తెలంగాణాకు కొత్తగా వచ్చిన గవర్నర్, మొదటి రోజే కేసిఆర్ కు చుక్కలు చుపించారనే వార్తలు వస్తున్నాయి., ఆమె వచ్చిన మొదటి రోజే మంత్రివర్గ విస్తరణ చెయ్యటంతో, దానికి ముందే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హైడ్రామా నడిచినట్లు తెలుస్తోంది. ఈ నెల 1న కేంద్ర ప్రభుత్వం నరసింహన్‌ స్థానంలో తమిళిసై సౌందర రాజన్‌ను కొత్త గవర్నర్ గా నియమించింది. అయితే సెప్టెంబర్ 1 కంటే ముందే కేసీఆర్‌కు కొత్త గవర్నర్‌ వస్తున్నారన్న సమాచారం రావటంతో, నరసింహన్ వెళ్ళే లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ముహూర్తాల కోసం చూస్తూ ఉండగా, సెప్టెంబరు 8న దశమి రోజు మంచి ముహూర్తం ఉండటంతో అందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే గవర్నర్‌ మార్పు ప్రకటన వచ్చింది. సెప్టెంబరు 8న నరసింహన్‌తో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తిచేసి, పదో తేదీన ప్రగతిభవన్‌లో నరసింహన్ కు ఘనంగా వీడ్కోల విందు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

kcr 10092019 2

అందుకు తగ్గట్టే నరసింహన్‌ కూడా 11న మంచి రోజని, ఆ రోజున రాజ్‌భవన్‌ను వీడాలని అనుకుని, అదే విషయాన్ని కేసీఆర్‌కు సమాచారం ఇచ్చారు. ఈ నెల 3వ తేదీన జరిగిన విలేకరులతో ఇష్టాగోష్టిలో కూడా నరసింహన్‌ తాను మరో వారం ఉంటున్నట్లు చెప్పారు. అయితే, ఈలోపే కొత్త గవర్నర్‌ తమిళిసై సెప్టెంబరు 8న వచ్చి గవర్నర్ గా బాధ్యతలు స్వీకరిస్తానని సమాచారం వచ్చింది. అయితే కేసిఆర్ ఆమెతో మాట్లాడి, నరసింహన్‌ 11 వరకు ఉండాలని అనుకుంతున్నారని చెప్పటంతో, ఆమె కూడా సరే అన్నారు. అయితే ఏమైందో ఏమో కాని, హఠాత్తుగా ఆమె 8నే తాను రాష్ట్రానికి వస్తున్నట్లు రాజ్‌భవన్‌కు సమాచారం అందించారు. దాంతో ఇక చేసేది ఏమి లేక, 7వ తేదీనే నరసింహన్‌ రాజ్‌భవన్‌ను ఉన్నట్టు ఉండి వీడాల్సి వచ్చింది.

kcr 10092019 3

దీంతో ఏడో తేదీనే, గవర్నర్‌కు విందు ఏర్పాటు చేశారు. అయితే అదే రోజున మంత్రి వర్గ విస్తరణ పెట్టించి, నరసింహన్ తోనే, ప్రమాణ స్వీకారం పెట్టుకోవాలని కేసిఆర్ భావించినట్లు చెబుతున్నారు. అయితే, కొత్త గవర్నర్‌ వస్తుండగా, దిగిపోతున్న గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించడం మంచిది కాదని కేంద్రం నుంచి సంకేతాలు రావడంతో, కేసిఆర్ ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. ఈలోపు తమిళిసై రావటంతోనే, మంత్రి వర్గ విస్తరణ అని ఆమెకు చెప్పటంతో, తాను బాధ్యతలు స్వీకరించిన రోజే ఎందుకు, మరో మంచి ముహూర్తంలో చేసుకోండి అని ఆమె కోరగా, చేసేదేమీ లేక ఢిల్లీలోని బీజేపీ పెద్దలను సంప్రదించి ఆమెను ఒప్పించినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి ఆదేశాలు రావడంతో తమిళిసై సరేనన్నట్లు సమాచారం. మొన్నిదాక నరసింహన్ తో ఆడింది అటగా కొనసాగిన కేసిఆర్, తమిళిసై పూర్తిస్థాయి బీజేపీ కార్యకర్త కావడం, మొండిమనిషిగా ఆమెకు పేరుండటంతో సీఎం-గవర్నర్‌ సంబంధాలు అంత సాఫీగా ఉండవని మొదటి నుంచే ఊహిస్తున్నారు. అందుకు తగ్గట్లే ఆమె తన మొండి తనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తొలిరోజే చూపించారు.

శ్రీశైలం డ్యాంకు మరోసారి పై నుంచి వరద వస్తుంది. దీంతో శ్రీశైలం దగ్గర కృష్ణమ్మ ప్రామాదకర స్థాయికి చేరుకుంది. అయితే, ఎందుకో కాని ప్రభుత్వం, నిన్న రాత్రి వరకు, నీటిని కిందకు వదలలేదు. పై నుంచి అధికంగా వరద వస్తుందని తెలిసినా, డ్యాం కెపాసిటీ ఫుల్ గా నింపేశారు. అయితే రాత్రి మాత్రం కొన్ని గేటులు ఎత్తి, నీళ్ళు కిందకు వదిలారు. అయితే, నిన్న ఇది కూడా వివాదాస్పదం అయ్యింది. ఇంజనీర్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉండగా, ఆయన భార్య వచ్చి, గేట్లు వదిలారు. ఆవిడ ముచ్చట పడటంతో, ఒక అధికారి ఇలా చెయ్యటం వివాదాస్పదం అయ్యింది. అయితే, ఈ రోజు ఉదయం శ్రీశైలం దగ్గర అనుకోని సంఘటన ఎదురైంది. సరైన వాటర్ మ్యానేజ్మెంట్ చెయ్యలేక పోవటంతో, పెద్ద ప్రమాదం తప్పింది. పై నుంచి వచ్చే నీరు అంచనా వెయ్యలేక, సరైన విధంగా గేట్లు ఎత్తక పోవటంతో, శైలం డ్యాం గేట్ల పైనుంచి వరద నీరు ప్రవహించింది.

srisailam 10092019 2

దీంతో గేట్ల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. స్పిల్ వే నుంచి కాకుండా 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు పారింది. దీంతో ఒక్కసారిగా డ్యాం దగ్గర కలకలం రేగింది. అయితే ఈ సమయంలో, శ్రీశైలం డ్యాం దగ్గర అధికారులు లేకపోవడంతో, అక్కడ ఏమి జరుగుతుందో అర్ధం కాక, ప్రజలు ఆందోళన చెందారు. అధికారులు లేకపోవటంతో, ఇలా ఎందుకు జరుగుతుంది, డ్యాంకి ఏమైనా ఇబ్బంది ఉందా అనే విషయం తెలియక ప్రజలు ఆందోళన చెందారు. డ్యాం గేట్ల పైనుంచి వరద నీరు పారుతున్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, టీవీల్లో పెద్ద ఎత్తున రావటంతో, అధికారులు రంగంలోకి దిగి, సరిచేసారు. శ్రీశైలం డ్యామ్ దగ్గర క్రస్ట్ గేట్ల పై నుంచి నీరు దూకుతూ రావటంతో, అధికారులు ఎవరూ అక్కడ అందుబాటులో లేకపోవడం పెద్ద చర్చగా మారింది.

srisailam 10092019 3

శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.9 అడగులకు చేరింది. అయితే పై నుంచి వరద వస్తు ఉండటం, డ్యాం పూర్తిగా నిండినా సరే, ఆరు గేట్లను మాత్రమే ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో మిగతా గేట్ల పై నుంచి నీరు కిందకు వెళ్లిపోతోంది. అయితే, ఈ పరిణామంతో డ్యామ్‌కు పెద్దగా ఇబ్బంది లేకపోయినా, అధికారుల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో 2009లో అధిక వరద , రికార్డు సమయంలో వచ్చినప్పుడే ఇలా జరిగిందని, కాని ఇప్పుడు మాత్రం, ముందుగా తెలుస్తున్నా, ప్రభుత్వం ఇలా నీళ్ళు వదలకుండా ఎందుకు చేస్తుందో, ప్రజలకు అర్ధం కావటం లేదు. ఏదైనా జరగరానిది జరిగితే, ప్రభుత్వం, అధికారులు, ఏమి సమాధానం చెప్తారు ? 20 రోజుల క్రిందట వరద వచ్చినప్పుడు, ప్రభుత్వం సరిగ్గా వాటర్ మ్యానేజ్మెంట్ చెయ్యలేదు అనే విమర్శలు వచ్చినా, ప్రభుత్వం మాత్రం, ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని, ఈ చర్యతో అర్ధమవుతుంది.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయాయి. అమరావతి అసలు ఉంటుందా, ఉండదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మంత్రులు చేస్తున్న ప్రకటనలు కూడా తీవ్ర గందరగోళ పరిస్థతితులకు తావు ఇచ్చింది. ఇంత జరుగుతున్నా, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అమరావతి పై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. దీంతో అమరావతి ఉంటుందా ఉండదా అనే కన్ఫ్యూషన్ ప్రజల్లో ఉంది. ఒక పక్క ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అమరావతికి రుణం ఇవ్వం అంటూ తేల్చి చెప్పాయి. జగన్ మోహన్ రెడ్డి, కేంద్రం దగ్గరకు వెళ్లి, అమరావతికి ప్రస్తుతానికి ఎలాంటి సహాయం అవసరం లేదని చెప్పారు. అయితే అమరావతి పై పెట్టుబడులు పెట్టె వారు కూడా కన్ఫ్యూషన్ లో ఉన్నారు.

singapore 09092019 2

ముఖ్యంగా అమరావతిలోని స్టార్ట్ అప్ ఏరియాలో పెట్టుబడులు పెట్టాటానికి రెడీ అయిన సింగపూర్ ప్రభుత్వం, కూడా కన్ఫ్యూషన్ లో పడింది. పోయిన వారం సింగపూర్ మంత్రి శ్రీధరన్ ఈ విషయం పై, సింగపూర్ పార్లమెంట్ లో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అమరావతిలో అధికార మార్పిడి జరిగింది అని, ప్రస్తుత ప్రభుత్వ వైఖరి పై గమనిస్తున్నాం అని అన్నారు. అలాగే, ప్రభుత్వ బ్యాంక్ కూడా అమరావతికి రుణం ఇవ్వకుండా వెనక్కు వెళ్లిందని, ఈ పరిణామాలు అన్నీ గమనిస్తున్నాం అని అన్నారు. అయితే ఈ రోజు మరో సింగపూర్ మంత్రి వీవీయన్‌ బాలకృష్ణన్ కూడా అమరావతి పై స్పందించారు. వీవీయన్‌ బాలకృష్ణన్ సింగపూర్ ప్రభుత్వానికి విదేశాంగ మంత్రి. ఆయన కూడా ఈ రోజు సింగపూర్ లో జరిగిన ఒక సదస్సులో, అమరావతి పై మాట్లాడారు.

singapore 09092019 3

సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి అనుకుందని, అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సింగపూర్ ప్రభుత్వం గమనిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును సమీక్షించాలని భావిస్తోందని సింగపూర్‌ కన్సార్షియం తమకు తెలిపిందని సింగపూర్ మంత్రి వెల్లడించారు. కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కోసం తాము వేచి చూస్తున్నామన్నారు. సమీక్ష ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. ఎలాగూ జగన్ మోహన్ రెడ్డికి అమరావతి పై ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, సింగపూర్ ప్రభుత్వం, ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టే అనుకోవాలి. చూద్దాం, జగన్ మోహన్ రెడ్డి గారి మనసు ఏమైనా మారుతుంది ఏమో.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఇప్పటి వరకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై, 500 పైగా దాడులు జరిగాయని, 8 మంది చనిపోయారని తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తున్న సంగాతి తెలిసిందే. వైసిపీ అరాచకాలు తట్టుకోలేక, గ్రామాల నుంచి ప్రాణ భయంతో వెళ్ళిపోయిన కార్యకర్తలను, గుంటూరులో శిబిరం ఏర్పాటు చేసి అక్కడ ఉంచారు. అయితే, పోలీసులకు ఎంత చెప్పినా, ఎవరూ పట్టించుకోవటం లేదని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అందుకే చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. ఈ నెల 11న చలో పల్నాడు పేరుతొ, ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులతో పాటుగా, వైసిపీ బాధితులు అంతా అక్కడకు హాజరు కావాలని చంద్రబాబు పిలుపిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అనే అనుమానాలు వస్తున్న తరుణంలో, ఇప్పుడు మరో ట్విస్ట్ బయటకు వచ్చింది.

palnadu 09092019 2

గురజాల పోలీసులు, గురజాలలో, ఈ రోజు నుంచి, 12వ తారీఖు వరకు 144 సెక్షన్ పెట్టారు. దీనికి కారణంగా, మొహరం పండుగ, గణేష్ నిమ్మజనం అని ఉత్తర్వుల్లో పెర్కున్నారు. అయితే, ఇలా పండుగల రోజుల్లో 144 సెక్షన్ పై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుంది. ముఖ్యంగా, గ్రామాల్లో ఘనంగా, ఊరంతా ఏకమై జరుపుకునే గణేష్ నిమ్మజనంలో కూడా 144 సెక్షన్ ఎలా పెడతారు అంటూ కొంత మంది ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలు లేకపోలేదని, తెలుగుదేశం నేతలు అంటున్నారు. చంద్రబాబు గారు ఈ నెల 11న పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కాబట్టి, వైసిపీ ప్రభుత్వ అరాచకాలు బయటకు రాకుండా ఉండేందుకు, చంద్రబాబు పర్యటనను అడ్డుకునే క్రమంలో, ఇలా 144 సెక్షన్ పెట్టేరని తెలుగుదేశం ఆరోపిస్తుంది.

palnadu 09092019 3

500 మంది పై దాడి చేసి, 8 మందిని చంపేస్తే కూడా, ఆందోళన చేసే హక్కు కూడా లేదా అని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. దీని పై అనవసర రాద్ధాంతం చేసి, చంద్రబాబు పై మరోసారి కక్ష తీర్చుకునే ప్రయత్నంలో, ఇలా 144 సెక్షన్ పెట్టి, ఆ రోజు మరింత ఉద్రిక్త పరిస్థితులు రేపే ఉద్దేశంతో ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మరో పక్క, ఈ రోజు హోం మంత్రి, మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలేమీ లేవని, రాష్ట్రం ప్రశాంతంగా ఉందని అన్నారు. మరి అలాంటప్పుడు 144 సెక్షన్ ఎందుకు పెట్టారని తెలుగుదేశం ప్రనిస్తుంది. మరో పక్క, తెలుగుదేశం పునరావాస కేంద్రంలో అందరూ పైడ్ ఆర్టిస్ట్ లే ఉన్నారు అంటూ, హోం మంత్రి ప్రకటన చేసారు. అక్కడ తలలు పగిలి, ఒంటి నిండా కుట్లు వేసుకున్న వాళ్ళు రోజు మీడియాతో మాట్లాడుతున్నా, ఆ బాధితుల్ని, సాక్షాత్తు హోం మంత్రి గారే, పైడ్ ఆర్టిస్ట్ లు అనటం పై తెలుగుదేశం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు 144 సెక్షన్ పెట్టటంతో, చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుంది, చంద్రబాబు తదుపరి అడుగులు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి.

Advertisements

Latest Articles

Most Read