్నీ మద్యం సరఫరా చేయకుండా చేతులెత్తేశాయన్నారు.

చీప్ లిక్కర్ పై క్వార్టర్ కు అదనంగా వసూలుచేస్తున్న రూ.100రూపాయలు ఎవరి జేబులోకి వెళుతోందో వైసీపీ మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని ఎక్సైజ్ మంత్రి సెక్రటేరియట్ లో, మందు బాటిళ్లుచూపి విలేకరులతో మాట్లాడాడన్నారు. మద్యం వ్యాపారాన్ని నియంత్రించాల్సిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలోని మహిళా సిబ్బందితోనే మందు అమ్మిస్తున్న ప్రభుత్వనిర్వాకంపై రోజా ఏం సమాధానం చెబుతుందని ఉమా నిలదీశారు. పక్కరాష్ట్రాల నుంచి వస్తున్న ఎన్ డీపీ లిక్కర్ ని వాలంటీర్లే డోర్ డెలివరీ చేస్తున్నారని, అదిచాలక గ్రామాల్లో నాటుసారా విక్రయాలు యథేచ్చగా సాగిస్తున్నారని, వీటన్నింటిపై నోరువిప్పే, దమ్ము, ధైర్యం రోజాకుగానీ, ఇతర మంత్రులకుగానీ లేదన్నారు. సిగ్గులేకుండా ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని తాగుబోతులకోసం ప్రపంచబ్యాంక్ రుణమిస్తుందని చెప్పడం జగన్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రభుత్వలోపాలను ఎత్తిచూపుతున్న ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోసినంత మాత్రాన వాస్తవాలు ప్రజలకు తెలియకుండా పోతాయని భావిస్తే, అంతకంటే ఆత్మవంచన మరోటి ఉండబోదన్నారు. ప్రతిపక్షం ఎత్తిచూపిన తప్పులు సరిదిద్దుకోకుండా, కేసులుపెడతాం.. అంతుతేలుస్తామంటూ సొల్లు కబుర్లు చెప్పి, డాంభికాలుప్రదర్శిస్తే భయపడేవారెవరూ లేరని బొండా తేల్చిచెప్పారు.

గత 24 ఏళ్ళుగా, బీసీలకు, 34 శాతం రిజర్వేషన్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, హైకోర్ట్ లో సరిగ్గా వాదనలు వినిపించకుండా, రిజర్వేషన్ ను 59 శాతం నుంచి 50 శాతానికి పరిమితం అయ్యేలా చేసారు. దీంతో బీసీలకు ఉండే రిజర్వేషన్ 34 శాతం నుంచి, 24 శాతానికి పడిపోయింది. దీంతో, 16 వేల మంది బీసీలు, వార్డు మెంబెర్లుగా, పంచాయతీ ప్రెసిడెంట్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా అవకాసం కోల్పోనున్నారు. నిజానికి హైకోర్ట్ లో కేసు కొట్టేస్తే, సుప్రీం కోర్ట్ కు వెళ్ళవచ్చు. అయితే జగన్ మాత్రం, సుప్రీం కోర్ట్ కు వెళ్ళటం లేదు. గతంలో ఇలాగే హైకోర్ట్ కొట్టేస్తే, అప్పటి ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి, సుప్రీం కోర్ట్ కు వెళ్లి, 60 శాతం రిజర్వేషన్ కు ఒప్పించారు. అయితే, ఇప్పుడ జగన్ మాత్రం, సుప్రీం కోర్ట్ కు వెళ్ళటం లేదు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంటే, జగన్ సుప్రీంకు వెళ్ళకుండా అన్యాయం చేస్తున్నారు అనే భవన ఉంది. తన కేసుల్లో కాని, మూడు రాజధానులు విషయంలో కాని, 5 కోట్లు పెట్టి లాయర్ ను తెచ్చారు, మరి ఇక్కడ ఎందుకు తేవటం లేదు అనే ప్రశ్న వస్తుంది.

bc 05032020 2

ఇది ఇలా ఉంటే, ప్రభుత్వం బీసీలను అన్యాయం చేస్తున్నా, స్పందించకపోవటంతో, తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖాలు చేసింది టీడీపీ. ఎంపీ రామ్మోహన్ నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ పిటిషన్ వేసారు. జగన్ బీసీల పై కుట్ర పన్నారని, అందుకే పిటీషన్ వేసామని చెప్పారు. మరో పక్క, టిడిపి బీసి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో, అన్ని మండలాల బిసి నాయకులు, బిసి ప్రజా ప్రతినిధులు పాల్గున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, "ఎన్టీఆర్ వల్లే బీసి నాయకత్వం పెంపొందింది. టిడిపి వల్లే బీసి రాజకీయ సాధికారత సాధ్యమైంది. టిడిపి అంటే బీసి..బీసి అంటే టిడిపి. అందుకే బీసిలపై జగన్ కక్ష సాధిస్తున్నారు. జీవో 558ద్వారా బీసిల గొంతు కోశారు. 10%కోత వల్ల బీసిలు 16వేల పదవులు కోల్పోతారు."

bc 05032020 3

"బీసి రాజకీయ సాధికారతకు వైసిపి సమాధి. 10% రిజర్వేషన్ల కోత బీసిలకు కోలుకోలేని దెబ్బ. బీసిల పట్ల వైసిపి ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తోంది. పూలె, ఎన్టీఆర్ ఆదర్శాలను వైసిపి కాలరాస్తోంది. బీసి రిజర్వేషన్లు 34%నుంచి 24%కు తగ్గింపు వైసిపి ఉన్మాద చర్య. దీనిపై అన్ని మండల కేంద్రాలలో నిరసనలు తెలపాలి. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు జరపాలి. అటు న్యాయపోరాటం, ఇటు ప్రజా పోరాటం ఉధృతం చేయాలి. బీసి రిజర్వేషన్లు 33ఏళ్లుగా టిడిపి కల్పించిన హక్కు. 1987నుంచి 27% బీసి రిజర్వేషన్లు కల్పించాం. 1994నుంచి 34% బీసి రిజర్వేషన్లు ఇచ్చాం. పోరాడి బీసిలు సాధించుకున్న హక్కు 34% రిజర్వేషన్లు. ఇప్పుడు పోగొట్టుకుంటే మళ్లీ తిరిగిరాదు. దీనిని తాకట్టు పెట్టే అధికారం, పొట్టకొట్టే అధికారం వైసిపికి లేదు. ఇప్పుడు బిసి రిజర్వేషన్లను 24%కు తగ్గింపు దుర్మార్గ చర్య. బీసిల గొంతు నొక్కేందుకే శాసన మండలి రద్దు. బీసిల అసైన్డ్ భూములు లాక్కున్నారు. బీసి సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. ఫెడరేషన్ల నిధులు పక్కదారి పట్టించారు. బీసి కార్పోరేషన్లను నిర్వీర్యం చేశారు. మౌనంగా ఉంటే వైసిపి ఉన్మాదం పేట్రేగిపోతోంది. బిసిల హక్కుల రక్షణ కోసం ఉద్యమించాలి. దీనిపై ఇప్పటికే బీసి ప్రత్యేక బృందం ఢిల్లీకి పంపాం. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తున్నాం. బీసిలపై వైసిపి కక్ష సాధింపు చర్యలను అడ్డుకోవాలి. బీసీ రాజకీయ సాధికారత కాపాడుకోవాలి. 34% బీసి రిజర్వేషన్లను కాపాడుకోవాలి." అంటూ చంద్రబాబు చెప్పారు.

రాజకీయం, వ్యాపారం, సినిమా.. ఈ మూడు కలిసిపోయి ఉంటాయి మన దేశంలో. వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, సినిమాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లోకి రావటం సర్వ సాధారణం. అలా అని వచ్చిన ప్రతి ఒక్కరూ క్లిక్ అవుతారా అంటే లేదు. ఉదాహరణకు అన్న ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తే, మిగతా సినిమా హీరోలు రాజకీయల్లో చతికిల పడ్డారు. అలాగే కొంత మంది వ్యాపారస్తులు, వరుసగా ఎంపీలు అవుతుంటే, కొంత మంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ప్రజల మనసులు గెలవ లేక పోతున్నారు. అయితే ప్రజల మనసు గెలిచి, వరుసగా గెలుస్తున్న వాళ్ళు, రాజకీయాల్లో నిలదొక్కుకున్న సినిమా వారు, రాజకీయ నాయకులు ఉన్నారు. అయితే ఇలా గెలిచిన వారిని, బలహీన పరిచే కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వారిలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఒకరు. అమర్ రాజా కంపెనీల వారసుడిగా ఉన్న గల్లా, రాజకీయల్లోకి వచ్చి, రెండు సార్లు ఎంపీ అయ్యారు. అంతే కాదు, అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉంచుకుని, పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీని, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, ఏపి తరుపున ధైర్యంగా మాట్లాడారు కూడా.

galla 04032020 2

ఇప్పుడు గల్లా పై మరో ప్రచారం మొదలు అయ్యింది. గల్లా జయదేవ్ కంపెనీ అమర్ రాజా సంస్థతో తైవాన్ కంపెనీ సలోమ్ పార్టనర్ షిప్ కుదుర్చుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద కోట్లు పెట్టుబడి పెట్టటానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా, తన పెట్టుబడులు వ్యాప్తి చేస్తూ, తైవాన్ సంస్థ సలోమ్ భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం, చిత్తూరులో అమర్ రాజా ఆటోమొబైల్ బ్యాటరీ ఉత్పత్తి కంపెనీతో, 100 కోట్లు పెట్టుబడి పెట్టటానికి నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 800 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అయితే ఈ వార్త బయట పడగానే, వైసీపీ ఆక్టివ్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ ఒక పక్క, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి ఎవరూ రావటం లేదు అని ప్రచారం చేస్తున్నారని, వైసీపీ అంటుంది.

galla 04032020 3

గత 5 ఏళ్ళలో గల్లా రూపాయి పెట్టుబడి పెట్టలేదని, చంద్రబాబు మీద నమ్మకం లేదని, ఇప్పుడు జగన్ మీద నమ్మకంతో పెడుతున్నారని వైసీపీ ప్రచారం చేసింది. అయితే అలా ప్రచారం చేస్తుంటే, మరో పక్క టిడిపి ఎంపీనే ఇప్పుడు, మా జగనన్న పై నమ్మకంతో, పెట్టుబడి పెడుతున్నారు అంటూ, కొత్త ప్రచారం మొదలు పెట్టింది. మా జగనన్న అంటే అది అంటూ, గల్లాని ట్యాగ్ చేస్తూ రచ్చ చేసింది వైసీపీ. అయితే దీని పై అదే స్థాయిలో గల్లా రియాక్ట్ అయ్యారు. అమర్ రాజా గ్రూప్, గత 5 ఏళ్ళలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రూ.1800 కోట్లు పెట్టిందని, 6 వేల మందికి ఉపాధి ఇస్తుందని, భవిష్యత్తులో, 1100 కోట్లు పెట్టుబడి ఏపిలో పెట్టే ఆలోచన ఉందని చెప్పారు. తమ ఫ్యామిలీ ఎప్పుడూ, రాజకీయం, వ్యాపారం వేరేగా చూస్తూ వస్తుందని, స్థానిక యువతకు ఉపాధిని ఇచ్చే అంశంలో, అమర్ రాజా, ఏ ప్రభుత్వం ఉన్నా పెట్టుబడులు పెడుతూనే ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

విజయనగరం సంస్థానం వ్యవహారాల్లో కూడా జగన్ ప్రభుత్వం తలదూర్చిందని, 1958లో ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను, గజపతిరాజుల సంస్థానానికి మూలపురుషుడైన పీ.వీ.జీ. రాజు తన తండ్రి గారైన మహారాజా అలక్ నారాయణ గజపతి (మాన్సాస్ ట్రస్ట్) పేరుతో స్థాపించడం జరిగిందని, ఆనాడు ఆయనస్థాపించిన ట్రస్ట్ కొన్ని విధివిధానాలు, నియమనిబంధనల ప్రకారం నేటికీ నిర్వహించడం జరుగుతోందని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మరోమాజీ మంత్రి కాలవశ్రీనివాసులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ట్రస్ట్ ను స్థాపించినప్పుడే పీ.వీ.జీ.రాజు ట్రస్ట్ చైర్మన్ గా ఉండి, తన కుమారులైన ఆనందగజపతి రాజు, అశోక్ గజపతిరాజులను మెంబర్లుగా నియమించడం జరిగిందన్నారు. వారు నెలకొల్పిన అనేక విద్యాసంస్థలనుకూడా ట్రస్ట్ అధీనంలోకి తీసుకొచ్చి, దాని నిర్వహణకోసం 13వేల ఎకరాలను దాతృత్వంగా ట్రస్ట్ కు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నిప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా, ఎవరూకూడా విజయనగరం రాజుల అధీనంలోఉన్న మాన్సాస్ ట్రస్ట్ జోలికి, దాని అధీనంలో ఉన్న విద్యాసంస్థలజోలికి వెళ్లలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తొలిసారి రాష్ట్రప్రభుత్వానికి చెందిన ప్రముఖనేత, ట్రస్ట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందులోభాగంగానే ఆనందగజపతిరాజు రెండోకుమార్తె అయిన సంచితను ట్రస్ట్ ఛైర్మన్ గా నియమించారని కళా వెంకట్రావు పేర్కొన్నారు. అప్పటికప్పుడు రహస్యంగా జీవో ఇచ్చి, సంచితను ఛైర్మన్ గా నియమించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందో, తరతరాలుగా వస్తున్న రాజకుటుంబం సంప్రదాయాలకు విరుద్ధంగా ఎందుకు నిర్ణయం తీసుకుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేలా కొనసాగిస్తున్న తన చర్యలను జగన్మోహన్ రెడ్డి, విజయనగరం రాజుల కుటుంబంలోకి తీసుకెళ్లడంపై, విజయనగరం వాసులతో పాటు, మాన్సాస్ ట్రస్ట్ దయతో విద్యాబుద్ధులు నేర్చుకున్నవారందరూకూడా తీవ్రంగా తప్పుపడుతున్నారని టీడీపీనేత స్పష్టంచేశారు. ప్రజలసమస్యలు పరిష్కరించడం చేతగాని ప్రభుత్వం, రాజకుటుంబీకుల వ్యవహారాల్లో వేలుపెట్టడం ఎంతవరకు సమంజసమని కళా నిలదీశారు. పీ.వీ.జీ.రాజు కుమారుల్లో ఒకరైన ఆనందగజపతిరాజుకి అబ్బాయిలు లేరని, అందువల్లే ఆయనకు తమ్ముడైన అశోక్ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు కలుగచేసుకుందో ప్రజలకు చెప్పాలన్నారు. నెలరోజుల క్రితం ఢిల్లీలో సంచితను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి, సాక్షి టీవీలో ప్రసారంచేశారని, తర్వాత సాక్షిపత్రికలో అదే ఇంటర్వ్యూ కథనాన్ని ప్రచురించారన్నారు. ఇవన్నీ జరిగిన 15రోజుల తర్వాత సింహాచలం దేవస్థానానికి కమిటీవేసిన ప్రభుత్వం, అశోక్ గజపతిరాజుని ఛైర్మన్ గా, సంచిత గజపతిరాజుని మెంబర్ గా నియమించడం జరిగిందన్నారు. ఇది జరిగాక మాన్సాస్ ట్రస్ట్ లోవేలుపెట్టిన ప్రభుత్వం, దానికింద ఉన్న రూ.లక్షా30వేలకోట్ల విలువచేసే 13వేల ఎకరాల భూమిపై కన్నేసిందన్నారు. రాజకుటుంబం మధ్యన చిచ్చుపెట్టి, ట్రస్ట్ నడవడంలేదని చెప్పి, ఆభూములు కొట్టేయాలన్న దురుద్దేశంతోనే, సంచితను ట్రస్ట్ ఛైర్మన్ గా నియమించారని కళా వెంకట్రావు పేర్కొన్నారు.
ఏపీలో తిరుపతి తర్వాత రెండో అతిపెద్ద దేవాలయమైన సింహాచల దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు కొనసాగుతుంటే, 3వతేదీన మరో కొత్తజీవో ఇచ్చి, సంచిత గజపతిరాజునే ఆలయ ఛైర్మన్ గా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

20 రోజుల్లోనే అశోక్ గజపతి రాజుస్థానంలో సంచితను ఎందుకునియమించారు.. ప్రభుత్వంలోని ఆ కీలకనేత రాజకుటుంబం వ్యవహారాల్లో ఎందుకు కలగచేసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, తిరిగి ప్రశ్నలేస్తూ కట్టుకథలు చెబుతూ తప్పించుకుంటోందన్నారు. సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉన్న 9వేల ఎకరాల భూములపై కన్నేసిన జగన్ సర్కారు, రూ.9లక్షలకోట్ల విలువచేసే ఆ భూమికి ఎసరు పెట్టిందన్నారు. ఎప్పటినుంచో ఉన్న వంశపారంపర్య ధర్మకర్తనుకాదని, 30ఏళ్ల వయసుకూడాలేని సంచితను తెరపైకి తీసుకురావడం వెనుక ప్రభుత్వం పెద్ద కుట్రే చేస్తోందని కళా తెలిపారు. రాజకుటుంబం వ్యవహారాల్లో వేలుపెట్టి, లక్షలకోట్ల విలువైన ఆస్తులను కొట్టేయాలన్న ఆలోచన ఉండబట్టే, 20రోజుల వ్యవధిలోనే దేవస్థానం మెంబర్ గా ఉన్న సంచితను ఛైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు. ఇవన్నీ చూస్తుంటే, జగన్ ప్రభుత్వం కావాలనే ట్రస్ట్ వ్యవహారాల్లో, దేవస్థానం విషయాల్లో జోక్యం చేసుకుంటుందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. రాజుల కుటుంబాన్ని విచ్ఛిన్నంచేయాలన్న దుర్భుద్ధి జగన్ ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వం జారీచేసిన జీవో చూస్తే ఆ విషయం బోధపడుతోం దన్నారు. ఒడిస్సాలోని రాజులుకూడా సింహాచలం దేవస్థానానికి భూములు ఇచ్చారని, హిందూ మత విశ్వాసాలపై జగన్ ఎందుకు దాడిచేస్తున్నారో ప్రజలే ఆలోచించాలన్నారు.

ఉదాత్తమైన ఆశయాలతో నిర్వహింపబడుతున్న మాన్సాస్ ట్రస్ట్ పై కన్నేసిన జగన్ ప్రభుత్వం, అశోక్ గజపతిరాజుపై కక్షతీర్చుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే వారి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాజకీయ కోణంలో ఆలోచిస్తున్న ప్రభుత్వం, లక్షలకోట్ల విలుచేసే ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న దుర్భుద్ధితోనే అశోక్ గజపతిరాజు కుటుంబ వ్యవహారం లో వేలుపెట్టిందన్నారు. 1958లో పీ.వీ.జీ రాజు ట్రస్ట్ ను ఏర్పాటుచేసినప్పుడే తన తదనంతరం ఎవరు ట్రస్ట్ కు ఛైర్మన్ గా వ్యవహరించాలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఎవరైతే కుటుంబానికి వారసుడిగా ఉంటాడో, అతనే ట్రస్ట్ కు ఛైర్మన్ గా ఉంటాడని నిబంధనల్లో పేర్కొనడం జరిగిందని, దానిప్రకారమే 16ఏళ్లపాటు, ఆనంద గజపతి రాజే ట్రస్ట్ కు ఛైర్మన్ గా వ్యవహరించారని కాలవ తెలిపారు. 20-02-2020న జీవో నెం-252 విడుదలచేసిన జగన్ ప్రభుత్వం, సింహాచలం ఆలయట్రస్ట్ బోర్డుని 16 మంది సభ్యులతో ఏర్పాటు చేసిందన్నారు. ఆ జీవో ప్రకారం అశోక్ గజపతిరాజుని ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా పేర్కొని, సంచితను 16మందిలో ఒక మెంబర్ గా నియమించిందన్నారు. 29వ తేదీన జరగాల్సిన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం మార్చి3వతేదీకి వాయిదాపడటంతో, ఉన్నపళంగా సంచిత ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేయడం జరిగిందన్నారు. అధికారికంగా అందుకు సంబంధించిన ఉత్తర్వులేవీ బయటపెట్టకుండా, ట్రస్ట్ వ్యవస్థాపకులైన పీ.వీ.జీ రాజు నిబంధనల్లో వారసుడు అనిచెప్పినప్పటికీ దాన్నికాదని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మాన్సాస్ ట్రస్ట్ అధీనంలో ఉన్న 13వేల ఎకరాలతోపాటు, ఉత్తరాంధ్రలో ఉన్న లక్షలఎకరాలను కాజేయాలన్న ఆలోచన విజయసాయికి ఉండబట్టే, ట్రస్ట్ వ్యవహారాల్లో వేలుపెట్టేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందన్నారు.

Advertisements

Latest Articles

Most Read