మొన్నటి ఎన్నికల్లో చట్టా పట్టాల్ వేసుకుని తిరిగి, చంద్రబాబుని ఓడించిన, వైసిపీ, బీజేపీ మధ్య రోజు రోజుకీ గ్యాప్ పెరిగిపోతుంది. అచ్చం చంద్రబాబుకి ఎలా చేసారో, ఇలాగే జగన్ కు ఎర్త్ పెడుతుంది బీజేపీ. కాకపొతే చంద్రబాబుతో రెండేళ్ళ వరకూ బాగానే ఉండి, తరువాత ట్యూన్ మార్చారు, జగన్ కు మాత్రం రెండు నెలలకే ట్యూన్ మార్చారు. చంద్రబాబుని ఎదుర్కోవాలి అంటే, చాలా కష్టం కాబట్టి, ఎన్నో వ్యూహాలు, ఆపసోపాలు పడి, టార్గెట్ పూర్తీ చేసింది. అయితే జగన్ కు మాత్రం, ఇలాంటి వ్యూహాలు, పెద్దగా అవసరం లేదు. జగన్ రాజకీయ జీవితం ఫినిష్ చెయ్యాలి అంటే, అమిత్ షా కు 24 గంటలు చాలు. శశికళ ఎపిసోడ్ అదే చెప్తుంది. కాని ఇప్పుడే అక్కడి దాకా వెళ్ళే పరిస్థితి లేదు. జగన్ కూడా అణిగిమణిగి ఉంటున్నాడు కాబట్టి, బీజేపీకి ఆ రూట్ ప్రస్తుతానికి అవసరం లేదు. అందుకే రాజకీయంగా విమర్శల దాడి మొదలు పెట్టింది. గత నాలుగు రోజులుగా బీజేపీ విమర్శలు చూస్తుంటే, వాళ్ళ లైన్ అఫ్ ఎటాక్ ఎంతో ఇట్టే అర్ధమై పోతుంది.

bjp 21072019 2

నిజానికి ముందుగా తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేసేద్దాం అని బీజేపీ ప్లాన్ వేసింది. ఇందుకు తగ్గట్టే ముందుగా వ్యాపారాలు ఉన్న నేతలను బెదిరించి, నలుగురు రాజ్యసభ ఎంపీలను లాక్కుంది. అయితే అప్పటి నుంచి ఒక్క చెప్పుకో తగ్గ నేత కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళలేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను లాగుదాం అనుకున్నారు కాని, 23 మందిలో చాలా వారకు పార్టీతో ఉండేవారే. ఒకరో ఇద్దరో వెళ్తారు అనుకున్నా, జగన్ పెట్టిన కండీషన్ ప్రకారం, పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్ళాలి. దీంతో ఎమ్మెల్యేలను లాక్కోవలనే ప్లాన్, బీజేపీకి వర్క్ అవ్వలేదు. అందుకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వదిలేసి, ఏకంగా జగన్ పైనే గురి పెట్టింది. జగన్ మోహన్ రెడ్డి అవినీతి పాలన, కుల పాలన, మత పాలన చేస్తున్నారని బీజేపీ టార్గెట్ చేసింది. విశాఖలో చర్చిలకు భద్రత అంశం బీజేపీకి కలిసి వచ్చింది.

bjp 21072019 3

ఈ అంశం పై పురందేశ్వరి గట్టిగా పోరాడుతున్నారు. ఇక గ్రామాల్లో శాంతి భద్రతలు లేవని, పోలీస్ రాజ్యం నడుస్తుంది అని కన్నా లక్ష్మీ నారాయణ ఎత్తుకున్నారు. అలాగే జగన్ 40 రోజుల్లోనే అవినీతి మయం చేసారని, ఎమ్మెల్సీ మాధవ్ అంటున్నారు. ఇక రాయలసీమను పట్టించుకోవటం లేదని, మరికొందరు బీజేపీ నాయుకులు అంటున్నారు. మరో పక్క, అన్ని ప్రాధాన పోస్టింగ్ లు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వటం పై కూడా, బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. మొత్తానికి, కులం, మతం, అవినీతి, రాయలసీమ అజెండాగా, బీజేపీ తన లైన్ అఫ్ ఎటాక్ ని జగన్ పై చూపించబోతుందని అర్ధమవుతుంది. బీజేపీ తన సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తీ కాగానే, జగన్ ప్రభుత్వం పై ఆందోళనలకు సిద్ధం అవుతుంది. అయితే, బీజేపీ ఇన్ని విమర్శలు చేస్తున్నా, జగన్ క్యాంప్ వైపు నుంచి మాత్రం, ఒక్కటంటే ఒక్క రివర్స్ కౌంటర్ బీజేపీ పై లేదు. ఎందుకో అందరికీ తెలిసిందేగా..

విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, గత వారం రోజులుగా సొంత పార్టీ నేత పైనే నడిపిన ట్వీట్ వార్, బెజవాడ రాజకీయాల్లోనే కాదు, ఏపిలోనే హాట్ టాపిక్ అయ్యింది. ఏమైందో ఏమో కాని, ముందుగా కేశినేని నాని, బుద్దా వెంకన్న పై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చెయ్యటంతో, వివాదం మొదలైంది. తరువాత బుద్దా వెంకన్న కూడా, అదే రీతిలో కేశినేనిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. ఇలా దాదపుగా నాలుగు రోజుల పాటు, సొంత పార్టీ నేతల మధ్య ట్వీట్ వార్ నడించింది. ఇది వ్యక్తిగత దూషణలు వరకు వెళ్ళాయి. ఇద్దరి ప్రవర్తనతో తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం, ఆందోళన చెందారు. అసలకే ఓడిపోయి ఉన్న పార్టీకి, ఇలా నేతలు బహిరంగంగా తిట్టుకుని, ప్రత్యర్దికి అవకాసం ఇవ్వటం పై, తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన చెందారు.

nani 21072019 1

మధ్యలో వైసిపీ నేత పీవీపీ వచ్చి హడావిడి చేసారు. అయితే బుద్దా వెంకన్న మాత్రం, పార్టీకి నష్టం చేసే ఇలాంటి చర్యలు ఇంకా చెయ్యను అని వివాదాన్ని ముగిస్తున్నా అని చెప్పారు. అయితే కేశినేని నాని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక ట్వీట్లు ఏకంగా చంద్రబాబుని టార్గెట్ చేసి, మీ పెంపుడు కుక్కను అదుపులో పెట్టుకోండి, నన్ను పార్టీలో ఉండమంటారా, పొమ్మంటారా అంటూ చంద్రబాబునే ప్రశ్నించటం అందరినీ అవక్కయ్యేలా చేసింది. దీంతో కేశినేని నాని పార్టీ మారటనాకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఎప్పటి నుంచో నాని బీజేపీలో చేరతారు అంటూ ప్రచారం జరుగుతూ ఉండటంతో, నాని ట్వీట్ వార్, చంద్రబాబుని ప్రశ్నించటం చూసి, అందరూ నాని పార్టీ మారతారని డిసైడ్ అయిపోయారు.

nani 21072019 1

అయితే కేశినేని నాని మాత్రం, ఎక్కడా మీడియాలో ఏమి మాట్లాడలేదు. ఈ రోజు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నివాసంలో, ఆయన్ను కలిసారు. పార్లమెంట్ భేటీ పై, అక్కడ అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. అయితే, కేశినేని నాని వివాదం మొదలు అయిన తరువాత, చంద్రబాబుని కలవటం ఇదే ప్రధమం కావటంతో, అందరి ద్రుష్టి ఈ భేటీ పై పడింది. కేశినేని నాని ట్విట్టర్ వార్ పై చంద్రబాబు అడిగినట్టు తెలుస్తుంది. అయితే లోపల ఏమి జరిగిందో కాని, రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటోలో మాత్రం, కేశినేని నాని నవ్వుతూ కనిపించటం, చంద్రబాబు పక్కనే హుషారుగా ఉండటం చూసి, ఈ వివాదం ముగిసినట్టే అని తెలుగుదేశం శ్రేణులు అనుకుంటున్నాయి. ఏదైనా ఉంటే పార్టీ లోపల పరిష్కరించుకుందాం అని, బహిరంగంగా సొంత పార్టీ నేతల పై వ్యాఖ్యలు చెయ్యవద్దు అని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.

అమరావతికి రుణం ఇచ్చే విషయం పై, రెండు రోజుల క్రిందట ప్రపంచ బ్యాంక్, మీము రుణం ఇవ్వం అని చెప్పిన విషయం తెలిసిందే. ఇది పెద్ద దుమారం రేపింది. ముఖ్యంగా కేవలం జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్లే, ఈ పరిస్థితి వచ్చిందనే ప్రచారం జరిగింది. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, రుణం మంజూరు చేస్తాం అని, దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలని కోరారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం, ఈ విషయం పై ఏ స్పందన ప్రపంచ బ్యాంకుకు చెప్పక పోవటంతో, కేంద్రం కూడా పునరాలోచనలో పడింది. రాష్ట్రానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఈ తలనొప్పి మాకు ఎందుకు అని చెప్పి, ప్రపంచ బ్యాంకు కు, అమరావతికు రణం ఇవ్వండి అని గతంలో ఇచ్చిన ప్రతిపాదానను, కేంద్రం ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.

worldbank 21072019 1

దీంతో కేంద్రమే వెనక్కు తగ్గటంతో, ఇక చేసేది ఏమి లేక ప్రపంచ బ్యాంక్, మేము అమరావతికి రుణం ఇవ్వం అని చెప్పేసింది. గతంలో జగన్ పార్టీకి చెందిన నేతలు, అమరావతికి రుణం ఇవ్వద్దు అంటూ ఉత్తరాలు రాయటం, జగన్ కూడా అమరావతిని అవమానిస్తూ వ్యాఖ్యలు చెయ్యటం, ఇవన్నీ ఈ రోజు ప్రజలు గుర్తు చేసుకుని, జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్లే ఈ రోజు ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వం అని చెప్పిందనే నిర్ధారణకు వచ్చారు. ఇక అమరావతి పని అయిపోయిందని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో, తన యజమాని పై వ్యతిరేకత మొదలైందని అని గ్రహించిన జగన్ సొంత మీడియా, విషయాన్ని కవర్ చేస్తూ, ఈ రోజు ఒక అద్భుతమైన, అవాక్కయ్యే స్టొరీతో ప్రజల ముందుకు వచ్చింది. ఇది చూసిన ప్రజలు నిజంగానే అవాక్కయ్యారు.

worldbank 21072019 1

ప్రపంచ బ్యాంకు రుణం కేవలం చంద్రబాబు వల్లే పోయిందని, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని, జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త ప్రతిపాదనలు పంపారని, మళ్ళీ కొత్త రుణం ఇస్తారని రాసింది. అంతే కాదు అసలు విషయం ఏంటి అంటే, జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెడదాం అనుకుంటున్న నవరత్నాలు పై కూడా, ప్రపంచ బ్యాంకు స్పందించిదని, నవరత్నాలకు కూడా మేము మీకు లోన్ ఇస్తాం అంటూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, జగన్ వెంట పడుతున్నారని, కధనాలని వండి వార్చింది. ఇది చూసిన ప్రజలు అవాక్కయ్యారు. ఎక్కడైనా ప్రపంచ బ్యాంక్ నవరత్నాలు లాంటి పధకాలకు రుణాలు ఇస్తుందా అని ప్రశ్నిస్తున్నారు ? లోన్ ఇస్తున్నాడు అంటే, ఏదైనా ప్రజలు జీవితాలు మార్చే ప్రాజెక్ట్ లకు ఇస్తారు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కు ఇస్తారు కానీ, ఇలా రత్నాలకు, రాళ్లకి ఎక్కడైనా ప్రపంచ బ్యాంక్ లోన్ ఇస్తుందా అని ప్రజలు అవక్కవుతూ ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఇస్తున్నామని, జగన మోహన్ రెడ్డి ట్వీట్ చేసారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఒక రికార్డు అని అన్నారు. నిజమే గ్రామ వాలంటీర్లు ఒక పక్క, మరో పక్క గ్రామ సచివాయలం వ్యవస్థ ఏర్పాటుతో దాదపుగా లక్షకు పైగా ఉద్యోగాలు వస్తున్నాయి. అయితే ఈ గ్రామ సచివాలయంలో పది మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 వేల పైచిలుకు గ్రామాల్లో ఒక్కో సచివాలయం ఏర్పాటు అవుతుంది. ఇంత వరకు బాగానే ఉంది. కొత్త ఉద్యోగాలతో రాష్ట్రం కళకళలాడుతుంది. అయితే ఇప్పటి వరకు అక్కడ పని చేస్తున్న వివిధ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పరిస్థితి ఏంటి అంటే, ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ప్రతి రోజు జగన్ తాడేపల్లి ఇంటి ముందు, ధర్నాలు చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం వీరికి భరోసా ఇవ్వటం లేదు.

jagntweet 21072019 1

దీంతో ఈ ఉద్యోగాలు పై ఇప్పుడు భయం ఏర్పడింది. గ్రామ సచివాలయంలో పని చేసే పది మంది సిబ్బంది చేసే పని, ఇప్పటికే కొన్ని జరుగుతున్నాయి. వీరు ఎక్కువుగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు. గ్రామ సచివాలయం ఏర్పాటు కాగానే, వీరిని తొలగిస్తారనే సమాచారం వస్తుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సహకారం అందించే సెర్ప్‌ ఉద్యోగులు మరింత భయపడుతున్నారు. వీరే రాష్ట్ర వ్యాప్తంగా 41 వేల మంది ఉన్నారు. ప్రతి గ్రామ సమాఖ్యలో, ఒక గ్రామ సమాఖ్య అసిస్టెంట్‌ ఉంటారు. వీరే 27 వేల మంది ఉన్నారు. గతంలో వీరికి చంద్రబాబు 3 వేలు ఇస్తే, జగన్ రాగానే 10 వేలు చేస్తున్నాం అని ప్రకటించారు. అయితే అసలు ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయా లేదా అనే పరిస్థితి వచ్చింది. ఇక భీమా మిత్ర, కళ్యాణ మిత్ర, కాల్ సెంటర్ ఉద్యోగులు, కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఇదే పరిస్థితి.

jagntweet 21072019 1

ఇక అలాగే వ్యవసాయశాఖలో 4100 మంది, ఉద్యానవన శాఖలో 1200 మంది కూడా ఇలాగే కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది గోపాల మిత్రలు ఉన్నారు. వీరి పని కూడా అయిపోయినట్టే అని తెలుస్తుంది. ఉపాధి హామీ పథకంలో పని చేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఇతర ఉద్యోగులు, 10 వేల మంది దాకా ఉన్నారు. ఇలా అనేక మంది పరిస్థితి గందరగోళంలో పడింది. ఇప్పటికే వీరు అందరూ గ్రామాల్లో పని చేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న గ్రామ సచివాలయంలో వీరినే పెట్టచ్చు, అలా కాకుండా మళ్ళీ నియామకాలు చేస్తున్నారు. గ్రామా వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు కలిపి, మొత్తంగా గ్రామాన్ని బట్టి, వీరే 20 నుంచి 30 మంది దాకా ఉంటారు. దీంతో ఇక ఇప్పటి వరకు పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను భరించే ఆర్ధికస్థోమత ప్రభుత్వానికి ఉండదు. మరి ఈ లక్ష మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయం ఏమయినా చూపిస్తారా లేదా అనేది చూడాలి.

Advertisements

Latest Articles

Most Read