తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా, మీడియా పై ట్వీట్లు చేస్తూ, కొన్ని మీడియా చానల్స్ ని బ్యాన్ చెయ్యాలని చెప్పిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో, కొన్ని మీడియా చానల్స్ పై మరీ పర్సనల్ గా వెళ్ళిపోయాడు పవన్... శ్రీ రెడ్డి, పవన్ తల్లిని తిడుతూ చెప్పిన వీడియో, ఏ మీడియా ఛానల్ కూడా డైరెక్ట్ గా వెయ్యలేదు... ఆ పదాన్ని బీప్ చేసి వేసాయి... కాని పవన్ మాత్రం, ఒక ఛానల్ వీడియో పోస్ట్ చేసి, ఆ పదం బీప్ లేకుండా ఉన్న వీడియో ఒక పోస్ట్ చేసారు... అయితే, ఈ విషయం పై ఆ ఛానల్ వెరిఫై చేసుకోగా, వారి వీడియోస్ లో, ఆ పదం బీప్ చేసిన తరువాతే ప్రసారం చేసినట్టు తేలింది... దీంతో పవన్, ఆ వీడియోని ట్యాంపరింగ్ / ఆడియో మార్ఫింగ్ చేసి తన ట్వీట్టర్ లో పోస్ట్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది...

pawan kalyan 26042018 2

మూడు రోజుల క్రితమే ఈ విషయం పై, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి... ఇదే విషయం పై, జర్నలిస్ట్ సంఘాలు అన్నీ ఏకం అయ్యాయి... కుట్రతోనే, పవన్ ఇలా చేస్తున్నారని నిర్ధారణకు వచ్చాయి... జర్నలిస్ట్ సంఘాలు అందరూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు... కేసు నమోదు చెయ్యాలని, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు... ఈ విషయం పై పోలీసులు ప్రాధమిక విచారణ చేసారు... ప్రాధమిక విచారణలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను ట్యాంపరింగ్ చేసినట్టు నిర్ధారణ వచ్చారు... దీంతో, పవన్‌పై ఐపీసీ 469, 504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు...

pawan kalyan 26042018 3

ఇప్పుడు పోలీసులు మరింత లోతుగా విచారణ చెయ్యనున్నారు... ఈ విచారణలో పవన్, ఇలా ఎందుకు చేసారు, దీని వెనుక కుట్ర ఎమన్నా ఉందా ? పవన్ ఒక్కడే ఈ కుట్రలో ఉన్నాడా ? అనేది పోలీసుల విచారణలో తెలుస్తుంది... అయితే, ఈ సెక్షన్ల్ కింద పవన్ ట్యాంపరింగ్ చేసినట్టు నిర్ధారణ అయితే మాత్రం, గరిష్టంగా ఏడేళ్లు, కనిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. జైలు శిక్షతో పాటు జరిమానా దీనికి అదనం... మరి పోలీసులు ఈ విచారణ ఎటు వైపు తీసుకువెళ్తారు ? లేక పవన్, మీడియా కంప్రోమైజ్ అవుతారా అనేది చూడాల్సి ఉంది... మరో పక్క ఈ కేసు తెలంగాణాలో రిజిస్టర్ అయ్యింది కాబట్టి సరిపోయింది కాని, ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయ్యి ఉంటే, ఈ పాటికి పవన్ కళ్యాణ్ ఎంత గోల చేసే వాడో...

వైసిపీ, బీజేపీ బంధం ఓపెన్ అయిపోతుంది... ఇక విజయసాయి రెడ్డి, ఏ మీడియా వాడు చూస్తాడా అని దొంగ చాటుగా వెళ్లి మోడీని కలవాల్సిన పని ఉండదు... జగన్ మోహన్ రెడ్డి, కేసుల గురించి భయపడాల్సిన పని లేదు... ఇక ముసుగులో గుద్దులాటలు లేవు... అంతా ఓపెనే... ఈ రోజు కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే విజయవాడలో పర్యటించారు... ఈ సందర్భంలో ఆయన జగన్ పై చేసిన వ్యాఖ్యలు అదిరేలా ఉంటే, జగన్ కేసుల పై చేసిన వ్యాఖ్యలు బెదిరేలా ఉన్నాయి... మొత్తానికి, అనుకున్న ప్లాన్ ప్రకారం, స్టెప్ బై స్టెప్, వైసిపీ - బీజేపీ త్వరలోనే కలిసిపోతున్నాయి... విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రి అవ్వటం, జగన్ కేసులు ఒక్కోటి వీగిపోవటం, మనం చూడ బోతున్నాం... ఈ రోజు విజయావాడలో కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా హాట్ టాఫిక్‌గా మారాయి.

jagna nda 26042018

ఓ వైపు ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం తొందరపాటు చర్య అంటూనే.. మరోవైపు వైసీపీ రాకపై సానుకూలంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్‌ ఎన్డీయేతో కలిస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జగన్‌పై ఉన్న కేసుల గురించి ప్రస్తావిస్తూ.. జగన్‌పై ఉన్న కేసుల్లో ఏవీ ఇంకా నిరూపితం కాలేదని రాందాస్‌ అథవాలే చెప్పుకొచ్చారు. అవి కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిన కేసులని, అవి ఇంకా నిరూపితం కాలేదని అన్నారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశం అవుతున్నాయి. మరో పక్క ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం బాధించిందంటూనే 2019లో చంద్రబాబు తిరిగి ఎన్డీయేలోకి వస్తే బాగుంటుందని అన్నారు. అలా జరగని పక్షంలో జగన్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తామని అన్నారు.

jagna nda 26042018

వైసీపీతో లోపాయికారీ ఒప్పందంతోనే కేంద్రం ఏపీని పట్టించుకోవట్లేదన్న టీడీపీ చేస్తున్న ఆరోపణలకు రాందాస్‌ అథవాలే కామెంట్లు బలం చేకూర్చేలా కనబడుతున్నాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే, ఇదంతా అందరూ ఊహించిన పరిణామమే... కాకపోతే, ఇంత తొందరగా ఓపెన్ అప్ అవుతరానని అనుకోలేదు... మరో పక్క, పవన్ ఉండనే ఉన్నాడు... ఈ నేపధ్యంలో, ఆపరేషన్ గరుడ, అనుకున్న ప్రకారమే నడుస్తుంది... ఇప్పటి వరకు పార్ట్ వన్ లో, అన్నీ గ్రౌండ్ లెవెల్ లో సెట్ చేసి పెట్టారు.... ఇప్పటికే కర్ణాటకలో, గాలి పై ఉన్న కేసులన్నీ ఎలా వీగిపోయాయో చర్చించుకుంటూ ఉన్న సమయంలో, ఇప్పుడు జగన్ కూడా ఎన్డీఏలో చేరి, తన కేసులు కూడా మాఫీ చేసుకుంటాడు అని, అవసరం అయితే ఎన్నికలు అయిన తరువాత తన పార్టీ, బీజేపీలో విలీనం చేస్తాడు అని ఎప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

ఫేకో... ఫేకస్య... ఫేకభ్యహ... ఇచ్చట సర్వం ఫేక్ చెయ్యబడును... మాములుగా అయితే, ఈ క్యాప్షన్ లోటస్ పాండ్ సొంతం... ఒకటి కాదు, రెండు కాదు, అక్కడ సర్వం ఫేక్... ఉన్నది లేనిది, లేనిది ఉన్నది చేసే మాస్టర్ ఆర్ట్స్ లోటస్ పాండ్ పైడ్ బ్యాచ్ సొంతం... సన్నీ లియోన్ కు వచ్చిన జగన్ కూడా, ఫోటోషాప్ చేసి జగన్ కు వచ్చారు అనే చెప్పే ఘనులు ఉన్నారు అక్కడ... బీహార్ లో రోడ్లు చూపించి, ఇది చంద్రబాబు పాలన అంటారు.... తమిళనాడులో ఫోటోలు తమిళ్ రాసి ఉన్న ఫోటోలు చూపించి, చూసారా మా రాజశేఖర్ రెడ్డి పాలనలో, ఎంత మందికి చదువు చెప్పించామో అంటారు... ఈ పైడ్ బ్యాచ్ కి తోడు, సాక్షి ఛానల్ ఉండనే ఉంది... అయితే, ఇప్పుడు ఈ ఫేక్ బ్యాచ్ కు తోడుగా, పవన్ కళ్యాణ్ ఫేక్ బ్యాచ్ కూడా తయారయ్యింది... ఎలాగూ, త్వరలో కలిసిపోతారు కదా, ఇద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటూ, ఫేక్ చేసి పదేస్తున్నారు...

pawab 26042018 1

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఎలాంటి చౌకబారు పోస్ట్లు పెడుతున్నాడో చూస్తున్నాం... ఈ చౌకబారు పోస్ట్లకు, బుద్ధి ఉన్నవాడు ఎవడూ మద్దతు ఇవ్వడు... గాలి మంద తప్ప... అందుకే, మా పవన్ తోపు తురం అని కలరింగ్ ఇవ్వటానికి, ప్రముఖల పేరుతో ఫేక్ ట్విట్టర్ ఖాతాలు తెరిసారు... ఆ ఫేక్ ఖాతాలతో, పవన్ చేసే ప్రతి ట్వీట్ ఆహా ఓహో అనటం, మరో పక్క చంద్రబాబుని తిట్టించటం ఈ ఫేక్ బ్యాచ్ పని... సినీ హీరోలు, ప్రముఖులు, సెలబ్రిటీల పేరుతో ఈ ఫేక్ ఎకౌంటు లు ఓపెన్ చేసారు... ఇప్పటికే జగన బ్యాచ్ ఇలాంటివి తయారు చేసింది... ఇప్పుడు జనసేన బ్యాచ్ మరి కొన్ని ఫేక్ ఎకౌంటు లు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే.. ట్విట్టర్‌లో యాంకర్‌ రవి పేరిట, ఇలాంటి డ్రామాలు ఆడి దొరికిపోయారు.

యాంకర్‌ రవి కామెంట్‌ ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్‌ అయ్యింది. హఠాత్తుగా బుధవారం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని టార్గెట్‌ చేస్తూ.. పవన్ కల్యాణ్‌ ట్వీట్ చేసిన రీతిలోనే.. అభ్యంతరకరంగా రవి ఓ ప్రశ్న సంధించాడు. దీనికి కూడా అనుకూలంగా, వ్యతిరేకంగా 59 రీట్వీట్స్‌, 499 లైక్‌లు వచ్చాయి. యాంకర్‌ రవి చేసిన ట్వీట్‌కు హీరో నితిన్ స్పందించాడు. అతన్ని వారిస్తున్నట్లు, డోస్‌ చాలన్న రీతిలో ఓ కామెంట్‌ను రీ ట్వీట్‌ చేశాడు. రవి ట్వీట్‌కు.. హీరో నితిన్‌ స్పందించడం... మరింత చర్చకు దారితీసింది. ట్విట్టర్‌ వేదికపై ఈ రచ్చ రంబోలా సాగుతుండటాన్ని గమనించిన కొందరు యాంకర్‌ రవి అభిమానులు, జర్నలిస్టులు.. ఆయన పేరిట పోస్ట్‌ అవుతున్న ట్వీట్లపై ప్రశ్నించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపై అభ్యంతరకర పోస్టును ఎందుకు పెట్టావంటూ రవి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. షాక్‌ అవ్వడం యాంకర్‌ రవి వంతు అయ్యింది. తన ప్రమేయం లేకుండా.. తన పేరుతో.. తన ఫోటోతో ట్విట్టర్‌లో కామెంట్లు ఎలా పోస్ట్‌ అయ్యాయని విస్తుపోయాడు. తన పేరిట నకిలీ ట్విట్టర్‌ ఖాతా ఓపెన్‌ అయ్యిందని గుర్తించాడు.

pawab 26042018 1

అయినా తన పేరుతో నకిలీ ట్విట్టర్‌ అకౌంట్ వాడుతూ.. అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారని.. ఆపోస్టులపైనా, ఆపోస్టులు పెట్టిన వాళ్లపైనా లీగల్‌గా కేసువేసి ప్రొసీడ్‌ అవుతానన్నారు. అంతేకాదు.. తన అఫిషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్, నకిలీ ట్విట్టర్‌ అకౌంట్ల అడ్రస్‌ను వెల్లడించారు యాంకర్‌ రవి. వీటిని పరిశీలించి.. అసలు ఖాతా ఏదో, నకిలీ అకౌంట్‌ ఏదో గుర్తించాలని కోరుతున్నారు. అటు.. హీరో నితిన్‌ తండ్రి సుధాకర్‌రెడ్డి కూడా తన కుమారుడికి ఈ పేరుతో ట్విట్టర్‌ అకౌంట్‌ లేదని, ఎవరో నకిలీ అకౌంట్‌తో పోస్టులు చేస్తుండవచ్చని స్పష్టం చేశారు. యాంకర్‌ రవి వివరణ, హీరో నితిన్‌ తండ్రి చెబుతున్న విషయాలతో.. పవన్‌ కల్యాణ్‌ అభిమానుల పైత్యం మరోసారి బయటపడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మీ దాక వస్తే కాని నొప్పి తెలియలేదా ? మీ రాజకీయం కోసం, సినిమా పరిశ్రమ మొత్తం ఏకం కావాలా ? సినీ ఇండస్ట్రీ పై ఇన్ని రోజులుగా ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో, అవేమీ పట్టించుకోని మీరు, మీ మీదకు వస్తే మాత్రం, వచ్చి హడావిడి చేస్తారా ? అదీ రాజకీయంగా వాడుకుంటారా ? ఇది ప్రతి ఒక్క సామాన్యుడు అభిప్రాయం... కాని, ఇదే అభిప్రాయం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు కూడా వినిపిస్తున్నారు... పవన్ బ్యాచ్ చేస్తున్న హడావిడి పై మండిపడుతున్నారు... టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులలో ఒకడిగా ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురులో కీలక వ్యక్తిగా పేరు గాంచిన అల్లు అరవింద్ మాటలకు ఎదురు ఉండదు అనే అభిప్రాయానికి చెక్ పడింది. అరవింద్ కు కొన్ని రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల సమావేశంలో నాగార్జున మేనకోడలు సుప్రియ అరవింద్ ను టార్గెట్ చేస్తూ ఘాటైన కామెంట్స్ చేసింది అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

allu 26042018

పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా అతడి తల్లిని టార్గెట్ చేసే విధంగా కొన్ని ప్రముఖ ఛానల్స్ నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నాయి అంటూ దానికి వ్యతిరేకంగా పవన్ తన రాజకీయ కార్యకలాపాలను పక్కకు పెట్టి గత కొద్ది రోజులగా ఆ ఛానల్స్ ను చూడవద్దు అంటూ పవన్ చేస్తున్న హడావిడి తెలిసిందే. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న పవన్ కు సపోర్ట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన సమావేశంలో సుప్రియ అరవింద్ ల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగినట్లు ఆ పత్రిక పేర్కొంది. అరవింద్ న్యూస్ చానల్స్ ను బ్యాన్ చేద్దాం అని ప్రకటించగా, ఈ సందర్భంలో సుప్రియ అరవింద్ ను ఉద్దేసించి మాట్లాడుతూ కొంతకాలం క్రితం ఒక టివి యాంకర్ ఒక హీరోయిన్ విషయమై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన విషయాన్ని గుర్తుకు చేస్తూ మాట్లాడిందట.

allu 26042018

అంతేకాదు అప్పట్లో తాను ఆ కామెంట్స్ ను ఖండించమని కోరుతూ పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు మెసేజ్ లు పెట్టినా స్పందించని సందర్భాలను గుర్తుకు చేసి, అప్పుడు ఆవిషయాలు అన్యాయంగా అనిపించలేదా అంటూ అరవింద్ ను అందరి ఎదురుగా సుప్రియ ప్రశ్నించిందని, ఆ పత్రిక వివరణాత్మకంగా వార్తను వ్రాసింది. దీనితో ఊహించని ఈ పరిణామానికి అరవింద్ షాక్ ఐనట్లు తెలుస్తోంది. ఆ తరువాత అరవింద్ టివి9, ఎబిఎన్ ఛానల్స్ కార్యక్రమాలకు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల వారు ఎవరూ వెళ్ళకూడదు అన్న తీర్మానాన్ని పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఇండస్ట్రీ పెద్దలతో పాటు సుప్రియ కూడ తీవ్రంగా వ్యతిరేకించినట్లు టాక్. మొత్తానికి, తమ రాజకీయ ప్రయోజానాల కోసం, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న పవన్, అల్లు బ్యాచ్ కి, సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరూ మద్దతు పలకటం లేదు...

Advertisements

Latest Articles

Most Read