చంద్రబాబు అనే నాయకుడు ఎలాంటి పరిపాలన దక్షకుడు అనేది అందరికీ తెలుసు... ఇలాంటి నాయకుడు మీద, నిన్న సాక్షి అనే ఒక రాజకీయ నాయకుడు ఛానల్ లో, "ఎండలు తగ్గించమని, చంద్రబాబు హుకం.. అవాక్కయిన అధికారులు అంటూ" ఒక చెత్త వార్తా ప్రచురించారు.. అది పట్టుకుని, సోషల్ మీడియాలో చంద్రబాబుని హేళన చెయ్యటం ప్రారంభించారు...చంద్రబాబు లాంటి వాడు, ఇలా మాట్లడుతురా ? ఎంత సిల్లీగా వీరి ప్రచారం ఉంటుంది అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ... వీరికి ఒక్క ప్రజా సమస్య లేదు.. ఇంత ఎండల్లో కూడా, ఎక్కడా త్రాగు నీరుకు ఇబ్బంది అనే వార్తలు లేవు... అందుకే ఏమి చెయ్యాలో తెలియక, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించి, ఆనందం పొందుతూ, ఎదో సాధించినట్టు ఒక్కొక్కడు సైకో ఆనందం పొందుతున్నారు...

neeruchettu 22052018 2

నిజానికి వాస్తవం వేరు... నిన్న నీరు ప్రగతి పై, ప్రెస్ కి ఇచ్చిన నోట్ ఇది... కింద రెడ్ మార్క్ పెట్టింది చూడండి... అది పట్టుకుని ఎవడికి కావాల్సింది వాళ్ళు రాసుకుంటూ, చంద్రబాబు అలా అన్నారు అంటూ, పిచ్చ ప్రచారం చేస్తూ, హడావిడి చేసారు.... నిన్న నీరు ప్రగతి పై జరిగిన సమీక్షలో చంద్రబాబు చెప్పింది ఇది... "వేసవిలో వడగాడ్పులు పెరిగే అవకాశం ఉంది.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ నీటి నిల్వలు పెంచుకోవాలి... రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు తగ్గేలా చూడాలి... చెరువులు,కాలువలు,జలాశయాల్లో నీటినిల్వలు పెంచాలి... పచ్చదనం,తుంపర సేద్యం ద్వారా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల"... ఇది చంద్రబాబు చెప్పింది... దీంట్లో తప్పు ఏమన్నా ఉందా ?

neeruchettu 22052018 3

చంద్రబాబుని విమర్శించే వారు, రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి అమీర్పేట్ చౌరస్తా లో టెంపరేచర్ ఎంత ఉందో చూడండి.... తరువాత సంజీవయ్య పార్క్ లో ఒక చెట్టు కింద కూర్చుని టెంపరేచర్ ఎంత ఉందో చూడండి... అప్పుడు చంద్రబాబు చెప్పే 10 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఎలా తగ్గించమని చెప్పారో అర్ధమౌతుంది... బుర్ర ఉన్నవాడు ఎవరైనా ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే దానికర్థం చెట్లు పెంచటం లాంటివి అని అనుకుంటారు. అది లేని వాళ్ళు ఇలాగే కామెడీలు చేసుకుంటూ వుంటారు. ఉదాహరణకు 1.5దశాబ్దం క్రితం ఇంకుడు గుంతలు అంటే పిచ్చి నవ్వులు వెటకారాలు. మరి ఇప్పుడు తెలుసుగా అవి లేకపోతే ఇల్లు కట్టుకోవటానికి పర్మిషన్ కూడా ఇవ్వరు... చంద్రబాబు కాలి గోటి కూడా సరిపోని వీరు, ఇలా విష ప్రచారం చేస్తూ, ఆయన్ను కించ పరిచే ప్రయత్నం చేస్తున్నారు...

శ్రీ వారి పింక్ డైమెండ్ పోయింది అని, అది జెనీవాలో ఇటీవల వేలం వేశారని, 500 కోట్లకు అమ్ముడు పోయింది అంటూ, రమణ దీక్షితులు గారు, ఆయనకు బాకా కొడుతూ బీజేపీ, వైసీపీ, జనసేన నేతలు ఎలా విష ప్రచారం చేస్తున్నారో చూస్తున్నాం.... చంద్రబాబు పై నిత్యం విషం చిమ్మే జగన్ పత్రిక దాని, ఆంధ్ర బ్య్యూరో, వాళ్ళు అది జెనీవాలో అమ్ముడు పోని వజ్రమేనా, ఈ దీక్షితులు చెప్తున్న వజ్రం అని వార్తలు రాసారు. ఇక అది పట్టుకుని, బీహార్, చింతలబస్తీ బ్యాచ్ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి... అయితే, ఇది అవాస్తవం అని తేలింది.. ఆధారాలుతో సహా, బయట పెట్టారు...

diamond 22052018 2

ఆ జెనీవా వజ్రం గురించి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్, ఒక ఆర్టికల్ రాసింది... జెనీవాలో అమ్మకానికి పెట్టిన 37.30 క్యారెట్ పింక్ వజ్రం (రాజ్-పింక్) 2015 సంవత్సరంలో ఆఫ్రికాలో దొరికింది.. ముడి వజ్రం చాలా పెద్దది. దాదాపు ఒక సంవత్సరం పాటు విశ్లేషణ చేసి సాన పెట్టి , అంగుళీయ రూపంలో వేలం ద్వారా అమ్మకానికి పెట్టారు. ప్రపంచ విఖ్యాత వేలం సంస్థ సోతెబీ‌స్ ద్వారా యీ అమ్మకం ప్రక్రియ జెనీవాలో జరిగింది. సరియైన పాటదారు రాక వేలంలో అమ్ముడు పోలేదు... అమ్మకందారు ఇరవై నుండి ముప్పై మిలియన్ అమెరికన్ డాలర్ల ధర వస్తుందని ఆశించాడు. ఆ ధర రాకపోవడంతో అమ్మకం జరుగలేదు. 14 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర్ మాత్రమే వచ్చింది.. ఆ పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు https://af.reuters.com/article/worldNews/idAFKBN1DF30H

diamond 22052018 3

2015 లో ఆఫ్రికాలో దొరికిన ముడి వజ్రం సానపెట్టబడిన తర్వాత 2017 సంవత్సరంలో అమ్మకానికి వచ్చింది... 2015లో ఆఫ్రికాలో దొరికిన వజ్రం, అది దశాబ్దాల క్రితం మైసూర్ మహారాజా గారు వెంకన్న స్వామికి ఇచ్చిన కెంపు, మన దీక్షితులు గారికి, సాక్షి లాంటి విషం చిమ్మే చానల్స్ కు రూపాంతరం చెంది, వజ్రంగా మారి 500 కోట్ల రూపాయలకు ఎలా అమ్ముడు పోయిందో ? ఏడుకొండల వాడా వెంకట"రమణా" గోవిందా గోవిందా, నీ వస్తువుల గురించే అసత్యాలాడే వారు ఏమౌతారో ? నువ్వే చూసుకోవాలి స్వామీ...

అధికవడ్డీ ఆశచూపి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ సంస్థలో మరో కీలక అరెస్ట్ జరిగింది. అగ్రిగోల్డ్ మోసం బయటకు వచ్చినప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న వైస్ ఛైర్మన్ అవ్వా సీతారామారావు ఎట్టకేటలకు పట్టుబడ్డాడు. సీఐడీ పోలీసులు దిల్లీలో అరెస్ట్ చేశారు. సీతారాం గతంలో అగ్రిగోల్డ్ కు డైరక్టర్‌గా వ్యవహరించాడు. కంపెనీ లావాదేవీలను తెరవెనుక నుండి నడిపించేవాడు. అగ్రిగోల్డ్ పై కేసు నమోదు తర్వాత సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ముందస్తు బెయిల్ కోసం ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌ను సంప్రదించాడు. అయితే హైకోర్టు బెయిల్ నిరాకరించటంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న తనవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు.

cid 22052018 2

అగ్రిగోల్డ్ సంస్థలను వేలంలో కొనేందుకు ముందుకొచ్చిన ఎస్సెల్ గ్రూప్ సంస్థలను సీతారామారావు ప్రభావితం చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సీఐడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సీతారాంను ఎట్టకేలకు సీఐడీ పోలీసులు గూడ్‌గావ్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడ్ని స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై రేపు ఉదయం విజయవాడకు తీసుకువచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. అగ్రిగోల్డ్ అసలు ఆస్తులెంత? లావాదేవీలు ఎలా జరిగాయి? అనే విషయాలపై సీతారామారావును పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.

cid 22052018 3

గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న సీతారామారావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆయన ఢిల్లీలో తలదాచుకున్నారని తెలుసుకుని ట్రాప్ చేశారు. ఏపీ నుంచి వెళ్లిన సీఐడీ అధికారులు ఢిల్లీలో సీతారామారావును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొదటి నుంచి సీతారామారావు ప్రమేయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పోలీసుల అదుపులో ఉన్న సీతారామారావును విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో వైస్ ఛైర్మన్ అవ్వాస్ సీతారామారావును అరెస్టు చేయడం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం అధ్యక్షుడు ముపాళ్ళ నాగేశ్వరరావు, తిరుపతిరావు హర్షం వ్యక్తం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న, మొన్న కొన్ని కొత్త అంశాలు బయటికి వచ్చాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ అన్నారు. టీటీడీ వివాదంపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని అంశాలపై చట్టపరంగా ముందుకెళ్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల పవిత్రతకు భంగం కలగకూడదని సీఎం చెప్పారన్నారు. శ్రీవారి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని... ఆలయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తితిదేపై ఆరోపణలు చేస్తుండటం.. దీనికి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో పాటు మరికొందరు వంత పాడుతున్న నేపథ్యంలో..

ttd eo 22052018 2

తితిదే నిర్వహణపై అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పాలకమండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌తో పాటు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ... ఆలయ పవిత్రతకు భంగం కలిగించకుడా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తమను ఆదేశించినట్లు తెలిపారు. శ్రీవారికి వచ్చే నిధులన్నింటినీ సక్రమంగా వినియోగిస్తున్నామని.. ఎలాంటి దుర్వినియోగం చేయడం లేదన్నారు. శ్రీవారికి జరిగే కైంకర్యాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయన్నారు.

ttd eo 22052018 3

రమణ దీక్షతులు ఆరోపిస్తున్నట్లుగా శ్రీవారి బూందీ పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు. స్వామివారి నగలకు సంబంధించి 1952 నుంచి పక్కా లెక్కలు ఉన్నాయని.. ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. శ్రీవారి ఆభరణాల్లో ఏది ఎవరిచ్చారన్న సమాచారం సమగ్రంగా లేకపోయినా.. 1952 రికార్టుల్లో ఉన్ననగలన్నీ భద్రంగా ఉన్నాయన్నారు. తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాట్లడుతూ..ఇటీవల జెనీవాలో వేలం వేసిన గులాజీ రంగు వజ్రం శ్రీవారిదేనంటూ రమణ దీక్షితులు అనుమానం వ్యక్తం చేయడంపై స్పందించారు. అసలు అలాంటి వజ్రమే స్వామివారికి ఉన్నట్లు లెక్కల్లో లేదని.. లేని వజ్రాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read