ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే, రాజకీయ చానిక్యతకు మారు పేరు.. గతంలో, కేంద్రంలో రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యటంలో కీలక పాత్ర పోషించారు... 20 ఏళ్ళ క్రితమే, ఆయన్ను ప్రధానిగా ప్రతిపాదించగా, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెయ్యల్సింది చాలా ఉంది అని, ఆ ప్రతిపాదన తిరస్కరించారు... వాజ్ పాయి ప్రధానిగా ఉండగా కూడా, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ, ఒక్క మంత్రి పదవి కూడా తీసుకోకుండా, రాష్ట్రానికి సహకరించండి అని మాత్రమే అడిగారు.. ఇప్పుడు ఉన్న సీనియర్ నాయకుల్లో చంద్రబాబు ఒకరు.. నిన్న బెంగుళూరులో కూడా, మమతా బెనర్జీ స్వయంగా చంద్రబాబుని ఒక ఫ్రంట్ ఏర్పాటు చెయ్యమని, మోడీ వ్యతిరేక పోరాటాన్ని లీడ్ చెయ్యమని అడిగారు... అది చంద్రబాబు సత్తా... మొన్న లండన్ లో కూడా, ఒక అవార్డు తీసుకునే సందర్భంలో, చంద్రబాబుని "పొటెన్షియాల్ ప్రైమ్ మినిస్టర్ అఫ్ ఇండియా" అని సంబోధించారు...

cbn 24052018 2

అలాంటి చంద్రబాబు, 20 ఏళ్ళ క్రిత్రం ఏ మాట చెప్పారో, ఈ రోజు అదే మాట చెప్పారు.. తెలంగాణ టీడీపీ మహానాడుకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. కార్యకర్తలు పీఎం.. పీఎం అంటూ నినాదాలు చేస్తుంటే, ఆయన స్పందిస్తూ, ప్రధాని కావాలని లేదని... తనకు తెలుగు జాతి ముఖ్యమని.. 22 ఏళ్ల క్రితమే ఆమాట చెప్పాను అన్నారు. ప్రధాని పదవి ఆశ లేదని.. ఎంతగా అరిచినా ఆ కోరిక కలగదని తేల్చి చెప్పారు. 1996లో తృతీయ కూటమి ఏర్పాటుచేసి దేవెగౌడను ప్రధానిగా చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్‌కు, భాజపాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుచేసిన ఘనత తెదేపాదన్నారు. తనకు ప్రధాని పదవి అవసరం లేదని 20 ఏళ్ల క్రితమే చెప్పానన్నారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం రెండుసార్లు వచ్చినప్పటికీ వద్దని చెప్పానన్నారు.

cbn 24052018 3

ప్రధాని పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని తెలిపారు. ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నానంటే.. పదవుల కోసం కాదని, ప్రజాసేవ కోసమేననిఅన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. నాడు ఎన్టీఆర్‌ నేషనల్ ఫ్రంట్‌కు రూపకల్పన చేశారని చంద్రబాబు కొనియాడారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి దేవెగౌడను ప్రధానిని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. 2019 ఎన్నికల తర్వాత దేశంలో పెను మార్పులు వస్తాయని ఆయన అన్నారు. దేశ రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రన్న భీమా పధకం వల్ల అనాధ శవంగా పడి ఉన్న అతన్ని, కుటుంబం వచ్చి దహన సంస్కారాలు చేసిన సంఘటన చుస్తే, ఒక పక్క మానవత్వం కంటే, డబ్బు గొప్పది అనే సందేశం వస్తున్నా, ఆ డబ్బు కోసమైనా, ఆనాధ శవంగా కాకుండా, కుటుంబ సభ్యులు దహనం చేసారు అనే ఆనందం అన్నా వస్తుంది.. వివరాల్లోకి వెళ్తే, అల్లు సత్యనారాయణ అనే వ్యక్తి, విశాఖ జిల్లా పాయకరావుపేట పంచాయతీకి చెందిన వ్యక్తి. ఈయన లారీ డ్రైవర్‌. శరీరంలో ఓపిక ఉన్నంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుని భార్యా పిల్లలను పోషించాడు. ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచాన పడ్డాడు. తన భార్య ఉన్నంతవరకు ఆయన బాగోగులు చూసుకునేది. ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి ఇద్దరు కుమారులు పట్టించుకోవడం మానేశారు.

chandrannabheema 24052018 2

దీంతో కొద్ది రోజులుగా స్థానిక ఆర్టీసీ బస్టాండులో కాలం వెల్లదీస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున చనిపోయాడు. ఈ విషయాన్ని స్థానికులు, పోలీసులు కుటుంబ సభ్యులకు చెబితే మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు నిరాకరించారు. ఇంతలో ఎవరో మృతుడికి చంద్రన్న బీమా వస్తుందని చెప్పడంతో వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ఈ సంఘటన చూసిన పలువురు తీవ్ర ఆవేదన చెందారు. మానవత్వం నశించిన చోట చంద్రన్న బీమా ఆదుకుందని విచారం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయమై చంద్రన్న బీమా సిబ్బంది కుమా రిని వివరణ కోరగా బుధవారం ఆర్టీసీ బస్టాండులో అల్లు సత్యనారాయణ అనే వ్యక్తి చనిపోయినట్టు సమాచారం వచ్చిందన్నారు. పరిశీలించి వివరాలు నమోదు చేస్తామని ఆమె తెలిపారు.

chandrannabheema 24052018 3

ఇదీ పధకం... దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అసంఘటిత రంగ కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన వరం చంద్రన్న భీమా... అసంఘటిత రంగ కార్మికులు ఎవరైనా సహజమరణానికి గురైతే వారి కుటుంబానికి రూ.2 లక్షలు, ప్రమాదం జరిగి మరణిస్తే 5 లక్షల చొప్పున చంద్రన్న బీమాపథకం కింద లబ్ధి చేకూరింది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్న అసంఘటిత రంగ కార్మికులు ఆధార్‌, బ్యాంక్‌ఖాతా, రేషన్‌కార్డుతోపాటు రూ. 15 చెల్లించి ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాలేని వారికి వాటిని సమకూర్చి బీమా పథకం కింద బీమా మిత్ర నమోదు చేస్తారు. బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం కింద జూన్‌, జులై మాసాల్లో పేర్లు నమోదు చేస్తారు.

మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలో పర్యటిస్తూ, ఈ రోజు రెస్ట్ తీసుకున్నారు... అయతే, ఈ మూడు రోజుల నుంచి, నన్ను ఎవరో కొట్టేస్తున్నారు, నా మీదకు రౌడీలు వచ్చారు, గుడ్డలు ఊడదీసి కొడతాను, ఇలా ఎదేదో మాట్లాడుతూ, ఎందుకో తెగ ఇబ్బంది పడుతున్నారు... ఇంకా కామెడీ ఏంటి అంటే, మా బౌన్సర్ లను కొట్టారు, వారి బదులు కొత్త బౌన్సర్ లు రావాలి అందుకే, ఈ రోజు సెలవు అని చెప్పారు... కాని మనం టీవీల్లో, పేపర్ లో చూసింది, బౌన్సర్ లే అక్కడకు వచ్చిన వారిని ఇరగ బాదారు.. ఇంతే కాదు, నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, నన్ను చంపేస్తే చంద్రబాబుదే బాధ్యత అంటూ, పవన్ తీవ్రమైన ఆరోపణలు చేసారు... నిజానికి పవన్ కు వ్యక్తిగత బధ్రత ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చింది.. ఇక్కడ కూడా ఎదో ఊహించుకుని, పవనే వాళ్ళను వెనక్కు పంపించారు.. ఇప్పుడేమో ఇలా.. కాని వాస్తవానికి, శ్రీకాకుళం పోలీసులు పవన్ సభలకు, రోడ్ షో లకు పూర్తి బధ్రత ఇచ్చారు...

pk 24052018 2

పవన్ కళ్యాణ్ మాత్రం, అవాస్తవాలు చెప్తూ, దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటానికి చూస్తున్నాడు.. దీని పై శ్రీకాకుళం ఎస్పీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు... "జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వారి తరుపున... జనసేన ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సందర్బంగా జనసేన పార్టీ నుండి జిల్లా యస్.పి. గారికి వచ్చిన అభ్యర్ధన మేరకు తక్షణమే స్పందించి, జిల్లాలో గల మూడు సబ్-డివిజనల్ పోలీసు అధికారులకు సెక్యూరిటీ పరంగా ఆదేశాలు ఇవ్వడమే కాకుండా జిల్లా తరుపు నుండి (i) పి.యస్.ఓస్, (i) రోప్ పార్టీస్, (i) మల్టీ కాంపోనెంట్, (iv) ట్రాఫిక్ కాంపోనెంట్, (v) లా & ఆర్డర్ కాంపోనెంట్ మరియు పవన్ కళ్యాణ్ గారు బస చేసిన విడిది వద్ద తగిన బందోబస్తీ ఏర్పాట్లు చేయడం జరిగింది. బందోబస్తీ విషయంలో ఎక్కడా రాజీ లేదని, బౌన్సర్ల పై దాడి చేసినట్లు, దెబ్బలు తగిలినట్లు పోలీసు వారికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని జిల్లా యస్.పి. గారు ఒక ప్రకటన ద్వారా తెలియచేసినారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీకాకుళం."

pk 24052018 3

ఇదే విషయం పై డీజీపీ మాలకొండయ్య కూడా స్పందించారు. జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ భద్రతపై ఎలాంటి అయోమయం లేదని డీజీపీ మాలకొండయ్య పేర్కొన్నారు. గురువారం అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... స్థానిక నేతలు జిల్లాల ఎస్పీలతో మాట్లాడితే భద్రతా చర్యలు తీసుకుంటారని, ఇందులో ఎటువంటి అయోమయాలకు తావులేదన్నారు. ఒక పక్క పోలీసులు అధికారులు రాత పూర్వకంగా చెప్తున్నా, మరి పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయనకే తెలియాలి.. ఇలా చెప్తే కాని, ప్రజల్లో సానుభూతి రాదేమో అని, కొత్త సలహాదారుడు చింతలబస్తీ దేవ్ ఏమన్నా చెప్పాడేమో కాని, ఇంత చేస్తున్నా పోలీసులుల మీద నిందలు వేసి, పబ్బం గడుపుకోవటం మాత్రం తప్పు. మా నాన్న కానిస్టేబుల్ అని చెప్పే పవన్, ఇలా పోలీసుల పై అవాస్తవాలు చెప్పకూడదు...

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా తొలగించబడిన తరువాత రమణ దీక్షితులు చేస్తున్న విమర్శలపై టీటీడీ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఆలయ ప్రతిష్ఠను దిగజార్చేలా ఆయన మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ, ఉద్యోగులు మూకుమ్మడి నిరసనకు దిగారు. మూడు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. దేవాలయంలో స్వామికి సకాలంలో నైవేద్యం పెట్టడం లేదని, పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరగడం లేదని, స్వామి సంపదను అధికారులు కొల్లగొడుతున్నారని, నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కావాలనే ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ ఉద్యోగ సంఘం ప్రతినిధులు ప్రత్యారోపణలు చేస్తున్నారు.

ttd 24052018 2

అలాగే, రేపు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు విధులు బహిష్కరించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకుని తీర్మానం చేశాయి. తిరుపతి పరిపాలన భవనంలో అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై చర్చించి న‌ర్ణ‌యం తీసుకున్నారు. అర్చ‌కులు, ఉద్యోగులు న‌ల్ల‌బ్యాడ్జీల‌తో నిర‌స‌న తెలుపుతూ విధులు నిర్వ‌ర్తిస్తున్న నిరసనకు, ఇది తోడు. ఈ నిరసనా పై, టిటిడి ఉద్యోగులు మాట్లాడుతూ రమక్ష దీక్షితులు పాలకవర్గంపై కక్షతో తిరుమల తిరుపతి దేవస్థానంలో నగలు మాయం అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తద్వారా తితిదే ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మాట్లాడని రమణ దీక్షితులు ఇప్పుడెందు ఆరోపణలు చేస్తున్నారో ప్రజలకు అర్థమైందన్నారు. కావాలనే ఇలా చేయడం ద్వారా తితిదే ప్రతిష్ట దెబ్బతింటుందని, ఇలాంటి వ్యాఖ్యలను మానుకోవాలని వారు రమణ దీక్షితులకు విజ్ఞప్తి చేశారు.

ttd 24052018 3

తిరుమలలో ఆలయ పవిత్రతను దిగజార్చేలా రమణ దీక్షితులు ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. టీటీడీలో పరిపాలన తీరు బాగోలేదని, అవినీతి జరుగుతోందని, గులాబీ వజ్రం పోయిందని తీవ్ర ఆరోపణలు చేస్తోన్న రమణ దీక్షితులు నిన్న ఢిల్లీకి సైతం వెళ్లి పలువురు బీజేపీ నేతలతో కూడా చర్చించారు. బీజేపీ ఈ విషయం పై, వెనుక ఉండి నడిపిస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా, బీజేపీకి చెందిన ఒక నేషనల్ మీడియా ఛానల్ కూడా, ఈ విషయం పై విషం చిమ్మింది. తిరుమల వ్యవహారాలు ఎన్నడూ లేనంతగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్ప‌టికే భ‌క్తులు ఆందోళ‌న చెందుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read