నెల్లూరు సోగ్గాడు, పాపులర్ పొలిటీషియన్, టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డి పాటు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరారు. విలక్షణమైన వ్యక్తిత్వం, మాటతీరు, వేషధారణతో నెల్లూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్‌గా పేరొందిన ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడితోపాటు హస్తం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఆనం మృతితో టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

aanam 25042018 1

ఆనం వివేకా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియడంతో ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ నాయుడు,మంత్రులు ,ఇతర పార్టీ నేతలు హైదరాబాద్ వెళ్లి ప్రత్యేకంగా ఆయనను పరామర్శించి వచ్చారు. గత ఏడాది జూలై నుంచి ఆనం ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. గతంలో కోర్టుకు హాజరు కావాల్సిన సందర్భంలో అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానంటూ ఆయన న్యాయస్థానానికి సమాచారం అందించారు. దీంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.

aanam 25042018 1

ఇటీవల ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్న ఆనం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు బాబు. ఆనంను పరామర్శించిన వారిలో బాబుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలు ఉన్నారు. కాగా ఆనం ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నెల్లూరు జిల్లా నుంచి ఆయన అభిమానులు భారీగా ఆసుపత్రికి వద్దకు చేరుకుంటున్నారు.

బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురయ్యారు. హై బిపితో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నాలక్ష్మినారాయణ చేరారు. ఇవాళ సాయంత్రం గన్నవరంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని మాజీ మంత్రి కన్నా నిర్ణయించుకున్నారు. పార్టీ మారే విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనైతున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి కూడా తీవ్ర ఒత్తిడికి గురైన కన్నా .. ఆ ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేది వాయిదా పడినట్లే అని సమాచారం అందించింది.

kanna 25042018 1

బీజేపీలో నిన్నమొన్నటి వరకు కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్న కన్నా పార్టీ అధ్యక్ష పదవిపై ఆశ పడ్డారు. బీజేపీలో చేరిన సమయంలో, తగిన ప్రాధ్యానత ఇస్తామని హామీ కూడా ఇచ్చారని కన్నా వర్గీయులు అంటున్నారు.. హరిబాబు రాజీనామాతో అది తనకు ఖాయమని నమ్మారు. అధిష్ఠానం కూడా తొలుత ఆయనకే ఇవ్వాలని భావించినా, పార్టీలోని సీనియర్లను కాదని, బయటి నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పదవి ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్ఠానం వెనక్కి తగ్గింది. దీంతో కినుక వహించిన కన్నా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఏ పార్టీలో చేరాలి అనే విషయం పై కన్నా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం... ఇటు తెలుగుదేశం పార్టీ నానియ్యదు... కాపు పార్టీగా పేరు ఉన్న జనసేన, అసలు అది ఒక పార్టీనో కాదో కూడా అర్ధం కావటం లేదు, మరో పక్క జగన్ రమ్మని ఆహ్వానం పంపుతున్నా, కన్నా వర్గీయులు కూడా అందుకే సై అంటున్నా, జగన్ పార్టీలో చేరిక విషయం పై కన్నా ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తుంది..

kanna 25042018 1

మరో పక్క బీజేపీ విషయానికి వస్తే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒకవేళ బీజేపీలో కొనసాగి.. ఎన్నికల బరిలోకి దిగితే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదన్న భావనకు వచ్చిన ఆయన బీజేపీని వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజులపాటు తన అనుయాయులతో మంతనాలు జరిపి వారి మనోగతానికి అనుగుణంగా వైసీపీలో చేరాలని అయిష్టంగానే ఒప్పుకున్నారు.. ఇప్పటికే తనతో మంతనాలు సాగిస్తున్న వైసీపీ ముఖ్యులతో ఫోన్లో చర్చలు జరిపిన ఈ నెల 25న చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు... ఈ క్రమంలో, నేడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని మీడియాకు లీకులు ఇచ్చారు... అంతలోనే ఆయన అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరారు.

కర్ణాటక శాసనసభకు వచ్చే నెల 12వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటాపోటీగా కృషి చేస్తున్నాయి. అదేసమయంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. అయితే, భారతీయ జనతా పార్టీ తరపున టాలీవుడ్ హీరో సాయికుమార్ బరిలోకి దిగుతున్నారు. సాయికుమార్ మంగళవారం ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోగల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అలాగే గోరంట్లలోగల వినాయక దేవస్థానంలో పూజలు నిర్వహించారు. రాబోయే ఐదేళ్లలోనూ ప్రధానిగా మోదీనే ఉంటారని, కర్ణాటకలోనూ భాజపా ప్రభుత్వం వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

saikumar 24042018 2

కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ వేయడానికి ముందు కదిరి, గోరంట్ల పట్టణానికి విచ్చేసి లక్ష్మీనరసింహస్వామివారిని, వినాయక దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాగేపల్లి వెళ్లి తన అనుచరులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు దృఢ సంకల్పంతో పని చేస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువేళ్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని, ప్రధాని మోదీ తప్పక సహకరిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోదీని కోరతానని, అవసరమైతే ఆయన కాళ్లు పట్టుకుంటానని సాయికుమార్ భావోద్వేగం చెందారు.

saikumar 24042018 3

ప్రధాని మోదీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని సాయికుమార్‌ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. కర్ణాటకలోని బాగేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాయికుమార్ పోటీ చేయనున్నారు. తన తల్లి స్వగ్రామమైన బాగేపల్లి బెంగళూరు నగరానికి అతి సమీపంలోనే ఉన్నప్పటికీ.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉందని ఆయన చెప్పారు. అమ్మ కోరిక మేరకు బాగేపల్లి అభివృద్ధికి తనవంతు కృషి చేయాలనే సంకల్పంతోనే అక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమ ఇలవేల్పు అయిన నారసింహుడి ఆశీస్సులతో నామినేషన్ వేయాలనే ఉద్దేశంతోనే స్వామివారి దర్శనానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఒక్క పైసా కూడా పన్ను పెంచని ప్రభుత్వం, ఇప్పుడు పేదలకు ఇంటి పన్ను మినహాయింపు ఇస్తుంది. రాష్ట్రంలో రూ.2లక్షలలోపు విలువ ఉన్న గ్రామీణ ఇళ్లకు పన్ను మినహాయింపు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 80 లక్షలు ఇళ్లు ఉండగా 44 లక్షల ఇళ్లకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. పూరి గుడిసెలు,మట్టి ఇల్లు,రేకులు,పెంకుటిళ్ళు మొదలైనవన్నీ ఈ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన పంచాయతీరాజ్‌ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

inti pannu 25042018

గత పాలకుల హయాంలో నిర్లక్ష్యం కారణంగా 3200 కోట్లు ఉపాధి హామీ పథకం మెటీరియల్ వెనక్కి వెళ్ళిపోయింది కానీ, ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని, అధునాతన టెక్నాలజి తో డ్యాష్ బోర్డ్ ఏర్పాటు చేసామని, దీని వలన కార్యక్రమాల అమలులో మనం ఎక్కడ ఉన్నాం, ఇతర జిల్లాల పనితీరు తెలుసుకునే అవకాశం వచ్చిందని లోకేష్ తెలిపారు. టెక్నాలజీ సహాయం తో తాగునీటి సమస్యకు చెక్ పెట్టామని, క్షేత్ర స్థాయిలో మీకు ఉన్న సమస్యలు పై నాకు పూర్తి స్థాయి అవగాహన ఉందని, ఒక్కొక్కటిగా మీ సమస్యలను పరిష్కరిస్తున్నాని లోకేష్ అన్నారు... ఇంకా కొన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాను అని చెప్పారు...

inti pannu 25042018

ఉపాధిహామీ పథకంలో భాగంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగస్తులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయం వలన 481 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కలుగుతుందని, క్షేత్ర సహాయకులు ప్రమాదంలో మరణిస్తే చెల్లించే పరిహారాన్ని 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచామని, ప్రమాద సమయంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే చెల్లించే నష్ట పరిహారాన్ని లక్షన్నర నుండి 3 లక్షలకు పెంచామని లోకేష్ చెప్పారు. "అతి చిన్న వయస్సులో గ్రామాలకు సేవ చేసే అదృష్టం నాకు వచ్చింది మీ సహకారం పూర్తి స్థాయి లో ఉండాలి. ఒక యువకుడినైనా నా పై ఎంతో నమ్మకంతో పెద్ద బాధ్యత ఇచ్చారు. మీ సహకారంతో విజయం సాధిస్తే భవిష్యత్తులో మరికొంతమంది యువకులకు కీలక బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుందని" లోకేష్ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read