మెగా స్టార్ చిరంజీవి అంటే సినిమాల్లో మామూలు క్రేజ్ కాదు. అయితే ఆయన రాజకీయాల్లోకి రావటం, అక్కడ నుంచి ప్రజలు పిలుస్తున్నారు అంటూ ప్రజా రాజ్యం పార్టీ పెట్టటం, తరువాత సీట్లు అమ్ముకున్నారు అనే ఆరోపణలు, 18 సీట్లు మాత్రమే గెలవటం, తరువాత ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చెయ్యటం, తరువాత కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ టికెట్ తీసుకోవటం, ఆ తరువాత కేంద్ర మంత్రి అవ్వటం, పదవి పోగానే, 5 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో దూరంగా ఉండటం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మొన్న ఎన్నికల్లో ప్రచారం చెయ్యలేదు. రాహుల్ గాంధీ స్వయంగా కోరినా, ఆయన మాత్రం సినిమాల్లో బిజీగ ఉన్నానని, ఈ సమయంలో మళ్ళీ రాజకీయాల్లో ఆక్టివ్ అవ్వలేనని చెప్పారు. అన్నట్టుగానే, మొన్నటి ఎన్నికల్లో ప్రచారానికి దూరం అయ్యారు.

chiru 18082019 2

అయితే ఎన్నికలు అయిన తరువాత నుంచి, బీజేపీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం అవ్వటానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా, చిరంజీవిని తమ పార్టీలోకి తీసుకుని, పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి, కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. దీని పై అనేకసార్లు వార్తలు కూడా వచ్చాయి. చర్చలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, అటు చిరంజీవి కాని, ఇటు బీజేపీ కాని స్పందించలేదు. అయితే, తన సినిమా సైరా నరసింహారెడ్డి ప్రమోషన్ లో బిజీగా ఉన్న చిరంజీవి ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో తన పై వస్తున్న వార్తల గురించి స్పందించారు. అయితే ఆ వార్తలకు డైరెక్ట్ ఖండించలేదు. నేను వాళ్ళ పార్టీలో చేరాలని, పూర్తిగా వాళ్ల ఆలోచన, ఆశ. దానిపై నేనెలా స్పందిస్తాను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే అంటూ స్పందించారు.

chiru 18082019 3

అయితే బీజేపీలో చేరిక వార్తలను మాత్రం ఖండించలేదు. అలాగే పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ ఓటమి పై కూడా చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు. జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలవటం, పవన్ రెండు చోట్లా ఓడిపోవటం పై ప్రశ్నించగా, రాజకీయం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ, ఈ సుదీర్ఘ ప్రయాణంలో, ఒకోసారి గెలుస్తాం, ఒకోసారి ఓడిపోతాం అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక బలమైన లక్ష్యంతో రాజకీయం చెయ్యటానికి వచ్చారు, ఇప్పుడు ఆయన ఓడిపోవచ్చు కాని, భవిషత్తులో ఘన విజయం సాధిస్తారు. ఆయన ఆశయాలు చలా బలమైనవి, ఆయన ఆలోచనలకు క్రమంగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుందనే నమ్మకం ఉందని చిరంజీవి అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్... 2009లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పని చేసారు. తరువాత కాలంలో, సినిమాల్లో బిజీ అయ్యి, రాజకీయాలకు దూరంగా జరిగారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ రిలేషన్ పై అనేక అభిప్రాయాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. ముఖ్యంగా కొడాలి నాని వ్యవహారంలో, ఎన్టీఆర్ కి, తెలుగుదేశం క్యాడర్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అయితే తాను మాత్రం, కట్టే కాలే వారుకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటానాని, అనేకసార్లు స్పష్టం చేసారు కూడా. కాని, ప్రతి సారి, ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య గ్యాప్ పెంచటానికి ప్రత్యర్ధి పార్టీలు చూస్తూ ఉండేవి. ముఖ్యంగా లోకేష్ ఎంటర్ అయిన తరువాత, లోకేష్ కోసం ఎన్టీఆర్ ని బలి ఇస్తున్నారు అంటూ ప్రత్యర్ధులు ప్రచారం చేసే వారు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను సినిమాల్లో పేరు తెచ్చుకోవాలి అని ఎన్టీఆర్ ఎన్ని సార్లు చెప్పినా, ప్రచారాలు మాత్రం ఆగలేదు.

ntr 18082019 2

అయితే అనేక సందర్భాల్లో మాత్రం, చంద్రబాబు, ఎన్టీఆర్ కు అండగా నిలబడ్డారు. అలాగే ఎన్టీఆర్ కూడా కావలసిన సమయంలో ముందుకొచ్చారు. చంద్రబాబు 2014లో ప్రమాణస్వీకారం చేసిన సమయంలో, అలాగే 2018లో లోకేష్ మంత్రి అయిన సందర్భంలో, ప్రమాణస్వీకారానికి హరికృష్ణ హాజరయ్యారు. సంవత్సరం క్రితం, హరికృష్ణ మరణ వార్తా విని, చంద్రబాబు అన్నీ తానై చివరి కార్యక్రమాలు జరిపించారు. ఇద్దరి మధ్య ఇంత మంచి సంబంధాలు ఉన్నా, ప్రచారాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తరువాత, ఈ రోజు మరోసారి చంద్రబాబు, ఎన్టీఆర్ కలుసుకున్నారు. ఈ రోజు హరికృష్ణ సంవత్సరీకం కావటంతో, ఆ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అందరూ పాల్గున్నారు.

ntr 18082019 3

ఎన్టీఆర్ , కళ్యాణ్ రాం తో, చంద్రబాబు చాలా సేపు మాట్లాడారు. చంద్రబాబు ప్రస్తుతం చెయ్యి నొప్పితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఆ విషయం పై, ఎన్టీఆర్, చంద్రబాబు ఆరోగ్యం పై ఆరా తీసారు. ఇరువురు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి గురించి ప్రస్తావిస్తూ, మీరు కష్టపడి పని చేసారు, ప్రజలకు ఎంతో సేవ చేసారు, కొన్నాళ్ళు ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోండి అని చెప్పినట్టు సమాచారం. అలాగే, చంద్రబాబు కూడా, ఎన్టీఆర్ కు షూటింగ్ లో అయిన గాయం గురించి ఆరా తీసారు. మొత్తానికి, హరికృష్ణ మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్న టీఆర్ఎస్, వైసిపీ పార్టీలు, ఈ సీన్ చూసి మాత్రం ఇబ్బంది పడక తప్పదు. మళ్ళీ ఎదో విష ప్రచారంతో వాళ్ళు ముందుకు రావటం, వీళ్ళు కడుక్కుంటు కూర్చోవటం మామూలే అనుకోండి.

30 ఇయర్స్ పృథ్వి, ఎన్నికల్లో చేసిన సేవ నచ్చి, అతనికి ఎస్వీబీసి చైర్మెన్ పదవి ఇచ్చారు జగన్. అయితే అక్కడ వెంకన్న స్వామి సేవ చేస్తూ, వెంకన్న స్మరణలో ఉండాల్సిన పృధ్వీ మాత్రం, జగన్ మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్నారు. ఎస్వీబీసి చైర్మెన్ పదవిలో ఉంటూ, స్వామి వారిని కాకుండా, జగన్ ని పొగుడుతున్నారు. పులి కడుపున, మరో పులి పుడుతుంది అంటూ భక్తిని చాటుకుంటూ, వివాదాలు రేపుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వటం ఇష్టం లేదు అంటూ ప్రకటన చేసారు. అందుకే ఇప్పటి వరకు జగన్ ను కలిసి సన్మానం చెయ్యలేదు అన్నారు. అయితే దీని పై, అగ్ర హీరో, రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎవరైనా గౌరవం ఇస్తామని, ఎవరైనా ఇవ్వాల్సిందే అన్నారు.

rnm 17082019 2

ఇప్పటికిప్పుడు జగన్ ను కలిసి చర్చలు జరపటానికి, మేము పెట్టుబడి దారులం కాదని, సమయం వచ్చినప్పుడు ఆయన్ను కలుస్తామని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యల పై పృధ్వీ స్పందిస్తూ, రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన సమాధానం సరిగ్గా లేదని, జగన్ ను ఎవరైనా అవమాన పరిస్తే, తాట తీస్తాను అంటూ హెచ్చరించారు. అయితే ఇప్పటికే పృధ్వీ వ్యాఖ్యలను, ఒకే పార్టీ అయినా సరె పోసాని ఖండించారు. అయితే, ఇప్పుడు మరో హీరో, ఆర్ నారాయణ మూర్తిని, ఈ విషయం పై మీడియా అడిగింది. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వటం, తెలుగు సినీ పరిశ్రమకు ఇష్టం లేదని, వైసీపీ నాయకులు అంటున్నారు, మీరేమంటారు అని మీడియా ఆర్ నారాయణ మూర్తిని ప్రశ్నించింది. దీని పై ఆయన సూటిగా సమాధానం చెప్పారు.

rnm 17082019 3

రాజకీయలాకు, సినీ ఇండస్ట్రీకి సంబంధం ఉండదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకు సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము వారిని అభిమానిస్తామని అన్నారు. చిత్ర పరిశ్రమ అద్దాల మేడ లాంటిదని, మేము వేరే వారిని విమర్శించే అవకాసం ఉండదని అన్నారు. మరో ప్రశ్నగా, మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు అని మీడియా ప్రశ్నించింది. దానికి ఆర్ నారాయణ మూర్తి స్పందిస్తూ, గతంలో తనకు కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశాలు వచ్చాయని, కాని అప్పుడు తిరస్కరించానని, ప్రస్తుతం ఇంకా సినిమాల్లో ఉన్నానని, సినీమాలకు స్వస్తి చెప్పినప్పుడు, రాజకీయాల్లోకి వచ్చే విషయం అప్పుడు ఆలోచిస్తానని అన్నారు. అలాగే గోదావరి జలాలను ఉత్త రాంధ్రకు తరలించే పురుషోత్తపట్నం ఎత్తిపోతల మంచి ప్రాజెక్ట్ అని అన్నారు. నిన్న ఆయన, అల్లూరి సేవా సమితి ఆధ్వర్యంలో కోటనందూరులో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గున్నారు.

జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కేసులు కొత్త కాదు. జగన్ మోహన్ రెడ్డి పై 31 కేసులు ఉన్నాయి. మొన్నటి దాక ఆయన ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్ళే వారు. అలాగే జగన్ కేసుల్లోనే, ఆయన భార్య పై కూడా కేసు నమోదు అయ్యింది. ఇక జగన్ తండ్రి దివంగత వైఎస్ఆర్ పై కూడా అమెరికాలో టైటానియం లాంటి పెద్ద కేసు ఉంది. ఇక జగన్ బావ, వైఎస్షర్మిల భర్త అయిన అనిల్ పై కూడా కేసు ఉంది. అయితే, ఇప్పుడు ఈ కేసు విషయంలోనే, జగన్ బావ అయిన, ప్రముఖ క్రైస్తవ మత ఉపన్యాసకుడు బ్రదర్ అనిల్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది కోర్ట్. కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా, అరెస్ట్ చేసి, అతన్ని తమ ముందు హాజరు పరచాలని కోర్ట్, పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం, ప్రస్తుతం హాట్ టపిక్ గా మారించి. ఒక పక్క జగన్ ఇక్కడ సియంగా ఉండటం, పక్కన రాష్ట్రంలో ఆయన స్నేహితుడు కేసిఆర్ అధికారంలో ఉండి కూడా, ఆయన బావకు అరెస్ట్ వారంట్ రావటంతో వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు.

brothernail 18082019 2

ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో రాష్ట్రంలో ఖమ్మం పట్టణంలో ఉన్న న్యాయస్థానం, జగన బావ, బ్రదర్ అనిల్ కుమార్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ఇష్యూ చేసింది. ఎన్నికల కోడ్ అఫ్ కాండక్ట్ ను ఉల్లంఘించిన కేసులో ఆయనకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా రాలేదని, ఆయన న్యాయస్థానానికి హాజరు కాకపోవడం వల్ల ఈ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ను ఇచ్చారు. 2009 ఎన్నికల సమయంలో, 2009 మార్చి 28వ తేదీన బ్రదర్ అనిల్ కుమార్ ఎన్నికల కోడ్ అఫ్ కాండక్ట్ ఉల్లంఘించారంటూ ఆయన పై కేసు నమోదు చేసారు పోలీసులు. ఖమ్మం కరుణగిరి ప్రాంతంలో ఆయన వైసిపీకి అనుకూలంగా ఆయన ప్రచారం చేశారని, రూల్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసారని అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది.

brothernail 18082019 3

ఆ టైంలో, ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తరువాత కూడా, ఆయన కరుణగిరిలో ప్రచారం చేస్తూ, చర్చిలో ప్రార్థనలు జరిపి, ఓటర్లను లోబర్చుకునే నిమిత్తం డబ్బు పంపిణీకి యత్నించారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. వాటి ఆధారంగా ఖమ్మం రూరల్ పోలీసులు అనిల్‌తో పాటు మరో ముగ్గురిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆయన కరపత్రాలు కూడా పంచారని బ్రదర్ అనిల్ కుమార్ పై కేసు పెట్టారు పోలీసులు. అయితే ఆ కేసులో ఏ1గా ఉన్న అనిల్‌ కుమార్‌ ఎన్ని సార్లు కోర్ట్ పిలిచినా, రాలేదు. దీనితో ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం కోర్ట్ లో హాజరుపరచాలని ఖమ్మం సెకెండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి జస్టిస్ ఎం జయమ్మ ఆదేశాలు ఇస్తూ, ఈ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసారు.

Advertisements

Latest Articles

Most Read