గత రెండు నెలల నుంచి జగన్ మొహన్ రెడ్డికి ఒకే ఒక టార్గెట్. చంద్రబాబుని ఎదో ఒక అవినీతి కేసులో ఇరికించాలి. దీని కోసం జగన్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సెక్రటేరియట్ కు వెళ్ళిన మొదటి రోజే, అక్కడి ఉద్యోగులకు ఒక ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు చేసిన అవినీతి ఉంటె చెప్పండి, మిమ్మల్ని సన్మానిస్తాం అని. ఇప్పటికి రెండు నెలలు అయినా, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇక తన పరిధిలో అన్ని ఫైల్స్ తిరగేస్తున్నారు. చంద్రబాబు పై చాలా కమిషన్ లు వేసారు. మరో 15 రోజుల్లో మొత్తం బయట పెడతా అని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదే కోవలతో చంద్రబాబు హయంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాల పై జగన్ పట్టుదలగా ఉన్నారు. ఎవరు చెప్పారో కాని, ఈ విషయం మాత్రం వదిలి పెట్టటం లేదు. అటు కేంద్రం కూడా , ఈ విషయంలో రెండు లేఖలు రాసింది.

current 22072019 2

విద్యుత్ ఒప్పందాలు, రెగ్యులేటరీ కమిషన్ చేస్తుందని, దీంట్లో అవినీతి ఆస్కారం ఉండదని, పెట్టుబడిదారులను భయపెట్టద్దు అని వార్నింగ్ ఇచ్చింది. అయినా జగన్ ఎదో జరిగి పోయింది అనే భ్రమలో ముందుకే వెళ్తున్నారు. ఈ నేపధ్యంలోనే, ఈ రోజు విద్యుత్ ఒప్పందాల పై ఉన్నతస్థాయి సమీక్ష చేస్తున్నామని, ఈ సమీక్షకు హాజరుకావాలని, ఒప్పందాలు చేసుకున్న అన్ని విద్యుత్ కంపెనీలను ప్రభుత్వం సమీక్షకు ఆహ్వానించింది. వీరందిరనీ వెలగపూడి సచివాలయాని రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. అయితే, ఈ సమీక్షకు మేము హాజరు కావటం లేదని, కేంద్ర సంస్థలు అయిన, ఎన్టీపీసీ, ఎస్‌ఈసీఐ నిర్ణయం తీసుకుంటూ, వారి నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలిపాయి. అంతే కాదు, జగన్ ప్రభుత్వం ఇలాగే మొండిగా వెళ్తే, కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి.

current 22072019 3

మా ఒప్పందాలు కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేస్తే, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రెండు కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ప్రైవేటు కంపెనీ అయిన గ్రీన్ కో, ప్రభుత్వ వైఖరి పై ట్రిబ్యునల్ కు వెళ్ళటంతో, జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టి, ట్రిబ్యునల్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వానికి అటు కేంద్రం కాని, ఇటు బిజినెస్ వర్గాలు, ఫిచ్ రేటింగ్స్, ఇలా అనేక మంది హెచ్చరికలు జారీ చేసారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని, పెట్టుబడి దారులు వెళ్లిపోతారని, హెచ్చరించారు. ఎవరు ఎన్ని చెప్పినా, జగన్ మాత్రం, నేను సమీక్ష చేస్తాను, ఉండే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు అనే ధోరణిలో, కేవలం చంద్రబాబుని టార్గెట్ చేసుకుని వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే జగన్ ప్రభుత్వానికి పవర్ షాక్ తప్పదేమో ?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎలా అయినా అధికారంలోకి వచ్చేయాలని బీజేపీ తహతహలాడుతుంది. ఇందు కోసం అన్ని ప్లాన్లతో రెడీ అయ్యి, రంగంలోకి దిగింది. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పగ్గాలు తమ చేతికి రావాలని బీజేపీ అనుకుంటుంది. తెలంగాణాలో అయితే అధికారం ఖాయంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, అధికారంలోకి రాకపోయినా, ప్రతిపక్ష హోదా మాత్రం సంపాదిస్తామని చెప్తున్నారు. తెలంగాణాలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలు బలహీనంగా ఉన్నాయని, వాళ్ళ స్థానం కైవసం చేసుకోవటానికి, ఇదే మంచి అవకాసం అని బీజేపీ నమ్ముతుంది. తెలంగాణాలో అటు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేసిన బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసింది.

ryapati 22072019 2

ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు దెబ్బ పడితే తెలుగుదేశం మళ్ళీ కోలుకోలేదని బీజేపీ అంచనా వేస్తుంది. ఇందులో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను లాగేశారు. అయితే, నాయుకులను లాగినంత మాత్రానా, తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏమి ఉండదు. ఈ నాయకులు కూడా గ్రౌండ్ లెవెల్ తో సంబంధం లేని వాళ్ళు. గట్టిగా ఒక వార్డ్ లో కూడా గెలవలేని నాయకులు. ఈ నేపధ్యంలోనే వారం రోజుల క్రిందట రాంమాధవ్, గుంటూరు జిల్లా నేత, మాజీ ఎంపీ రాయపాటి ఇంటికి వెళ్లి, బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే అప్పుడు రాయపాటి మాత్రం, ఏ నిర్ణయం ప్రకటించలేదు. త్వరలోనే ఢిల్లీ వచ్చి, అన్ని విషయాలు అక్కడ మాట్లాడతాఅని చెప్పారు. రాయపాటి ఢిల్లీ అయితే వెళ్ళలేదు కాని, ఈ రోజు తిరుమలలో మాత్రం కీలక ప్రకటన చేసారు.

ryapati 22072019 3

తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాయపాటి, తాను త్వరలోనే బీజేపీ పార్టీలో చేరుతున్నా అని మీడియాకు చెప్పారు. తాను ఎవరితో సంప్రదింపులు జరపలేదని, మోడీ పాలన నచ్చి, బీజేపీలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నా అని చెప్పారు. అయితే గత వారం రాంమాధవ్, రాయపాటిని కలిసిన విషయం, ఆ ఫోటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రాం మాధవ్ ని కలిసిన మరుసటి రోజే, రాయపాటి, చంద్రబాబుని కలిసి విషయం చెప్పారని, బీజేపీ ఒత్తిడులు తట్టువాలి అంటే, పార్టీ మారక తప్పదు అని చెప్పటంతో, చంద్రబాబు కుద, మీ ఇష్టం అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే రాయపాటి పార్టీ మార్పు పై మాత్రం, టిడిపి కార్యకర్తలు మరో రకంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతే, పార్టీకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారని, చంద్రబాబు ఎలాగూ వీళ్ళను దూరం పెట్టలేరని, వీళ్ళే వెళ్ళిపోతే, చంద్రబాబు కొత్త వారికి అవకాసం ఇస్తారని, పార్టీకి నూతన రక్తం వస్తుందని టిడిపి కార్యకర్తలు అంటున్నారు.

అమరావతికి రుణం ఇవ్వం అంటూ కొద్ది రోజులుగా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై ఎవరికీ వారు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ మీడియా అయితే, కేవలం చంద్రబాబు వల్లే ఈ రుణం ఆగిపోయింది అని, చంద్రబాబు అమరావతిలో అవినీతి చేసారని, అందుకే రుణం ఆపేసారని, చంద్రబాబు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిన విషయం ప్రపంచ బ్యాంకుకు తెలిసిపోయి, రుణం ఆపేసారని. విష ప్రచారం చేసారు. అయితే ఈ వాదనలకు తెర దింపుతూ ప్రపంచ బ్యాంక్ ఈ రోజు ఒక ప్రకటన విడుదుల చేసింది. రుణం ఆపటానికి కారణం, భారత ప్రభుత్వం అంటూ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది. అమరావతికి రుణం ఇచ్చే ప్రతిపాదనను కేంద్రం ప్రభుత్వం జూలై 15 వ తారీఖున వెనక్కు తీసుకుందని, అందుకే రుణం ఇవ్వలేం అని చెప్పామని చెప్పింది.

wb 21072019 2

అయితే రాజధాని అమరావతి ప్రాజెక్ట్ నుంచి మాత్రమే తప్పుకున్నాం అని , ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో మేము, మా సహయం కొనసాగిస్తాం అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ వివిధ రంగాలు అయిన, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఇప్పటికే అనేక బిలియన్‌ డాలర్ల రుణ సహాయం అందించామని, ఇది ఎప్పటికీ కొనసాగిస్తామని చెప్పింది. ఆరోగ్యం విషయంలో గత నెలలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాం అని చెప్పింది. అయితే ఈ విషయం పై గత రెండు రోజులుగా చంద్రబాబు టార్గెట్ గా వైసిపీ ఆడిన ఆటలు అన్నీ అబద్ధం అని తేలిపోయింది. వైసిపీ నేతలు, చంద్రబాబు వల్లే అమరావతికి రుణం ఇవ్వలేదంటూ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు.

wb 21072019 3

అయితే అది తప్పుడు ప్రచారం అని తేలింది. మరో పక్క, ఈ రోజు జగన్ మీడియాలో బ్యానేర్ ఐటెంగా, అమరావతి రుణం పై వండి వార్చారు. చంద్రబాబు అవినీతి వల్లే అమరావతికి రుణం ఇవ్వలేదని చెప్పి, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జగన్ విజన్ కు ఆకర్షితులు అయ్యారని చెప్పింది. అంతే కాదు, జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రపంచ బ్యాంకుకు ఎంతో నచ్చాయని, వాటికి రుణం ఇవ్వటానికి ప్రపంచ బ్యాంక్ సిద్దంగా ఉందని చెప్పింది. నిజానికి ప్రపంచ బ్యాంక్ ఇలాంటి పధకాలకు రుణం ఇవ్వదు. అయితే, ఇప్పుడు ఏకంగా ప్రపంచ బ్యాంక్ ప్రకటన విడుదల చెయ్యటం, కేంద్రం వల్లే మేము ఇవ్వలేక పోయామని చెప్పటం, భవిష్యత్తు ప్రాజెక్ట్ ల గురించి చెప్పటంతో, జగన్ మీడియా చెప్పేవి అన్నీ అబద్ధాలే అని మరోసారి రుజువైంది.

రెండు రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు గుర్తుందా ? చంద్రబాబు నువ్వు మాట్లాడితే 40 ఏళ్ళు అనుభవం ఉంది అని డబ్బా కొట్టుకుంటావ్, ఏంటయ్యా నీ అనుభవం. నీ అనుభవంతో, నువ్వు నలుగురుకి అయినా రోల్ మోడల్ అయ్యావా అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రశ్న పై తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబుని అభిమానించే వారు, సోషల్ మీడియాలో స్పందిస్తూ, సిబిఎన్ ఈజ్ మై రోల్ మోడల్ అంటూ, హాష్ ట్యాగ్ తో, దాదపుగా 20 వేల పోస్ట్ లు వేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. ఎంతో మంది దేశాధినేతలు, కార్పొరేట్ దిగ్గజాలు చంద్రబాబు పై ప్రశంసలు కురిపించిన వీడియోలు ట్రెండ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఏకంగా ప్రపంచ బ్యాంక్ కూడా చంద్రబాబువిధానాలను పొగిడింది.

worldbak 21072019 1

ఈ రోజు ప్రపంచ బ్యాంక్, అమరావతికి ఎందుకు రుణం ఇవ్వలేకపోయామో చెప్తూ, ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్రం ప్రతిపాదన వెనక్కు తీసుకుందని, అందుకే ఇవ్వలేక పోయాం అని చెప్పింది. అయితే ఈ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ తో ప్రపంచ బ్యాంక్ కు ఉన్న సంబంధాల పై వివరించింది. ఎప్పటి లాగే, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, ప్రకృతి వైపరీత్యాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం అందిస్తామని చెప్పింది. అలాగే మరొక్క విషయం కూడా చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన డ్వాక్రా సంఘాల వ్యవస్థతో పని చెయ్యటం మాకు ఎంతో గర్వ కారణం అని, ఈ వ్యవస్థను మిగతా దేశాలు కూడా అనుసరించాయని చెప్పింది. 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మహిళలకు సాధికారత కల్పించాలని డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

worldbak 21072019 1

అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనం అయ్యింది. అదే విషయం ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ మరోసారి గుర్తు చేసింది. డైరెక్ట్ గా చంద్రబాబు పేరు రాయకపోయినా, ఆంధ్రప్రదేశ్ అనుసరించిన ఈ విధానం, ఎన్నో దేశాలకు మార్గదర్శకం అని చెప్పింది. రెండు రోజుల క్రితం నువ్వు ఎవరికీ రోల్ మోడల్ అని అడిగిన జగన్ గారికి ఇక్కడ సమాధానం దొరికే ఉంటుంది. చంద్రబాబు గారి విధానాలు, ప్రపంచ దేశాలకు రోల్ మోడల్ అని ఏకంగా ప్రపంచ బ్యాంక్ చెప్పింది. ఇది వారి ప్రకటనలో చెప్పింది. "The World Bank has had a long and productive partnership with the state of Andhra Pradesh. The state has pioneered some remarkable development innovations, such as the women’s self-help group movement, that other countries have learned from."

Advertisements

Latest Articles

Most Read