మొన్నటి వరకు అనధికార మిత్రులుగా ఉన్న వైసీపీ, బీజేపీ పార్టీలు, ఇప్పుడు ఒకరి పై ఒకరు రాజకీయ దాడులు చేసుకుంటున్నాయి. నిన్న జగన్ యాంటీ హిందూ అంటూ, బీజేపీ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. ఈ రోజు కూడా జగన్ ప్రభుత్వం పై బీజేపీ పార్టీ విరుచుకు పడింది. వరదలల్లో సరిగ్గా వాటర్ మ్యానేజ్మెంట్ చేయ్యక పోవటం, పోలవరం టెండర్లు, రాజధాని తరలింపు పై, బీజేపీ, వైసిపీ పై రాజకీయ దాడి చేస్తుంది. అయితే ఈ రోజు విజయసాయి రెడ్డి చాలా రోజుల తరువాత మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇన్ని విమర్శలు చేసినా, వారిని ఒక్క మాట కూడా అనే సాహసం చెయ్యలేదు. వారిని ఏమి అనకపోగా, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా పై ప్రశంసలు కురిపించారు. అయితే, పోలవరం ప్రాజెక్ట్ విషయం పై, విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై, కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది కదా అని విలేఖరులు ప్రశ్నించారు.

vsreddy 21082019 2

దీనికి విజయసాయి రెడ్డి సమాధానం చెప్తూ, జగన్ మోహన్ రెడ్డి ఏమి చేసినా, మోడీ, అమిత్ షాలకు చెప్పే చేస్తారని చెప్పారు. వారి అనుమతితోనే అన్ని పనులు చేస్తారు అంటూ, పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల సమీక్షను, మోడీ, షా ల పై తోసేసే ప్రయత్నం చేసారు. అయితే విజయసాయి రెడ్డి వ్యాఖల పై, బీజేపీ పార్టీ వెంటనే స్పందించింది. ముందుగా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ, పోలవరం టెండర్ల విషయంలో, విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, కేంద్ర ప్రభుత్వం వద్దు అని చెప్తున్నా, జగన్ మోహన్ రెడ్డి, ఆయన ఇష్టం వచ్చినట్టు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రధాని మోడీ చెప్పిన మాట వినటం నేర్చుకోవాలి అంటూ మండి పడ్డారు.

vsreddy 21082019 3

ఇక కొద్ది సేపటికే, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. ఢిల్లీలో ఈ రోజు సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తో చర్చలు జరిపి, వారి అంగీకారం తరువాతే పోలవరం విషయంలో, విద్యుత్ ఒప్పందాల విషయంలో ముందుకు వెళ్తున్నాం అని చెప్పిన విజయసాయి రెడ్డి మాటలు కరెక్ట్ కాదని సుజనా అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిపలన ఉండదని, ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటారనే విషయం విజయసాయి రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని అన్నారు. అసలు ఏ ప్రాతిపదికన, మోడీ, అమిత్ షా, మీకు భోరోసా ఇస్తారని సుజనా ప్రశ్నించారు. ఇలాంటి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు అని, కేంద్రం చెప్పే ప్రతి అభ్యంతరానికి, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుందని, విజయసాయి రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు.

నిన్న బొత్సా అమరావతి పై ప్రకటన చేసిన దగ్గర నుంచి, అమరావతి మార్పు వార్తల పై చర్చ జరుగుతుంది. నిన్న విశాఖలో బొత్సా మాట్లాడుతూ, అమరావతి పై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని, త్వరలోనే అమరావతి రాజధాని పై, ఒక ప్రకటన చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిలో నిర్మాణాల ఖర్చు ఎక్కువ అవుతుందని, అలాగే వరదల వల్ల ముంపు వస్తుందని, దీని కోసం డ్యాములు, కాలువలు కట్టాలని, ఇదంతా ఖర్చుని పెంచి, ప్రజా ధనం వృధా అయ్యేలా చేస్తుందని, అందుకే రాజధాని పై ఆలోచన చేస్తున్నామని, త్వరలో నిర్ణయం చెప్తామని బొత్సా అన్నారు. అయితే, ఈ విషయం పై రాజధాని రైతుల్లో ఆందోళన నెలకొంది. చంద్రబాబు వరల్డ్ క్లాస్ రాజధాని కడతారని భూములు ఇచ్చామని, ఆయన ఇప్పటికే పనులు మొదలు పెట్టారని, వీళ్ళు వచ్చి, ఇప్పుడు ఇలా చెప్తున్నారని ఆందోళన చెందుతున్నారు.

amaravati 21082019 2

దీని పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. అమరావతి కోసం ఖర్చు అవుతుందని ఆపేస్తాం అంటున్నారని, కాని అమరావతి కోసం, వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదని అన్నారు. 33 వేల ఎకరాల్లో అన్ని మౌలిక వసతులు ఇచ్చిన తరువాత, 8 వేల ఎకరాలు ప్రభుత్వనైకివ్ వస్తాయని, అవి అమ్ముకుంటే పైసా ఖర్చు లేకుండా, ప్రభుత్వం అమరావతి నిర్మాణం చెయ్యొచ్చని అన్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి పై అపోహలు ఉన్న వేళ, బొత్సా ఈ వ్యాఖ్యలు చెయ్యటంతో, రాజధానిని తరలించతం ఖాయం ఏమో అని, ప్రజలు అనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లో, కిషన్ రెడ్డిని, మీడియా ప్రతినిధులు, అమరావతి తరలింపు పై, కిషన్ రెడ్డిని అడిగారు.

amaravati 21082019 3

ఇలాంటి అంశాలు అన్నీ కేంద్ర హోమ శాఖ పరిధిలోకి వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చే విషయం పై, కేంద్రం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేసారు. అమరావతి పై మేము, ఏమి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర రాజధాని మార్పు అంశం పై, మా పరిధిలోకి రాదని అన్నరు. అలాగే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల పై ప్రశ్నించగా, హైదరాబాద్ ను రెండో రాజధాని చేసే ఆలోచన కేంద్రానికి లేదని కిషన్ రెడ్డి అన్నారు. మొత్తానికి, అటు అమరావతి, హైదరాబాద్ పై , కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయితే కేంద్రం చెప్పినా, వినని వ్యక్తి జగన్. చూద్దాం ఏమి చేస్తారో.

అమరావతిని మార్చేస్తారంట కదా ? మంత్రి బొత్సా ప్రకటన తరువాత, నిన్నటి నుంచి ఇదే చర్చ. అమరావతిని ప్రేమించే వారికి, ఇది నిజంగా చేదు వార్తా. అమరావతిని ద్వేషించే బ్యాచ్ కు మాత్రం, పండగ లాంటి వార్తా. అయితే అమరావతికి కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబు, ఈ వార్తలు విని, స్పందించారు. నిన్న కృష్ణా వరద వచ్చిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్న సామయంలోనే ఈ వార్త వచ్చింది. అప్పటికే ప్రజల మధ్య ఉన్న చంద్రబాబుకు, మంత్రి ప్రకటన పై, చంద్రబాబుకు బ్రీఫ్ చేసారు. అయితే, చంద్రబాబు ఈ వార్త విన్న వెంటనే, ప్రజల మధ్యకే వచ్చి స్పందించారు. ఇప్పుడే వార్తల్లో వస్తుంది, అమరావతి గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటూ మంత్రి బొత్సా మాట్లాడారు అంటూ, చంద్రబాబు స్పందించారు. వరదను కావాలని నిలుపదల చేసి, ఇప్పుడు వరద ప్రాంతం అనే ముద్ర వేసి, రాజధానిని తరలించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

cbn 21082019 2

ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3 టీఎంసీలు అయితే, అమరావతి ప్రాంతం, నా ఇల్లు ముంచాలని, 4 టీఎంసీల నీటిని బ్యారేజీలో నిల్వ ఉంచారు. అయినా అమరావతికి ఏమి అవ్వలేదు, నా ఇల్లు మునగలేదు. కాని, పేద ప్రజలని ముంచేసారు అని చంద్రబాబు అన్నారు. 4 టీఎంసీల నీటిని ఉంచి, ప్రకాశం బ్యారేజీనే ప్రమాదకర పరిస్థితులకు తీసుకువెళ్ళారని అన్నారు. నా ఇల్లు పొతే, ఆ ఇంటి ఓనర్ కు ఇబ్బంది, అక్కడ వస్తువులున్న నాకు ఇబ్బంది, కాని ఇప్పుడు మాకు ఏమి అవ్వలేదు కాని, పేదల కడుపు కొట్టారని అన్నారు. ఇంతా చేసి, అమరావతికి వరద ముప్పు ఉంది, దాని కోసం చాలా ఖర్చు పెట్టాలి, చాలా ఖర్చు పెడితే ప్రజాధనం వృధా అవుతుంది, అందుకే ఆలోచిస్తున్నాం అని ప్రభుత్వం చెప్తుందని, కాని ఇది తప్పు అని చంద్రబాబు అన్నారు.

cbn 21082019 3

అమరావతి కోసం, ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదని అన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా అమరావతి నిర్మాణానికి రైతులు 33వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని, గుర్తు చేసారు. అన్ని మౌలిక సదుపాయాలు, రైతులకు ఇచ్చే భూమి పోగా, ప్రభుత్వానికి 8 వేల ఎకరాలు మిగులుతుందని, ఆ భూమి అమ్ముకుంటే, రాజధాని నిర్మాణం తేలికగా పూర్తీ అవుతుందని అన్నారు. తరువాత, అదే ఆదాయం తెచ్చి, రాష్ట్రానికి గుండెకాయ అవుతుందని అన్నారు. కాని ప్రభుత్వానికి వేరే కుట్ర ఆలోచనలు ఉన్నాయని, అందుకే రాజధానిని మార్చే ఆలోచనతోనే, కుట్ర చేసి, ఇక్కడకు వరదలు వచ్చేలా ప్లాన్ చేసారని చంద్రబాబు అన్నారు. ఖర్చు ఎక్కువ అంటూ అమరావతిని పూర్తిగా నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై ఎంతవరకైనా పోరాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

20 రోజుల పాటు కృష్ణా నదికి కొట్టిన వరదలు ఆగిపోయాయి. కృష్ణమ్మ శాంతించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసుకు పోయాయి. అయితే ఒక్క చోట మాత్రం, ఒకే ఒక గేటు ఇంకా తెరిచే ఉంది. అక్కడ నుంచి సముద్రంలోకి నీరు వృధాగా పోతుంది. ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వెళ్ళిన ప్రజలకు, ప్రకాశం బ్యారేజీ దగ్గర అన్ని గేట్లు మూసుకుపోయి కనిపించినా, ఒక్క గేటు మాత్రం ఇంకా తెరిచే ఉంది. అక్కడ నుంచి నీళ్ళు వృధాగా కిందకు పోతున్నాయి. సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతున్నాయి. పులిచింతల గేట్లు మూసేసారు. ప్రకాశం బ్యారేజి గేట్లు మూసేసారు. అక్కడ 3 టియంసీ నీళ్ళు నిలువ చెయ్యాలి. కాని, ఇలా వృధాగా ఒక గేటు తెరిచి, ఎందుకు నీళ్ళు వాడులుతున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. ఊరికే నీళ్ళు సముద్రంలోకి వదిలేస్తున్నారని ప్రజలు బాధపడుతున్నారు.

barrage 21082019 2

అయితే, ఈ విషయం తెలియటంతో, నిన్న కృష్ణా జిల్లా కలెక్టర్ అక్కడకు వెళ్లి చూసారు. ప్రకాశం బ్యారేజీ 68వ పిల్లర్ వద్ద గేటు తెరిచి ఉందని, అక్కడ నుంచి నీళ్ళు వృధాగా పోతున్నాయని గమనించారు. విషయం పై ఆరా తీసారు. మొన్న వరదలకు ఒక పెద్ద ఇసుక బోటు వచ్చి, 68వ పిల్లర్ వద్ద ఇరుక్కు పోయింది. అయతే ఇప్పుడు వరద తగ్గటంతో, అది బయట పడింది. ఆ పెద్ద ఇసుక బోటు, వెళ్లి బ్యారేజీ గేటుని గట్టిగా గుద్దుకోవటంతో, అక్కడే ఇరుక్కు పోయింది. దీంతో, అన్ని గేట్లు వేసినా, ఈ గేటు మాత్రం కిందకు దిగటం లేదు. అక్కడ ఒక పెద్ద ఇసుక బోటు ఉండటంతో, వీలు కావటం లేదు. ఇసుక బోటు అంటే ఎదో పడవ లాగా ఉంది అనుకునేరు, దాదపుగా 25-30 లారీలకు సరిపడా ఇసుక తీసుకుచ్చెంత పెద్ద ఇసుక పడవ..

barrage 21082019 3

అయితే ఈ బోటు వల్ల గేటు కిందకు దిగటం లేదు అని తేల్చిన కృష్ణా జిల్లా కలెక్టర్, అక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. నీరు వృధాగా పోతుందని, తొందరగా, ఆక్కడ నుంచి బోటుని తియ్యాలని ఆదేశించారు. బోటు తొలగించే సమయంలో, బ్యారేజీ పిల్లర్లకు కానీ, గేట్లకు కాని నష్టం కలగకుండా చూడాలని అన్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు, ఇది కుట్ర కోణం కాదా ? అని ప్రశ్నించారు. మొత్తం ఇలాంటివి మూడు పెద్ద ఇసుక పడవలు, బ్యారేజీకి అడ్డంగా వేసారని, ఇప్పుడు అందులో ఒకటి బ్యారేజీకే ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. వీళ్ళు చేసే పనుల వల్ల, ఎలాంటి నష్టం వాటిల్లిందో చూడండి అంటున్నారు. బ్యారేజీకి అడ్డంగా బొట్లు వెయ్యటం పై, నారా లోకేష్ కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది కుట్ర కోణంలో చేసినా, పొరపాటున వచ్చినా, గత రెండు రోజుల నుంచి, అక్కడ పడవ ఉండటం వల్ల, నీళ్ళు సముద్రంలోకి వెళ్తున్నాయి. ప్రభుత్వం వెంటనే, అక్కడ నుంచి బోటు తీసి, బ్యారేజీ గేటు మూసే ప్రయత్నం చెయ్యాలి.

Advertisements

Latest Articles

Most Read