పౌరహక్కుల నేతగా, ప్రొఫెసర్ గా హరిగోపాల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమే. సీనియర్ అయిన ఆయన, అనేక ఉద్యమాల్లో పాల్గుని, పౌర సమాజం తరుపున పోరాడారు. తాజాగా హరిగోపాల్ ఒక వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగన్ల పై సంచలన కామెంట్స్ చేసారు. అప్పట్లో మేము, రాజశేఖర్ రెడ్డిని తరుచూ కలుస్తూ, పలు విషయాల పై చర్చించే వారమని చెప్తూ, కొన్ని సంఘటనలు గురించి చెప్పుకొచ్చారు. మీ నాన్న రాజారెడ్డి మీద ఎన్నో మర్డర్ కేసులు ఉన్నాయి, చివరకు ఆయన కూడా అలాగే చనిపోయారు కదా, దీని పై మీ అభిప్రాయం ఏంటి అండి అడిగినప్పుడు, రాజశేఖర్ రెడ్డి చెప్పిన విషయాన్నీ చెప్పారు. తన తండ్రి రాజా రెడ్డికి, పీపుల్స్ వార్ భావజాలం ఎక్కువగా ఉండేదని వైఎస్ఆర్ అన్నారని, చెప్పారు.

haragopal 21072019 1

అందుకే ప్రజా కోర్ట్ లు పెట్టి, శిక్షలు అమలు చేసే వారిని, ఆ సందర్భంలో తన తండ్రి పై మర్డర్ కేసులు పెట్టారని, కాని రాజా రెడ్డి అలాంటి వారు కారని, వైఎస్ఆర్ చెప్పారని, చెప్పారు. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత, ప్రజలకు డబ్బులు పంచటం ఎక్కువైంది అని ప్రశ్నించామని, దానికి వైఎస్ఆర్ సమాధానం చెప్తూ, తమకు ఉన్న బైరైట్ ఎస్టేట్లో, ఒక ప్రత్యేకమైన రాయి దొరికిందని, ఆ రాయి పెట్రోల్ ని రీఫైన్ చెయ్యటానికి ఉపయోగిస్తారాని, అప్పుడు డబ్బులు బాగా వచ్చాయని, దీంతో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ప్రజలకు కూడా కొంత డబ్బులు ఇచ్చే వాళ్ళం అని, అది తప్పా అని వైఎస్ఆర్ ప్రశ్నించారని హరిగోపాల్ అన్నారు. అదే విధంగా, 2004లో వైఎస్ఆర్ సియం కాకపోయే ఉంటె, పెద్ద ఎత్తున ప్రత్యెక రాయలసీమ ఉద్యమం చేపట్టాలని డిసైడ్ అయ్యారని, అంతా రెడీ కూడా చేసుకున్నారని, కాని చంద్రబాబు ఓడిపోయి, అయన సియం కావటంతో, ఆ ప్రతిపాదన పక్కన పెట్టారనే సంచలన విషయం కూడా చెప్పారు.

haragopal 21072019 1

ఇక జగన మోహన్ రెడ్డి చేసిన విన్యాసాలు గురించి కూడా ఆ రోజు వైఎస్ఆర్ ని అడగగా, ఎన్నో విషయాలు చెప్పేవారని చెప్పారు. ఒక సందర్భంలో, 2004లో, జగన్ మోహన్ రెడ్డి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ని చితకబాదారని, ఆ విషయం వైఎస్ఆర్ దగ్గర ప్రస్తావించగా, ఆయాన జవాబు విని అవాక్కయ్యామని అన్నారు. వైఎస్ఆర్ మాట్లాడుతూ, అవును, జగన్ కు కొంత మంది అనుచరులు ఉన్నారు, వాళ్ళలో ఎవరి దగ్గరో లైసెన్స్ లేని తుపాకీ దొరికింది. అప్పుడు సిఐ, అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన 24 గంటల లోపు కోర్ట్ లో ప్రవేశపెట్టాలి. ఆ సిఐ అలా చెయ్యలేదు. దీంతో మా వాడు, ఆ పోలీస్ మీదకు వెళ్ళింది వాస్తవమే, నాలుగు తగిలించింది వాస్తవమే అంటూ కొడుకు గొప్పదనం గురించి వైఎస్ఆర్ చెప్పిన మాటలను, హరిగోపాల్ వివరించారు. మొత్తానికి మూడు తరాల వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి, హరిగోపాల్ చెప్పిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీళ్ళ స్వభావం అందరికీ తెలిసిందే అయినా, ఇప్పుడు అధికారంలో ఉన్నారని తెలిసినా, ఇంత ధైర్యంగా హరిగోపాల్ గారు చెప్పటం మాత్రం హైలైట్..

టాలెంట్ ను ప్రోత్సహించటంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. గతంలో క్రీడాకారులును ఎంకరేజ్ చెయ్యటం మనం చూసాం, అలాగే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారిని స్వయంగా ఫోన్లు చేసి మరి అభినందించే వారు. అలాగే వివిధ ప్రతిభ చూపించిన అనేక మందికి, స్వయంగా కలుస్తూ, వారిని అభినందిస్తూ ప్రోత్సహించే వారు. ఇప్పుడు ఇదే కోవలో, తెలుగులో పాపులర్ గాయనిగా పేరు ఉన్న, విజయవాడ వాస్తవ్యులు గాయని స్మితకు చంద్రబాబు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఇదే విషయాన్ని స్మిత స్వయానా ఆమె తన ట్విట్టర్ లో ఎకౌంటులో పెట్టారు. స్మిత గాయనిగా కెరీర్ ప్రారంభించి 20 ఏళ్ళు అయ్యింది. మన తెలుగు అమ్మాయి, పాప్ సాంగ్స్ పాడటం చాలా అరుదు. అలాంటిది, స్మిత ఏకంగా 20 ఏళ్ళు అదే ఫీల్డ్ లో ఉన్నారు. ఈ నేపధ్యంలో, 20 ఏళ్ళు పూర్తీ చేసుకున్న సందర్భంగా, ఆమెను పలువురు అభినందిస్తున్నారు.

smita 21072019 2

ఇదే కోవలో చంద్రబాబు కూడా ఆమెను అభినందించారు. దీనికి సంబంధించి ఒక లేఖను స్మితకు చంద్రబాబు పంపారు. ‘నటి, గాయని స్మిత తన పాటలతో సంగీత ప్రియులకు ఆహ్లాదం కల్గిస్తున్నందుకు అభినందనలు. శ్రోతలను అలరించడానికి వివిధ రూపాల్లో పాటలను వేదికగా చేసుకుని స్మిత సాగిస్తున్న ప్రయాణం అనిర్వచనీయం. కాలానికి అనుగుణంగా పాటల పందిరి నిర్మాణం మరింత జనరంజకం అవుతుందని విశ్వసిస్తున్నాను. ఒక్క తెలుగులోనే కాకుండా సంగీతానికి ఎల్లలు లేవరని తెలుపుతూ 9 భాషల్లో పాటలు పాడిన ఘనత సాధించడం ప్రశంసనీయం. భవిష్యత్తులోనూ స్మిత తన మధుర కంఠంతో ఇలానే అలరిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

smita 21072019 3

గాయనిగా స్మిత, తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిన్నటితో ఇరవై సంవత్సరాలు పూర్తయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో స్మిత ఒకే ఒక్క ‘ఇండిపాప్‌’ కావడం విశేషం. 1996లో ఈటీవీలో వచ్చే పాడుతా తీయగా కోసం తొలిసారి మైక్‌ పట్టుకుని, ఇప్పటి వరకు అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్మిత తన కెరీర్ ను మలుచుకున్నారు. 1999లో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్మిత, నిన్నతో తన కెరీర్ లో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇదీ ఇలా ఉంటె, తన కెరీర్ 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా, హైదరాబాద్‌లో ఈ నెల 22న ‘ఎ జర్నీ 1999–2019’ పేరుతో ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన లేఖ చూసిన స్మిత, అది ట్విట్టర్ లో పెడుతూ, ఇది నిజంగా నాకు సర్‌ప్రైజ్‌... ధన్యవాదాలు చంద్రబాబు గారు అని పెట్టి, లెటర్ కూడా పోస్ట్ చేసారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నంత వరకు, చంద్రబాబు పై లేని కుల పక్షపాతి ఇమేజ్ ను సృష్టించారు. నిజానికి చంద్రబాబు దగ్గరకు ఎవరైనా నా కులం, మీ కులం ఒక్కటే అంటే, నాకు ఈ పని చేసి పెట్టండి అని అంటే, వాళ్ళని ఆమడ దూరం కూర్చో పెడతారు. ఈ భయం వల్లే, ఎంతో మందికి సమర్ధత ఉన్నా వారిని పక్కన పడేసారు. అయినా సరే చంద్రబాబు కుల పక్షపాతి అని ప్రచారం చెయ్యటంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఒకానొక సందర్భంలో 38 డీఎస్పీలు తన సొంత కులం వారికే ఇచ్చారని జగన్ ప్రచారం చేసారు. ఇప్పటికీ ఆ పేర్లు ఏంటి అంటే మాత్రం చెప్పలేదు. కాని ప్రచారం చేసి, ప్రజలను నమ్మించటంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మాత్రం, నిజంగానే ఒకే కులానికి అధిక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

reddy 200072019 1

మొదట్లో అయుదుగురు డిప్యూటీ సియంలు అంటూ చెప్పి, వేరే వేరే కులాలకు ఇచ్చి, మంచి పని చేసారు అని అనిపించుకున్నారు. కాని తరువాత నుంచి అసలు సినిమా మొదలైంది. నిజానికి ఇది ఒక, డేంజర్ డ్యామేజింగ్ గేమ్. జగన్ మోహన్ రెడ్డి ఈ గేమ్ తెలిసి ఆడుతున్నారా లేక ఎవరూ గమనించటం లేదులే అనుకుంటున్నారా ఏమో కాని, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఒకే కులానికి అధిక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ప్రజలలో అభిప్రాయం ఏర్పడితే మాత్రం, ఇక ఆ పార్టీ అవుట్ అయినట్టే లెక్క. చంద్రబాబుకి ఫేక్ ప్రచారం చేస్తేనే టిడిపి పరిస్థితి ఇలా ఉంది, అలాంటిది జగన్ మోహన్ రెడ్డి, అందరూ చూస్తూ ఉండగా, ఒకే కులానికి పదవులు ఇస్తుంటే, ఇది నిజంగా డేంజర్ డ్యామేజింగ్ గేమ్ అనే చెప్పాలి. ఇది ఎలా సమర్ధించాలో తెలియని స్థితిలో వైసిపీ శ్రేణులు ఉన్నాయి. ఏదైతే తప్పు అని ప్రచారం చేసామో, అదే ఇప్పుడు జగన్ చేస్తున్నారని అంటున్నారు.

reddy 200072019 1

మచ్చుకు కొన్ని చూడండి , ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి గా కె. ధనుంజయ రెడ్డి ,ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి గా పి. కృష్ణ మోహన్ రెడ్డి ,ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి గా నాగేశ్వర రెడ్డి ,ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు గా అజేయకల్లం రెడ్డి ,తూడా ఛైర్మెన్ గా చెవిరెడ్డి. బాస్కర్ రెడ్డి ,టిటిడి ఎక్స్ ఆఫిసియో సభ్యులు గా చెవిరెడ్డి. బాస్కర్ రెడ్డి ,టిటిడి ఛైర్మెన్ గా వై. వి. సుబ్బారెడ్డి ,APIIC ఛైర్మెన్ గా రోజా రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సహాదారు గా సజ్జల రామక్రిష్ణా రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల సలహాదారు శైలజా. రామకృష్ణారెడ్డి , ఎపి భవన్ ప్రత్యేక ప్రతినిధి గా వి. విజయసాయి రెడ్డి , రాజ్యసభ పక్ష నేత గా వి. విజయసాయి రెడ్డి ,వైకాపా పార్లమెంటరి పార్టీ నేత గా వి. విజయసాయి రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గా వి. విజయసాయి రెడ్డి , ప్రభుత్వ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులు గా వి. విజయసాయి రెడ్డి , ఎయిమ్స్, మంగళగిరి డైరెక్టర్ గా వి. విజయసాయి రెడ్డి. , లోక్ సభ పక్ష నేత గా పెద్దిరెడ్డి. మిధున్ రెడ్డి ,లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా పెద్దిరెడ్డి. మిధున్ రెడ్డి , రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులు గా పెద్దిరెడ్డి. మిధున్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ గా గడికొట. శ్రీకాంత్ రెడ్డి , ప్రభుత్వ విప్ గా కాపు. రామచంద్రా రెడ్డి ,ప్రభుత్వ విప్ గా పిన్నేల్లి. రామక్రిష్ణా రెడ్డి ,ప్రభుత్వ విప్ గా గంగుల. ప్రభాకర్ రెడ్డి , రైతు సాధికార సంస్థ ఛైర్మెన్ గా వై. మదుసుదున్ రెడ్డి ,రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా చల్లా. మదుసుదున్ రెడ్డి , PKM అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటి ఛైర్మెన్ గా యం. సుబ్రమణ్యం రెడ్డి ,

రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పొన్నవొలు. సుధాకర్ రెడ్డి , రాష్ట్ర ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సలహాదారు గా వి. యన్. భరత్ రెడ్డి ,ఉన్నత విద్యా మండలి ఛైర్మెన్ గా కె. హేమచంద్రా రెడ్డి ,CRDA ఛైర్మెన్ గా అళ్ల రామకృష్ణా రెడ్డి , వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ యం. వి. ఎన్. నాగిరెడ్డి ,వ్యవసాయ మిషన్ సభ్యులు గా పి. రాఘవ రెడ్డి ,వ్యవసాయ మిషన్ సభ్యులు గా చంద్రశేఖర రెడ్డి ,నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ ఛైర్మెన్ కోటంరెడ్డి. శ్రీనివాసులు రెడ్డి ,రాష్ట్ర ఐటి సలహాదారు గా కె. రాజశేఖర రెడ్డి ,రాష్ట్ర ఐటి సలహాదారు గా శ్రీనాధ్ దేవి రెడ్డి ,ఆంధ్రా యూనివర్సిటీ విసి గా ప్రసాద్ రెడ్డి ,ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా బైరాగి రెడ్డి ,ఆంధ్రా యూనివర్సిటీ, సీటిసీ డీన్ గా పాండురంగా రెడ్డి ,రాజీవ్ గాంధీ యునివర్సిటి విసి గా కె. సి. రెడ్డి ,విండ్ & సోలార్ పవర్ సంప్రదింపుల కమిటీ సభ్యులు గా బి. రాజేంద్రనాధ్ రెడ్డి ,విండ్ & సోలార్ పవర్ సంప్రదింపుల కమిటీ సభ్యులు గా బి. శ్రీనివాసులు రెడ్డి ,విండ్ & సోలార్ పవన్ సంప్రదింపుల కమిటీ సభ్యులు గా డి. కృష్ణ గోపాల్ రెడ్డి , క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు గా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ,క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులు గా వేమిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి ,క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు గా మేకపాటి. గౌతమ్ రెడ్డి ,రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ సలహాదారు గా జె. విద్యాసాగర్ రెడ్డి. , రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది గా కాసా. జగన్ మోహన్ రెడ్డి. ,రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ సభ్యులు భూమిరెడ్డి. చంద్రశేఖర రెడ్డి. ,రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ సభ్యులు బి. సాంబశివా రెడ్డి. ,రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ సభ్యులు కసిరెడ్డి. సతీష్ కుమార్ రెడ్డి. ,రాయలసీమ యూనివర్సిటీ విసి సివీ కృష్ణా రెడ్డి. ,శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మళ్లికార్జున రెడ్డి. ,శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీధర్ రెడ్డి. , SVBC ఛైర్మెన్ పృథ్వీరాజ్ బాలి రెడ్డి. , ఏవియేషన్ ఆడ్వజైర్ వి. యన్. భరత్ రెడ్డి.

వైసీపీ ప్రభుత్వానికి తొందరగానే హనీమూన్ పీరియడ్ అయిపోయినట్టు ఉంది. 50 రోజులకే ఎమ్మెల్యే పై ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రతి రోజు జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి దగ్గర ఆందోళనలు చేస్తున్నా, అవి పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు. అయితే ఈ రోజు నెల్లూరులో ప్రజల తిరుగుబాటు చేసి, అధికార పార్టీ ఎమ్మెల్యే, అధికారులు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణంలో, కోట మండలం కొత్తపట్టణంలో లెథర్ ఫ్యాక్టరీ పై, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఇక్కడ మీటింగ్ కు గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్‌, గూడూరు సబ్‌ కలెక్టర్‌ ఆనంద్‌ లు హాజరయ్యారు. అధికార పక్షానికి సంభందించి, పేర్నాటి శ్యాం ప్రసాద్‌ రెడ్డి, ఈ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా చాలా ఏళ్ళగా పోరాటాలు చేస్తున్నారు. ఆయన కూడా ఇక్కడకు వచ్చారు.

leather 20072019 2

అయితే ఇక్కడ తోళ్ళ పరిశ్రమ ఏర్పాటుకు మేము సిద్ధంగా లేవని, అక్కడకు వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీంతో సభ అంతా రసాభాస అయ్యింది. ఎమ్మెల్యే, సబ్‌ కలెక్టర్‌ ఎంత సర్ది చెప్పటానికి ప్రయత్నించినా, వాళ్ళు వినలేదు. ఈ తోళ్ళ పరిశ్రమ ఏర్పాటు వెనుక గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్‌ హస్తం ఉందని, ఆయనకు 30 కోట్లు లంచాలు అందాయని నినాదాలు చేసారు. సొంత పార్టీ నేత అయిన పేర్నాటి శ్యాం ప్రసాద్‌ రెడ్డి, ఈ ఉద్యమానికి నాయకత్వం వహించటంతో, ఎమ్మెల్యే కూడా షాక్ అయ్యారు. ప్రజలు తిరగబడి, స్టేజి పైన ఉన్న కుర్చీలు, టేబుల్స్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు అతి కష్టం మీద ఎమ్మెల్యే, సబ్‌ కలెక్టర్‌ ను అక్కడ నుంచి, సురక్షితంగా బయటకు తరలించారు. తోళ్ళ పరిశ్రమ వద్దు అంటూ ఇక్కడ 10 ఏళ్ళుగా పోరాటం జరుగుతుంది.

leather 20072019 3

2010 లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కోట మండలం, కొత్తపట్నం పంచాయతీ పరిధిలో కెపిఐఎల్ కృష్ణపట్నం పోర్ట్‌ ఇంటర్నేషనల్‌ లెదర్‌ కాంప్లెక్స్‌, ఇండిస్టీ ఏర్పాటుకు సిద్ధం అయ్యింది. అప్పటి నుంచి ఈ పరిశ్రమ మాకు వద్దు అంటూ ఆందోళనలు చేస్తున్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత, ప్రజల సెంటిమెంట్ గ్రహించి, పరిశ్రమ వర్గాలు ఎంత ఒత్తిడి చేసినా, ఇక్కడ పరిశ్రమను మాత్రం ఏర్పాటు చెయ్యలేదు. అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావటంతో, పరిశ్రమను పెట్టాలని మళ్ళీ డిసైడ్ అయ్యారు. దీనికి వైసిపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండటంతో, పరిశ్రమను పెట్టటానికి రెడీ అయ్యారు. దీంతో ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించటంతో, అక్కడ ప్రజలు అందరూ, ఈ ఫ్యాక్టరీ మా దగ్గర వద్దు అంటూ తీవ్ర ఆందోళన చేసారు, ఎమ్మెల్యేను కొట్టే దాకా వెళ్లారు. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read