ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో మరో సంచలన వార్త. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో, ఒక్కసారిగా అధికార వర్గాల్లో కలకలం రేగింది. మొన్నటికి మొన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని, బదిలీ చేస్తూ, సంచలన నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశంలోనే సంచలనానికి తెర లేపింది. మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యన్ని, బదిలీ చేస్తూ, ప్రాధాన్య లేని శాఖకు బదిలీ చేసింది. అయితే తరువాత అయన సెలవు పై వెళ్ళటం, ఢిల్లీ వర్గాలను కలవటం సంచలనంగా మారింది. అయితే, జగన్ ప్రభుత్వం మాత్రం, తాను చెప్పాలి అనుకున్న సందేశాన్ని, అధికార వర్గాలకు గట్టిగా పంపించింది. అప్పటి నుంచి ఐఏఎస్ వర్గాలు, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ప్రభుత్వ ఆగ్రహానికి ఎప్పుడు గురి అవుతామో అంటూ, ఆలోచిస్తూ ఉండగానే, ఇప్పుడు మరో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చెయ్యటం సంచలనం అయ్యింది. విధి నిర్వహణలో అలసత్వం వహించారు అంటూ, ఇద్దరినీ సస్పెండ్ చేసారు.

ias 22112019 2

జీఏడీలో పని చేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అవ్వటంతో, మరోసారి ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేగింది. జీఏడిలో అసిస్టెంట్ కార్యదర్శిగా పని చేస్తున్న జయరామ్, అక్కడే సెక్షన్ అధికారిగా పని చేస్తున్న అచ్చెయ్యను సస్పెండ్ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. కేంద్రం నుంచి వచ్చిన ఒక, ఐఆర్ఎస్ ఆఫీసర్ రిలీవ్ అంశంలో, వచ్చిన ఫైల్ విషయంలో, ఈ ఇద్దరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే, ఫైల్ ను ఉన్నతాధికారులకు చెప్పకుండా దాచి పెట్టారు అనేది అభియోగం. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఏపీ ఎండీసీకి ఎండీగా ఉన్న, వెంకయ్య చౌదరిని జీఏడీకి రిలీవ్ చెయ్యాల్సిందిగా చెప్తూ రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయన తిరిగి తన మదర్ డిపార్టుమెంటులో పోస్టింగ్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

ias 22112019 3

అయితే ఈ విషయంలో, ఆయన్ను డీమ్డ్ టు బి రిలీవ్ అని ప్రస్తావించటం, వెంకయ్య చౌదరి పై, విజిలెన్స్ రెమర్క్ లను కూడా, ఫైల్ లో ప్రస్తావించక పోవటంతో, అచ్చెయ్య, జయరామ్ పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వీరిద్దరూ, కావాలనే ఇలా చేసారు అంటూ, ప్రభుత్వం భావించింది. సిఎంఓ లో ఒక కీలక ఆధికారి, ఇద్దరినీ పిలిచి వివరణ అడిగే ప్రయత్నం చెయ్యటం, వారు కారణాలు చెప్పటం, ఈ విషయాన్ని జగన్ కు నివేదించటంతో, ఆయన వెంటనే తగు చర్యలు తీసుకోమని చెప్పటంతో, ఆ ఇద్దరు అధికారులపైన సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంకయ్య చౌదరిని రాష్ట్ర సర్వీస్ నుంచి రిలీవ్ చేసి, కేంద్రానికి పంపించే సమయంలో, ఆయన పై ఉన్న అభియోగాలు ప్రస్తావించలేదు అనే కారణంతో, ఇద్దరు ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చెయ్యటం సంచలనంగా మారింది. అలాగే ఈ ఇద్దరినీ, అనుమతి లేకుండా రాజధాని వదిలి వెళ్లవద్దంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశం సైతం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఇద్దరు నుంచి, వివరణ తీసుకునే ప్రభుత్వం సస్పెండ్ చేసిందా, లేక, ఎటువంటి విచారణ లేకుండా సస్పెండ్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది.

కేంద్ర హోం శాఖ వర్గాలు కొత్త మ్యాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో, కేంద్ర హోం శాఖ, ఈ నెల మొదటి వారంలో, భారత దేశానికి సంబందించిన కొత్త మ్యాప్ విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలను చూపిస్తూ, ఆ రాష్ట్ర రాజధానులను కూడా పాయింట్ అవుట్ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మాత్రం, రాజధాని అమరావతిగా పెట్టలేదు. తెలంగాణాకు హైదరాబాద్ ని రాజధానిగా పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిపాలన హైదరాబాద్ నగరం నుంచే జరుగుతున్నట్టు ఆ మ్యాప్ లో పెట్టారు. మొన్నటి దాక అమరావతిని చూపించి, ఇప్పుడు ఎందుకు చుపించలేదో ఎవరికీ అర్ధం కాలేదు. ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, కేంద్రాన్ని అడగలేదు. మన రాజధాని లేకుండా, ఒక కొత్త మ్యాప్ రిలీజ్ అయితే, ప్రభుత్వంలో ఉన్న పాలకులు, అమరావతిలోనే ఉంటూ, అమరావతిని మా రాజధానిగా ఎందుకు పెట్టలేదు అని కేంద్రాన్ని అడగలేక పోయారు.

galla 21112019 2

22 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నా, ఈ విషయం పై అడగలేదు. ఇది మన ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. ఆంధ్రుల రాజధానిని కేంద్రం ఎందుకు గుర్తించలేదో, అని ప్రజల తరుపున అడగాల్సిన బాధ్యత అందరి పై ఉంటుంది. అయితే 22 మంది ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగ పోయినా, ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ విషయం పై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీసింది. ఈ రోజు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్నీ ప్రస్తావించింది. జీరో హావర్ లో, ఈ విషయం పై మాట్లాడటానికి తెలుగుదేశం పార్ట్ నోటీస్ ఇచ్చింది. దీంతో ఈ రోజు పార్లమెంట్ లో, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్, పార్లమెంట్ లో అమరావతి విషయం ప్రస్తావించారు.

galla 21112019 3

అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించకుండా, అమరావతి లేకుండానే హోంశాఖ కొత్త ఇండియా మ్యాప్‌ను విడుదల చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడమేనని లోక్‌సభలో ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీని కూడా, మీరే అవమానించినట్టు అని చెప్పారు. ప్రధాని మోడీ స్వయంగా వచ్చి, అమరావతి గొప్ప రాజధాని కావాలంటూ, ఆ రోజు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ఇండియా మ్యాప్‌లో రాజధాని అమరావతి లేకపోవడం వల్లే, రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే వారు కూడా, అనుమానంగా చూస్తున్నారని అన్నారు. కేంద్రం చేసిన ఈ తప్పిండం, తక్షణం కేంద్ర హోంశాఖ తప్పును సరిదిద్దాలని గల్లా జయదేవ్‌ తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేసారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానన్నాయి. ముందుగా డిసెంబర్ 2వ తేది నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా, ఇప్పుడు డిసెంబర్ 9 నుంచి సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఒక పక్క అమరావతిని ఆపేయటం, పోలవరం ముందుకు వెళ్లకపోవటం, పెట్టుబడులు వెనక్కు వెళ్ళటం, ఇసుక అందుబాటులో లేకపోవటం, ఉపాధి హామీ పధకం డబ్బులు ఇవ్వకపోవటం, ఇంగ్లీష్ మీడియం చదువులు, నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, రోజుకి ఒక సమస్య పై, తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. అయితే, వీటి అన్నిటికీ అసెంబ్లీ వేదికగానే గట్టి సమాధానం చెప్పాలని, డేటా మొత్తం రెడీ చేసి, పూర్తీ సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి, ఇంకా ఏ పార్టీలో చేరని వల్లభనేని వంశీ వ్యవహారం కూడా, హాట్ టాపిక్ గా మారింది.

assembly 21112019 2

వల్లభనేని వంశీ తటస్థంగా కొనసాగనున్నారు. అయితే, వల్లభనేని వంశీ చేతే, అనేక విషయాల పై మాట్లాడించి, తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్పాలని, వైసిపీ భావిస్తుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, తన ప్రెస్ మీట్ లో, ఇసుక గురించి, ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు. వరదలు వస్తే ఇసుక ఎక్కడ నుంచి వస్తుంది అని ప్రశ్నించారు. అలాగే ఇంగ్లీష్ మీడియం వద్దు అంటున్న వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ నేపధ్యంలోనే, ఈ రెండు సమస్యల పై, వల్లభనేని వంశీ చేత మాట్లాడించి, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని డిఫెన్సు లోకి నెట్టాలని, ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి, వ్యూహాలు పన్నుతున్నారు. అయితే, దీనికి రివర్స్ ప్లాన్ ని కూడా తెలుగుదేశం పార్టీ రెడీ చేస్తుంది.

assembly 21112019 3

వల్లభనేని వంశీ పార్టీ పై చేసిన విమర్శలకు వివరణ అడుగుతూ సస్పండ్ మాత్రమే చేసామని, పార్టీ నుంచి బహిష్కరించలేదని, ఆయన ఇంకా మా పార్టీ సభ్యుడుగానే ఉన్నారని తెలుగుదేశం చెప్తుంది. అసెంబ్లీలో పార్టీ లైన్ ధిక్కరించి ఎవరూ మాట్లాడ కూడదు అంటూ, తెలుగుదేశం పార్టీ విప్ జారీ చెయ్యాలని భావిస్తుంది. ఇలా విప్ జారీ చేసిన తరువాత కూడా, వల్లభనేని వంశీ వ్యతిరేకంగా మాట్లాడితే, అప్పుడు ఆయన పై అనర్హత వేటు వెయ్యాలని, స్పీకర్ ను తెలుగుదేశం కోరుతుంది. వైసిపీ ఆ ప్లాన్ వేస్తే, తెలుగుదేశం పార్టీ ఇలా రివర్స్ ప్లాన్ వేసింది అనర్హత వేటు పడితే ఇబ్బంది కాబట్టి, వంశీ కొంచెం వెనక్కు తగ్గే అవకాసం ఉంది. అలాగే మరో ఒకటి రెండు మంది టిడిపి ఎమ్మెల్యేలను, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే, తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ భావిస్తుంది. దానికి కూడా, ఈ విప్ ఉపయోగపడుతుందని, తెలుగుదేశం భావిస్తుంది.

అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిట్టు ప్రచారం చెయ్యటంలో, అప్పట్లో ప్రతిపక్షాలు చాలా ఆక్టివ్ గా ఉండేవి. చాలా విషయాలు ప్రజలకు నిజం అని నమ్మించారు కూడా. అందులో ఒకటి, ఐటి గ్రిడ్స్ కేసు. సరిగ్గా ఎన్నికలకు నోటిఫికేషన్ కు వారం రోజులు ముందు, ప్రజల వ్యక్తిగత సమాచారం అంతా, తెలుగుదేశం ప్రభుత్వం దోచేసింది అంటూ, వైసీపీ ఆరోపించింది. తెలుగుదేశం పార్టీకి యాప్ తయారు చేసే ఐటి గ్రిడ్ కు, ప్రభుత్వ సమాచారం అంతా ఇచ్చారని, వారు ప్రజల సమాచారం దోచేసి, వాటిని ఓట్లు తొలగించటంలో ఉపయోగించారని వైసీపీ ఆరోపించింది. దీనికి సంబంధించి, అప్పట్లో తెలంగాణా ప్రభుత్వ సాయంతో, కేసులు కూడా పెట్టి, ఈ కేసు నిజమే అన్నట్టు, నమ్మించే ప్రయత్నం చేసారు. దీని పై ఒక సిట్ కూడా ఏర్పాటు చేసారు. తెలుగుదేశం పార్టీ దోచేసింది దోచేసింది అంటూ ప్రచారం చేసారు. అయితే అప్పట్లోనే ఆధార్, ఈ ప్రచారాన్ని ఖండించింది.

sanjay 21112019 2

ఈ రోజు పార్లమెంట్ వేదికగా కేంద్రం కూడా ఈ విషయం పై ప్రకటన చేసింది. ఐటి గ్రిడ్స్ తో ఎలాంటి డేటా చోరీ జరగలేదని, కేంద్రం తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి, ఈ రోజు పార్లమెంట్ లో ప్రకటన చేసింది. ఐటి గ్రిడ్ ద్వారా, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆధార్ డేటా చోరి చేసింది అంటూ, గతంలో ఆరోపణలు వచ్చాయి, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వైసీపీనే అప్పట్లో హడావిడి చేసింది, ఇప్పుడు ఈ కేసు పరిస్థితి ఏమిటి అంటూ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి సంబంధించి, కేంద్రమంత్రి సంజయ్ థాత్రే సమాధానం ఇచ్చారు. ఆధార్‌ డేటాను ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని, ఆధార్ డేటా చోరీ అయ్యే, సమస్యే లేదని, ఎక్కడా కూడా డేటా చోరీ కాలేదని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.

sanjay 21112019 3

అయితే విజిల్ బ్లోయర్ గా చెప్పుకుంటున్న లోకేశ్వర్ రెడ్డి, ఐటి గ్రిడ్స్ పై , తెలంగణా ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చారు. ఇదే లోకేశ్వర్ రెడ్డికి, ఇప్పుడు ఏపి ప్రభుత్వంలో ఒక పాదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం కూడా, డేటా చోరీ జరగలేదు అని చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే, అప్పట్లో ఎంత కుట్ర జరిగిందో, ఎలాంటి ప్రచారం చేసారో అర్ధం అవుతుంది. ఏది ఏమైనా ఈ విషయంలో, తెలుగుదేశం పార్టీ అప్పట్లో సరిగ్గా తిప్పి కొట్టలేక పోవటంతో, రాజకీయంగా నష్ట పోయింది. అందరూ చేసిన ప్రచారాన్ని, తిప్పి కొట్టలేక, ప్రజలకు నిజం చెప్పలేకపోయింది. అయితే నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు, ఇప్పుడు పార్లమెంట్ వేదికగా కేంద్రమే చెప్పింది. అయినా, తెలుగుదేశం పార్టీకి జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.

Advertisements

Latest Articles

Most Read