ఢిల్లీలోని బీజేపీ, వైసీపీ ఎంపీలను టార్గెట్ చేసింది అంటూ, వార్తలు గుప్పుమంటున్న వేళ, జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు బలం చేకురుస్తున్నాయి. వైసీపీ ఏమి లేదు అని చెప్తున్నా, దాదపుగా 8 మంది ఎంపీలు బీజేపీ టచ్ లో ఉన్నారు అంటూ లీకులు ఇస్తున్నారు. మొన్నటి మొన్న సుజనా చౌదరి కూడా, బీజేపీతో, వైసీపీ ఎంపీలు టచ్ లో ఉన్నారని చెప్పారు. అయితే, సుజనా ప్రకటన పై, వైసీపీ ఎంపీలు భగ్గు మన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి, సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండించారు. అయినా, కొంత మంది పై అనుమానపు మేఘాలు ఉన్నాయి. అందులో మొదటి వరుసలో ఉన్నది నరసరాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. పార్లిమెంట్ సమావేశాలకు జరిగే ముందే, జగన్ మోహన్ రెడ్డి, ఎంపీలు అందరితీ సమావేశం అయ్యి, పార్లమెంట్ లో ఏ అంశాలు ప్రస్తావించాలి అనేదాని పై, సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో, విజయసాయి రెడ్డికి, మిథున్ రెడ్డికి చెప్పకుండా, ప్రధాని మోడిని కాని, కేంద్ర మంత్రులను కాని, కలవ కూడదు అని వార్నింగ్ ఇచ్చారు.

raghu 25112019 2

పార్టీ చెప్పిన గీత దాటితే, షోకాజ్ నోటీసు ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఈ వ్యాఖ్యలు ఇద్దరు ఎంపీలను ఉద్దేశించి చేసారని, వైసీపీ క్యాంప్ లో గుసగుసలు వినిపించాయి. అయితే, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు మాత్రం, ఆయన పంధాలో ఆయన కొనసాగుతూనే ఉన్నారు. ఈ రోజు ఆయన ఇచ్చిన జర్క్ తో, మరోసారి వైసీపీలో చర్చనీయంసం అయ్యింది. ఈ రోజు పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్ళిన రఘరామకృష్ణ రాజు, ఉన్నట్టు ఉండి, భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరిని కలిసారు, ఏ పని మీద కలిసారు అనేది తేలియలేదు కాని, దాదపుగా గంట సేపు, ఆయన బీజేపీ కార్యాలయంలో గడిపినట్లు ప్రముఖ ఛానెల్స్ లో వార్తలు వచ్చాయి.

raghu 25112019 3

వార్తలే కాదు, ఆయన అక్కడ ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఒక వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండగా, ఆయన బీజేపీ ఆఫీస్ లో ప్రత్యక్షం అవ్వటం, అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆయన ఇప్పటి వరకు, ఏ అంశం పై, ఎవరితో కలిసింది, ఇంకా బయటకు చెప్పలేదు. ఒక పక్క పార్టీ అధినేత, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డికి చెప్పకుండా, ఎవరినీ కలవద్దు అని చెప్తే, రఘురామ కృష్ణ రాజు మాత్రం, ఏకంగా బీజేపీ ఆఫీస్ కే వెళ్ళటం, ఆసక్తికరంగా మారింది. మూడు రోజుల క్రితం, రఘురామ కృష్ణ రాజు, ప్రాధాని మోడీ తరాస పడిన సమయంలో, ఆయనకు పాదాభివందనం చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా, పార్లమెంట్ మొదటి రోజున, తెలుగు భాషకు అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ కార్యాలయానికే వెళ్లారు. మరి రఘురామాకృష్ణ రాజు ఏమి చెప్తారో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష రాజకీయం నడుస్తుంది. రాష్ట్రంలో అన్ని స్కూల్స్ లో, ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది అని, తెలుగు మీడియం చదువులు పూర్తిగా రద్దు చేస్తున్నామని జగన గారి ప్రభుత్వం ప్రకటించింది. ఉన్నట్టు ఉండి ఇలా ఏమిటి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఎక్కడైనా ఆప్షన్ ఇవ్వాలి కాని, ఇలా నిర్బంధ విద్య ఏమిటి అంటూ మాటలు వినిపించాయి. ప్రస్తుతం ఉన్న టీచర్స్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పగలరా అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. గతంలో చంద్రబాబు హయంలో లాగా, ఆప్షన్స్ ఇవ్వాలని, ఎవరికీ కావాల్సింది వారు ఎంచుకుంటారు అని కొంత మంది అభిప్రాయం. ఇక భాషా ప్రేమికులు అయితే, ఇలా అయితే తెలుగు భాష పూర్తిగా చచ్చిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ లాంటి పార్టీలు ఒక అడుగు ముందుకు వేసి, మత మార్పిడులు కోసమే ఇది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం, ఒకే ఒక మాటతో ఎదురు దాడి చేస్తుంది. మీ పిల్లలు ఏ మీడియం అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది.

modi 25112019 2

చివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పై కూడా, జగన్ మోహన్ రెడ్డి, మీ పిల్లలు ఏ మీడియం అంటూ ఎదురు ప్రశ్నించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా, మాతృభాష పై, మన్‌కీ బాత్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభాషా పరిజ్ఞానం లేకుండా అభివృద్ధి అసాధ్యమని అన్నారు. దేశంలో మాతృభాలు, అంతరించిపోతున్నాయేమోనన్న భయం కలుగుతోందని, ఇటీవల పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే ఎంత అభివృద్ధి సాధించినా ఉపయోగం ఉండదని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాఖండ్‌లో ఓ తెగ వారి భాషను కాపాడుకునే తీరు సంతోషమేసిందని మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాతృభాష పై చర్చ పెద్ద చర్చ జరుగుతూ, రాజకీయమే దాని చుట్టూ తిరుగుతున్న వేళ, ప్రధాని వ్యాఖ్యలు వైసీపీని మరింత డిఫెన్సు లోకి నెట్టుతాయి.

modi 25112019 3

ఎందుకంటే, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడుని, మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు అని ఆయాన పై ఎదురు దాడి చేసినట్టు, ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల పై కౌంటర్ ఇచ్చే అవకాసం ఉండదు. ప్రధాని మోడీ, ఏపిలో జరుగుతున్న విషయాలు ద్రుష్టిలో ఉంచుకుని చెప్పక పోయినా, ఆయన మాటలు మాత్రం, ప్రతిపక్షాలకు ఆయుధంగా దొరికాయి. ప్రధాని వ్యాఖ్యల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందిన్కాహారు. ప్రధాని ప్రసంగంపై సీఎం జగన్‌తోపాటు, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని ఆయన ట్వీట్ చేశారు. మోదీ చేసిన ప్రసంగానికి సంబంధించిన పేపర్ కటింగ్‌లను పవన్ పోస్టు చేశారు. తెలుగు మీడియంను రద్దు చేసిన జగన్ కానీ, ఆ నిర్ణయాన్ని సమర్ధించిన మంత్రులు కూడా ప్రధాని వ్యాఖ్యలపై స్పందించాలన్న అభిప్రాయం అంతటా ఏర్పడుతోంది.

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, నారా లోకేష్ పై, వైసీపీ టార్గెట్ కొనసాగుతూనే ఉంది. గత 5 ఏళ్ళుగా ఒక పద్దతి ప్రకారం అతని పై, ఒక క్యాంపైన్ నడిపి, వ్యక్తిత్వ హననం చేసారు. దీంతో లోకేష్ మంత్రిగా ఉంటూ, ఎన్ని మంచి పనులు చేసినా, ఊరు ఊరు సిమెంట్ రోడ్డులు వేసినా, ఎన్టీఆర్ సుజల లాంటి కార్యక్రమాలు చేసినా, ఐటి మంత్రిగా రిలయన్స్ జియో, ఆదనీ డేటా సెంటర్, టీసీఎల్ లాంటి ఎన్నో కంపెనీలు తెచ్చినా, అతని పై చేతకాని వాడు అనే ముద్ర వెయ్యతంలో, సక్సెస్ అయ్యారు. రాజకీయంగా లోకేష్ ని దెబ్బ కొట్టటంలో సక్సెస్ అయ్యారు. చివరకు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని మంగళగిరిలో, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే సామాజికవర్గాలు లేకపోయినా, అక్కడ ధైర్యంగా పోటీ చేసి, ఓడిపోయారు కూడా. ఇప్పుడు ఎమ్మెల్సీగా పని చేస్తూ, ప్రజా సమస్యల పై పోరాడుతూనే ఉన్నారు. అయినా, వైసీపీ మాత్రం, లోకేష్ ని వదలటం లేదు. ఇంకా లోకేష్ ని టార్గెట్ చేస్తూ, రాజకీయంగా దెబ్బ కొడుతూనే ఉంది.

lokesh 23112019 2

తాజాగా, వైసీపీ నేతలు, లోకేష్ కు మరో షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా కు సంబంధించి, డిస్ట్రిక్‌ రివ్యూ కమిటీ మీటింగ్ ఈ రోజు జరిగింది. అయితే స్థానిక ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ కు మాత్రం, ఈ సమావేశానికి ఆహ్వానం పంపలేదు. లోకేష్ ని పిలవకూడదు అనే నిర్ణయం తీసుకుని, ఆహ్వానం పంపలేదు. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఇక నుంచి లోకేష్ డిస్ట్రిక్‌ రివ్యూ కమిటీ మీటింగ్ రాకుండా, నిర్ణయం తీసుకుని, లోకేష్ ని సస్పెండ్ చేసారు. లోకేష్, జగన్ పై విమర్శలు చేస్తున్నారని, అందుకే అతన్ని డిస్ట్రిక్‌ రివ్యూ కమిటీ మీటింగ్ కు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి, అక్కడ ఉన్న మెజారిటీ సభ్యులు అంగీకారం తెలిపారు.

lokesh 23112019 3

ఇన్‌చార్జ్ మంత్రి రంగనాథ్‌రాజు, మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మద్దతు తెలపటంతో, లోకేష్‌పై బహిష్కరణ వేటుపడినట్టైంది. అయితే, దీని పై ఇంకా లోకేష్ స్పందించాల్సి ఉంది. తెలుగుదేశం నేతలు మాత్రం, ఇదేదో సొంత వ్యవహారం లాగా, చేస్తున్నారని, ప్రజల తరుపున పోరాటం చేస్తూ, సమస్యల పై ప్రభుత్వాన్ని నిలదీస్తే, బహిష్కరిస్తారా అంటూ, నిలదీస్తున్నారు. దీన్ని బట్టి ఎంత అసహనంతో ప్రభుత్వం ఉందొ అర్ధం అవుతుంది అని అంటున్నారు. డిస్ట్రిక్‌ రివ్యూ కమిటీ ప్రతి జిల్లాలో జరుగుతుంది. అన్ని శాఖల అధికారులతో ప్రతి మూడు నెలలకు ఒకసారి, జిల్లాలో అభివృద్ధి పనుల పై సమీక్ష సమావేశాలు నిర్వహించడం వీటి ఉద్దేశం. దీనికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షత వహిస్తారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు సభ్యులుగా ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం, చాలా ఘాటుగా మాట్లాడుతూ ఉంటారు. స్పీకర్ గా ఉంటూనే, రాజకీయ విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ఆ విమర్శలు చాలా సార్లు గీత దాటాయి కూడా. సామాన్య ఎమ్మెల్యేలు కూడా అలా ఘాటుగా మాట్లాడటానికి ఆలోచిస్తారు కాని, తమ్మినేని మాత్రం, స్పీకర్ గా ఉంటూ, ఘాటు రాజకీయ విమర్శలకు వెనుకాడారు. కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు, గుడ్డలు ఊడదీసి నుంచో పెడతాం, మడిచి ఎక్కడో పెట్టుకోండి అంటూ, చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అలాగే అసెంబ్లీలో కూడా, ప్రతిపక్షాలు ఏమైనా ఆందోళన చేసిన, పౌరుషంగా మాట్లాడినా, వారి పై వెంటనే ఎదురు దాడి చేసి, వారిని కంట్రోల్ చేస్తారు. అలాగే ఫిరాయింపుల పై, ఎంతటి వారినైనా వదిలేది లేదని, పార్టీ ఫిరాయిస్తే, వెంటనే అనర్హత వేటు వేసేస్తానంటూ ఒకటి రెండు సార్లు, చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. ఇలాంటి స్పీకర్ పై, రాం గోపాల్ వర్మ లాంటి వాడు, పేరడీ చెయ్యాలని చూస్తూ ? వామ్మో ఇంకా ఏమన్నా ఉందా.

tammineni 24112019 2

ఇంత ఖటినమైన స్పీకర్ జోలికి రాం గోపాల్ వర్మ వస్తే, అతని పని మటాష్ అని అందరూ అనుకుంటారు. అయితే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ, సమాజాన్ని కులంతో విడగొట్టే, పిచ్చి సినిమాలు తీసే రాం గోపాల్ వర్మ, ఈ సినిమాలో చంద్రబాబుని, లోకేష్ ని, కేఏ పాల్ నే కాదు, స్పీకర్ తమ్మినేని సీతారంని పోలిన క్యారక్టర్ ను కూడా, సినిమాలో చూపించారు. దీనికి సంబంధించి, ఒక ఫోటో వర్మ పోస్ట్ చేసారు. అందులో అలీ స్పీకర్ గా ఉంటూ, అసెంబ్లీలో నిద్ర పోతూ ఉంటారు. ఆ ఫోటో పోస్ట్ చేసి "Ali is playing speaker Pammineni RamRam in KAMMA RAJYAMLO KADAPA REDDLU" అంటూ పోస్ట్ చేసారు. స్పీకర్ తమ్మినేని సీతారం ని పోలినట్టు, ఆ వేష ధారణ ఆలీకి వేసి, ఆ క్యారక్టర్ పేరు కూడా "పమ్మినేని రాం రాం" అంటూ పెట్టారు.

tammineni 24112019 3

అయితే రాజకీయ నాయకులను చులకను చేసే చూపిస్తే, అది వేరే విషయం. కాని ఏకంగా స్పీకర్ ని ఇలా చెయ్యటం, చూసి, అలాగే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారం వ్యక్తిత్వం చూసిన వాళ్ళు, రాం గోపాల్ వర్మకు మూడిందిలే అనుకున్నారు. కాని, ఆ ఫోటో వచ్చిన దగ్గర నుంచి , వైసీపీ నాయకులు ఎవరూ స్పందించలేదు. నిన్న స్పీకర్ తమ్మినేని, అసెంబ్లీ సమావేశాల గురించి మీడియాతో మాట్లాడుతూ ఉండగా, ఈ విషయం పై విలేఖరులు ప్రశ్న అడగగా, "అసెంబ్లీ స్పీకర్‌ ఛైర్‌ ను అగౌరవపరిచే విధంగా ఎవరూ మాట్లాడకూడదని, అసెంబ్లీ స్పీకర్‌ అంశాన్ని రామ్‌గోపాల్‌ వర్మ చిత్రీకరించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు." అయితే ఇంత సింపుల్ గా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని స్పీకర్ ఎందుకు అన్నారో ఎవరికీ అర్ధం కాలేదు. బహుసా, ఈ సినిమా నిర్మాత వైసీపీ వాళ్ళు కాబట్టి, అలాగే ఈ సినిమా చంద్రబాబుని, లోకేష్ ని అల్లరి చేసేలా ఉంది కాబట్టి, వైసీపీ పార్టీ వాళ్ళు, ఎవరూ ఏమి అనటం లేదు ఏమో.

Advertisements

Latest Articles

Most Read