ఇప్పుడు ప్రభుత్వాలు, పారదర్శకత వైపు పరుగులు తీస్తున్నాయి. ప్రతి విషయం ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రతి డిపార్టుమెంటు ఏమి చేస్తుంది,ఎంత ఖర్చు పెడుతుంది అనే వివరాలు, సియం డ్యాష్ బోర్డు లో పెట్టేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత, ఆ డ్యాష్ బోర్డు కూడా సరిగ్గా పని చెయ్యటం లేదని, ఒకరోజు వస్తే, ఒక రోజు రాదు అంటూ విమర్శలు వచ్చాయి. ఇక మరో పక్క ప్రభుత్వం వరుస పెట్టి ఇస్తున్న రహస్య జీవోల విషయంలో కూడా, ఇలాగే విమర్శలు వస్తున్నాయి. ప్రజల దగ్గర దాయటానికి ఏమి ఉంటుంది ? ప్రతి విషయం ప్రజలకు తెలియాలి కదా ? ఏదన్నా మరీ రహస్యం అయితే, ఒకటో రెండో ఉంటాయి కాని, ఇలా వందల జీవోలు ఎందుకు ఉంటాయి అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇది ఇలా ఉంటే, నిన్న అర్ధరాత్రి, 11:45 గంటల నుంచి 11:55 మధ్య, 10 నిమిషాల్లో 10 రహస్య జీవోలు వచ్చాయి. ఈ జీవోలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు చెందినవి కావటంతో, ఇవి ఎన్నికల విషయంలో ఇచ్చిన జీవో లు అంటూ ప్రచారం జరుగుతుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు, 59.85 శాతం రిజర్వేషన్లతో కాకుండా, కేవలం 50 శాతం వరకే ఉండాలి అని కోర్ట్ చెప్పిన విషయం తెలిసిందే.

secretariat 040320202

అయితే ప్రభుత్వం ఈ విషయంలో సరిగ్గా వాదనలు వినిపించలేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగ్గట్టే వ్యవహరం కూడా నడించింది. హైకోర్ట్ 59.85 శాతం రిజర్వేషన్ రద్దు చేసిన వెంటనే, ప్రభుత్వం ఒకే అంటూ, బీసీల రిజర్వేషన్ తగ్గించి 50 శాతంతో ఎన్నికలకు వెళ్ళటానికి రెడీ అయ్యింది. అయితే, 59 శాతం పై చిత్తసుద్ధి ఉంటే, ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కు వెళ్ళాలి కాని, ఇలా 50 శాతానికి ఎందుకు ఒప్పుకుంది ? బీసీలకు న్యాయం చేస్తాం అంటూ 59 శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, దాని కోసం పోరాడాలి కదా ? ఎందుకు సరిగ్గా వాదనలు వినిపించలేదు అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. 24 ఏళ్ళుగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఉందని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్వాకంతో, అది 25కి పడిపోయింది ఆనే వాదన వినిపిస్తుంది.

secretariat 04032020 3

ఇదే సమయంలో, ప్రభుత్వం రహస్య జీవోలు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లను కుదిస్తూ, కొత్త రిజర్వేషన్లు ఖరారు చేస్తూ, ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని, ప్రజా వ్యతిరేకత, న్యాయ పరమైన చిక్కులు వస్తాయనే, అవి రహస్యంగా ఉంచారని, వాదనలు వినిపిస్తున్నాయి. చివరి నిమిషం వరకు ఇవి చెప్పకుండా, ఎవరూ కోర్ట్ కు వెళ్ళకుండా, వీటిని రహస్య జీవోలో ఉంచి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత, ఎలాగూ చెప్పాలి కాబట్టి, అప్పుడు బయటకు చెప్పే అవకాసం ఉన్నట్టు సమాచారం. నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత, కోర్ట్ కు వెళ్ళినా, కోర్ట్ ఎన్నికలు ఆపమని ఆదేశాలు ఇచ్చే అవకాసం ఉండదని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికి, రహస్య జీవోల ద్వారా, 24 ఏళ్ళుగా బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్ ను ఎత్తేసే కుట్ర జగన్ చేస్తున్నారని, టిడిపి ఆరోపిస్తుంది.

బీసీల రిజర్వేషన్ ను తమ పేలవమైన వాదనలతో, హైకోర్ట్ లో రిజర్వేషన్ కొట్టేసేలా చేసి, ఇప్పుడు సుప్రీం కోర్ట్ కు వెళ్ళకుండా, బీసీ రిజర్వేషన్ తగ్గించి, ఎన్నికలకు వెళ్ళటం పై, చంద్రబాబు మండి పడ్డారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. చంద్రబాబు ఏమన్నారంటే... "బిసిల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇది పద్దతి కాదని హెచ్చరిస్తున్నాం. ఆర్ధికంగా, సామాజికంగా బీసిలు శాశ్వతంగా వెనకబడి ఉండకుండా తగిన ఆదరణ, గుర్తింపు ఇవ్వాలి. బిసిల జనాభా 48%-50% కాబట్టి 34% రిజర్వేషన్లను 04.09.2013న అప్పటి ప్రభుత్వం కల్పించింది. 1995నుంచి 2020దాకా బిసిలకు రిజర్వేషన్లను 25ఏళ్లు కాపాడాం. వాటివల్ల బిసిలకు ఎనలేని లబ్ది చేకూరింది. 1987నుంచి 33ఏళ్లపాటు బిసిలకు రిజర్వేషన్ల లబ్ది చేకూరింది. అలాంటిది ఇప్పుడీ వైసిపి ప్రభుత్వం నిర్వాకం వల్ల బిసి రిజర్వేషన్లు 24%కు తగ్గుతాయి. 10% రిజర్వేషన్లను బిసిలు కోల్పోతారు. 16వేల మంది బిసిలు పదవులను కోల్పోతారు. ఇది మీ( వైసిపి ప్రభుత్వ) అసమర్ధత కాదా..? బిసిల పట్ల మీ కక్షకాదా..? 33ఏళ్లు కాపాడిన బిసి రిజర్వేషన్లను మీరు కాపాడలేక పోయారంటే ఇప్పుడు మిమ్మల్ని బిసి ద్రోహి అనాల్నా..? బిసి వ్యతిరేకి అనాల్నా..? మీ కేసులలో వాదించడానికి బ్రహ్మాండమైన లాయర్లను పెడతారు.

"ప్రజాధనం వాళ్లకు ఫీజులుగా కట్టబెడతారు. మరి బిసి రిజర్వేషన్ల కేసును ఎందుకు అనాధగా చూశారు..? కౌన్సిల్ రద్దుపై ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేశారు, ప్రధానిని కలిశారు, అదే బిసి రిజర్వేషన్లపై వారితో ఎందుకని మాట్లాడలేదు..? బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన ఇద్దరూ వైసిపి వాళ్లే..రాఫ్తాడు మండల వైసిపి అధ్యక్షుడు బి రామాంజనేయులు ఒకరు కాగా, రెడ్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి మరొకరు. నిన్న ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు ఎందుకు పోవడం లేదో బిసిలకు సంజాయిషీ ఇవ్వాలి. డివిజన్ బెంచ్ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లి బిసి రిజర్వేషన్లను గత ప్రభుత్వాలు కాపాడాయి. ఈ 9నెలలు ఎందుకని నిద్రపోయారు..? అమరావతి నాశనం చేయాలి, పోలవరం నిలిపేయాలి, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలి,ఆర్ధిక మూలాలను దెబ్బతీయాలి, తప్పుడు కేసులతో మానసికంగా హింసించాలి అనేవాటిపైనేనా మీ దృష్టి అంతా..? బిసి రిజర్వేషన్లపై నిముషం కూడా ఆలోచించే తీరిక లేకుండా పోయిందా..? ఇప్పుడు పరీక్షల సీజన్ వచ్చింది, ఇన్నాళ్లు ఎందుకు నిద్రపోయారు..? ఆర్ధిక సంఘం డబ్బులు రావాలి కాబట్టి బిసిలకు అన్యాయం చేస్తారా..? దీనినింతటితో వదిలిపెట్టం, 131కులాల తరఫున సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడతాం. బిసి రిజర్వేషన్ల పరిస్థితి కేంద్రానికి వివరించి సాయం చేయమని ఎందుకు కోరలేదు..? కౌన్సిల్ రద్దుకు సాయం అడిగిన వాడివి బిసి రిజర్వేషన్లపై ఎందుకని అడగలేదు..? "

"గత ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ది మీకెందుకు లేకుండా పోయింది..? బిసిలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని దేశం అంతా ఒత్తిడి చేస్తుంటే స్థానిక సంస్థల్లో బిసిలకు గతంనుంచి ఉన్న రిజర్వేషన్లలో కోత పెట్టడాన్ని ఏమనాలి..? ఇది బిసిలకు నమ్మక ద్రోహం కాదా..? ఇక్కడే బిసిలపై మీకున్న కక్ష బైటపడింది. మీరు ఇవ్వకపోతే పోయారు, మేము ఇచ్చింది తీసేసే హక్కు ఎవరిచ్చారు..? కావాలని ఎన్నికలు తెచ్చి శాశ్వతంగా బిసిలకు ద్రోహిగా మిగిలిపోవద్దు. నిన్న తీర్పు వస్తే కులసంఘాలతో, రాజకీయ పార్టీలతో మీరెందుకని చర్చించలేదు..? ఆరోజు కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ది,ఇంగిత జ్ఞానం మీకు లేదా..? 34% రిజర్వేషన్లను 40%కు పెంచాలిగాని, 24%కు తగ్గిస్తారా..? నోరుతెరిస్తే అన్నీ అబద్దాలే.. ఒక్కరోజైనా వాస్తవాలు చెప్పారా..? అబద్దాల కోరు పార్టీ వైసిపి.. మిగలబెడ్తామన్నారు పోలవరాన్ని ఏం మిగిలింది..? ఉద్దరిస్తామన్నారు రాష్ట్రాన్ని ఏం ఉద్దరించారు..? అమరావతిని ఉద్దరిస్తామన్నారు ఏం ఉద్దరించారు..? వీళ్లవల్ల మా పరువు పోయిందని కేంద్రమంత్రే అన్నారు. డిజిపిని హైకోర్టు పిలిచే పరిస్థితి. పర్యటనకు అనుమతి ఇచ్చి నాకు 151నోటీసు ఇస్తారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, అప్రదిష్టపాలు చేశారు. భావితరాల భవిష్యత్తు అంధకారం చేశారు. మీ చేతగానితనానికి బిసిలు మాల్యం చెల్లించాలా..? బిసిల రాజకీయ భవిష్యత్తును శాశ్వతంగా సమాధి చేస్తారా..? వైసిపి ఉన్మాద చర్యలపై ప్రజలంతా ఆలోచించాలి. " అని చంద్రబాబు అన్నారు.

దశలవారీ మద్యపాన నిషేధం ముసుగులో జగన్ ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా కల్తీ మద్యం విక్రయాలు జరుపుతూ, మద్యంవ్యాపారాన్నేప్రధాన ఆదాయవనరుగా మార్చుకొని, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాణాలకు హానికలిగించే పలురకాల కల్తీ మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో విక్రయిస్తూ, తాడేపల్లిలో ఇండెంట్ – హైదరాబాద్ లో పేమేంట్ అన్నతీరుగా జే-ట్యాక్స్ కోసం జగన్ వ్యవహారం నడిపిస్తున్నాడన్నారు. నెలకు రూ.350కోట్ల పైచిలుకు చొప్పున కమీషన్లు కొట్టేస్తూ, 10నెలల నుంచి జే-ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారన్నారు. మద్యపానం నిషేధం కోసమే ధరలు పెంచామని, దానివల్ల మద్యం వినియోగం తగ్గుతుందని చెబుతున్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఎక్కడా కనీవినీ ఎరుగని, ఎవరూ చూడని, పిచ్చిపిచ్చిపేర్లతో చెలామణి అవుతున్న మద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న దుకాణాలకు సరఫరా చేస్తున్నారన్నారు. జార్డీ ఎస్ బార్ (విస్కీ), బూమ్ (బీర్), వంటి పేర్లున్న వివిధరకాల కల్తీ మద్యాన్ని కమీషన్ల కోసమే విక్రయిస్తున్నారని ఉమా తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలతో సహా, జగన్ కు ఇష్టమైన దక్షిణాఫ్రికాలో కూడా లభించని మద్యం బ్రాండ్లన్నీ, ఏపీలోనే జగన్ సర్కారు అమ్ముతోంద న్నారు. బీర్ కేసుకి ఇంత, చీప్ లిక్కర్ కు ఇంత, లిక్కర్ కు ఇంతా అని లెక్కలేసి మరీ జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా కమీషన్లు వసూలు చేస్తోందన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో 50, 60ఏళ్ల నుంచి మద్యం ఉత్పత్తులు తయారుచేస్తున్న జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లనే విక్రయించడం జరిగిందన్నారు. జనం ఆరోగ్యంతో చెలగాటమాడేలా జగన్ మాదిరి పిచ్చి మద్యం అమ్మలేదన్నారు. డబ్బుపిచ్చి పట్టిన జగన్ ప్రభుత్వం, పొద్దస్తమానం కష్టపడిన శ్రమజీవి రక్తాన్ని, మద్యం అమ్మకాల ద్వారా పీల్చడానికి కూడా వెనుకాడటం లేదని బొండా మండిపడ్డారు. హైదారాబాద్ లో జే-ట్యాక్స్ కట్టిన బ్రాండ్లకు మాత్రమే తాడేపల్లిలో ఇండెంట్ ఇస్తున్నారని, గతంలో ఎప్పుడూ చూడని, వినని పేర్లతో కూడిన డిస్టిలరీలన్నీ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. తొలి రెండునెలలు డిస్టిలరీలు ఇచ్చిన కమీషన్లతోనే సర్కారు తృప్తిపడిందని, కానీ తరువాత సొంతంగా నడపాలన్న ఆలోచనతో పక్కరాష్ట్రాల నుంచి పిచ్చిపిచ్చిపేర్లతో కల్తీమద్యం విక్రయాలు జరపడానికి సిద్ధపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో, మద్యం సిండికేట్ల వ్యవహారం భారీ ఎత్తున సాగుతున్న ఉదంతాలనుచూశామని, బొత్స లాంటి ప్రముఖుల పేర్లుకూడా ప్రచారంలోకి వచ్చాయన్నారు. వైసీపీప్రభుత్వం లోని కీలకనేతలంతా కలిసి, జగన్ అండదండలతో ఏపీలో అతిపెద్ద లిక్కర్ మాఫియాకు తెరలేపారన్నారు. టీడీపీ ప్రభుత్వం విక్రయించిన మద్యం రకాలన్నీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖమైనవని, జగన్ ప్రభుత్వం విక్రయించే బ్రాండ్లు మాత్రం ఏపీలో తప్ప ఇంకెక్కడా లభించడంలేదన్నారు. (కల్తీ మద్యంరకాలను బొండా ఉమా ఈ సందర్భంగా విలేకరులకు చూపించారు), ప్రతిరోజు కొన్ని లక్షలలీటర్ల కల్తీ మద్యం రాష్ట్రంలోనే తయారవుతోందని, దానికితోడు అదనంగా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన ఎన్ డీపీ లిక్కర్ (నాన్ డ్యూటీపెయిడ్)ను రాత్రి 8.30గంటల నుంచి వైసీపీనేతలే విక్రయిస్తున్నారన్నారు.

వాలంటర్లీ ద్వారా పింఛన్లు ఇంటింటికీ ఇప్పించామని డబ్బాలు కొట్టుకుంటున్న ప్రభుత్వం, వారిద్వారానే గడపగడపకూ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తోందన్నారు. రూ. 500 నుంచి రూ.700 సంపాదించే దినసరి కూలీ, మద్యానికి రూ.200 ఖర్చుచేసేవాడని, ఇప్పుడు పిచ్చిమందు కొనడానికి రూ.400వరకు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పిచ్చి మందు తాగేవారంతా, రాత్రివేళల్లో వింతవింతగా ప్రవర్తిస్తూ ఇంట్లోనివారికి కూడా నిద్రలేకుండా చేస్తున్నారని, ఉదయం ఎన్నిగంటలకు లేస్తారో కూడా తెలియడంలేదని, దీనికంతటికీ జగన్ కు పట్టిన డబ్బుపిచ్చే కారణమన్నారు. తన డబ్బుపిచ్చి కారణంగా ప్రజల ప్రాణాలను హరించడానికి కూడా జగన్ వెనుకాడటంలేదని ఉమా దుయ్యబట్టారు. రాష్ట్రంలో తయారవుతున్న కల్తీమద్యం వల్ల తమకు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని మద్యపానప్రియులే చెబుతున్నారన్నారు. కేస్ ల వారీగా చీప్ లిక్కర్ పై రూ.3వేలు, బీర్ ల కేస్ పై రూ.700, ప్రీమియం బ్రాండ్లపై కేస్ కు రూ.4నుంచి రూ.5వేల వరకు ధరలు పెంచి అమ్ముతూ, జే-ట్యాక్స్ వసూలుచేస్తున్నారన్నారు. మద్యనిషేధం అమల్లో ఉంటే, ప్రభుత్వానికి ఆదాయం తగ్గాలని, కానీ అందుకు విరుద్ధంగా జగన్ కు, ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో, పేదలు, కార్మికులు, రోజువారీ కూలీల జేబుకు చిల్లుపడిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక కల్తీ మద్యం కారణంగా ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్యకూడా పెరిగిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుధ్ధి ఉంటే, నిజంగా సంపూర్ణ మద్య నిషేధం అమలుచేయాలన్నారు.

జగన్ ప్రభుత్వంలో ఆడవాళ్లు ఉల్లిపాయలకోసం, మగవాళ్లు మద్యం కోసం క్యూలైన్లలో నిలబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. పిచ్చి మద్యం తాగేవారంతా, తామేం చేస్తున్నామో తెలియని స్థితిలో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. మద్యం తరలింపు కాంట్రాక్ట్ కూడా వైసీపీనేతలే కొనసాగిస్తున్నారని, దానిద్వారా కూడా ప్రభుత్వం దోపిడీ సాగిస్తోందన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం నిబంధనలప్రకారం మద్యం దుకాణాలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదని, అందుకు విరుద్ధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేలా పాఠశాలలు, గుడులు, మసీదులు, చర్చిలు, ఇళ్లమధ్యనే దుకాణాలు నిర్వహిస్తున్నారని ఉమా స్పష్టంచేశారు. రాష్ట్రంలో కొత్తమద్యం పాలసీ వచ్చాక, దాదాపు 8లక్షల పైచిలుకు మద్యం కేసులు విక్రయించారని, వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించడానికి కూడా 40 నుంచి 50శాతం వరకు కమీషన్లు దండుకుంటున్నారని ఉమా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అడిగే కమీషన్లు డబ్బురూపంలో చెల్లించలేమంటూ ప్రధాన కంపెనీలన్నీ ఇప్పటికే చేతులెత్తేశాయన్నారు. దానివల్లే ప్రధాన కంపెనీల మద్యం అందుబాటులో లేకుండా పోయిందని, కమీషన్లు ఎక్కువిచ్చే జగన్ బ్రాండ్లు మాత్రమే విచ్చలవిడిగా లభిస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి ఎవరు ఎక్కువలంచం ఇస్తే, వారి బ్రాండ్లనే అమ్ముతున్నారని ఉమా తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా సంపూర్ణ మద్యపాని నిషేధాన్ని అమలుచేసి, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. మద్యాన్ని నిషేధించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే, పిచ్చిపిచ్చి బ్రాండ్లను విక్రయానికి పెట్టేదికాదని, ఆ ఆలోచన లేకపోబట్టే, దశలవారీగా మద్యం దుకాణాలను ఆదాయవనరుగా మార్చిందన్నారు. తెలంగాణలో ఏఏ రకాలు అమ్ముతున్నారో, ఏపీలో ఏరకమైన మద్యం అమ్ముతున్నారో, ఎందుకు అమ్ముతున్నారో జగన్ సమాధానం చెప్పాలన్నారు.

ఎన్నికలకు ముందు పాదయాత్రలో బీసీ డిక్లరేషన్, బీసీ గర్జన, బీసీ సబ్ ప్లాన్ అంటూ ఊదరగొట్టి ఆయా వర్గాల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేడు బీసీల వెన్నెముకనే విరిచేయడానికి సిద్ధపడ్డాడని టీడీపీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిన్న కోర్ట్ లు రిజర్వేషన్ లు కొట్టేయగానే, జగన్ లో ఏ మాత్రం బాధ లేదని, తనకు కావాల్సిందే జరిగింది అన్నటు, జగన్ వెంటనే మంత్రులు చేత బీసీలకు తగ్గించి 50 శాతంతో ఎన్నికలకు వెళ్తాం అని నిన్న సాయంత్రం చెప్పించారని, ఈ రోజు జగన్ స్వయంగా చెప్పారని, రేపు క్యాబినెట్ అంటున్నారని, ఎక్కడైనా కోర్ట్ లు కొట్టేస్తే, సుప్రీం కోర్ట్ కు వెళ్తారని, కాని జగన్ కు బీసీలు అంటే చులకన కాబట్టి, సుప్రీంకు వెళ్ళకుండా, బీసీల గొంతు కోస్తున్నారని అన్నారు. జగన్ నిర్లిప్తత, నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగానే 60.55 శాతం ఉండాల్సిన రిజర్వేషన్లకు 10 శాతం కోత పడిందని... తద్వారా 34 శాతం ఉండాల్సిన బీసీ రిజర్వేషన్లు 24 శాతానికే పరిమితమయ్యాయన్నారు. 1995 నుంచి 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు జగన్ పాలనలో 24 శాతానికి తగ్గించబడ్డాయన్నారు. 25 సంవత్సరాల నుంచి అమలు లో ఉన్న బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి తక్షణమే బడుగు, బలహీన వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ లు కొనసాగించలేని ముఖ్యమంత్రికి అధికారంలో ఉండే అర్హత లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

2010లో హైకోర్టు రిజర్వేషన్లలో కోత పెట్టినా వెనకడుగు వేయకుండా ముందుకెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుప్రీం కోర్టు ద్వారా 60.55 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చేసిన విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. బీసీలంటే జగన్ కు చిన్నచూపు ఉండబట్టే నేడు వారు రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. బీసీలు 10 శాతం రిజర్వేషన్లు కోల్పోయేలా కోర్టు తీర్పు రావడానికి జగనే ప్రధాన కారకుడన్నారు. హైకోర్టులో రిజర్వేషన్లపై వాదనలు జరిగేటప్పడు జగన్ ప్రభుత్వం అసమర్థులైన లాయర్లను నియమించబట్టే బీసీలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. 70 శాతం జనాభా ఉన్న బీసీలకు న్యాయం చేయడం కోసం పేరు ప్రతిష్టలు గల న్యాయవాదులను ఎందుకు నియమించలేదో జగన్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజల ధనాన్ని దుబారా చేయడంలో జగన్ ప్రభుత్వం నెంబర్ వన్ గా నిలిచిందన్న నిమ్మల, సచివాలయ, ఇతర ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, శ్మశానాలకు రంగులు వేయడానికి రూ. 13 వందల కోట్లను దుర్వినియోగం చేసిందన్నారు. తన ఇంటి మరమ్మత్తులకు కూడా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్నే జగన్ దుబారా చేశాడన్నారు. తన కేసులకు సుప్రీం కోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్గీ కి రూ. 5 కోట్లు ఇచ్చి పెట్టుకున్న జగన్, బీసీల రిజర్వేషన్ల కేసు విషయంలో మాత్రం ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ని నియమించి చేతులు దులుపుకున్నాడని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిజర్వేషన్ల అంశంలో ఓడిపోవాలన్న ఉద్దేశం ఉండబట్టే ప్రభుత్వ న్యాయవాది చిత్తశుద్ధితో పని చేయలేదన్నారు. రిజర్వేషన్ లు 50 శాతం దాటకూడదంటూ కోర్టుకు వెళ్లిన వారంతా తెలుగుదేశం పార్టీవారేనని అసత్య ప్రచారం చేసిన జగన్ అంతర్ ‘సాక్షి’ ప్రతాపరెడ్డి, రామాంజనేయులు అనే వ్యక్తులతో జగన్ కు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి తెలుసుకుంటే మంచిదన్నారు. రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షుడైన ప్రతాప్ రెడ్డి రిజర్వేషన్లు తగ్గిస్తూ హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ప్రకటన చేసిన వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదని నిమ్మల ప్రశ్నించారు. బోయరామాంజనేయులు రాప్తాడు మండల వైసీపీ కన్వీనర్ అని, అటువంటి వ్యక్తి బీసీలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళింది వాస్తవమో కాదో వైసీపీ నేతలు, మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. జగన్ ప్రోద్భలంవల్లే రామాంజనేయులు కోర్టులో బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రెండు పిటిషన్లు (1143/2020 మరియు 604/2020) వేశాడన్నారు. (ఈ సందర్భంగా బోయ రామాజంనేయులు జగన్ తో దిగినఫొటోలను, శుభాకాంక్షలు చెబుతూ జగన్ పేరుతో వేసిన ప్లెక్సీల ఫొటోలను నిమ్మల విలేకరులకు చూపించారు).

తనపార్టీ వారితోనే బీసీల రిజర్వేషన్లు తగ్గించేలా కోర్టులో పిటిషన్లు వేసిన జగన్, బీసీలకు ఏం సమాధానం చెబుతాడో చెప్పాలన్నారు. 15వేల పదవులు బీసీలకు దక్కకుండా రామాంజనేయులు ద్వారా అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డేనన్నారు. జగన్ ఇంతచేస్తుంటే, బీసీ వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిమ్మల నిలదీశారు. బీసీలకు పెద్దపీట వేస్తామని డబ్బాలు కొట్టుకుంటున్న జగన్, రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా వారిని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడన్నారు. నిజంగా జగన్ కు బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే, తమిళనాడు, కర్ణాటక మాదిరి రిజర్వేషన్లను షెడ్యూల్ లో చేర్చడానికి ఎందుకు ప్రయత్నించడం లేదన్నారు. సొంతకేసుల నుంచి బయటపడటానికి, అమరావతిని చంపేయడానికి, మండలిని రద్దుచేయడానికి ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేసిన జగన్, బీసీల రిజర్వేషన్ల కోసం కేంద్రపెద్దలతో ఎందుకు లాబీయింగ్ చేయలేదని నిమ్మల నిలదీశారు.

Advertisements

Latest Articles

Most Read