ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, ఇంగ్లీష్ మీడియంను ప్రతిష్టాత్మికంగా తీసుకుంటే, సొంత పార్టీ ఎంపీల నుంచే ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అన్ని స్కూల్స్ లో, తెలుగు మీడియం తీసివేసి, ఇంగ్లీష్ మీడియం పెట్టటం పై, విమర్శలు ఎదురు అయ్యాయి. అయితే జగన్, వారందరినీ తిప్పి కొట్టారు. చివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య పై కూడా, అదే రకమైన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు పత్రికల్లో తెలుగు ఆవశ్యకత పై, కధనాలు వస్తూనే ఉన్నాయి. తెలుగు భాషను చంపవద్దని, ఆప్షనల్ గా తెలుగు మీడియం పెడితే, అటు వైపు ఆసక్తి ఉన్న వారు వెళ్తారని, చెప్తున్నా, ప్రభుత్వం వినటం లేదు. ఈ నేపధ్యంలోనే, సొంత పార్టీ నుంచి జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బంది ఎదురైంది. తెలుగు భాష పై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు, పార్లమెంట్ లో, ప్రశ్న అడిగారు. తెలుగు అకాడమీ విభజన ఇంకా జరగలేదని, అది జరపాలని, తెలుగు భాషని కాపడాలని, ఇలా కొంత సేపు మాట్లాడారు.

raghu 20112019 2

అయితే ఇందులో తప్పు ఏమి లేకపోయినా, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న జగన్ కు మాత్రం, కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. ప్రతిపక్షాలకు సమాధానం చెప్తున్న సమయంలో, సొంత పార్టీ నేతే తెలుగు ప్రాముఖ్యత అడగటం పై, జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం వచ్చేలా ఎవరు మాట్లాడిన ఉపేక్షించను అని, పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువు మా విధానం అని, దీని పై పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించి, వివరణ కోరాలని జగన్ ఆదేశించారు. అయితే ఈ వార్తలు నిన్న రాత్రి టీవిల్లో రాగానే, రఘురామకృష్ణ రాజు, ఏబీఎన్ ఛానల్ కు అందుబాటులోకి వచ్చి, తాను అసలు ఇంగ్లీష్ మీడియం గురించి ఎక్కడా మాట్లాడలేదని, కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే, నా పై అపోహలు వచ్చాయని అన్నారు.

raghu 20112019 3

తాను మాట్లాడిన దాంట్లో తప్పు ఏమి లేదని, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం గురించి మాట్లాడలేదని, కేవలం మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రమే కోరానని చెప్పారు. నాకు తెలుగు భాష అంటే ఇష్టం కాబట్టి, మాట్లాడానని అన్నారు. 350, 350ఏ అధికరణల్లోని మాతృభాష, బోధన గురించి ఎందుకు మాట్లాడారు అని అడగగా, రాజ్యాంగం ప్రకారం మాట్లాడాలి కాబట్టి మాట్లాడాను, అది మాతృభాష గురించి, అది ఏ భాష అయినా కావచ్చు అంటూ స్పందించారు. తెలుగుని పరిరక్షించుకోవటం అందరి బాధ్యత అని అన్నారు. ఇప్పటి వరకు ఎవరూ సంజయషీ అడగలేదని, అడిగితె అర్ధం అయ్యేలా చెప్తానని, తెలుగు భాష పరిరక్షణకు నేను మాట్లాడింది తప్పు అయితే, ఏ శిక్షకైనా సిద్ధం అని అన్నారు. అయితే రఘురామ కృష్ణంరాజు పై మొదటి నుంచి జగన్ అసహనంగానే ఉన్నారని తెలుస్తుంది.

గత వారం రోజుల నుంచి, ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో, గన్నవరం నియోజకవర్గం రాజకీయ వేడి, హాట్ హాట్ గా సాగుతుంది. నాలుగు రోజుల క్రితం వల్లభనేని వంశీ ప్రెస్ మీట్ పేటి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై పరుష పదజాలంతో విరుచుకు పడ్డారు. అప్పటి నుంచి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతూనే ఉన్నాయి. ఇవి ఒక పక్క ఉండగా, ఇప్పుడు వంశీ పార్టీ మారతారా లేక తటస్థ ఎమ్మెల్యేగా ఉంటారా ? ఒకవేళ పార్టీ మారితే రాజీనామా చేస్తారా అనే అంశం ఇప్పుడు చర్చలోకి వస్తుంది. రెండు రోజుల క్రితం స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ, రాజీనామా చెయ్యాల్సిందే అంటూ, చెప్పుకొచ్చారు.ఎవరైనా పార్టీ మారితే, రాజీనామా చెయ్యాల్సిందే అని, దాంట్లో రెండో ఆలోచనల లేదని చెప్పారు. దీంతో ఇప్పుడు వంశీ రాజీనామా ఖాయంగా తెలుస్తుంది. ఆయాన రాజీనామా చేస్తే కనుక ఉప ఎన్నికలు వస్తాయి. ఈ మొత్తం నేపధ్యంలో, ఇప్పుడు గన్నవరం రాజకీయం, హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఇప్పటికే వైసీపీ గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్నా, యార్లగడ్డ వెంకట్రావ్ తదుపరి అడుగులు ఏమిటి అనేది కూడా ఆసక్తిగా మారింది.

yarlagadda 20112019 2

వంశీ రాకను వ్యతిరేకిస్తూ యార్లగడ్డ, పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేసారు. అనుచరులుతో కలిసి, సమావేశం అయ్యి, చర్చించారు కూడా. అయితే నిన్న యార్లగడ్డ వెంకట్రావ్, వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. మంత్రులు పెర్ని నాని, కొడాలి నానితో కలిసి, యార్లగడ్డ వెంకట్రావ్ జగన్ ను కలిసారు. వంశీ రాక ఖయామని, ఉప ఎన్నికలు వస్తే వంశీకే సీట్ ఇస్తానని జగన్ చెప్పినట్టు సమాచారం. ఇదే నేపధ్యంలో, యార్లగడ్డ వెంకట్రావ్ కు, ఎమ్మెల్సీ ఇచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. నిన్న జగన్ ను కలిసి కొంచెం మెత్తబడిన యార్లగడ్డ, ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు, వంశీ మీ పార్టీలోకి వస్తున్నారు కదా, మీ పరిస్థితి ఏమిటి, పార్టీ మారతారా అని అడిగారు.

yarlagadda 20112019 3

దీనికి యార్లగడ్డ సమాధానం ఇస్తూ, ‘నాకు క్యారక్టర్ ఉంది నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు’ అంటూ పంచ్ వేసారు. ఇది ఎవరిని ఉద్దేశించి చేసారు, వంశీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసారా అనే చర్చ జరుగుతంది. వంశీ మీతో కలిసి పని చేస్తారు అని అన్నారు అని చెప్పగా, వంశీ ఇంకా పార్టీలో చేరలేదు కదా, వంశీ వచ్చిన తరువాత చూద్దాం అంటూ, మీడియా వారికి యార్లగడ్డ సమాధానం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి మా బాస్, ఆయన ఏమి చెప్తే అదే అంటూ యార్లగడ్డ సమాధానం చెప్పారు. వంశీ ఉన్నాడని నేను రాజకీయాల్లోకి రాలేదు. నాకు క్యారక్టర్ ఉంది నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు అంటూ యార్లగడ్డ స్పందిచటం చూస్తుంటే, వంశీ రాక పై, అయన ఎంత అసహనంగా ఉన్నారో తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు అందరూ కలిసి పని చెయ్యాల్సిన పరిస్థితి.

పార్టీ లైన్ దాటవద్దు. విజయసాయి రెడ్డికి చెప్పకుండా, ఆయన సలహాలు తీసుకోకుండా, ఢిల్లీలో, ప్రధాని కాని, ఇతర మంత్రుల్ని కలవద్దు. పార్టీ లైన్ ధిక్కరిస్తే, ఎవరికైనా షోకాజ్ నోటీస్ ఇచ్చి, పక్కన పెడతాం. ఇది శనివారం, 23 మంది వైసిపీ ఎంపీలకు జగన్ ఇచ్చిన వార్నింగ్. అయితే రెండు రోజులు కూడా కాక ముందే, 23 మంది ఎంపీలలో, 7-8 మంది ఎంపీలు, ఈ రోజు కీలక సమావేశానికి డుమ్మా కొట్టటం, వచ్చిన వారిలో కొందరు ధిక్కార స్వరం వినిపించటంతో, ఒక్కసారిగా వైసిపీ అధిష్టానం, షాక్ కు గురైంది. ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి అనే విషయం పై, ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ పార్లమెంటేరీ పార్టీ నేత హోదాలో, ఎంపీలు అందరినీ తన ఇంట్లో, సమావేశానికి ఆహ్వానించారు. అయితే 23 ఎంపీలకు గాను, 7-8 మంది ఎంపీలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఏకంగా విజయసాయి రెడ్డి పిలిచిన మీటింగ్ కే, ఎంపీలు రాకపోవటంతో, ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతంది. ఇలా ఎందుకు జరిగింది అని ఆరా తీస్తున్నారు.

mp 19112019 2

ఇక వచ్చిన ఎంపీలు, తమ అసహనాన్ని విజయసాయి రెడ్డి దగ్గర వెళ్లగక్కారు. ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, అన్ని పనులు ఎమ్మెల్యేలే చేస్తున్నారని, తమను లెక్క చెయ్యటం లేదని, అధినేత కూడా, ఎమ్మేల్యేలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎంపీలు విజయసాయి రెడ్డి దగ్గర వాపోయినట్టు సమాచారం. అలాగే తమకు పార్టీ తరుపున ఎదురు అవుతున్న వివిధ సమస్యలను విజయసాయి రెడ్డికి చెప్పుకున్నారు. ముఖ్యంగా తమకు ఏమి చేయలన్నా, ఎమ్మెల్యేల అనుమతి తీసుకుని చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని, తమ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఎంపీల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే, తమకు సరైన ప్రొటోకాల్‌ కూడా ఇవ్వటం లేదని, ఏకరవు పెట్టరు. ఇలా అయితే ఇక మేము ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేసారు.

mp 19112019 3

ఈ సమస్యను జగన్ వద్దకు తీసుకువెళ్ళి పరిష్కారం చెయ్యాలని కోరారు. అలాగే, జాతీయ స్థాయిలో, తమ పాలన పై వస్తున్న కధనాలను ప్రస్తావించారు. జాతీయ స్థాయిలో, ఏపి ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని, జాతీయ పత్రికల్లో వస్తున్న కధనాలతో, పరువు పోతుందని వాపోయారు. మనం చేసే మంచి పనులు, జాతీయ స్థాయిలో వచ్చేలా ప్రణాళికలు వెయ్యాలని, విజయసాయి రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు, జగన్ పై వ్యతిరేకంగా మాట్లాడితే, అడ్డుకోవాలని తమ ఎంపీలకు తెలిపారు. మరో పక్క సగం మంది ఎంపీలు మీటింగ్ కి దుమ్మా కొట్టటం పై, టిడిపి విమర్శలు దాడి మొదలు పెట్టింది. సగం మంది ఎంపీలు పక్క దారి చూస్తుంటే, ఇక్కడ ఎమ్మెల్యేలు కొత్త సియం కోసం ఎదురు చూస్తున్నారని, అందుకే మా పై బూతు పురాణం అందుకున్నారని, దేవినేని ఉమా విమర్శించారు.

విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పరిశ్రమల కోసం, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంతో కష్టపడి, ఒక్కో మెట్టు పేరుస్తూ వచ్చారు. ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న కంపెనీలను మన వైపు తీసుకు వచ్చే ప్రయత్నం చేసారు. అలాగే ఒకే ప్రాంతానికి కాకుండా, రాష్ట్రమంతా పరిశ్రమలు వచ్చేలా చూసారు. అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురంలో వచ్చింది, చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి, విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే చంద్రబాబు ఓడిపోవటం, జగన్ మోహన్ రెడ్డి అఖండ మెజారిటీతో, గెలవటంతో, రాజకీయ వాతావరణం మారిపోయింది. అయితే జగన్ కు భారీ మెజారిటీ ఉండటంతో, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి, అధిక పెట్టుబడులు వస్తాయని అందరూ భావించారు

కాని అనూహ్యంగా, ఒక్క పరిశ్రమ రాకపోగా, వస్తాం అని ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. సింగపూర్ ప్రాభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, రిలయన్స్ జియో విలిపోయింది అని వార్తలు వచ్చాయి. ఆదానీ డేటా సెంటర్ కుదించుకుంది అని వార్తలు వచ్చాయి. మరో పక్క లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో లూలు గ్రూప్, ఈ చర్యతో, తీవ్ర అవమానంగా భావించింది. ప్రపంచ స్థాయిలో తమ పేరు ప్రఖ్యాతలకు ఇబ్బంది వస్తుందని గ్రహించి, తమకు భూకేటాయింపులు రద్దు చెయ్యటం పై, ఏపి ప్రభుత్వం పై ఘాటుగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. లూలూ గ్రూపు, ఇండియా డైరెక్టర్ అనంత్‌రామ్‌ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసారు.

ఇప్పుడున్న పరిస్థితిలో, ఇక మీదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎలాంటి పెట్టుబడులు పెట్టటం అంటూ తెలిపారు. అయితే భారత దేశంలో మా పెట్టుబడులు కొనసాగుతాయని, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో తమ పెట్టుబడులను యథావిధిగా షెడ్యూలు ప్రకారం పెడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో, 13 ఎకరాల్లో ప్రపంచస్థాయి కన్వెన్షన్‌ సెంటర్, షాపింగ్‌మాల్‌, ఫైవ్ స్టార్ హోటల్‌ నిర్మాణాలను చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం, రూ.2,200 కోట్ల పెట్టుబడి పెట్టి, ఏడువేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన బిడ్డింగ్‌లో పాల్గొని భూమిని లీజుకు పొందారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కన్సల్టెంట్లను నియమించుకుని, ప్రపంచస్థాయి ఆర్కిటెక్టులతో డిజైన్లు తయారుచేయించుకోవడానికి భారీఎత్తున ఖర్చుచేశామని అనంత్‌రామ్‌ తెలిపారు. అయినా లూలూ సంస్థకు కేటాయించిన భూములను రద్దుచేస్తూ ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read