నిన్న రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు లేవనెత్తిన అంశంతో, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడు పరువు పోయింది. నిన్న రాజ్యసభలో, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాల వివరాలు, వాటి పని తీరు గురించి వెంకయ్య నాయుడు చెప్తూ, ఎవరు ఎలా పని చేసింది వివరాలు ఇచ్చారు. దీంట్లో, వైసీపీ నేత, ఎంపి విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కామర్స్ కమిటీ పని తీరు అధ్వానంగా ఉందని, తాను ఈ విషయంలో బాధ పడుతున్నట్టు వెంకయ్య చెప్పారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కామర్స్ కమిటీ, అన్ని కమిటీల కంటే తక్కువగా కేవలం, 32 శాతం హాజరు మాత్రమే ఉందని, వెంకయ్య నాయుడు సభ దృష్టికి తెచ్చారు. ఇది చాలా విచారకరమని, తాను ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఈ అపవాదుకు, ఆ కమిటీకి నేతృత్వం వహిస్తున్న, విజయసాయిరెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. స్టాండింగ్ కమిటీలు అనేవి, తమకు కేటాయించిన శాఖలు, బాధ్యతల పై సమీక్షలు జరిపి, చర్చలు జరిపి, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తాయి.

vsreddy 03022020 2

మరింత మెరుగ్గా ఎలా పని చెయ్యాలి, ఏమి చేస్తే మంచిది, ఇలా వివరంగా ప్రభుత్వానికి తగు సూచనలు ఇస్తారు. అయితే, విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కీలకమైన కామర్స్ కమిటీ మాత్రం, ఈ విషయాలను పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. సహజంగా నేతృత్వం వచించే వాళ్ళు బాధ్యత తీసుకుంటే, మిగతా సభ్యులు కూడా, నేతృత్వం వచించే వారిని చూసి నేర్చుకుంటారు. వారు కూడా, సమావేశాల్లో పాల్గునాలి అనే ఆసక్తి వస్తుంది. కాని, ఇక్కడ విజయసాయి రెడ్డి ఆ కమిటీ చైర్మెన్ గా తన బాధ్యతలు సరిగ్గా నిర్వహించటం లేదని, కేవలం 32 శాతం మాత్రమే హాజరు ఉండటం పై, అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఇది రాష్ట్ర సమస్యో, రాజకీయ సమస్యో కాదు, దేశానికి సంబంధించిన విషయం.

vsreddy 03022020 3

మొన్న బడ్జెట్ సమావేశాలు సమయంలో కూడా, బడ్జెట్ పై మాట్లాడండి అని, చైర్మెన్ పిలిస్తే, విజయసాయి రెడ్డి అందుబాటులో లేరు. అపట్లోనే విజయసాయి రెడ్డి పై విమర్శలు వచ్చాయి. కీలకమైన బడ్జెట్ పై, రాష్ట్ర సమస్యలు ప్రస్తావించకుండా జారుకున్నారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేసాయి. విజయసాయి రెడ్డికి, ఎంత సేపు ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబుని ఎలా దెబ్బ కొడదాం, ఈ రోజు ఎవరిని ఇరికిద్దాం అనే ధ్యాసే కాని, తనకు ఇచ్చిన బాధ్యతలు చెయ్యటం చేతకాదని, తెలుగుదేశం పార్టీ విమర్సిస్తుంది. ఆయనకు ఢిల్లీలో ఎంపీగా చెయ్యాల్సిన పని కంటే, ఎపిలో రాజకీయాలు చెయ్యటమే ముఖ్యం అని, లేకపోతె ట్విట్టర్ లో పిచ్చి రాతలు రాయటమే ఇష్టం అని, టిడిపి ఆరోపిస్తుంది.

రాష్ట్రప్రభుత్వం బీసీలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియలో ఆయా వర్గాలకు అన్యాయం చేయడానికి జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని టీడీపీనేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో ఎమ్మెల్సీ బచ్చు అర్జునుడితో కలిసి విలేకరులతో మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థానికసంస్థల్లో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, నేడున్న వైసీపీప్రభుత్వం కావాలనే ఆ మొత్తాన్ని తగ్గించడా నికి ‍యత్నిస్తోందన్నారు. 59శాతం వరకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన జగన్, నేడు కావాలనే తనపార్టీ వారిని కోర్టులకు పంపి, వాటిని 50శాతానికి కుదించేయత్నాలు చేస్తున్నాడన్నారు. వైసీపీకి చెందిన బోయ రామాంజనేయులుని (రాఫ్తాడు మండల వైసీపీ కన్వీనర్) కోర్టుకి పంపిన జగన్ సర్కారు, హైకోర్టులో కూడా బీసీలకు న్యాయం జరిగేలా వాదనలు వినిపించడంలో విఫలమైందన్నారు. స్థానికసంస్థల్లో బీసీలకు అన్యాయం జరిగేలా కోర్టు తీర్పురావడానికి జగన్ ప్రభుత్వమే కారణమని రవీంద్ర దుయ్యబట్టారు.

రాజధాని విషయంలో తన పంతం నెగ్గించుకోవడానికి రూ.5కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి న్యాయవాదిని నియమించిన జగన్మోహన్ రెడ్డి, బీసీల రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగే వాదనకోసం, అనుభవజ్ఙుడైన న్యాయవాదిని ఎందుకు నియమించలేదన్నారు. బీసీలకోసం కనీసం రూ.కోటికూడా ఖర్చుచేయకపోవడంవల్లే, బలహీనవర్గాలవారు తమహక్కులు కోల్పోయే దుస్థితి దాపురించిందన్నారు. జగన్ ప్రభుత్వం హైకోర్టులో సరిగా వాదనలు వినిపించలేకపోయినందునే, రిజర్వేషన్లు 55శాతానికి పరిమితం చేయబడ్డాయని, దానివల్ల బీసీలు దాదాపు 10శాతం స్థానాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 59శాతం రిజర్వేషన్లు అమలై ఉంటే, బీసీలకు 39శాతం వరకు రిజర్వేషన్లు దక్కేవన్నారు. వైసీపీప్రభుత్వం వచ్చాక బీసీలకు చిల్లిగవ్వ కూడా ఖర్చుపెట్టకపోగా, స్థానికసంస్థల ఎన్నికల్లో వారికి దక్కాల్సిన రిజర్వేషన్లకు కూడా కోతపెట్టిందన్నారు. గతప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకోసం అమలుచేసిన అనేక సంక్షేమపథకాలను జగన్ రద్దుచేశాడన్నారు.

కోర్టు తీర్పు ప్రకారం బీసీలకు 25శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతాయని, తద్వారా 1200 గ్రామపంచాయతీలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. బలహీనవర్గాలకు అన్యాయం జరగుతున్న నేపథ్యంలో మంచిలాయర్ ద్వారా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో, కార్పొరేషన్ పదవుల్లో బీసీలకు అన్యాయంచేసిన జగన్ ప్రభుత్వం, తాజాగా రిజర్వేషన్ల అంశంలోకూడా వారికి తీరని అన్యాయం చేయడానికి సిద్ధమైందని రవీంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
బడుగు, బలహీన వర్గాలకు మేలుకలిగేలా 59శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం, తన పార్టీకే చెందిన వ్యక్తితో రిజర్వేషన్ల అంశాన్ని కోర్టులో వేయించి, బీసీలకు 10శాతం వరకు రిజర్వేషన్లు తగ్గేలా చేసిందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు స్పష్టంచేశారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గినా జగన్ సర్కారులో చలనంలేదని, బీసీలు తమప్రభుత్వానికి బ్యాక్ బోన్ అని చెబుతూనే, వారి వెన్నువిరిచే కార్యక్రమాన్ని యథేచ్ఛగా సాగిస్తోందన్నారు. జగన్ కు నిజంగా బీసీలపై ప్రేమాభిమానాలుంటే, ఇప్పటికైనా సుప్రీంకోర్టు తలుపుతట్టి, వారికి న్యాయంజరిగేలా చూడాలని అర్జునుడు డిమాండ్ చేశారు.

అవసరమైతే రూ.2కోట్లు ఖర్చుపెట్టైనా సరే, సుప్రీంలో న్యాయవాదిని నియమించి బీసీలకు న్యాయం జరిగేలాచూడాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. ఎన్టీ ఆర్ బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తే, చంద్రబాబునాయుడు వారిని ఆర్థికంగా పరిపుష్టులను చేశాడన్నారు. రాజ్యాధికారంలో బడుగు, బలహీనవర్గాలకు సరిపడా రిజర్వేషన్లు కల్పించలేనప్పుడు, వారికి జగన్ హామీలెందుకిచ్చాడో చెప్పాలన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 70శాతం వరకు బడుగు, బలహీనవర్గాలకు జగన్ ప్రభుత్వం 9నెలల్లో పైసా కూడా ఖర్చుచేయలేదని, ఏపీలో 139 వరకు బీసీకులాలుంటే కేవలం రెండు కులాలకే ఆర్థిక సహాయం చేస్తామంటూ ప్రభుత్వమిస్తున్న ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని, రిజర్వేషన్ల అంశంలో కూడా వారికి నష్టం చేయాలని చూస్తే సహించేది లేదని అచ్చెన్న హెచ్చరించారు. జగన్ ప్రభుత్వ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకటించగానే, దానిపై సుప్రీంకోర్టుని ఆశ్రయించిన వ్యక్తి పూర్వాపరాలేమిటో మంత్రి బొత్స, ఇతర మంత్రులు తెలుసుకోవాలన్నారు. సదరు వ్యక్తి వైసీపీలో అతిముఖ్యమైన వాడని, ఆయనకు జగన్ తో సన్నిహిత సంబంధాలున్నాయని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు.

దూకుడు నిర్ణయాలతో, వాటి పర్యావసానాలు ఆలోచించకుండా, ఏది తోస్తే అది చేస్తూ, ఎవరి మాట వినకుండా, స్పీడ్ గా వెళ్తున్న జగన్ కు, ఎప్పటికప్పుడు హైకోర్ట్ బ్రేకులు వేస్తూనే ఉంది. ప్రతి రోజు, ఏదో ఒక విషయంలో, ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ చేతిలో ఎదురు దెబ్బలు, మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. తమకు మంద బలం ఉంది, తాము చెప్పిందే వేదం అంటూ, రూల్స్ పాటించుకుండా వెళ్తున్న జగన్ ప్రభుత్వానికి ఈ రోజు ఇప్పటి వరకు, రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. మొదటిది, వైజాగ్ లో చంద్రబాబుని, 151 సెక్షన్ కింద నోటీస్ ఇచ్చి, అరెస్ట్ చెయ్యటం పై, ఈ రోజు విచారణలో, ఏకంగా డీజీపీనే వచ్చి సమాధానం చెప్పమని కోరటం. ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ పై. జగన్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ అంటూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కోర్ట్ లు కొట్టేస్తాయి అని అందరికీ తెలిసిందే. అయినా సరే, జగన్ ప్రభుత్వం, ఎందుకు ముందుకు వెళ్లిందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి.

court 02032020 2

ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ పై హైకోర్టులో విచారణ జరిపింది. ప్రభుత్వం ఇచ్చిన 59.85 శాతం రిజర్వేషన్ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 50 శాతానికి పైగా రిజర్వేషన్ చెల్లదన్న కోర్టు...నెలలోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని తెలిపింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడం సుప్రీం తీర్పునకు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. 4 వారాల తరువాత ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల పై, ప్రభుత్వం ఇచ్చిన జీవోని ప్రభుత్వం రద్దు చేసింది. హైకోర్ట్ ఆదేశాలు నేపధ్యంలో, ఎలా ముందుకు వెళ్ళాలి అనేదాని పై, ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. సుప్రీం కోర్ట్ కు వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని పై చర్చలు జరుపుతున్నారు.

court 02032020 3

ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాల రిజర్వేషన్లు తగ్గిస్తే సహించేది లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అన్నారు. అవసరమైతే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. తొమ్మిది నెలల పాలనలో బలహీన వర్గాల కోసం వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీ పథకాల్లో కోత విధిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీల రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెదేపా కేసు వేసిందంటూ మంత్రి బొత్స తప్పుడు ప్రచారం చేసున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాకు అండగా ఉన్నది బీసీలేనన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. న్యాయస్థానం చెప్పిందని బీసీల రిజర్వేషన్ తగ్గిస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు.

రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని, ఆయన ప్రసంగంలో ఎక్కడా కూడా మండలితిరస్కరించిన మూడురాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు అంశాల ప్రస్తావన రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం సమావేశాల్లో భాగం కాకపోయినప్పటికీ, అది జరగడం అనేది రివాజుగా వస్తోంది కాబట్టి, అది జరుగుతుందన్నారు. కానీ గవర్నర్ ప్రసంగాన్ని తయారుచేసేది ప్రభుత్వమే కాబట్టి, దానిలో ఎక్కడా కూడా గత సమావేశాల్లో మండలి తీసుకున్న నిర్ణయాలను ఎక్కడా ఆ ప్రసంగంలో రాకుండా చూడాలన్నారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి, ప్రభుత్వ పాలసీని రూల్-71కింద తిరస్కరించడం జరిగిందన్నారు. ఏపాలసీలను మండలి తిరస్కరించిందో, వాటినే గవర్నర్ ప్రసంగంద్వారా ప్రభుత్వం తిరిగి సభల్లోకి తీసుకురావాలని చూస్తోందన్నారు. గవర్నర్ తన ప్రసంగంలో ఎక్కడా తనసొంత అభిప్రాయాలు చెప్పరని, ప్రభుత్వ ఆలోచనలు, అభిప్రాయాలే ఆయనద్వారా సభల ముందుకొస్తాయని యనమల పేర్కొన్నారు.

ప్రభుత్వం ఆదిశగా ప్రయత్నాలుచేయకుండా, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, గవర్నర్ కూడా తాను చేయబోయే ప్రసంగాన్ని పరిశీలించాలన్నారు. అసెంబ్లీలో ఆ రెండు బిల్లులు మద్ధుతుపొందాయికాబట్టి, అక్కడ వాటి ప్రస్తావనరాదని, మండలిలో మాత్రమే వాటిని ప్రస్తావించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తు దన్నారు. సర్కారు అదేవిధంగా ముందుకెళ్లాలని చూస్తే, ప్రతిపక్షం చూస్తూ ఉండదని, రాజ్యాంగంప్రకారం, చట్టప్రకారమే ముందుకెళుతుందన్నారు. గతంలో మండలిలో ప్రతిపక్షం తిరస్కరించిన మూడురాజధానుల బిల్లు, సీఆర్డీ ఏ రద్దు బిల్లులను గవర్నర్ ప్రసంగంలో చేరిస్తే, ఆ రెండు అంశాలు సభలో చర్చకు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తే, వాటిని నిర్ద్వందంగా తిరస్కరిస్తామని యనమల తేల్చిచెప్పారు. మండలి తిరస్కరించిన పాతపాలసీలను ప్రభుత్వం పక్కనపెడితేనే మంచిదన్నారు. ప్రతిపక్షం తనకున్న అధికారాలను ఉపయోగించుకునే హక్కుని ఎవరూ కాదనలేరని, ఆ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పోకుండా చేసింది ప్రభుత్వమే కాబట్టి, త్వరలోజరగబోయే సమావేశాల్లో మండలిలో ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాలను ఆమోదించాలని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోకుంటే ప్రభుత్వానికి సరైనవిధంగా గుణపాఠం చెప్పి తీరుతామని యనమల తేల్చిచెప్పారు. రాష్ట్రప్రతిష్టకు సంబంధించిన అంశాలను, బలవంతంగా ఆమోదింపచేసుకోవాలని జగన్ సర్కారు చూస్తే, తాము చట్టప్రకారం తమకున్న హక్కులను ఉపయోగించుకుంటామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, వీలైనంతవరకు ఆ రెండు అంశాలను సభ ముందకు తీసుకురాకుండా ఉంటేనే మంచిదన్నారు.

రిజర్వేషన్ల అమలు, విధివిధానాలపై సుప్రీం ఇచ్చిన తీర్పుని తామేమీ తప్పుపట్టడంలేదని, కాలమాన పరిస్థితులకు తగినట్లుగా న్యాయస్థానాలుకూడా వాటి నిర్ణయాలను మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, రిజర్వేషన్ల ఖరారుపై ఏ వర్గానికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం న్యాయస్థానంలో పున:సమీక్ష కోరవచ్చన్నారు. రిజర్వేషన్లనేవి దళితులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కని, వాటి విషయంలో తమకేమీ అభ్యంతరం లేదన్న యనమల, బీసీల రిజర్వేషన్లలో మాత్రం వారికి అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. బీసీలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చిన పక్షంలో ప్రభుత్వం ఆదరాబాదరాగా ముందుకెళ్లడం ఎంతమాత్రం మంచిదికాదన్నారు. బీసీల సంఖ్యకు తగినట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపైనే ఉందన్నారు. నలుగురి కలయికగా జగన్ ను పేర్కొనవచ్చని, అంతటి ప్రత్యేక లక్షణాలు ఆయనకు మాత్రమే ఉన్నాయని యనమల ఎద్దేవాచేశారు. హిట్లర్, ముస్సోలినీ, నీరో, తుగ్లక్ ల కలయికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డని, ఆయన చర్యలు, చేష్టలు, ఆలోచనలు, నిర్ణయాలు ఆ నలుగురినే గుర్తుకు తెస్తుంటాయన్నారు.

ప్రపంచ రాజకీయ చరిత్రను ఒకసారి గమనించినట్లయితే, రాజధాని మార్పు పేరుతో తుగ్లక్ ఎలా ప్రవర్తించాడో, ప్రపంచాన్నే మింగేయాలన్న పరిపాలనా కాంక్షతో హిట్లర్ ఎలా విర్రవీగాడో, తొలుత సోషలిజం గురించి ప్రచారం చేసిన ముస్సోలినీ, అధికారంలోకి రాగానే ఏవిధంగా ఫాసిస్టుగా మారాడో, గోల్డెన్ ప్యాలెస్ కట్టుకోవడానికి నీరో ఎలాగైతే రోమ్ నగరాన్ని తగలెట్టాడో, అదేవిధంగా వారందరి మనస్తత్వాల కలబోతగా జగన్ రాష్ట్రంలో పాలనసాగిస్తున్నాడని యనమల దుయ్యబట్టారు. తనకు అధికారముంటే చాలు, తాననుకున్నది జరిగితే చాలు, రాష్ట్రం తగలబడిపోయినా, అభివృద్ధి ఆగిపోయినా, పెట్టుబడులు-ఆదాయం రాకపోయినా ఏమీ పరవాలేదన్నట్లుగా జగన్మోహన్ రెడి పరిపాలన సాగుతోందన్నారు. రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది, ఏం చేస్తే ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుందనే ఆలోచనలు లేకుండా, రాష్ట్రం సర్వనాశనమవుతుంటే, ఎందరు సలహాదారులుండీ ఏం ఉపయోగమని యనమల వాపోయారు. సలహాదాలు చెప్పేది ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని, వారి ఆలోచనలు పట్టించుకోకుండా వ్యవస్థల నాశనానికే జగన్ కంకణం కట్టుకున్నాడన్నారు.

Advertisements

Latest Articles

Most Read