రాష్ట్రంలో ఎన్నికలు అయ్యి, మూడు నెలలు కూడా కాలేదు, అప్పుడే రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుని దించటానికి, అన్ని పార్టీలు కలిసి ఎలా పని చేసాయో చూసాం. ముఖ్యంగా బీజేపీ పెద్దన్న పాత్రలో, జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యటానికి, బీజేపీ ఎన్ని పావులు కదిపిందో, ఎన్ని క్యారక్టర్లు ఎంటర్ అయ్యయో, ఎన్ని తోక పార్టీలు పని చేసాయో, ఎన్ని క్యంపైన్లు నడిపారో, అన్నీ ప్రజలకు సుపరిచితమే. రాజకీయంగానే కాక, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో, సంస్థలను కూడా వాడుకుని, చంద్రబాబుని దించే ప్రయత్నం చేసారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్నికల ముందు వరకు, ఈవీఎంలు కూడా మ్యానేజ్ చేసారని చంద్రబాబు ఆరోపించారు కూడా. అయితే ఎన్నికల ఫలితాలు తరువాత మాత్రం, ఆ విమర్శలు చెయ్యలేదు.

jagan 20082019 1 2

ఇలా అన్ని విధాలుగా రాజకీయ ప్లాన్లు వేసి, చంద్రబాబుని దించి, జగన్ మోహన్ రెడ్డిని సియం పదవిలో ఎక్కించటంలో, బీజేపీ పాత్ర ఉందనేది అందరికీ తెలిసిందే. ఈ ప్లాన్లో భాగంగా, ఎన్నికల ముందు, జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ మతం మారి, హిందూ మతంలోకి వచ్చారని, బీజేపీ సోషల్ మీడియా టీం ప్రచారం చెయ్యటం కూడా అందరికీ తెలుసు. ఇందులో ప్రశాంత్ కిషోర్ టీం ఎంతో పని చేసింది. స్వరూపానంద, జగన్ తో కలిసి చేసిన పూజల వీడియో చూపించి, జగన మోహన్ రెడ్డి మతం మారారని ప్రచారం చేసారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సియం అయ్యారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరువెయ్యటానికి బీజేపీ ప్లాన్ వేసింది. ఇందులో భగంగా, గత నెల రోజుల నుంచి జగన్ మోహన్ రెడ్డిని స్లో గా టార్గెట్ చేస్తుంది బీజేపీ.

jagan 20082019 1 3

అయితే ఈ రోజు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ ఖాతా ద్వారా, సంచలన ట్వీట్ చేసింది. జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో, డల్లాస్ లో ప్రావాస భారతీయులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా, సభ మొదట్లో, జగన్ మోహన్ రెడ్డిని జ్యోతి వెలిగించమని నిర్వాహకులు కోరారు. అయితే జగన్ నిరాకరించారు. ఈ వీడియో బీజేపీ ఈ రోజు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. జగన్ మోహన్ రెడ్డి జ్యోతి వెలిగంచమంటే వెలిగించలేదని, హిందువులను ఎన్నికల ముందు జగన్ ఫూల్ చేసారని, అన్ని దేవాలయాలకు తిరిగి రాహుల్ గాంధీ లాగా నాటకాలు ఆడారని, ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ బాగా రాసారని, ఇవన్నీ చూసి బెంగాల్ రాష్ట్రం నేర్చుకోవచ్చు అంటూ సంచలన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో, జగన్ మోహన్ రెడ్డి పై, ఎలాంటి ధోరణితో రాజకీయంగా బీజేపీ ఎదుర్కుంటుందో అర్ధమవుతుంది.

అంతర్జాతీయ స్మగ్లర్‌, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై అలిపిరిలో జరిగిన దాడిలో, ప్రధాన పాత్ర పోషించిన, అంతర్జాతీయ స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డికి ఈ రోజు బెయిల్‌ మంజూరైంది. ప్రసుత్తం ఆయన కడప జైల్లో ఉన్నారు. ఈ రోజు బెయిల్ రావటంతో, మరి కొద్ది సేపట్లో ఆయన, కడప జైలు నుంచి విడుదల కానున్నారు. గంగిరెడ్డి 27 స్మగ్లింగ్ కేసుల్లో ఉన్నారు. ఆయన్ను చంద్రబాబు హయంలో పట్టుకున్నారు. విదేశాల్లో ఉండగా, ఇంటర్ పోల్ సాయంతో, అప్పటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు. 2015 నుంచి గంగిరెడ్డి కడప కేంద్ర కారాగారంలో ఉన్నారు. 2015 నుంచి 2017 వరకు గంగారెడ్డి జైలులో ఉన్నాడు. 2017 జనవరి నుంచి 2018 జనవరి వరకు పీడీ యాక్ట్ కింద గంగారెడ్డిని జైలులో ఉంచారు. 2018 నుంచి ఈ రోజు వరకు గంగారెడ్డిని రిమాండ్ ఖైదీగా ఉంచారు.

gangireddy 20082019 2

అరెస్ట్ జరిగింది ఇలా... ఎర్రచందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డి, ముందుగా కర్నూలు నుంచే విదేశాలకు పరార్ అయ్యాడు. 2014 మార్చి 3న వెల్దురి మండలంలో ఓ గోడౌన్‌లో దాదాపు రూ.80 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఈ కేసులో కర్నూలు జిల్లాకు చెందిన రమేష్‌రెడ్డి సహకారంతో గంగిరెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులుగుర్తించారు. దీంతో గంగి రెడ్డిని పట్టుకుని 2014 మే 5న పోలీసులు అరెస్టు చేశారు. అయితే 45 రోజుల పాటు కర్నూల్ జిల్లల, డోన్‌ సబ్‌ జైలులో ఉన్న గంగిరెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నార. అయితే స్థానిక కోర్ట్ బెయిల్ నిరాకరించింది. తరువాత హైకోర్టుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు గంగి రెడ్డి. అయితే బెయిల్ పై బయటకు రాగానే, నకిలీ పాస్‌పోర్టు, గుర్తింపు కార్డుతో దుబాయ్ పారిపోయాడు.

gangireddy 20082019 3

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఆయన సియం అయితే, తన బండారంతో పాటు, తన వెనుక ఉన్న వారు కూడా బయట పడతారని గ్రహించి, అతన్ని కొన్ని శక్తులు, దేశం దాటించాయి. అయితే తరువాత చంద్రబాబు సియం అయ్యారు. 2003లో అలిపిరి దాడిలో, గంగిరెడ్డి సహకారంతోనే మావోయిస్టులు తన పై దాడి చేసారని, ఇప్పుడు స్మగ్లింగ్ చేసి గంగిరెడ్డి వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారని, చంద్రబాబు నాయుడు గంగిరెడ్డి పరారీ కాగానే అప్పటి గవర్నర్‌ ఇఎల్‌ నర్సింహన్‌ కు గంగిరెడ్డి పై ఫిర్యాదు చేసారు ఫిర్యాదు చేశారు. అయితే చంద్రబాబు సియం అవ్వగానే, పోలీసులు ఈ కంప్లైంట్ పై సీరియస్ అయ్యి, అతని పై రెడ్ కార్నర్ నోటీస్ జరీ చేసారు. అదే సమయంలో గంగిరెడ్డి దుబాయ్ నుంచి మారిషస్‌కు వెళ్లడాని తెలుసుకుని, ఫిబ్రవరి 23, 2015న అరెస్టు చేశారు. ఇన్నాళ్ళకు జగన్ ప్రభుత్వం రాగానే, గంగిరెడ్డికి బెయిల్ లభించింది. అయితే ఇప్పటికే చంద్రబాబు భద్రత పై, జగన్ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవటం లేదు అంటున్న టిడిపి, గంగిరెడ్డి బయటకు రావటంతో, చంద్రబాబుకు ప్రాణహాని మరింత పెరిగిందని ఆరోపిస్తుంది.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, చంద్రబాబు ముద్రలు చేరిపేయాలని చూస్తూ, బాగా పని చేస్తున్న నవయుగ కంపెనీని, తీసేసి, కొత్త టెండర్ ను పిలవాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై అటు కేంద్రం కాని, ఇటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కాని మొదటి నుంచి గుర్రుగానే ఉన్నారు. అయినా సరే జగన్ ప్రభుత్వం మాత్రం, ముందుకే వెళ్తుంది. ఎందుకు ఇంత తొందర, కేంద్రం నిర్ణయం తీసుకునే దాకా ఎందుకు ఆగారు, అని ప్రశ్నించినా, మొండిగా ముందుకు వెళ్తున్నారు. దీంతో ఈ విషయం పై, కేంద్రం నిన్న సీరియస్ అయ్యింది. మా మాట వినండి అని చెప్పినా, 4 గంటల్లోనే రివర్స్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ జరీ చేసిన జగన్ ప్రభుత్వం పై, కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ విషయం పై పూర్తీ స్థాయి నివేదక మాకు ఇవ్వండి అంటూ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్కే జైన్‌ను కోరింది.

jagan 20082019 2

అయితే ఇప్పటికే ఈ విషయం పై జైన్, ప్రాధమిక నివేదిక కేంద్రానికి ఇచ్చారు. అలాగే తాను రాష్ట్రానికి రాసిన లేఖలు కూడా, కేంద్రానికి పంపించారు. అలాగే జైన్ తో కేంద్ర అధికారులు ఫోన్ లో కూడా మాట్లాడారు. ఈ రోజు, రేపటి లోపు , నివేదిక కేంద్రానికి ఇస్తామని చెప్పారు. బుధవారం, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ ఈ విషయం ద్రుష్టి పెట్టి, తగిన సూచనలతో, ప్రధానిని కూడా కలిసే అవకాసం ఉందని తెలిస్తుంది. అయితే జగన్ అనవసర పట్టుబదలతో, పరిస్థితి చేయి దాటుతుందేమో అని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే, మరో గంటలోనే, మరొక వార్తా రాష్ట్రాన్ని కలవర పెట్టింది. మమ్మల్ని అకారణంగా పోలవరం ప్రాజెక్ట్ నుంచి తప్పించారని, కారణం చెప్పకుండా తొలగించారని, నవయుగ కోర్ట్ కి వెళ్ళింది.

jagan 20082019 3

నవయుగ ఈ అడుగు వేస్తుందని, జగన్ ప్రభుత్వం భావించలేదు. వాళ్లకి రాష్ట్రంలో కాంట్రాక్టు లు కావాలంటే, ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటారు, అదీ కృష్ణపట్నం పోర్ట్ కూడా నవయుగ చేతిలో ఉంది కాబట్టి, వాళ్ళు ఇంత దూకుడుగా వెళ్తారని ప్రభుత్వం భావించలేదు. అయితే నవయుగ మాత్రం, మేము రికార్డు స్థాయిలో పని చేసి, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చాం, ప్రాజెక్ట్ ని దూకుడుగా చేసి, 73 శాతం పూర్తీ చేస్తే, మేము ఏ తప్పు చెయ్యకుండా, తప్పించారని, కోర్ట్ కు వెళ్లారు. పనులు మమ్మల్ని కొనసాగనించాలని, వేరే సంస్థకు అవకాసం ఇవ్వకుండా చూడాలని కోర్ట్ ని కోరారు. అయితే ఈ వరుస వివాదాల నేపధ్యంలో, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మరుగున పడేలా కనిపిస్తుంది. ఒక పక్క కోర్ట్ లో ఉండటం, అలాగే కేంద్రానికి మండి, మళ్ళీ వాళ్ళే ప్రాజెక్ట్ బాధ్యతలు తీసుకుంటే, ఇక పోలవరం ఇప్పుడప్పుడే అయ్యే అవకాశమే లేదు. చూద్దాం ఏమి జరుగుతుందో ?

అమరావతి అనే పేరు వింటేనే, మొదటి నుంచి వైసిపీ పార్టీకి వ్యతిరేకత. అమరావతిని అన్ని విధాలుగా చంద్రబాబు పైకి తేవాలని, ప్రపంచంలోనే మేటి నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలపాలని కలలు కన్నారు. దీనికి అక్కడ ప్రజలు కూడా సహకరించి, ఒక్క రక్తం బొట్టు కూడా చిందకుండా, 33 వేల ఎకరాలు ఇచ్చారు. ఇంత భూమి ప్రజలు, ప్రభుత్వానికి ఇవ్వటం, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ప్రణాళికలు తగ్గట్టుగానే, రోడ్లు వేసారు, ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ ల క్వార్టర్స్ నిర్మాణం పూర్తయింది. మరిన్ని నిర్మాణంలో ఉన్నాయి. శాశ్వత సచివాలయం, హైకోర్ట్ పనులు మొదలయ్యాయి. అయితే, ఈ నిర్మాణాలు జరుగుతున్నంత సేపు, వైఎస్ఆర్ పార్టీ, చివరకు జగన్ కూడా, అమరావతిని భ్రమరావతి అంటూ హేళన చేసారు. ఇక సాక్షిలో వచ్చిన కధనాలు అయితే, కోకొల్లలు. ఇలాంటి టైంలోనే, ప్రభుత్వం మారింది.

botsa 20082019 2

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అమరావతి నిర్మాణాలు ఆగిపోయాయి. అమరావతిని బూచిగా చూపించే ప్రతి సందర్భాన్ని వాడుకునే వైసిపీ పార్టీ, ఇప్పుడు మొన్న వచ్చిన వరదలను కూడా అలాగే వాడుకుంటుంది. మొన్న వరదలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. 20 రోజుల నుంచి వరద వస్తున్నా, సరైన వాటర్ మ్యానేజ్మెంట్ చెయ్యటం చేత కాక, కృష్ణా పరివాహక గ్రామాలను ముంచారు. అయితే ఇంత చేసినా, అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోకి వరదలు రాలేదు. ఎక్కడో 30 కిమీ దూరంలో ఉన్న అమరావతి గ్రామం మునిగితే, అది అమరావతి రాజధాని ప్రాంతం అని ప్రచారం చేసారు. అయితే ఈ ప్రచారాల మధ్యే, ఇప్పుడు ప్రభుత్వం తరుపున, మంత్రి బొత్సా మరో బాంబు పేల్చారు. రాజధాని పై కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని పై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని అన్నారు.

botsa 20082019 3

విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని పై త్వరలోనే ఒక ప్రకటన చేస్తామని అన్నారు. ఆ ప్రకటనలో పూర్తీ వివరాలు అందచేస్తామని అన్నారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని అన్నారు. బయట నిర్మాణాల కంటే, ఇక్కడ ఎక్కువ వ్యయం అవుతుందని బొత్సా అన్నారు. మొన్న వరదలతో, ఇక్కడ ప్రాంతం మునిగిపోతుందని అర్ధమవుతుందని అన్నారు. ఈ వరదలు రాకుండా చెయ్యాలి అంటే, కాల్వలు, డ్యామ్‌లు నిర్మించాల్సి ఉంటుందని, ఇది ప్రభుత్వానికి ఒక అదనపు భారం అని, ప్రజాధనం వృధా అవుతుందని బొత్సా అన్నారు. అందుకే ఇవన్నీ ఆలోచిస్తున్నామని అన్నారు. అయితే బొత్సా ప్రకటన విశ్లేషిస్తే, రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారా అనే అర్ధం వచ్చేలా ఉంది. ప్రజా ధనం వృధా అవుతుంది, చర్చిస్తున్నాం అంటున్నారు. మరో పక్క నిర్మాణాలు అన్నీ ఆపేశారు. ఇవన్నీ చూస్తుంటే, చంద్రబాబు మీద కోపంతో, మరో షాకింగ్ నిర్ణయం, త్వరలోనే ఏపి ప్రజలు వినబోతున్నారు అనిపిస్తుంది. వేచి చూద్దాం..

Advertisements

Latest Articles

Most Read