నిన్న హైకోర్ట్ లో నవయుగ వేసిన పిటీషన్ పై, జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. జల విద్యుత్ ప్రాజెక్ట్ ను నవయుగకి రద్దు చేస్తూ, కొత్తగా టెండర్ పిలవాలని జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, నవయుగ కోర్ట్ కి వెళ్ళింది. దీని పై విచారణ జరిపిన కోర్ట్, నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, జగన్ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ జెన్కో కు, నవయుగకు మధ్య ఒప్పందం జరిగింది కదా, ఏపీ జెన్కో ప్రభుత్వ సంస్థ అయినా, ఒకసారి ఒప్పందం జరిగిన తరువాత, ఏపీ జెన్కో కు సంబంధం ఉంటుంది కాని, ఏపి ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం ఉండదు అని కోర్ట్ తెలిపింది. ఒక వేళ ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు ఇచ్చినా, ఏపీ జెన్కో ఒప్పందంలో ఉన్న అంశాలకు మాత్రమే లోబడి ఉండాలని కోర్ట్ చెప్పింది.

court 23082019 2

కాంట్రాక్టర్ కంపెనీ సరిగ్గా పని చెయ్యలేదు అంటున్నారు, దాని పై ఇప్పటికి వరకు చర్చించారా ? సరిదిద్దే ప్రయత్నం చేసారా అని కోర్ట్ ప్రశ్నించింది. ఒప్పందం కనుక ఉల్లంఘన జరిగితే, ఇవన్నీ చెయ్యాలి, మరి ఇక్కడ అది జరిగినట్టు కనిపించటం లేదని కోర్ట్ పేర్కొంది. ఇక మరో పక్క నవయుగ పనుల్లో అసలు పురోగతి లేదు అంటూ, ప్రభుత్వం చేసిన వాదన పై కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక విధంగా ప్రభుత్వం, తప్పుదోవ పట్టించింది అంటూ వ్యాఖ్యలు చేసింది. కాంట్రాక్టు రద్దు చెయ్యాలని ప్రభుత్వం రాసిన లేఖకు, నవయుగ ఒక లేఖ రాసింది, ఆ లేఖ చూస్తే పనులు వేగంగా జరుగుతున్నాయని అర్ధం అవుతుంది కదా అని కోర్ట్ ప్రశ్నించింది. నవయుగ పనులు చెయ్యటంలో పూర్తిగా విఫలం అయ్యింది అంటూ, ఏజీ వాదనలు వినిపించారు.

court 23082019 3

కాని కోర్ట్ మాత్రం, ఆ లేఖ చూపిస్తూ, నవయుగ పనుల్లో గణనీయమైన పురోగతి చూపినట్టు తెలుస్తుంది. ఇంజనీరింగ్‌ పనుల్లో 98 శాతం, సివిల్‌ పనుల్లో 75 శాతం పూర్తయ్యాయని తెలుస్తోంది కదా అని కోర్ట్ ప్రశ్నించింది. మరో పక్క, ఒప్పందంలోని క్లాజ్‌ 13.1 ప్రకారం ఒప్పందం రద్దుకు ఉన్న నిర్దిష్టమైన విధానాన్ని ఇక్కడ పాటించలేదు అని హైకోర్ట్ పేర్కొంది. నవయుగకి కాంట్రాక్టు రద్దు చేస్తూ జెన్కో తీసుకున్న నిర్ణయంలో, చట్ట నిబంధనలకు తగ్గట్లుగా లేవని హైకోర్ట్ పేర్కొంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ విషయంలో జోక్యం చేసుకోవటం పైనా, కోర్ట్ అక్షింతలు వేసింది. ఈ విషయం ఒప్పందం జరిగింది అని, ఏపీ జెన్కో కు నవయుగకి సంబందించిన విషయం అంటూ, కోర్ట్ ఒక రకంగా ఏపి ప్రభుత్వాన్ని తగ్గమని చెప్పింది. మరి ఈ విషయంలో జగన ఏ నిర్ణయం తీసుకొంటారో చూడాలి.

వారం క్రితం, కృష్ణా నదికి వచ్చిన వరదలతో, గుంటూరు, కృష్ణా లంక గ్రామాలు మునిగిన సంగతి తెలిసిందే. అనేక ఎకరాల్లో పంటకి కూడా నష్టం జరిగింది. అయితే, వరద కష్టాల పై, అక్కడ స్థానికలు అనేక వీడియోలు తీసి వారి బాధని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంత చిన్న పాటి వరదకు కూడా, ఇళ్ళు, పొలాలు మునగటంతో, ప్రభుత్వ చేతకాని తనాన్ని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని, నీటి పారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, ప్రతి విషయంలోనూ రాజకీయం చేసే రాజకీయ పార్టీలు, వరద బాధితులు ఇబ్బందులు పడుతూ, తిట్టిన తిట్లలో కూడా, కులం చూస్తూ, రాజకీయం చేసారు. గుంటూరు జిల్లా, కొల్లూరు మండలం, తిప్పలకట్ట గ్రామానికి చెందిన సోమశేఖర్ చౌదరి అనే రైతు, వరద దుస్థితి పై ఒక వీడియో పెట్టారు.

sekhar 23082019 2

అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మా ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణం అని అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్లకు ఏమి తెలియదని, వాళ్ళని తీసుకువచ్చి మినిస్టర్లను చేస్తే ప్రజలు ఇలాగే ఇబ్బందులు పడతారని అన్నారు. ఈ క్రమంలో అనిల్ కుమార్ ని, గేదలు కాచుకునేవాడు అంటూ సంబోధించారు. అంతే వైసిపీ ఈ పాయింట్ పట్టుకుని రచ్చ రచ్చ చేసింది. కడుపు మండి మాట్లాడిన వ్యక్తి కమ్మ కులం కవటం, అనిల్ కుమార్, యాదవ్ కులం కావటంతో, మంట రేపారు. అందునా ఈ సోమశేఖర్ రైతు మాత్రమే కాకుండా, పొలం పనులు లేనప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా వేషాలు కూడా వేస్తూ ఉండటం వైసిపీకి కలిసి వచ్చింది. జూనియర్ ఆర్టిస్ట్ లకు తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చి, ఒక కులాన్ని తిట్టిస్తుంది అంటూ, సమస్యను పూర్తిగా తప్పుదోవ పట్టించారు.

sekhar 23082019 3

టిడిపి ఎన్నికల ప్రచారంలో ఒక యాడ్ లో ఉన్న వ్యక్తి, ఇతనే అంటూ ప్రచారం చేసారు. అలాగే మరో మహిళను కూడా ఇలాగే యాడ్ లో ఉన్న వ్యక్తి అంటూ ప్రచారం చేసారు. అయితే ఆ మహిళ, వెంటనే ఖండించింది. నేను విజయవాడ రామలింగేశ్వర నగర్ కు చెందిన వ్యక్తిని అని, కూలి పనులు చేసుకునే వాళ్ళం అని, వరదల్లో ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని ప్రశ్నిస్తే, పైడ్ ఆర్టిస్ట్ అంటారా అంటూ మండి పడింది. ఇదే విషయం పై టిడిపి రెండు వీడియోలను పెట్టి వైసిపీని ఎండగట్టింది. అయితే ఇప్పుడు సోమశేఖర్ కూడా ఈ ప్రచారం పై మండి పడుతున్నారు. నేను ఆర్టిస్ట్ నే కాని, ఎప్పుడు కూడా టిడిపి యాడ్ లో నటించాలేదని అన్నారు. అసలు ఆ వ్యక్తికి నాకు , పోలికలు ఎక్కడ ఉన్నాయని అన్నారు. ఇలాంటి దిగజారుడు ప్రచారాలు మానుకోవాలని అన్నారు.

మా పంట మునిగిందని అనే ఆవేదనలో, అనిల్ కుమార్ యాదవ్ పై మండి పడ్డామని, దీంట్లో కూడా కులం చూస్తున్నారని అన్నారు. అయినా, నా మాటలు బాధించి ఉంటే, యదావ కులానికి క్షమాపణలు చెప్తున్నా అని అన్నారు. మా పొలాలు అన్నీ మునిపోయాయని, దీని పై వైసిపీ ఏమి చెప్తుందని అన్నారు. నేను పొలం పనులు లేనప్పుడు, హైదరాబాద్ వెళ్లి పొట్ట కూటి కోసం, సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తానని, ఎప్పుడూ టిడిపి యాడ్ లో నటించాలేదని అన్నారు. నా పై, వీడియోలో నా వెనుక ఉన్న వాళ్ల పై కూడా కేసులు పెట్టారని, ఇప్పటికే వారిని అరెస్ట్ చేసారని, విజయవాడలో వేదిస్తున్నారని, నా కోసం వెతుకుతున్నారని, పంటలు చనిపోతే మనిషి పోయినంత బాధ ఉంటుందని, అలాంటిది నా పంటను, ప్రభుత్వం చేతకాని తనంతో చంపేస్తే, కడుపు మండి వాళ్ళని ప్రశ్నిస్తే, కేసులు పెట్టి వేదిస్తున్నారని, ఏవో వీడియోలు పెట్టి, నేనే అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

పవిత్ర తిరుమలలో మరోసారి, అన్యమత ప్రచారంతో కలకలం రేగింది. పవిత్రమైన తిరుమల కొండ పై, వేరే మతాల ప్రచారం చెయ్యటం నిషేధం అని తెలిసిందే. అయితే, గత రెండు నెలల నుంచి, ఎదో ఓక అంశంలో తిరుమల వార్తలకు ఎక్కుతూనే ఉంది. అయితే ఈ రోజు తిరుమలలో జరిగిన అన్యమత ప్రచారంతో, ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ఇంకా చెప్పే విషయం ఏమిటి అంటే, ఏకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో, ఏకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మైనారిటీ శాఖ ఈ ప్రకటన ఇవ్వటంతో, అక్కడ ఉన్న ప్రజలు అవాక్కయ్యే పరిస్థితి వచ్చింది. ఇది తిరుమల కొండ అనుకుంటున్నారా,ఏంటి అంటూ, భక్తులు ఆందోళన చెయ్యటంతో, అధికారులు ఎంటర్ అయ్యి, జరిగిన విషయం పై ఆరా తీసారు. పొరపాటు అయ్యింది అని, మరోసారి జరగకుండా చూస్తామని అన్నారు.

tirumala 22082019 2

విషయం ఏమిటి అంటే, ఈ రోజు తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే బస్సుల్లో ఇచ్చిన టికెట్ల వెనుక, భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ దర్శనమిచ్చాయి. ఈ యాడ్స్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, మైనారిటీ సంక్షేమ శాఖ. అయితే ఇవి చూసిన భక్తులు, వెంటనే గొడవ మొదలు పెట్టారు. తిరుమల కొండ పై అన్యమతాల ప్రచారం పై నిషేధం ఉన్నా, జరూసలేం యాత్రల పై ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ఆందోళనకు సిద్ధం అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ, ఏకంగా ప్రభుత్వమే ఇలా యాడ్స్ ఇస్తే ఎలా అంటూ నిలదీసారు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు చేస్తే అనుకోవచ్చు, ప్రభుత్వమే ఇలా చెయ్యటం హేయం అని, హిందువుల మనోభావాలతో పని లేదా అని ప్రశ్నించారు.

tirumala 22082019 3

అయితే ఈ ఘటన పై భక్తుల ఆందోళన తీవ్రం అవ్వటంతో, ఆర్టీసీ డిపో మేనేజర్ రంగంలోకి దిగారు. వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన టికెట్ రోల్, పొరపాటున తిరుమల వచ్చిందని ఆర్టీసీ డిపో మేనేజర్ అన్నారు. భక్తుల ఫిర్యాదుతో టికెట్ రోల్ అధికారులు మార్చేసారు. తిరుమల రాంబగీచా బస్టాండ్ టికెట్ కౌంటర్‍లో ఈ ఘటన జరిగింది. అయితే, అధికారుల సమాధానం పై భక్తులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పొరపాటున వచ్చింది కాదని, దీని వెనుక ఎవరో ఉన్నారని అంటున్నారు. తిరుమల లాంటి చోట, పోరపాటున ఇలాంటివి జరగవని అంటున్నారు. మరోసారి ఇలాంటివి జరిగితే, తీవ్రంగా ఉంటాయని, హిందూ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే, జగన్ యాంటీ హిందూ అంటూ ప్రచారం మొదలు పెట్టిన బీజేపీ, దీని పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నేతల పై కక్ష సాధింపు కొనసాగుతుంది. మొన్నటి మొన్న, చంద్రబాబు తన క్యాంపు ఆఫీస్ గా ప్రజా వేదిక ఇవ్వమని అడిగారని, రాత్రికి రాత్రి నిబంధనలు పేరుతొ, దాన్ని పదాగొట్టేసారు. అలాగే రాష్ట్రంలో వివధ చోట్ల తెలుగుదేశం నేతలకు చెందిన భవనాలు టార్గెట్ గా చేసుకుని, పడగొట్టారు. టీడీపీ నేత, మాజీ ఎంపీ మురళీ మోహన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందుకు సంబంధించిన భవనాలు కూల్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వంతు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావుది. విశాఖపట్నంలో గంటా శ్రీనివాస్ రావుకు సంబంధించి, పలు భవనాలు కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భీమిలోని గంటా శ్రీనివాస్ క్యాంపు ఆఫీస్ సహా, పలు భవనాలు కూల్చివేతకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. అయితే, కేవలం 24 గంటలు నోటీస్ ఇచ్చి, కొట్టేస్తున్నాం అని చెప్పటం కక్ష సాధింపు అంటూ తెలుగుదేశం ఆరోపిస్తుంది.

ganta 23082019 2

విశాఖ పరిధిలోని భీమిలిలో, టౌన్‌ సర్వేనంబర్‌ 442లో గంటా కుమార్తె గంటా సాయిపూజిత పేరుతో నిర్మించిన జి+2 భవనాన్ని గంటా శ్రీనివాస్ ఆయన క్యాంప్‌ కార్యాలయంగా వాడుకుంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే, ఈ భవనానికి అనుమతి లేదు, మేము కూల్చేస్తున్నాం అని నోటీస్ ఇవ్వటానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో, ఆ భవనం ఉన్న గోడకు, నోటీస్ అంటించి వెళ్లారు. దీని పై, గంటా హైకోర్ట్ కు వెళ్లారు. దీని పై హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. ఈ విషయం పై హైకోర్ట్, జీవీఎంసీ అధికారులను వివరణ కోరింది. ఆ సమయంలో జీవీఎంసీ అధికారులు, ఇది అక్రమ భవనం అని, అందుకే దీన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ganta 23082019 3

అయితే దీని పై కోర్ట్ స్పందిస్తూ, అన్ని వివరాలు చూడాలని, అప్పటికీ కూల్చేయాలి అనుకుంటే, వారం ముందు ఆ భావన యజమానికి నోటీసు ఇచ్చి, ఆ భవనంలోని వస్తువులకు ఇబ్బంది లేకుండా చూసుకుని, అప్పుడు నిర్ణయం తీసుకోవాలని కోరింది. అయితే, జీవీఎంసీ అధికారులు మాత్రం, కేవలం 24 గంటలు నోటీస్ ఇచ్చి, భవనం కాళీ చెయ్యండి, లేకపోతె, కొట్టేస్తాం అంటూ నోటీస్ ఇచ్చారని గంటా వర్గం ఆరోపిస్తుంది. ఇప్పటికే భవన నిర్మాణం, క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నామని, దాని పై ఏమి స్పందించకుండా, రాజకీయ కక్షతోనే తన భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారని గంటా ఆరోపించారు. ఒక వేళ కూల్చాలి అనుకున్నా, కొంత టైం ఇవ్వాలి కదా, రాత్రి నోటీస్ ఇచ్చి, ఉదయం కొట్టేస్తాం అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read