విజయనగరం జిల్లా మాన్సస్ ట్రస్టు వ్యవహారంలో అనూహ్య పరిణామం నెలకొంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ట్రస్టుకు ఛైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను తప్పించింది. ఊహించని విధంగా రాష్ట్ర ప్రభత్వం, ఆయన స్థానంలో బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఉన్న సంచిత గజపతి రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా కూడా ఉన్నారు. అయితే ఈ పదవి, బీజేపీ నాయకురాలికి ఇవ్వటం పై, విస్మయం వ్యక్తం అవుతుంది. బీజేపీ ఏది అడిగితే అది జగన్ చెయ్యాల్సిన పరిస్థితి వచిందనే అభిప్రాయం జరుగుతుంది. మొన్న అంబానీ అడిగిన వ్యక్తికి రాజ్యసభ ఇవ్వాల్సిన పరిస్థితి, ఈ రోజు బీజేపీ ఢిల్లీ నాయకురాలికి పదివి ఇవ్వటం చూస్తుంటే, అదే అనిపిస్తుంది. ఇక మరో పక్క, మాన్సస్ ట్రస్టు ఛైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గత కొన్నేళ్ళుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన్ను పదవిలో నుంచి తొలగించారు.

bjp 04032020 2

మాహరాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ (మాన్సస్) ట్రస్టును, 1958లో పూసపాటి వంశీయులైన దివంగత పీవీజీ రాజు స్థాపించారు. విద్యను ప్రోత్సహించేందుకు, విద్యా సంస్థల నిర్వహణ కొనసాగించడానికి ఈ ట్రస్టు అండగా నిలుస్తోంది. ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులే ఈ ట్రస్టు బాధ్యతలు చూసుకుంటున్నారు. 108 ఆలయాలు, 14 వేల 800 ఎకరాల విలువైన భూములను మాన్సస్ ట్రస్ట్ కలిగి ఉంది. విద్యా సంస్థలకు నిరంతర మద్దతు కోసం ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రత్యేక ఎంవోయూ కుదుర్చుకున్నారు. ట్రస్ట్ డీడ్ వారసత్వంగా ఎల్డెస్ట్ మేల్ లీనియల్ వారసుడు బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిబంధన ప్రకారంగా నాడు పీవీజీ రాజు ట్రస్ట్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మరణానంతరం 1994లో ఆయన పెద్ద కుమారుడు పూసపాటి ఆనంద్ గజపతి రాజు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 2016లో ఆనంద్ గజపతి రాజు మరణం తరువాత పీవీజీ రాజు రెండో కుమారుడు అశోక్ గజపతి రాజు ఆ పదవి చేపట్టారు. నేటి వరకు ఆయనే ఛైర్మన్‌గా అశోక్ రెండో కుమార్తె అదితి గజపతిరాజు సభ్యురాలుగా ఉన్నారు.

bjp 04032020 3

తాజాగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించి ఆయన స్థానంలో ఆనంద గజపతి రాజు కుమార్తె సంచితా గజపతి రాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె అధికారిక లాంఛనాలతో ట్రస్టు ఛైర్ పర్సన్​గా బాధ్యతలు స్వీకరించారు. ఈ అన్యూహ పరిణామం మాన్సస్ ట్రస్టు సభ్యులు, ఉద్యోగుల్లోనే కాకుండా తెదేపా శ్రేణులను ఉలిక్కిపడేలా చేసింది. ఆనంద గజపతి, అశోక్ గజపతి ఇద్దరూ స్వయానా సొదరులే అయినప్పటికీ ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలుండేవి. అశోక్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆనంద్ కాంగ్రెస్, తెదేపాలో పనిచేశారు. ఆనంద గజపతి రెండో వివాహం చేసుకున్నారు. ఈయన రెండో భార్య.. రెండో కుమార్తే సంచిత గజపతి. ప్రస్తుతం ఈమె దిల్లీలోనే ఉంటూ అక్కడ భాజపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత ఎన్నికల సమయంలో సంచిత గజపతి విశాఖలో భాజపా కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ గ్రూప్ ఉంది అంటూ, హడావిడి చేసి, ఉమ్మడి ఏపిలో వీరంగం చేసిన వైసీపీ, నేడు అదే అంబానీకి సన్మానాలు చెయ్యటం పై అందరూ ఆశ్చర్య పోయారు. ఎన్నికలు వస్తున్నాయి అంటే, రాజశేఖర్ రెడ్డి మరణం పై అనుమనాలు ఉన్నాయి అంటూ, రిలయన్స్ వైపు చూసే వైసీపీ, ఇప్పుడు అదే అంబానీకి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికింది. దీని పై వైఎస్ఆర్ హార్డ్ కోర్ ఫాన్స్, తీవ్రంగా నిరాస పడ్డారు. మాటలు మార్చను అని చెప్పే జగన్, ఇలా మారిపోయారు ఏమిటో అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ అంశం పక్క పెడితే, రిలయన్స్ అంబానీ, నాలుగు రోజుల క్రిందట జగన్ మోహన్ రెడ్డిని కలిసి, చర్చించారు. అయితే ఎందుకు కలిసారు అనే దాని పై, ఎటువుంటి సమాచారం బయటకు రాలేదు. ప్రభుత్వం కాని, అటు వైసీపీ పార్టీ కాని, ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. అయితే, తమ సొంత మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం, రిలయన్స్ అంబానీ, జగన్ మోహన్ రెడ్డి విజన్ నచ్చి, మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు అంటూ ప్రచారం చేసారు.

ambani 04032020 2

అయితే, ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఎందుకుంటే, రిలయన్స్ లాంటి వ్యక్తి పెట్టుబడి పెట్టటానికి వస్తే, అది పెద్ద సెన్సేషన్. ఏపి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, ఇతర పెట్టుబడిదారులను ఆకర్షించుకుంటుంది. అయితే, ఇటు ప్రభుత్వం కానీ, అటు అంబానీ కాని, పెట్టుబడులు పై ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. చివరకు అంబానీ జగన్ ను కలిసింది, అమిత్ షా సూచన పై అని, అంబానీ సన్నిహితుడు, పరిమల్‌ నత్వానీని, ఏపి నుంచి రాజ్యసభకు పంపించటానికి అంటూ వార్తలు వచ్చాయి. అయితే, వైసీపీ వర్గాలు మాత్రం అలా ఏమి లేదని, మేము బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తాం అంటూ సన్నాయి నొక్కులు నోక్కాయి. అయితే అంబానీ జగన్ తో మీట్ అయ్యింది పెట్టుబడులు కోసం కాదని తేలిపోయింది.

ambani 04032020 3

ఆ రోజు తాము జగన్ ను కలిసింది, తనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని కోరటానికే, ఆంధ్రప్రదేశ్ వచ్చామని, ఝార్ఖండ్‌ స్వతంత్ర ఎంపీ పరిమల్‌ నత్వానీ చెప్పారు. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో విలేఖరులతో మాట్లాడుతూ, ఆయన ఈ విషయం చెప్పారు. ఈ సారి, ఝార్ఖండ్‌ నుంచి కాంగ్రెస్‌, బీజేపీలకు చెరో సీటు వస్తున్న నేపధ్యంలో, తనకు అక్కడ నుంచి రజ్యసభకు వెళ్ళే అవకాసం లేదని, అందుకే తాను, ఏపి నుంచి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాసం ఇవ్వమని, ముకేష్ అంబానీతో కలిసి, అమరావతి వచ్చి జగన్ ను కలిసనాని చెప్పారు. అయితే జగన్ దానికి స్పందిస్తూ, తనకు మూడు రోజులు టైం కావాలని అడిగారని, నత్వానీ తెలిపారు. ఇది ఇలా ఉంటే, నత్వానీకి ఏపి నుంచి రాజ్యసభకు వెళ్ళటానికి లైన్ క్లియర్ అయ్యిందని, డైరెక్ట్ అమిత్ షా సూచన కావటంతో, జగన్ కూడా ఏమి చెయ్యలేని పరిస్థితి అని తెలుస్తుంది.

నారాలోకేశ్ పర్యటనను అడ్డుకోవడానకి, ఆయనపై దాడికి యత్నించడానికి పిచ్చి,పిచ్చి కారణాలుచెప్పిన జగన్ ప్రభుత్వం, అందుకు పురుషోత్తమపట్నం రైతులను సాకుగా చూపిందని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ మండిపడ్డారు. బుధవారం ఆయన టీడీపీనేత వరుపులరాజాతో కలిసి మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతప్రభుత్వం ఎక్కడాకూడా బలవంతపు భూసేకరణ జరపలేదని, నిజంగా అలాచేసుంటే, 330మంది రైతులుంటే, 255మందికి, ఒక్కొక్కరికీ రూ.28లక్షలచొప్పున చెల్లించడం జరిగిందని, మిగిలినవారంతా కోర్టుకు వెళ్లారని వెంకటేశ్ స్పష్టంచేశారు. ఆనాడు కోర్టుకివెళ్లినవారికి రూ.35లక్షలచొప్పున చెల్లిస్తామని వైసీపీనేతలు హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పటికీ అమలుచేయలేదన్నారు. లోకేశ్ పై దాడికి యత్నించినవారెవరూ రైతులుకారని, వారి ముసుగులో ఉన్న వైసీపీకార్యకర్తలే ఆపని చేశారన్నారు. లోకేశ్ యాత్రకు ముందు వైసీపీ మండల అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ, తాము యాత్రను అడ్డుకుంటామని కూడా చెప్పాడన్నారు. టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకోకుండా చూడాలని పోలీస్ వారిని కోరామని, అయినాకూడా వైసీపీ మూకలు టీడీపీ శ్రేణులపై, ఆపార్టీ జాతీయప్రధాన కార్యదర్శిపై దాడికి యత్నించారని వెంకటేశ్ చెప్పారు.

జగన్మోహన్ రెడ్డికి ధీటైన ప్రత్యర్థిగా లోకేశ్ ఎదుగుతున్నాడన్న భావన వైసీపీలో నానాటికీ పెరిగిపోతోందని, అందులోభాగంగానే లోకేశ్ లక్ష్యంగా ప్రభుత్వం దాడులు చేయిస్తోందన్నారు. లోకేశ్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించి తీరుతుందన్నభయాందోళనకూడా వైసీపీవారిలో ఉందని, ఆ భయంతోనే టీడీపీ యువనేతను వారు లక్ష్యంగా ఎంచుకున్నారని పెందుర్తి స్పష్టంచేశారు. స్థానిక (రాజానగరం) శాసనసభ్యుడికి, ఆయన కుటుంబానికి ఉన్న నేరచరిత్ర కూడా లోకేశ్ పై దాడికి ఒక కారణమన్నారు. లోకేశ్ యాత్రను ముగించుకొని తిరిగొచ్చే సమయంలో దారికి అడ్డంగా లారీలుపెట్టి, పోలీసులే ఆయన వాహనాలను దారి మళ్లించారు తప్ప, తమకు తాముగా వేరేదారిలో వెళ్లలేదన్నారు. ప్రభుత్వం తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే, దాడులకు పాల్పడుతోందన్నారు. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పురావృతమైతే, టీడీపీనేతలు, కార్యకర్తలుచూస్తూ ఊరుకోరని వెంకటేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజానగరం నియోజకవర్గం గతచరిత్ర చూస్తే, ఏనాడు అటువంటి దాడులు జరగలేదని, ఇప్పుడొచ్చిన కబ్జాకోరు, రౌడీ ఎమ్మెల్యే కారణంగానే అవన్నీ జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గం ప్రజలు లోకేశ్ పర్యటనను ప్రేమాభిమానాలతో ఆదరించారని, అదిచూసి ఓర్వలేని వైసీపీమూకలు ఆయన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి యత్నించాయని టీడీపీనేత రాజా స్పష్టంచేశారు. పురుషోత్తమపట్నం భూముల విషయంలో గత ప్రభుత్వం ఒక్కరైతుకి కూడా అన్యాయం చేయలేదన్నారు. వైసీపీకార్యకర్తలే రైతుల అవతారమెత్తి, లోకేశ్ పర్యటనను అడ్డగించారని, అంతజరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు.

మాకున్న ప్రజాబలం చూసి చివరకు వైసీపీకార్యకర్తలే వెనక్కు తగ్గారని, లోకేశ్ పర్యటన తూర్పుగోదావరి జిల్లా టీడీపీశ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందన్నారు. లోకేశ్ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని, పోలీసులు ఎవరూకూడా సక్రమంగా తమ విధులు నిర్వర్తించలేదన్నారు. దాడులద్వారా లబ్దిపొందాలన్న ప్రయత్నాలను వైసీపీప్రభుత్వం మానుకోవాలని, లేకపోతే ప్రజలే వారిని ప్రతిఘటిస్తారని రాజా హెచ్చరించారు. త్వరలోనే ఉభయగోదావరి జిల్లాల్లో చంద్రబాబునాయుడి పర్యటన ఉంటుందని, ఆ సమయంలో వైసీపీకార్యకర్తలు, కిరాయిమూకలు తోకజాడించాలనిచూస్తే, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు ఆతోకలు కత్తిరిస్తారన్నారు. లోకేశ్ పర్యటనలో విలేకరులను కూడా కొట్టారని, వైసీపీమూకల దౌర్జన్యకాండను చిత్రీకరిస్తున్నారన్నఅక్కసుతోనే వారిపై కూడా దాడిచేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో, ఆయన ఆదేశాలప్రకారమే సీతానగరంలో లోకేశ్ పై దాడికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే కుటుంబానికి ఎప్పటినుంచో రౌడీ కుటుంబమని పేరుందని, ఆపేరు ఇప్పుడు మరింత ఎక్కువైందన్నారు.

భవిష్యత్ లో నారాలోకేశ్ మరోమారు తూర్పుగోదావరిలో పర్యటిస్తారని, అప్పుడు కూడా ఇదేవిధంగా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తే, టీడీపీ కార్యకర్తలు తగినవిధంగా శాస్తి చేస్తారన్నారు. టీడీపీ ప్రభుత్వం పురుషోత్తమపట్నం రైతులకు సంపూర్ణ న్యాయం చేసిందని, వైసీపీ కార్యకర్తలైన రైతులకు కూడా రూ.28లక్షల చొప్పునపరిహారాన్ని అందచేసిందని రాజా వివరించారు. చంద్రబాబుకు, లోకేశ్ కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు వారిపై దాడికి పాల్పడుతున్నారన్నారు. లోకేశ్ పై జరిగిన దాడికి సంబంధించి, స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశామని, వారేం చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే మీడియాపై కూడా దాడులు చేస్తున్నారని, జగన్ ప్రభుత్వ దుశ్చర్యలను, దుర్మార్గాలను సమర్థించడం మీడియా కూడా మానుకోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి తమను ఆదరిస్తాడు.. బాగా చూసుకుంటాడన్న దురాలోచనతోనే వైసీపీ నేతలు ప్రతిపక్షనేతపై, ఆయన కుమారుడిపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

ఫిబ్రవరి 27వ తేదీన, తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడుని, వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజున జబ్బలు చరుస్తూ, చంద్రబాబుని అడ్డుకున్నాం అంటూ, పెద్ద హీరోల్లా ఫీల్ అయ్యారు. ఒక్కొక్కరూ రెచ్చిపోయారు. అయితే, వైసీపీ చేసిన అత్యుత్సాహమే వీరి కొంప ముంచటమే కాక, ఏకంగా డీజీపీని కోర్ట్ కు రావల్సిందిగా హైకోర్ట్ ఆదేశించింది. ఆ రోజు చంద్రబాబుని అడ్డుకోవటం, రాళ్ళు, గుడ్లు వేసి వీరంగం సృష్టించటం, చంద్రబాబుని కదలనివ్వకుండా 5 గంటలు ఉంచటం, ఇవన్నీ వైసీపీకి ఇప్పుడు మైనస్ అయ్యాయి. విశాఖ ప్రజలు, ఇదా వైసీపీ నైజం అని లైవ్ డెమో చూసారు. అయితే, ఇప్పుడు అంతకు మించిన కష్టం వీరికి వచ్చింది. చంద్రబాబుని అడ్డుకున్న కేసు, ఇప్పుడు హైకోర్ట్ లో ఉంది. ఈ సందర్భంగా కోర్ట్, ఒకింత ఆగ్రహంగా ఉంది. చంద్రబాబుకి పర్మిషన్ ఇచ్చి, ఎందుకు ఆయనకు 151 ఇచ్చారు అంటూ, కోర్ట్ వివరణ అడగటం, పోలీసులు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందకుండా, ఏకంగా డీజీపీనే కోర్ట్ కు రావాలి అని చెప్పటం తెలిసిందే.

అయితే, ఇలా డీజీపీ కోర్ట్ మెట్లు ఎక్కాల్సి రావటం వెనుక, వైసీపీ చేసిన చిన్న తప్పు ఉంది. కార్పొరేటర్ టికెట్లు ఆశిస్తున్నారు వారు, రెచ్చిపోయి జనసమీకరణ చేసి, అధిష్టానం దృష్టిలో పడాలని, రెచ్చిపోయారు. చంద్రబాబుని అడ్డుకుంటమే కాకుండా, ఆ ఫోటోలు, వీడియోలు తీసి, సోషల్ మీడియాలో గొప్పగా, ఏదో ఘనకార్యం చేసినట్టు పెట్టుకున్నారు. అయితే, ఇవన్నీ జగన్ చూస్తారని, తమకు మంచి జరుగుతుంది అనుకున్నారు కాని, ఇప్పుడు ఇవన్నీ కోర్ట్ చూసే పరిస్థితి వచ్చింది. ఆ రోజు దాడి చేసింది అంతా విశాఖ ప్రజలు అంటూ, వైసీపీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే దీనికి విరుగుడుగా, తెలుగుదేశం పార్టీ, దాడిలో పాల్గుంది, మొత్తం వైసీపీ నేతలు, కార్యకర్తలు అంటూ, దాదాపుగా 50 మంది ఫోటోలు, వీడియోలు బయట పెట్టారు.

ఇవి కోర్ట్ కు కూడా పంపించే పనిలో ఉన్నారు. ఇక పోలీసులకు కూడా వారి మీద ఆక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో, కొంత మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు. మిగతా వారిని కూడా కోర్ట్ అరెస్ట్ చెయ్యమని ఎక్కడ ఆదేశాలు ఇస్తుందా అని ఇప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడుతున్నారు. ఇక మరొకటి చంద్రబాబు పట్టుబట్టి, నాకు నోటీసు ఇస్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతా అని చెప్పటం. వైసీపీ వారిని తరిమి కొట్టకుండా, పోలీసులు చంద్రబాబుని అరెస్ట్ చేస్తాం అని వచ్చిన టైంలో, చంద్రబాబు మాత్రం నాకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో రాసి ఇవ్వండి, అప్పుడే వస్తాను అంటూ గొడవ చేసిన విషయం తెలిసిందే. దీంతో, చేసేది ఏమి లేక, ఆ రోజు ఒక చిత్తూ కాగితం మీద, నోటీస్ రాసి ఇచ్చారు. ఇప్పుడు అదే టిడిపికి కోర్ట్ లో ఆయుధం అయ్యింది. ఆ నోటీస్ పైనే టిడిపి కోర్ట్ కు వెళ్ళటం, 151 నోటీస్ ఎందుకు ఇచ్చారు అంటూ, డీజీపీని కోర్ట్ కు రమ్మంది హైకోర్ట్.

Advertisements

Latest Articles

Most Read