అమరావతి అంటే చాలు అన్ని వైపుల నుంచి, విషం చిమ్మే ఒక జాతి మన రాష్ట్రంలో చేస్తున్న పనులు చూస్తూనే ఉన్నాం... రాజధాని శంకుస్థాపనకు నన్ను పిలవద్దు, నేను రాను అన్నోడు, అదే రాజధాని గురించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు... రాజధానిలో ఒక్క ఇటుక అయినా పేర్చారా అని హేళన చేస్తున్నారు... రికార్డు టైంలో దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా కట్టిన, సచివాలయం కనిపించలేదు ఈయనకు... రెండు జాతీయ స్థాయిలో టాప్ యూనివర్సిటీలు మొదలైనా కనిపించిలా... సీడ్ యాక్సెస్ రోడ్ తో పాటు, మరిన్న రోడ్డులు పూర్తవుతున్నా, ఇంకా ఎన్నో పనులు జరుగుతున్నా కనిపించలా... సంవత్సర కాలం నుంచి, జరుగుతున్న విషయాలు తెలియవు ఏమో పాపం... మరో వైపు నుంచి ఇంకో కొత్త హీరో వచ్చాడు.. ఏమి మాట్లడతాడో త్లెఇయదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు..

amaravati 23052018 2

అమరావతి మీద విషం చిమ్ముతూ పుస్తకాలు రాస్తే, ఈయన వచ్చి ఆ పుస్తకం ఆవిష్కరిస్తాడు... మరో పక్క బీజేపీ నాయకులు, మీకు లక్ష కోట్లు ఇచ్చాం పండగ చేసుకోండి అంటారు.. మీకు అమరావతి అవసరమా అంటారు... మీ మోఖలకి మయసభ కట్టుకుంటారా అంటారు... ఇలాంటి వారి కోసం సిఆర్డీఏ ఒక వీడియో రిలీజ్ చేసింది.. అందులో ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న అని పనులు, ఏమి ఉన్నాయి, ఎలా సాగుతున్నాయి లాంటివి చూడవచ్చు.. వీడియో ఒక్కటే కాదు, 156 పేజీల స్టేటస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ మూడు సంవత్సరాల్లో అమరావతిలో ఏమి జరిగింది, డేట్ వైజ్ రిపోర్ట్ ఇచ్చింది... ఎన్ని పనులు జరుగుతున్నాయో సవివరంగా చెప్పింది.. అంతే కాదు భూములు త్యాగం చేసిన రైతన్నల కోసం ఏమి చేస్తుంది చెప్పింది... పెన్షన్లు, నైపుణ్య శిక్షణ, ప్లాట్ల కేటాయింపు ఇలా అన్ని వివరాలు చెప్పింది.... 91 పేజిలో దాదాపు 46 సంస్థలు పెట్టుబడి పెట్టటానికి సిద్ధంగా ఉన్నాయని అని వివరించి, ఎంత పెట్టుబడి పెట్టేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చేది, ప్రస్తుతం ప్రాజెక్ట్ స్థితి ఇలా అన్నీ వివరించింది.

amaravati 23052018 3

ప్రపంచం లోనే ఇంత వేగం గా ఒక కొలిక్కి వస్తున్న నూతన రాజధాని నిర్మాణం అమరావతి ఒక్కటే ..అది కూడా ప్రభుత్వం దగ్గర తగినంత భూమి , నిధులు లేకపోయినా కూడా...కేవలం ఒకే ఒక్క వ్యక్తి మీద నమ్మకంతో, 33 వేల ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసారు రైతులు... అమరావతి మీద విషం చిమ్ముతూ, నిత్యం దాన్ని నాశనం కోరుకునే సైకోలకి, ఈ రిపోర్ట్ అంకితం... మీకు బుర్ర ఉంటే ఇలాంటివి చదివి అర్ధం చేసుకు చావండి... ఈ వీడియో చూడండి, డిటైల్డ్ రిపోర్ట్ చూడండి, రాజధాని కోసం, ఏ రోజు ఏ పని చేసారో, ఏ పనులు జరుగుతున్నాయో తెలుస్తుంది. వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/K_XPss7tnJc ... రిపోర్ట్ ఇక్కడ చూడవచ్చు... https://crda.ap.gov.in/crda_norifications/NOT04089564/01~Amaravati%20Project%20Report%20Edition%20No3%20Status%20March%202018-compressed.pdf

వెనకాల బీజేపీ పెద్దలు ఉన్నారు, వారి ట్యూన్ కి తగ్గట్టు డాన్స్ వేద్దాం అని, వేషాలు వేసిన బీజేపీ అనుకూల నేషనల్ మీడియా ఛానల్ కు తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది... ఈ నేషనల్ మీడియా ప్రతినిధి, ఎదో కాంగ్రెస్ పార్టీతో ఆడినట్టు ఆటలు అనుకున్నాడు పాపం... ఇక్కడ ఉంది ఆంధ్రా వాడు అని మర్చిపోయాడు... అందుకే చివరకు వెంకన్న పేరుతో రాజకీయాలు చెయ్యాలని అనుకున్నాడు, తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తూ కధనాలు వేసాడు... వాళ్ళ బాస్ లను ప్రసన్నం చేసుకోవటానికి, వెంకన్నను రాజకీయాల్లోకి లాగాడు... ఇవన్నీ చూసిన తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది... తిరుమల పవిత్రతను, స్వామి వారి ప్రతిష్టతను అసత్య కధనాలతో దెబ్బ తీసి, ప్రజల్లో ఆందోళన, అవమానాలు కలిగించిన వారికి, కోర్ట్ నోటీసులు పంపించేందుకు నిర్ణయం తీసుకుంది..

media 23052018 2

నోటీసులు ఒక్కటే కాదు, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోనుంది.. తిరుమల శ్రీవేంకటేశ్వరుడిపై ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు అచంచల భక్తి విశ్వాసాలతో ఉన్నారని.. వారి మనోభావాలను దెబ్బతీసే విధం గా అక్కడ కీలక స్థానాల్లో పనిచేసిన వారే వ్యవహరించడం దారుణమని భావిస్తోంది. ప్రధాన అర్చకుడిగా తనకు తప్ప వేరొకరికి అవకాశం రాకూడదన్న దురుద్దేశంతో రమణదీక్షితులు వ్యవహరిస్తున్నారని.. గతంలో ఆయన అనేక తప్పులు చేశారని ఆక్షేపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఏకంగా స్వామివారికి జరిగే సేవలపై నే ఆరోపణలు చేయడం ద్వారా ఆలయ పవిత్రతను దెబ్బతీసే కుట్ర చేశారని ప్రభుత్వ, టీటీడీ వర్గాలు అం టున్నాయి. ఈ వివాదానికి బాధ్యులైన రమణదీక్షితు లు, మాజీ ఈవో-సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావులతో పాటు టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న ఒక జాతీయ చానల్‌పైనా క్రిమినల్‌ కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

media 23052018 3

టీటీడీ లీగల్‌ విభాగంతో మాట్లాడి.. ఈ దిశగా ముందుకు వెళ్లనున్నారు. తితిదే ఛైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మంగళవారమిక్కడ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. రమణదీక్షితులు ఇతర రాష్ట్రంలో విలేకరుల సమావేశం పెట్టి రాజకీయ నాయకుడిలా మాట్లాడడం.. రాజకీయ పార్టీల నేతలను కలవడం.. ప్రైవేటుగా పూజలు, హోమాలు చేయడం తదితర అంశాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం. తాను ప్రధాన అర్చకుడి హోదాలో ఉన్నంత కాలం అన్నీ బాగానే ఉన్నాయన్న వ్యక్తి.. కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ఒక విధానం తీసుకురాగానే నానా యాగీ చేసి పవిత్రతకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. స్వామివారికి అన్ని సేవలు, కైంకర్యాలు సంప్రదాయబద్ధంగానే జరుగుతున్నాయని తెలిసినా.. కేవలం తమ స్వార్దం కోసం కొందరు విమర్శలు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. దీనిపై టీటీడీ పాలక మండలిలో చర్చించి.. ఒక తీర్మానం చేసి.. వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మాపై ఎందుకీ వివక్ష? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి లేదా? మాకు ఇది జీవన్మరణ సమస్య. విశాఖ రైల్వేజోన్‌ మా హక్కు. దానికి అడ్డుచెబితే మీ అడ్రస్‌ గల్లంతే’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ధర్మపోరాట సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తిరుమలలో వెంకన్న పేరుతో చేస్తున్న రాజకీయం పై మండి పడ్డారు... వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే వడ్డీతో సహా అపరాధం చెల్లించుకోవాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు... టీటీడీపై లేనిపోని అనుమానాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

venkanna 22052018 2

‘‘నాకు వెంకటేశ్వరస్వామిపై చాలా భక్తి. వెంకటేశ్వరస్వామి నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తున్నారు. ఆ రోజు బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వ లాంఛనాలు తీసుకు వెళ్తుంటే 24 గ్లేమోర్ మైన్స్ నాపై పేల్చినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వరస్వామే నా ప్రాణాలు కాపాడాడు. ఏదో ఒక పర్పస్ కోసం.. నాతో ఏదో ఒక పని చేపించాలని కాపాడాడు. ఎవరితోనైనా పెట్టుకోండి.. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే వడ్డీతో సహా అపరాధం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరైనా మొక్కు కోరి ఒక్క రూపాయి అయినా ఇవ్వకపోయినా ఆయన వదిలిపెట్టరు. ఆయనకు అపచారం తలపెట్టిన వాడు... ఈ జీవితంలోనే తప్పకుండా పనిష్మెంట్లు తీసుకుంటారు. అది ఆయన కుండే మహిమ. అందుకనే ప్రతి ఒక్కరూ వెంకటేశ్వరస్వామి దగ్గరకి వస్తారు.’’ అని అన్నారు.

venkanna 22052018 3

‘‘ఎప్పుడో 1952లో గులాబీ రంగు వజ్రం పోయిందని, అన్నీ రికార్డులన్నీ ఎస్టాబ్లిస్ చేశారు. చాలాసార్లు రిపోర్టు కూడా వేశారు. జగన్నాథరావు కమిషన్ కూడా వేశారు. అంతేకాదు ఇంకో కమిటీ కూడా వేశారు. ఇది వజ్రం కాదు. కెంపు మాత్రమే అని ఆ రెండు కమిటీలు 2011లోనే చెప్పాయి. ఇప్పుడున్న కృష్ణారావు ఆనాడు ఈవోగా ఉన్నాడు. అది వజ్రం కాదు, కెంపు మాత్రమే అని ఆ రోజు ఆయన గవర్నమెంట్‌కి రిపోర్టు పంపించారు. పోటులో ఏదో జరిగిపోయిందని, అక్కడేదో గుప్త నిధులున్నాయని, ఎవరో తవ్వుతున్నారని వీళ్లకు కలొచ్చింది. పోటులో వెంకటేశ్వరస్వామికి భోజనం తయారు చేస్తారు. వెంకటేశ్వరస్వామి తల్లి వకులాదేవి అక్కడ వంట గది అంతా సూపర్ వైజ్ చేస్తుంది. అక్కడ ఏమీ జరగకపోయినా ప్రజల్లో అనుమానం వచ్చేలా లేనిపోనివి చేయడానికి ప్రయత్నం చేశారు.’’ అని అన్నారు.

నిన్న నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు(ఎన్‌ఐడీఎం) కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో శంకుస్థాపన చేశారు ఉప రాష్ట్రపతి వెంకయ్య.. ఈ సందర్భంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యల పై ఢిల్లీ బీజేపీ పెద్దలు షాక్ కు గురయ్యారని సమాచారం.. ప్రస్తుతం చంద్రబాబు, బీజేపీ పై ఒక యుద్ధమే చేస్తున్నారు... మొన్నటి వరకు మోడీ, షా జైత్ర యాత్రకు ఎదురు లేదు అనుకుంటున్న టైంలో, చంద్రబాబు ఎంటర్ అవ్వటం, మోడీని ఏకి పడేయటం, కర్ణాటకలో బీజేపీని ఓడించాలని పిలుపు ఇవ్వటం, ఇవన్నీ బీజేపీ పెద్దలకు మింగుడు పడటం లేదు.. ఒక పక్క అమిత్ షా పై తిరుపతిలో నిరసన, మరో పక్క కర్ణాటక ఓటమికి తెలుగు వారే కారణం అనుకుంటూ, బీజేపీ పెద్దలు చంద్రబాబు పై ఆగ్రహంగా ఉన్న వేళ, నిన్న అమరావతిలో వెంకయ్య మాటలు బీజేపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు..

venkayya 23052018 2

‘‘నేను కేంద్ర మంత్రిగా ఉండగా, రాష్ట్రానికి కేంద్ర సంస్థలు వచ్చేందుకు ఉన్న అవకాశాలను ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పేవాడిని. ఆయన చొరవ తీసుకొని, ఆ సంస్థల ఏర్పాటు కోసం భూములను కేటాయించేవారు. దానివల్లే ఇప్పుడు భారీ సంఖ్యలో కేంద్ర సంస్థలు ఏపీకి వస్తున్నాయి’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చంద్రబాబు పై ప్రసంసలు కురిపించారు... ‘‘కొండపావులూరులో 400 ఎకరాలకు పైగా భూముల్లో అనేక కేంద్ర సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 25 ఎకరాలలో, ఆయుష్‌ 25 ఎకరాలలో, ఎన్‌ఐడీఎం 10 ఎకరాలలో, ఐఐపీఎం 15 ఎకరాలలో, అమరావతి యూనివర్శిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ 100 ఎకరాలలో, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ 25 ఎకరాలలో కొలువు తీరబోతున్నాయి’’ అని వెంకయ్య వివరించారు. ..

venkayya 23052018 3

ఒక పక్క బీజేపీ వాళ్ళు ఇవన్నీ మా మోడీ పెట్టిన బిక్ష అంటూ ఉంటే, ఇప్పుడు సాక్షాత్తు ఉప రాష్ట్రపతి వచ్చి, చంద్రబాబు పై కృషి వల్లే అన్నీ సాధ్యం అయ్యాయి అని చెప్పారు... చంద్రబాబుకీ, బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇలాంటి పరిస్థితుల్ల్లో కూడా వెంకయ్య నాయుడు గారు చంద్రబాబుకి కితాబు ఇస్తన్నారంటే , అర్ధం కావట్లా ఎవరు ఏంటో అని ? వెంకయ్య నాయుడుని తప్పించి బీజేపీ పార్టీ అతి పెద్ద తప్పు చేసింది అనుకునే లోపే, చంద్రబాబుతో సున్నం పెట్టుకుని అంతకంటే పెద్ద తప్పు చేసింది. డబల్ సూసైడ్ అన్నట్టు.. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయడు.. వీళ్ళ స్థాయి ఏంటి, అనుభవం ఏంటి ? సమర్ధత ఏంటి ? వీళ్ళకీ, ఇప్పుడు కొత్తగా వచ్చి మిడిసి పడతన్న బ్యాచ్ కీ ఏవన్నా తేడా ఉందా ?

Advertisements

Latest Articles

Most Read