ఆమె తెలంగాణా తెలుగుదేశం పార్టీలో కీలక నేత.. ఎన్ని ఆటు పోట్లు వచ్చినా, తెలుగుదేశం పార్టీని విడవకుండా నిలబడ్డారు. అయితే, ఇక కమలం పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడి ఆమె తట్టుకోలేక పోయింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఒక భావోద్వేగపు లేఖ రాసారు. ఆ లేఖ చూస్తే, ఆమె ఎంత భారంగా పార్టీ వీడుతున్నారో అర్ధమవుతుంది. చంద్రబాబు వల్ల పదవులు పొంది, మంత్రులు అయ్యి, ఎమ్మెల్యేలు అయ్యి, చివరకు సియంలు కూడా అయ్యి, డబ్బు సంపాదించుకుని , చివరకు పార్టీ మారుతూ, చంద్రబాబుని తిట్టిన తిట్టకుండా వెళ్ళే వారే కాని, రేవంత్ రెడ్డి, సీతక్క తరువాత, అంతగా చంద్రబాబు పై కృతజ్ఞత చూపింది ఈమె. ఆమె, తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా నేత, బండ్రు శోభారాణి. పార్టీని వీడుతూ చంద్రబాబుకు రాసిన లేఖ ఇది....

bandru 150820192

"15 సంవత్సరాలుగా మీ వెన్నంటి ఉండి, మీతో కలసి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆహర్నిషలు ఓ సైనికురాలిగా పనిచేశా..పార్టీ అడుగు జాడల్లో నడుస్తూ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండ పాటించా..ఏలాంటి పదవులను ఆశించకుండా గ్రామాల్లోని నా పార్టీ కుటుంబ సభ్యులును కలసి మీరు చేస్తున్న అభివృద్ధి పనులను స్పష్టంగా వివరించాను. ఒకవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో కూడా పచ్చజెం డా భుజాన పెట్టుకొని పార్టీయేనా శ్వాసగా ముందు కుసాగాను. ఎన్నో ఆటు పోట్లు, తెలంగాణ ద్రోహులని ప్రజలు చీదరించుకున్నప్పటికినీ వెనుకడుగు వేయకుండా ముందుకు కదిలి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డకా కూడా పార్టీనే నమ్ముకొని ఇప్పటి వరకు కొనసాగాను. 15 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో నడవడం అదృష్టంగా భావిస్తున్నా..

bandru 150820193

ఎన్నో పార్టీ పదవులను కట్టబెట్టిన అధ్యక్షుడికి రుణపడి ఉంటాను. ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు చేసి పరిష్కారం దిశగా పాటుపడ్డాను, ఆలేరు ప్రజలతో మమేకమై సాగు తాగు జలాల కోసం పాదయాత్రలు, నిరసన దీక్షలు, జిల్లా ఏర్పాటుకై పాదయాత్ర, కరువు జిల్లా కోసం పోరాటంతో పాటు పలు ఉద్యమాలు నిర్వహించినా..రాజకీయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఆలేరు ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పాటుపడుతున్నా.. అధ్యక్ష అర్ధం చేసుకొని మన్నించు.. 15 సంవత్సరాల తెదేపా పార్టీని వీడిపోతున్నా..రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షురాలిగా పదవులతో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా..మీతో కలసి పనిచేశాను. ఇన్నేళ్లుగా ఆడబిడ్డగా ఆదరించారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వానికి ప్రత్నాన్మయం భాజపానే ఉంది. అందుకే కమలం వైపు అడుగులు వేస్తున్నానంటూ పార్టీ అధ్యక్షుడికి తన రాజీనామా పత్రాన్ని పంపించి తన తెదేపాలో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన దగ్గర నుంచి, జగన్ మోహన్ రెడ్డి, దేవుడు రాసిన స్క్రిప్ట్ అదిరింది అంటూ చంద్రబాబుని ఎద్దేవా చేస్తూ వచ్చారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా, ఇలాగే చంద్రబాబుకి దేవుడు అదిరిపోయే స్క్రిప్ట్ రాసారు అంటూ, విమర్శలు చేస్తూ వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా, ఇదే విషయం చెప్పారు. పదే పదే చంద్రబాబుని దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే, ఇలా ఎద్దేవా చేసే వాళ్లకి, ఈ రోజు అడిరిపోయే కౌంటర్ ఇచ్చారు. స్వంతంత్ర దినోత్సవం సందర్భంగా, నిన్న వెలగపూడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సెక్రటేరియట్ లకు, విద్యుత్ దీపాలతో అలంకరణ జరిగింది. లేజర్ లైటింగ్ తో, అసెంబ్లీ, సెక్రటేరియట్ మెరిసిపోతూ కనిపించాయి.

secretariat 15082019 2

ప్రతి సంవత్సరం, ఇండిపెన్డెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు కూడా, ఇలా విద్యుత్ దీపాలతో అలంకరణ జరిగిదే. చంద్రబాబు ఉన్న సమయంలో, ఇలా చేసే వారు. అయితే అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి, సాక్షి, వైసిపీ అమరావతిని ఎలా ఎద్దేవా చేసే వారో అందరికీ తెలిసిందే. అమరావతిని భ్రమరావతి అంటూ ఎగతాళి చేసి, తమకు అమరావతి పై ఉన్న ద్వేషం చూపించే వారు. అయితే ఇప్పుడే అదే అమరావతిలో ఉంటున్నారు అనుకోండి అది వేరే విషయం. సరిగ్గా ఇదే పాయింట్ పై చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ప్రతి సారి అమరావతిని భ్రమరావతి అని, అమరావతి మొత్తం గ్రాఫిక్స్ అని, అమరావతి మొత్తం సినిమా సెట్టింగ్ అని, ఇలా అనేక రకాలుగా ఎద్దేవా చేసిన అమరావతిలోనే జగన్ చేస్తున్న పనులు ఎత్తి చూపారు.

secretariat 15082019 3

అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలకు పెట్టిన లైటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, చంద్రబాబు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. "దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు... ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు." అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు. నిజంగానే చంద్రబాబు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది. గతంలో అమరావతి పై ఎంతో ద్వేషం చిమ్మి, తమ పత్రికల్లో, ఛానెల్స్ లో, అమరావతి పై బురద చల్లి, ఇప్పుడు అదే అమరావతిలో, అందంగా లైటింగ్ పెట్టి, జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, నిజంగా దేవుడి స్క్రిప్టే కదా...

ఈ రోజు ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో, జగన్ మోహన్ రెడ్డి పాల్గున్నారు. అయితే ఈ కార్యక్రమం చివరలో, అనుకోని సంఘటనతో, అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ముఖ్యంగా జగన్ భద్రతా సిబ్బంది, ఊహించని సంఘటన చూసి షాక్ అయ్యారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న సెక్యూరిటీ వేడుకల్లో, సెక్యూరిటీని దాటుకుని, జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు దూసుకెళ్ళారు చంద్రబాబు వీరాభిమాని. అయితే ఇది రాజకీయంగా ఎదో హాని చెయ్యటానికి మాత్రం కాదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పటానికి. దీని పై జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఇక విషయానికి వస్తే, విజయవాడకు చెందిన కోలా దుర్గారావు అనే వ్యక్తికి రెండు చేతులు లేవు.

kola 15082019 2

చిన్నప్పుడు ఎలెక్ట్రిక్ షాక్ తో, రెండు చేతులు పోయాయి. అయితే గతంలో చంద్రబాబు సియంగా ఉండగా, అతన్ని అన్ని విధాలుగా ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా, అమెరికా నుంచి సెన్సార్లతో పనిచేసే కృత్రిమ చేతులు తెప్పించి ఇచ్చారు. అదే విధంగా, దుర్గారావుకు ఉద్యోగం కూడా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు, ముందుకు వెళ్తున్న వేళ, ఎన్నికలు రావటం, ఎన్నికల కోడ్ రావటంతో, ఆ హామీని చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. ఇదే విషయాన్ని ఈ రోజు అతి కష్టం మీద జగన్ ను కలిసి, దుర్గారావు చెప్పారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు , తనకు ఇచ్చిన హామీని ఇప్పుడు అధికారంలో ఉన్న మీరే తీర్చాలని అతను జగన్ కు కోరారు. తనకు రెండు చేతులు లేవని, ఆదుకోవాలని కోరారు. అయితే ఈ విషయం పై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారికి జగన్ ఆదేశాలు జారీ చేశారు.

kola 15082019 3

దుర్గారావు నేపధ్యం చూస్తే, అతను విజయవాడలోని రాజరాజేశ్వరీపేట వాస్తవ్యుడు. అయితే చిన్నప్పుడే ఊహించని రీతిలో తన రెండు చేతులను కోల్పోయాడు. చిన్న వయసులో గాలిపటం కోసం కరెంట్ స్తంభం ఎక్కి ప్రమాదానికి గురయ్యాడు. కరెంట్ తీగలపై పడటంతో, రెండు చేతులు తెగిపోయాయి. అయితే రాను రాను క్రీడల్లో బాగా రానిస్తూ మంచి పేరు సంపాదించాడు. అయితే సంఘటన జరిగిన తరువాత, చంద్రబాబుకు విషయం తెలియటంతో, పదేళ్ళ క్రితమే అతనికి చంద్రబాబు సహాయం చేసారు. తరువాత చంద్రబాబు 2014లో అధికారంలోకి రావటంతో, 2018 సమయంలో దుర్గారావు చంద్రబాబుని వచ్చి కలిసి, డిగ్రీ చదివాను అని, క్రీడల్లో బాగా రానిస్తున్నాని, తన జీవినం సాగించాటానికి ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని కోరగా, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశాలు చూడాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే ఎన్నికల కోడ్ రావటం, ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, చంద్రబాబు ఇచ్చిన హామీని, మీరు నెరవేర్చాలని జగన్ ను కోరారు. మరి జగన్ గారు, ఎదో చూడమనటం కాకుండా, నిజంగా అతనికి ఉద్యోగం ఇవ్వాలని ఆశిద్దాం.

తెలుగు సినీ ఇండస్ట్రీ, తెలుగు రాజకీయాలు, రెండిటికీ దగ్గర సంబంధాలు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి, ఏకంగా సియం అయ్యి, దేశ రాజకీయాలనే శాసించారు ఎన్టీఆర్. అలాగే అనేక మంది సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వారు పార్టీలు పెట్టారు. ఇలా తెలుగు సినిమాకు, రాజకీయాలకు ఎప్పుడూ దగ్గర సంబంధాలు ఉన్నాయి. అయితే సామాన్య ప్రజలు లాగానే, సినిమా వాళ్ళు కూడా, ఒక పార్టీ వైపు మొగ్గు చూపటం చాలా సహజం. ఎవరు అధికారంలో ఉన్నా, మనకు ఇష్టం లేని వాళ్ళు అధికారంలో ఉన్నా, వారికి గౌరవం ఇవ్వాల్సిందే. అయితే, వైసీపీ నేత, సినీ ఆర్టిస్ట్ పృధ్వీ మాత్రం, ఎందుకో కాని, మొదటి నుంచి, సినీ ఇండస్ట్రీకి, జగన్ మోహన్ రెడ్డికి గ్యాప్ పెంచటానికి, ప్రయత్నం చేస్తున్నాడు.

prudhvi 15082019 2

ఇది కావాలని ప్లాన్ ప్రకారం జరుగుతుందా, లేక తెలియని తనంతో, జగన్ మీద పిచ్చ అభిమానంతో చేస్తున్నాడో అర్ధం కావటం లేదు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుని బాగా తిట్టినందుకు, జగన మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, 30 ఇయర్స్ పృధ్వీ కోసం, తిరుమల తిరుపతి దేవస్తానం ఛానల్ కు చైర్మెన్ గా చేసారు. ఈ సందర్భంలో, ఆ ప్రమాణస్వీకారం అయిన తరువాత, పృధ్వీ మీడియాతో మాట్లాడుతూ, తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దల పై విరుచుకు పడ్డారు. తెలుగు సినీ ఇండస్ట్రీ వాళ్లకు జగన్ అంటే గౌరవం లేదని, ఇప్పటి వరకు వచ్చి జగన్ ను ఎందుకు కలవలేదు, ఎందుకు సన్మానం చెయ్యలేదు అని పృధ్వీ ప్రశ్నించారు. దీని పై అగ్ర నటుడు రాజేంద్ర ప్రసాద్, తిరుమల వచ్చినప్పుడు స్పందించారు.

prudhvi 15082019 3

మేమేమీ పెట్టుబడిదారులం కాదని, జగన్ మోహన్ రెడ్డిని సియం అయిన సందర్భంగా అందరం అభినందించామని, అవసరం ఉన్నప్పుడు, ఆయన అవకాసం ఇచ్చినప్పుడు వెళ్లి కలుస్తామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మరి ఈ మాటలో పృధ్వీ గారికి ఏమి తప్పు కనిపించిందో కాని, ఈ రోజు మరింతగా విరుచుకు పడ్డారు. జగన్ ను సినీ పెద్దలు కలిసి విష్ చెయ్యలేదు అని మాత్రమే తాను చెప్పానని పృథ్వీ తెలిపారు. ఈ విషయంలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పారు. . ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఎవరు విమర్శించినా తాట తీస్తానని హెచ్చరించారు. మొత్తానికి, లేని రచ్చను లేపి, సినీ ఇండస్ట్రీకి, ఏపి ప్రభుత్వానికి గొడవ పెట్టేలా ఉన్నాడు పృధ్వీ. జగన్ కలగ చేసుకుని, కొంచెం తగ్గమంటే కాని, ఈయన తగ్గేలా లేడు.

Advertisements

Latest Articles

Most Read