కన్నా లక్ష్మీనారాయణ మచ్చ లేని నాయకుడు... అవాక్కయ్యారా ? కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా, మన కన్నా వేసిన కన్నాలు అన్నీ గుర్తుకు వచ్చాయి కదా ? నిన్న కాక మొన్న బీజేపీకి రాజీనామా చేసి, వైసిపీ పార్టీలో చేరుతున్న కన్నాని, తెల్లారే సరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసారు.. ఇప్పుడు ఈ కన్నాలు సారు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వస్తున్నారు అంట... ఈ మాట చెప్పింది భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్... దక్షిణాది దండయాత్రకు వస్తున్నాం అంటూ, డాంబీకాలు పోతున్న రాం మాధవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటున్నాం అంటూ గుంటూరు వేదికగా ప్రకటించారు...

kanna 26052018 2

కన్నా లక్ష్మీ నారాయణ గురించి ఏమన్నారో తెలుసా ? "రాజకీయ అనుభవం ఉన్న నేత కన్నా.. మీ ముఖ్యమంత్రి కంటే ఐదేళ్లు ఎక్కువ అనుభవం ఉన్న నేత.. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఆంధ్ర ప్రజల అభివృద్ధికి బీజేపీకి కట్టుబడి ఉంది. మేం ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తాం. ఇప్పటికే కేంద్రం 85 శాతం హామీలు నెరవేర్చింది. 100 కాదు 150 శాతం సహయ సహకారాలు అందించేందుకు మేం సిద్ధం. నూతన రాజకీయం ఇక్కడ తీసుకురావాలి. కన్నాకు పదవి ఇస్తే కులాన్ని చూసి ఇచ్చారంటున్నారు. అసలు ఇలా ఆలోచించే విధానానికి వ్యతిరేకంగా కొత్త రాజకీయం రాష్ట్రంలో తీసుకురావాలి. అబద్ధపు ప్రచారానికి వ్యతిరేకంగా న్యూ పాలిటిక్స్..ఫర్ న్యూ ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి. మనమే అధికారంలోకి వస్తున్నాం" అంటూ రాం మాధవ్ అక్కడ ఉన్న వారికి కనువిప్పు కలిగిస్తూ, కన్నా గురించి చెప్పారు..

kanna 26052018 3

పదేళ్లు మంత్రిగా గుంటూరు జిల్లాను కొల్లగొట్టిన సంగతి కొత్తబిచ్చగాడు..రాంమాధవ్‌కు తెలియదేమో...? అప్పట్లో...రాంమాధవ్‌ ఎవరో...ప్రజలకు కానీ...ఇప్పటి..బిజెపి అధ్యక్షుడు 'కన్నా'కు కానీ తెలిసి ఉండదు. అందుకే...'కన్నా'లో నిజాయితీపరుడైన...నాయకుడు 'రాంమాధవ్‌'కు కనిపించి ఉంటారు. పదేళ్లు మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన 'కన్నా'...అవినీతి గురించి గుంటూరు ప్రజలే కాదు..రాష్ట్ర మంతా...కథలు..కథలుగాచెప్పుకున్నారు. ఆ సంగతి...పాపం ఈయనకు తెలిసి ఉండదు. తెల్లారితే పార్టీ మారే వ్యక్తిని బెదిరించి...పార్టీ అధ్యక్షున్ని చేసుకున్న బిజెపి పెద్దలు....ఆయన నీతిమంతుడు, చరిత్రకారుడు అని సర్టిఫికెట్‌ ఇవ్వడంకన్నా దౌర్బాగ్యం ఏముంటుంది. కులాలను అడ్డం పెట్టుకుని...టిడిపి... రాజకీయాలు చేస్తోందన్న రాంమాధవ్‌ చేసేది ఏమిటి..? 'కన్నా' బిజెపికి చేసిన సేవ ఏమిటి..? ఎందుకు ఆయనకు అధ్యక్ష పదవి వచ్చింది..? కులం కోటాలో కాదా...?

అత్యంత వృద్ధి రేటు నమోదు చేస్తున్న ఆక్వారంగానికి మరింత ఊతమిచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో దఫా ప్రోత్సాహం ప్రకటించారు. ఆక్వాసాగుకు వినియోగించే విద్యుత్‌పై సబ్సిడీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు యూనిట్‌ రూ. 2కే విద్యుత్ సరఫరా చేస్తామని రొయ్యల మార్కెట్ ధర స్థిరీకరణపై ఆక్వారంగ భాగస్వాములతో శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వరాన్ని ఇచ్చారు. ఆక్వారంగానికి ఇప్పటికే సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఇకపై ఇచ్చే అదనపు సబ్సిడీతో రూ. 350 కోట్లకు పైగా ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. కోస్తాంధ్రలో ఆక్వారంగాన్ని, రాయలసీమలో ఉద్యానరంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఆక్వా రైతు బావుండాలనే విద్యుత్ ధరలు తగ్గించామని చెప్పారు. విద్యుత్ సబ్సిడీపై హర్షం వ్యక్తం చేసిన రైతులు విద్యుత్ సబ్సిడీతో పాటు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం సంక్షోభంలో వున్నా ఆక్వారంగాన్ని ప్రాథమికరంగంగా గుర్తించి ప్రోత్సాహకాలు ఇస్తున్నారని ధన్యవాదాలు తెలియజేశారు.

aqua 26052018 2

సమావేశానికి వచ్చిన ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో గంటకుపైగా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి ఆక్వారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆక్వా రైతులు ప్రాముఖ్యత ఇవ్వాలని, ఇష్టానుసారంగా యాంటి బయాటిక్స్ వినియోగించడం మంచిది కాదని, పర్యావరణహితంగా వ్యాధుల నియంత్రణపై దృష్టిపెట్టాలని సూచించారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాల్సి వుందన్నారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ఆక్వాసాగు సరికాదని, అక్రమ సాగుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించకుండా, నష్టపోకుండా ముందే జాగ్రత్తపడాలని చెప్పారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చేవారికి రైతులు సహకరించినప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. రొయ్యల ఫీడ్ ధరలపై ఉత్పత్తిదారులు - రైతులు ఒకరిని ఒకరు నిందించుకోకుండా సమస్య పరిష్కరించుకోవాలని తెలిపారు.

aqua 26052018 3

అయితే ఇక్కడ ఒక మెలిక పెట్టారు... ఇన్ని సబ్సిడీలు ఇస్తున్నాం కాబట్టి, యాంటి బయాటిక్స్ వినియోగం తగ్గించమని కోరారు...ఆక్వారంగంలో యాంటి బయాటిక్స్ వినియోగంతో ఎగుమతులపై నిషేధం ఎదుర్కొనే ప్రమాదం వుందని, ఎట్టిపరిస్థితుల్లో యాంటి బయాటిక్స్ వాడేందుకు అనుమతిచ్చేది లేదని ముఖ్యమంత్రి అన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి రైతు కట్టుబడి వుండాలన్నారు. భూగర్భజలాలు కలుషితం కాకుండా మెరుగైన మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉత్పత్తుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఆక్వారంగాన్ని చిత్తశుద్ధితో పరిరక్షించుకోవాలని చెప్పారు. రైతులు ఇందుకు ముందుకువస్తే అన్నివిధాలా అండగా నిలబడేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. తాత్కాలిక లాభాల కోసం ఏ ఒక్కరు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా అందరూ నష్టపోతారని హెచ్చరించారు. కాలుష్య నియంత్రణ కోసం జోన్లువారీగా ఆక్వాసాగుకు అనుమతులు ఇస్తామని వెల్లడించారు. ఆక్వారంగంలో సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తులు కొత్తగా మరికొన్ని దేశాలకు ఎగుమతులు చేసేలా ఎగుమతిదారులు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చెప్పారు. దేశీయ మార్కెట్‌లోనూ మన ఆక్వా ఉత్పత్తుల విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆక్వా ఉత్పత్తుల నాణత్య నిర్ధారణకు అత్యాధునిక పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యేలా చూడాలని సమావేశంలో పలువురు రైతులు విన్నవించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

ముఖ్యమంత్రి కుర్చీ కోసం, పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కోనసీమలో కొనసాగుతుంది. ఈ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద పెదకాపవరం గ్రామ శివారులో, అక్కడ చెరువుని అక్కడ నీళ్ళను చూసి పులకించి పోయారు... వేసవిలో కూడా ఇంత నీరు ఉండటంతో అక్కడకు వెళ్లి, చెరువులో చేపలు, రొయ్యలు పట్టే వారి దగ్గరకు వెళ్లారు.. వారి దగ్గర ఆ చెరువులో చేపలు, రొయ్యలకు మేత వేసే విధానం చూశారు. అంతే కాదు వల వేయడమే కాదు… వాటిని పట్టడం ఎలాగో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తాను పట్టి సరదా తీర్చుకున్నారు. ఇంతటితో అయిపోలేదు.. అసలు స్టొరీ ఇక్కడే ఉంది.. జగన్ వెనుక ఉండే ప్రశాంత్ కిషోర్ టీం, అక్కడ అన్నీ ఫోటోలు తీసారు..

jagan 26052018 2

జగన్ చెరువు దగ్గరకు వెళ్ళటం, చెరువులో నీళ్ళు దండిగా ఉన్నాయి కదా అని చెప్పటం, స్వయంగా అక్కడ చేపులు, రొయ్యలు పట్టటం, రొయ్యలు బయటకు తీసి, సైజు బాగా ఉంది డబ్బులు బాగా వస్తాయి కదా అని చెప్పటం, ఇవన్నీ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి... ఈ ఫోటోలు, వీడియోలు చూసిన ప్రజలు, జగనే స్వయంగా, అన్నీ బాగున్నాయి అని చూపిస్తున్నారుగా అని అనుకుంటున్నారు... ఒక పక్క వేసవి అయినా సరే. ఎక్కడా పచ్చదనం తగ్గలేదు, కొబ్బరి చెట్లు, చెరువులు చూస్తే మనసు పులకించిపోతోంది, ఇంత వేసవిలో కూడా చెరువులు అన్నీ నిండు కుండ లాగా ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తూ, జగనే స్వయంగా, చంద్రబాబు పరిపాలనలో నీరు ఎలా ఉందో చుపిస్తున్నట్టు ఉంది అనుకుంటూ, టిడిపి ఎలాగూ చేసింది చెప్పుకోవటం లేదు కాబట్టి, జగన్ ఈ విధంగా చెప్తున్నారా ఏంటి అనుకుంటున్నారు...

jagan 26052018 3

మరో పక్క, అంతకు ముందు రోజే , బహిరంగ సభలో, ఆక్వా సాగు దెబ్బతింది అని, నీళ్ళు లేవని, చంద్రబాబు పై జగన్ విమర్శలు గుప్పించారు... తీరా ఇక్కడేమో, తానే స్వయంగా, నిండు కుండలా ఉన్న చెరువులో రొయ్యలు పట్టి, ఇంత పెద్ద రొయ్యలా అని ఆశ్చర్యపోయి, చంద్రబాబు పరిపాలన సూపర్ అని చెప్పకనే చెప్పారు.. అయితే, ఇలాంటి ఫీడబ్యాక్ వచ్చింది అని తెలుసుకున్న జగన్, ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ పై ఫైర్ అయ్యారు. ఇలాంటి ఫోటోలు బయటకు ఇవ్వద్దు అని ఎన్ని సార్లు చెప్పాలి, ఇది వరకు రాయలసీమలో కూడా పచ్చని పొలాలు, రోడ్లు, నీళ్ళు, ఇలా ఫోటోలు తీసి ఇచ్చి, మనమే చంద్రబాబు బాగా చేస్తున్నాడు అని చెప్పుకునేలా చేసారు, ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంటూ జగన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి ఫోటోలు కాకుండా, దీనంగా, హీనంగా ఉన్న ఫోటోలు, ఊరి బయట ఉండే ఫోటోలు మాత్రమే బయటకు వదలాలని, ఇంకో సారి ఇలాంటి తప్పు చేస్తే, సహించేది లేదని జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పుడు ఎవరి నోట విన్నా రిసార్ట్ దీక్ష గురించే... ఎన్నో దీక్షలు గురించి విన్న ప్రజలు నిన్న పవన్ కళ్యాణ్ చేసిన రిసార్ట్ దీక్ష గురించి తెలుసుకుని అవాక్కయ్యారు... పవన్ దీక్ష చేస్తున్న విధానం పై చర్చ వచ్చింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి, రేపు ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ రిసార్ట్ లోనే దీక్ష చేసారు. దీక్ష అంటే, జనాల మధ్య ఉంటుంది కదా అనుకున్నారు... కాని, ఎవరికీ ఎంట్రీ లేదు.. కనీసం మీడియాకు కూడా... మీడియా అదేమిటి అని అడిగితే, మేమే వీడియో తీసి కొన్ని బైట్స్ పంపిస్తాము అని చెప్పారు.. ఇక్కడ అయిన తరువాత, ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ హాఫ్ మాత్రం ప్రజల మధ్యలో దీక్ష మొదలు పెట్టారు.. నిన్న చీకట పడగానే పవన్ రిసార్ట్ లోపలకి వెళ్ళిపోయి దీక్ష చేసారని జనసేన వర్గాలు చెప్పాయి..

resort deeksha 26052018 2

అయితే ఇదేమి దీక్షో అంటూ ప్రజలు అవాక్కయ్యారు. ఇదే విషయం పై, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు స్పందిచారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే ఆసుపత్రిలో దీక్ష చేయాలి కానీ, రిసార్ట్ లో కాదని, తొలిసారిగా రిసార్ట్ లో దీక్ష చేయడం చూస్తున్నానని, ఇది కొత్త ఫ్యాషనేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు రిసార్ట్ లో దీక్ష ఏమిటో అర్ధం కావటం లేదని, ఇలాంటి దీక్షలు ఇప్పుడే చూస్తున్నాని అని అన్నారు... ప్రభుత్వం ఉద్దానం పై తీసుకున్న చర్యలు వివరించారు... మరో పక్క చంద్రబాబు కూడా ఈ విషయం పై ఈ రోజు సమీక్ష చేసారు... ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ... కిడ్నీ రోగులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు.

resort deeksha 26052018 3

13 వేల మందికి క్రమం తప్పకుండా చికిత్స అందిస్తున్నామని, ప్రతి 15రోజులకు నెఫ్రాలజిస్ట్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పలాస, సోంపేట, పాలకొండ, టెక్కలిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుచేశామని, రూ.17కోట్లతో 7 ఆర్వో సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అంతేగాక సీకేడీ కేసుల కోసం సోంపేటలో ప్రయోగశాల ఏర్పాటు చేశామని, పనిచేసేవాళ్లపైనే విమర్శలు చేస్తారా? అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. నెగటివ్ ధోరణులు అభివృద్ధికి నష్టం చేస్తాయన్నారు.

Advertisements

Latest Articles

Most Read