నిన్న, ఈ రోజు, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. నిన్న అయితే అసెంబ్లీకి పక్కన పెట్టి మరీ, క్యాబినెట్ సమావేశం జరిపి, అసెంబ్లీ కూడా కొంత సేపు వాయిదా వేసారు. అయితే నిన్న జరిగిన సంఘటన, ఈ రోజు మళ్ళీ క్యాబినెట్ సమావేశం అయ్యి తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి నిన్న క్యాబినెట్ అజెండా గా, ఎనిమిది అంశాలు అనుకుని అజెండా రూపొందించారు. అయితే ఈ అజెండాలో టేబుల్ అంశాలుగా కొన్ని చేరి, ఎనిమిది ఉన్న అజెండా కాస్తా 22కు చేరింది. ముఖ్యంగా నవరత్నాలు పై ఎక్కువగా అజెండాలో చర్చించారు. ఇక్కడి దాకా ఇబ్బంది లేదు, ఎవరి ప్రాధాన్యతలు వాళ్లకి ఉంటాయి కాబట్టి, సాధ్యాసాధ్యాలు చూసుకుని, అధికారులు కూడా వాటి పై తమ సలహాలు, నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటారు.

ias 19072019 2

నవరత్నాల అమలు పై చర్చ సందర్భంలో, కొంత మంది మంత్రులు, అధికారులు, ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితి గురించి వివరిస్తూ, వీటి పై నెమ్మిదిగా నిర్ణయం తీసుకుందాం అని చెప్పటంతో, జగన మోహన్ రెడ్డి వారి పై విరుచుకుపడ్డారు. నేను అన్నీ ఆలోచించే చెప్తున్నా, నేను ఒక ముఖ్యమంత్రిని, నేను చెప్పినా వినరా, వీటి పై ముందుకు వెళ్ళాల్సిందే అని తీవ్ర ఆవేశంతో జగన్ చెప్పటంతో, మొదటిసారి అక్కడ ఉన్న వాళ్ళు అవాక్కయ్యారు. ఇక తరువాత అజెండాగా పరిశ్రమల శాఖలో, స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అనే అంశం పై, చర్చకు వచ్చింది. ఈ చర్చ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి ఉగ్ర రూపం చూసి, క్యాబినెట్ సమావేశం హాల్ మొత్తం, పిన్ డ్రాప్ సైలెన్స్ గా మారిపోయింది. తన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, బిల్ తాయారు చెయ్యాలని అధికారులను కోరారు జగన్.

ias 19072019 3

అయితే పరిశ్రమల శాఖ కార్యదర్శి, మహిళా ఐఏఎస్ అయిన ఉదయ లక్ష్మి, ఆమె సలహాగా చెప్తూ, ఇది సాధ్య పడదు అని, దీని వల్ల ప్రభుత్వానికి లేని పోనీ తలనొప్పులు వస్తాయని అన్నారు. స్కిల్ ఉన్న ఉద్యోగాలు కావాలి అంటే బయట నుంచి వివిధ కంపెనీలు తెచ్చుకుంటాయని, మనం ఇలాంటివి పెడితే, పెట్టుబడులు రావని, ప్రభుత్వానికే ఇబ్బంది అని అన్నారు. ఈ మాటలు విన్న జగన్, మహిళా అధికారి అని కూడా చూడకుండా, అందరి ముందు ఆమె పై, తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. నేను బయటకు వెళ్లి, మా ఉదయ లక్ష్మి చెప్పింది, మీకు ఉద్యోగాలు ఇవ్వటం కుదరదు అని చెప్పినా అంటూ ఆగ్రహం వ్యక్తం చెయ్యటంతో, ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. ఈ లోపు ఎల్వీ సుభ్రమణ్యం కలగ చేసుకుని, వేరే మార్గాలు ఉన్నాయని చెప్పటంతో, రేపటి లోగా ఆ బిల్ నా ముందు ఉండాలి అని చెప్పి, అక్కడ నుంచి విసురుగా వెళ్ళిపోయారు. దీంతో చేసేది ఏమి లేక, ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ లో ఆ బిల్ తయారు చేసి తీసుకువచ్చారు. జగన్ మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో, అధికారులు కక్కలేక మింగలేక, తప్పు అని చెప్పలేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అయిన రాజు తలుచుకుంటే, ఈ సైనికులు అడ్డం పడితే ఎలా ?

ఆంధ్రప్రదేశ్ యువతలో ఓటర్లుగా ఉన్న దాదపుగా 90 శాతం మంది జగన్ మోహన్ రెడ్డికే మొన్న ఎన్నికల్లో ఓటు వేసి ఉంటారు. జగన్ అన్న వస్తాడు, మా కష్టాలు తీరుస్తాడు అని ఆశగా ఎదురు చూసిన ఏపి యువతకు ఇప్పటికైతే జగన్ షాక్ ఇచ్చారనే చెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వం, తన మ్యానిఫెస్టో హామీల్లో భాగంగా, 2018 ఆగస్టు నుంచి యువనేస్తం పథకం అమల్లోకి తెచ్చింది. ఈ పధకం కింద, దాదపుగా 6 లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఇచ్చారు. నెలకు వెయ్య రూపాయలు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ఇచ్చింది. తరువాత దాన్ని 2 వేలకు పెంచినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా, పెంచిన నిరుద్యోగ భృతి ఇవ్వటం కుదరలేదు. ఎన్నికల అయిన తరువాత ఇవ్వమన్నా, అప్పటి చీఫ్ సెక్రటరీ ఇవ్వలేదు.

bruti 19072019 2

అయితే మా జగనన్న వస్తాడు, మా జీవితాలు మార్చేస్తాడు, మాకు ఇంకా ఎక్కువ నిరుద్యోగ భృతిని ఇస్తాడు అని ఆశగా చూసిన యువతకు, నిరాశ మిగిలింది. మొదటి నెల ఇవ్వకపోవటంతో, ఇబ్బందులు ఉన్నాయోమో, రెండో నెల నుంచి ఇస్తారు అనుకున్నారు. రెండో నెల కూడా ఇవ్వకపోవటంతో, కొత్త పేరుతో బడ్జెట్ లో పెడతారాని ఏపి యువత ఆశించింది. అయితే, బడ్జెట్ లో నిరుద్యోగ భృతి కోసం రూపాయి కూడా కేటాయించక పోవటంతో, అవాక్కవ్వటం ఏపి యువత పని అయ్యింది. ఎందుకిలా చేస్తున్నారు అని అడిగితె, అది చంద్రబాబు పధకం అని, దానికి మాకు సంబధం లేదని, ఇప్పుడు మేము గ్రామా వాలంటీర్లను నియమిస్తున్నామని వైసిపీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ గ్రామ వాలంటీర్లు అన్నీ వైసిపీ నేతలకే ఇస్తున్న సంగతి తెలిసిందే.

bruti 19072019 3

గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద కేవలం వెయ్య రూపాయలే ఇచ్చినా, పెద్దల మీద ఆధారపడకుండా తమ ఖర్చులకు ఉపయోగించుకున్నారు. చదువుకుని, ఉద్యోగాలు లేక, అటు తల్లి దండ్రులను డబ్బులు అడగలేక, ఇబ్బంది పడిన యువతకు అప్పుడు చంద్రబాబు ఇచ్చిన వెయ్య రూపాయలు ఎంతో ఉపయోగ పడ్డాయి. అప్లికేషను కోసం, కోచింగ్ కోసం, పుస్తకాల కోసం, చార్జీల కోసం, ఇలా ఉపయోగించుకున్నారు. అయినా, వీరిలో ఎక్కువ మంది, చంద్రబాబుని కాదని, జగన్ వైపు మొగ్గు చూపారు. నిరుద్యోగ భృతి ఒక్కటే కాదు, దీంతో పాటు ఇస్తున్న స్కిల్ డెవలప్మెంట్ పై కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా నిరుద్యోగ భృతి, నైపుణ్య శిక్షణ జగన్ ప్రభుత్వం ఇప్పించాలని, లబ్ధిదారులు కోరుతున్నారు.

విద్యుత్ పై జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీల చేసిన ప్రసంగం ఆరోపణలు పై చంద్రబాబు స్పందించారు. మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా, సభ వాయిదా వేసుకుని పారిపోయారని అన్నారు. సండుర్ పవర్ కంపెనీ, నీ కంపెనీ, నువ్వు కర్ణాటకలో ఎందుకు ఎక్కువ రేట్ కు కొంటున్నావ్, దానికి సమాధానం చెప్తే, ఇక్కడ నీకు సమాధానం దొరుకుంతుంది అని చెప్పమని, అయినా ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా, ఏవేవో చెప్పి, సభను వాయిదా వేసుకుని వెళ్లిపోయారని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత, మీడియాతో మాట్లాడారు. తాను అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక వెళ్లిపోయారని చంద్రబాబు అన్నారు. థర్మల్ విద్యుత్ అంటే ఏంటి, సోలార్ అంటే ఏంటి, వింగ్ ఎనర్జీ ఏంటి, ఇవన్నీ ఆయనకు తెలియదని, అధికారులు ఏది చెప్తే, అది చెప్తున్నారని అన్నారు.

ppa 19072019 2

జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వితండవాదానికి ఏమి చెప్పాలో అర్ధం కావటం లేదని, తన వాదన కరెక్ట్ అని చెప్పటానికి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. థర్మల్ విద్యుత్ తక్కువ రేట్ కు దొరుకుతుంది, అదే సోలార్, విండ్ ఎనర్జీ మాత్రం ఎక్కువ రేట్ పెట్టాలి, తక్కువకు వస్తున్న థర్మల్ కాకుండా, ఎక్కువ ఖర్చు పెట్టి సోలార్, విండ్ కొన్నారు అంటే, ఇది ఒక పెద్ద స్కాం అంటూ జగన్ చెప్తుంటే, అతని అవగాహన ఎలా ఉందో అర్ధం అవుతుందని చంద్రబాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నారని, ఐక్యరాజ్య సమితి కూడా ఒక పాలసీ తీసుకు వచ్చిందని, దానికి అనుగుణంగా కేంద్రం కూడా అటు వైపు వెళ్లిందని అన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాను రాను తగ్గించుకుంటూ వస్తున్నామని అన్నారు.

ppa 19072019 3

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు గ్రీన్ ఎనర్జీ వైపు వస్తున్నాయని అన్నారు. మనకు బొగ్గు నిలవలు కూడా లేవని అన్నారు. ఇవన్నీ ఆలోచించకుండా, తక్కువకు వస్తుంది కాబట్టి, అది మాత్రమే వాడాలి, సోలార్ విండ్ వాడకూడదు అని వితండవాదం చేస్తున్నారని, ఇలాగే ఆలోచిస్తే, రాష్ట్రం చీకటి పాలు అవుతుందని, ఇప్పటికే కరెంటు కోతలు వచ్చేసాయని చంద్రబాబు అన్నారు. కర్ణాటకలో జగన్ మోహన్ రెడ్డి సండుర్ పవర్ ద్వారా విద్యుత్ ఉత్పతి దారుడు. అక్కడ ఎందుకు ఎక్కువ ధరకు కొంటున్నావ్ అంటే, దాని గురించి చెప్పకుండా, పక్క రాష్ట్రంతో మనకు సంబంధం లేదు అని చెప్పి పారిపోయారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, చంద్రబాబుని సాధించటం కోసం అబద్ధాలు చెప్తే ఎలాగని అన్నారు. విద్యుత్ లో పులివెందుల పంచాయితీలో పెట్టాలని చూస్తే, కేంద్రం వాతలు పెట్టిన విషయాన్ని గుర్తు చేసారు.

జగన్ మోహన్ రెడ్డి అవగాహన లోపంతో రాష్ట్రానికి కష్టాలు వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అతని అవగాహనా లేమి స్పష్టంగా కనిపిస్తుంది. భవనాలు కూల్చటం, విత్తనాలు సమస్య, కరెంట్ కష్టాలు, కేసిఆర్ ట్రాప్ లో పడి, మన ఆస్థులు ఇవ్వటం, ఇప్పుడు గోదావరి నీటి తరలింపు, తాజాగా విద్యుత్ పీపీఏల పై సమీక్ష చేసి పెట్టుబడి దారులను బెదిరించటం. ఇలా అనేక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో చేసుకున్న విద్యుత ఒప్పందాల పై సమీక్ష చేస్తాను అని చెప్పటంతో, యావత్తు కార్పోరేట్ ప్రపంచం షాక్ అయ్యింది. ఇప్పటికే కేంద్రం రెండు సార్లు లేఖలు రాసి జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించింది. నిన్న ట్రిబ్యునల్ కూడా, జగన్ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, గ్రీన్ కో కంపెనీకి ఇచ్చిన నోటీస్ పై స్టే ఇచ్చింది.

fitch 19072019 2

ఇలా జగన్ మోహన్ రెడ్డికి ప్రతి స్టేజ్ లోనూ ఎదురు దెబ్బులు తగులుతున్నా, తాను మాత్రం మూర్ఖంగా ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబుని ఎలా అయినా ఇరికించాలని చూస్తున్నారు. అయితే జగన్ విధానాల పై కార్పొరేట్ రేటింగ్ సంస్థ ఫిచ్ స్పందించింది. విద్యుత్ ఒప్పందాల సమీక్ష పేరుతొ ఇబ్బంది పెడితే, ఇది కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపి, పెట్టుబడి దారులు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని 'ఫిచ్' హెచ్చరించింది. సోలార్, విండ్ ఎనర్జీ ఒప్పందాల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీక్షలు చేస్తే, ఆ సంస్థల నగదు ప్రవాహానికి ఇబ్బందులు కలుగుతాయని తెలిపింది. ఏపి ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తే, పునరుత్పాదక విద్యుత్ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్తుందని ఫిచ్ హెచ్చరించింది.

fitch 19072019 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అనుకునట్టు, పీపీఎలను పునఃసమీక్షించినప్పటికీ, విద్యుత్ సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని తెలిపింది. ఏపి చర్యల వల్ల ఆ కంపెనీలకు కొన్ని పరిమితులతో ఇచ్చే రుణ సదుపాయం తగ్గి, కంపెనీ బాండ్ విలువ పడిపోతుందని తెలిపింది. అందుకే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటే, ఒక్క సంస్థ కూడా కొత్తగా పెట్టుబడి పెట్టాదని, ఉన్న సంస్థలు వేల్లిపోతయాని హెచ్చరించింది. గతంలో కూడా, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు, విద్యుత్ ఒప్పందాలను సమీక్షించేందుకు ప్రయత్నించాయని, కాని కేంద్రం హెచ్చరించటంతో ఆగిపోయాయని గుర్తు చేసింది. ఏపి చేసింది కదా, అని మిగతా రాష్ట్రాలు కూడా ఇలాగే చేస్తే, ఇక్కడ ఈ రంగంలో పెట్టుబడులు ఆగిపోతాయని హెచ్చరించింది. మరి మన జగన్ గారు ఇప్పుడైనా వింటారో, లేకపోతే నేను ఇంతే అని ముందుకు వెళ్తారో చూద్దాం.

Advertisements

Latest Articles

Most Read