ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు వింటుంటే, దొంగే దొంగ అన్నట్లుగా ఉందని, ప్రభుత్వం, వైసీపీ చెప్పాల్పిన సమాధానాన్ని ఆయనే చెబుతున్నాడని, ఎన్నికల అథారిటీ మొత్తం తనేచూసినట్లుగా ఆయన మాట లున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . తిరుపతిలో ఉపఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగడంలేదని, మూగవాణ్ణి కొడితే ఎలాగైతే తనబాధ చెప్పుకోలేడో, తిరుపతిలో ప్రజాస్వామ్యం పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. తిరుపతికి బయటివ్యక్తులు వేలల్లో వస్తుంటారని సజ్జల చెబుతున్నాడని, గత రెండు, మూడురోజులనుంచి చూస్తే రోజుకి 20వేలమంది కూడా తిరుమలకు వచ్చినట్టు లేదన్నారు. ఈ ఒక్కరోజే లక్షమంది వచ్చారని సజ్జల చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. తిరుపతికి వచ్చే భక్తులను అడ్డుకునే శక్తి తెలుగుదేశం వారికిలేదని, మేము ఒకవేళ అలా అడిగితే ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చూస్తూ ఊరుకుంటాయా అని అశోక్ బాబు ప్రశ్నించారు. తిరుపతికి వచ్చే యాత్రికులు ఎవరూ ఓటర్ కార్డులు చూపరని, ఎవరని ప్రశ్నిస్తే, వారు ఆధార్ కార్డులు చూపుతారన్నారు. కానీ నేడు బయటినుంచి వచ్చిన వ్యక్తలు వద్ద పోలింగ్ స్లిప్పులు, ఓటర్ కార్డులేఉన్నాయని, ఈ లాజిక్ సజ్జల ఎందుకు గుర్తించలేదో విచిత్రంగా ఉందన్నారు. 75శాతం గెలుస్తామని, 90శాతం ప్రజల మద్ధతు తమకే ఉందని చెప్పుకుంటున్న సజ్జలకు, ఆయనప్రభుత్వానికి, లోపల భయంగానేఉందని, అసలు తిరుపతి ఎన్నికలో గెలుస్తామో లేదోనన్న ఆందోళన తోనే అధికారపార్టీ ఇటువంటి దాష్టీకాలకు పాల్పడిందన్నారు. 15 రోజుల్లో టీడీపీ చేసిన ప్రచారంలోనే వైసీపీ ఓడిపోయిందన్నారు. గెలుపుసాధ్యం కాదని భావించే వాలంటీర్ల వ్యవస్థను వాడుకొని, ప్రభుత్వసమాచారాన్ని దుర్వినియోగంచే శారని అశోక్ బాబు ఆక్షేపించారు. చనిపోయినవారు, ఇతరప్రాంతాల్లో ఉంటున్నవారు, విదేశాలకు వెళ్లినవారి సమాచారం తీసుకొని,వారిస్థానంలో దొంగఓటర్లతో ఓట్లు వేయించే ప్రక్రియకు ప్రభుత్వం పూనుకుందన్నారు. నకిలీ ఓటర్ కార్డులు సృష్టించి మరీ, దొంగఓటర్లను ప్రభుత్వం తిరుపతికి తరలించిందన్నారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా రోజుకి 20, 30వేలమందిభక్తులు తిరుపతికి రావడం కష్టంగా ఉంటే, ఒక్కరోజే లక్షమంది వచ్చారని రామకృష్ణారెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమ న్నారు. ప్రజాస్వామ్యాన్ని నిశ్శబ్ధంగా వైసీపీప్రభుత్వం తిరుపతి ఉపఎన్నికలో ఖూనీ చేసిందనడానికి సజ్జల వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలిచామంటూ సజ్జల బీరాలుపలుకుతున్నాడని, తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్, అసెంబ్లీ ఉపఎన్నికలో ఓడిపోయిందన్నారు. ప్రజల తీర్పులు ఎప్పుడెలా ఉంటాయో తెలియదని, వైసీపీని కార్పొరేటర్ స్థాయిలో చూస్తే, ఆపార్టీ అభ్యర్థులను ప్రజలు అక్కడ గెలిపిస్తారన్నారు. 90శాతంప్రజలు అధికారపార్టీకి మద్ధతుపలుకుతున్నప్పుడు, గెలుపుకోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం అధికారపార్టీకి ఎందుకొచ్చిందో సజ్జల చెప్పాలన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఇల్లుఉంటే, ఆయన అక్కడ మాట్లాడితే తప్పేమిటని సజ్జల అంటున్నాడని, మంత్రిఓటు పుంగనూరులో ఉంటే, తిరుపతి లో ఆయనకేం పనో చెప్పాలన్నారు. ఒకమనిషికి నాలుగు ఇళ్లు ఉన్నంత మాత్రాన నాలుగుచోట్ల ఓట్లు ఉండవన్నారు. రిక్షాకార్మకుడైనా, మంత్రైనా ఓటు ఎక్కడుంటే అక్కడే వినియోగించుకోవాలనే కనీస ఇంగితంకూడా సజ్జలకు లేకపోవడం బాధాకరమన్నారు. తిరుపతి ఉపఎన్నికలో ఎంతమెజారిటీతో వైసీపీ గెలుస్తుందో, సజ్జల చెప్పగలడా అని అశోక్ బాబు నిలదీశారు. తిరుపతిలోని స్థానికులే వైసీపీ తీరుని అసహ్యించుకుంటున్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక నిర్వహించినా, కిందపనిచేసే అధికారులు, పోలీసులు అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలప్రకారమే పనిచేశారని అశోక్ బాబు స్పష్టంచేశారు. బస్సులు కనపడుతున్నా... బయటివ్యక్తులు దొరికిపోయినా డీజీపీ సవాంగ్ ఏమీ లేదని చెప్పడం చూస్తేనే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. తిరుపతి ఉపఎన్నిక ఎలా జరిగిందో నేషనల్ మీడియాలో వచ్చిందని, అది సజ్జలకు అర్థం కాకపోవడం సిగ్గుచేటన్నారు. పిల్లిలా కళ్లుమూసుకొని పాలుతాగకుండా, 400 బస్సుల్లో వచ్చిన స్థానికేతరులపై సజ్జల ఏం సమాధానంచెబుతాడన్నారు. తిరుపతికి స్వామివారి దర్శనానికి వచ్చేవారు, ఓటర్ ఐడీలు, ఓటర్ స్లిప్పులు చూపడం, తండ్రిపేరు, భర్తపేరు అడిగితే కార్డులో ఉన్నాయి చూసుకోమనడం వంటిసమాధానాలే వారెవరో చెప్పకనే చెబుతున్నాయన్నారు. ఈ విధంగా స్థాని కేతరులైనవారిని తరలించి, వారితో దొంగఓట్లు వేయించి గెలవాలని చూసినప్పుడే వైసీపీ ఓడిపోయిందన్నారు. రాజకీయంగా గెలవడం, నైతికంగా గెలవడం రెండూ ఒక్కటి కాదన్నారు.

తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార వైకాపా అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అనేక అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చినా ఎటువంటి చర్యలు లేవు. స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై అధికార వైకాపా లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడుతోంది. ఫేక్ ఐడీలతో స్థానికంగా లేని వారి ఓట్లను బయట వారితో వేయించి వైసీపీ రిగ్గుంగులకు పాల్పడుతోంది. పేక్ ఓటర్ దారులు తండ్రిపేరు, సహచరి పేర్లు కూడా చెప్పలేపోతున్నారు. వారు ఫేక్ ఓటర్ దారులు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అఫిడవిట్ ప్రకారం తిరుపతి పార్లమెంటుకు చెందిన వ్యక్తి కాదు. కానీ, ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఆయన తిరుపతి పార్లమెంటు పరిధిలోనే ఉన్నారు. పోలింగ్ రోజైన 17 వ తేదీన 11.15 AM కు పత్రికా సమావేశం నిర్వహించారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్దం. ఇతర మంత్రులు సైతం తిరుపతిలోనే తిష్ట వేశారు. ప్రజాస్వామ్యం కాపాడేందుకు తెలుగుదేశం నాయకులు ఫేక్ ఓటరుదారులను పట్టుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ చర్యలు శూన్యం. స్థానిక అధికారులు, పోలీసులు ఫేక్ దారులను వదిలేసి తెదేపా నాయకులైన నరసింహ యాదవ్, దొరస్వామీ నాయుడు, శ్రీరాం చినబాబు, దేవనారాయణ రెడ్డి, వెంకటేష్, వెంకటరత్నం, రవి, మణికంఠ లను అరెస్టు చేశారు. పోలింగ్ అక్రమాలకు సంబంధించి వీడియో క్లిప్పింగులతో సహా ఎన్నికల అధికారులకు అందించాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవాలి. తిరుపతి అసెంబ్లీ సెంగ్మెంట్లలో ఎన్నికలను రద్దు చేసి తిరిగి రీ-పోలింగ్ నిర్వహించాలి.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య వలువలు ఊడ్చబడ్డాయని, తిరుపతి ఉపఎన్నిక చూస్తే, తానెందుకు అలా అనాల్సివచ్చిందో ప్రజలకు అర్థమవుతోందని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అతిదారుణంగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.."తిరుపతి ఉపఎన్నిక ఏ రకంగా జరుగుతుందో రాష్ట్రప్రజలంతా వారి పనులు ఆపిమరీ గమనించాలి. దానివల్ల ప్రభుత్వతీరు, ప్రభుత్వపెద్దల పనితీరు, ఈ ప్రభుత్వం ఏరకంగా అధికారంలోకి వచ్చిందో తెలుస్తుందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తు న్నా. వంటచేసే మహిళలు, కార్ఖానాలో పనిచేసే కార్మికులు, పొలాల్లో ఉండే రైతులు, కూలీలు అందరూ వారి పనులు పక్కనెట్టి, కాసేపు టీవీలు చూడాలి. తిరుపతి ఉపఎన్నిక ఎలా జరుగుతుందో అందరూ తెలుసుకోవాలి. ఉప ఎన్నిక పరిశీలకులుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులున్నారు.... ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్నా రు.. సెక్రటేరియట్ లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ఉన్నారు. ఢిల్లీలో ఎన్నిక ల సంఘం ఉంది. ఇన్ని ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యం యధాస్థితిలో సాగిపోతోంది. పెద్దిరెడ్డి దౌర్జన్యాలను ఆపే దిక్కులేదు ఈ రాష్ట్రంలో. పీలేరు నుంచి బస్సులో జనాలను తీసుకొస్తే, అక్కడున్న స్థానికులు వారిని ఆపి, ఎక్కడివారు ఎందుకొచ్చారని నిలదీశారు. స్థానికులతో పాటు, హోంగార్డు కూడా ఉన్నాడు. వారంతా బస్సు ఆపి, ఎక్కడి నుంచి వస్తున్నారని నిలదీయడంతో బస్సులోని వారంతా దిగి పరిగెత్తారు. బస్సు డ్రైవర్ బస్సు ఆగిపోయిందని, దొంగ ఓట్లు వేయడానికి వచ్చామని చెప్పి, కనుక్కొని బస్సును ఆపారని, బస్సులోని వారంతా పారిపోయారని, అతను బస్సు ఓనర్ కి ఫోన్ చేసి చెప్పాడు. ఆ బస్సు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం నుంచే వచ్చింది. ఆ బస్సుడ్రైవర్ పెద్దిరెడ్డికి తెలుసు. బస్సులో వచ్చినవారంతా హోంగార్డుని, స్థానికులనుచూసి ఎందుకు పారిపోయారు? బస్సుని వారు ఆపకపోతే, అందులో వచ్చినవారంతా దొంగఓట్లు వేసేవారు కదా పెద్దిరెడ్డిగారు? ప్రజాస్వామ్యానికి ఏంఖర్మ పట్టింది పెద్దిరెడ్డి మంత్రిత్వంలో, ఆయనొక మంత్రా... జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రా? మీదొక ప్రభుత్వమా?

బీజేపీ మహిళానేత శాంతారెడ్డి కొందరు దొంగఓటర్లనుపట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నైతిక విలువలున్నా, ఒక్కక్షణం ఆయన తాడేపల్లి నివాసం నుంచి శాంతారెడ్డి వైపుచూడాలి. ఆమెమాటలకు ఆయన సమాధానం చెప్పాలి. ఆమె మాటలు వింటానికి ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధమేనా? ఆ మాటలు వింటే పెద్దిరెడ్డి బతుకు ఇక అంతే... నానోటితో నేను చెప్పలేను. శాంతారెడ్డి మాటలకు ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గేయడంలేదా? ఈ ప్రభుత్వం గాజులేసుకుందని ఆమె అంటుంటే వారికి సిగ్గుగా లేదా? ఈరకంగా దొడ్డిదారిన, దొంగదారిన, గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా? జగన్మోహన్ రెడ్డి విజయాలన్నీ ఇదే విధంగా వచ్చాయా? లక్షలకు లక్షల మెజారిటీలన్నీ ఇలానే సాధించారా? జగన్మోహన్ రెడ్డి విజయాలన్నీ ఇలా దొంగ గెలుపులేనా? ప్రజలు మెచ్చి, వారికి నచ్చి గెలిపించారని అనుకుంటున్నాం. దొంగఓట్లు వేయించడంలో మీరంతా ఇంతటి దిట్టలని ఇప్పుడే తెలిసింది. ఈ రకంగా ఒకరిపేరుతో మరొకరు దొంగఓట్లు వేయడమే పెద్దనేరం, సిగ్గుచేటు. అలా వచ్చినవారికి బుద్ధిలేదు. పంపినవెధవకు సిగ్గులేదు. ఎంతో పకడ్బందీగా, నిష్ణా తులైన వారిలా దొంగఓటర్లు వ్యవహరించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి అంటే ఈ రకంగా జరుగుతాయని దేశమంతా తెలియచేస్తాం. ఇంతటితో వదిలేదులేదు. మీకు వచ్చిన మెజారిటీ అంతా ఈ విధంగా దొంగఓటర్లతో వచ్చిందే. 151సీట్లు కూడా ఇలానే వచ్చాయా? ఇటువంటి నైపుణ్యం ఎక్కడనేర్చుకున్నారో చెప్పండి. ఇదివరకు స్టూవర్ట్ పురం దొంగలబ్యాచ్ పేరుచెబితే, పోలీస్ స్టేషన్లలోని సెల్ ల తాళాలు ఊడిపోయేవి. ఇప్పుడు ఈ పార్టీ పేరుచెబితే నకిలీఓట్లు కుప్పలుకుప్పులుగా పడిపోతున్నా యి. మీ గెలుపులన్నీ ఇలా తప్పుడుదారిలో సాధించినవేనా జగన్మోహన్ రెడ్డి గారు? కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి, తిరుపతి ఉపఎన్నికను రద్దుచేయాలి.

తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన తీరు పై తెలుగుదేశం నేటా వర్ల రామయ్య వివరించారు. ఆ ప్లానింగ్ చూస్తే ఎవరైనా అవాక్కావ్వాల్సిందే. రెండు మూడు రోజులు ముందుగానే వాలంటీర్లు ద్వారా, ఎవరు ఏంటి అనేది ఒక అంచనాకు వచ్చారు. తెలుగుదేశం వాళ్ళ ఓట్లు దొంగ ఓట్ల రూపంలో, మొదటి గంటలోనే వేసేయటానికి ప్లాన్ వేసారు. ఇక ఊరిలో లేని వాళ్ళవి, చనిపోయిన వారివి, ఇలా అనేక మందివి కూడా దొంగ ఓట్లు వేయటానికి ప్రణాళికలు వేసారు. దొంగఓటర్లను సృష్టించి, నకిలీ ఓటర్ కార్డులను తయారుచేశారు. పక్క నియోజకవర్గాల నుంచి జనాలను తోలుకుని వచ్చి, కళ్యాణమండపాల్లో, అపార్ట్ మెంట్ లలో పెట్టారు. అక్కడ నుంచి ఉదయమే, ఏ బూత్ కు ఆ బూత్ కు పంపించారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చివనారికి ఇచ్చిన గుర్తింపుకార్డుల వెనుక ఒక సీరియల్ నంబర్ ఉంది. ఆ సీరియల్ నెంబర్ ఆధారంగా, ఎక్కడ ఓటు వేయాలి, ఎవరికీ ఓటు వేయాలి, ఎంత డబ్బులు ఇవ్వాలి, ఇలా మొత్తం సెట్ చేసారు. వర్ల రామయ్య మాట్లాడుతూ "వారి ఐడీకార్డులు చూసి, వారు కడపనుంచి వచ్చారని గుర్తించి, క్యూలో నిలబడిన వారిని తండ్రిపేరేమిటని ఆయన అడిగితే, కార్డులో ఉంది చూసుకోమని చెప్పారు. పెద్దిరెడ్డిగారు... మీ నియోజకవర్గంలో తండ్రిపేరు అడిగితే, కాగితాల్లో, కార్డుల్లో చూసుకోమని చెబుతారా? ఇదెక్కడి అన్యాయమండీ... ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? నకిలీ కార్డులు ఇచ్చిన వాడు ఏదైనా అడిగితే, సహజంగా పారిపోతాడు. కానీ పెద్దిరెడ్డి జమానాలో దొంగలే ధైర్యంగా, దర్జాగా నిలబడి ఎదురు మాట్లాడుతున్నారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చివనారికి ఇచ్చిన గుర్తింపుకార్డుల వెనుక ఒక సీరియల్ నంబర్ ఉంది. వాలంటీర్లంతా వైసీపీ ప్రచారకులని నిన్ననే చెప్పాను. వారంతా వైసీపీ ప్రచార ఇన్ ఛార్జ్ లని నేను నిన్ననే చెప్పాను. వారంతా వారివారి ప్రాంతాలలో చనిపోయినవారు, ఇతరరాష్ట్రాలకు వెళ్లిన వారు, దేశాంతరం వెళ్లినవారి ఓటర్ లిస్ట్ అంతా తయారుచేసి, పెద్దిరెడ్డి అండ్ కో కు ఇచ్చారు. వారేమో దొంగఓటర్లను సృష్టించి, నకిలీ ఓటర్ కార్డులను తయారుచేశారు."

"నా తండ్రి ఫలానా అతనని నేను ధైర్యంగా చెబుతాను. పెద్దిరెడ్డి పంపిన దొంగఓటర్లలా కాగితాల్లో చూసుకోండని చెప్పను. ప్రజాస్వామ్యమా రాష్ట్రంలో నీ అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నాను. చిత్తూరుజిల్లాలో, తిరుపతిలో ప్రజాస్వామ్యం అడ్రస్ ఎక్కడుందో పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు సమాధానంచెప్పగలరా? తాను అడిగే ప్రశ్నలకు పెద్దిరెడ్డి, ఆయన ప్రభుత్వం సిగ్గుతో కుంచించుకుపోవాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో దొంగఓటర్లు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా క్యూలైన్లలో నిలబడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు? కాపాడాల్సిన ముఖ్యమంత్రి తప్పుడు విధానాలకు దొంగవిధానాలకు, అడ్డదారులకు సై అంటుంటే, ఆపాల్సిన పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా నిస్తేజంగా కూర్చుంది. సవాంగ్ నాయకత్వం లోని పోలీస్ వ్యవస్థ ఉపఎన్నిక నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. తిరుపతికి 4వేలబస్సులొస్తే, ఆ విషయం డీజీపీకి తెలియదా? బస్సులలో వచ్చినవారంతా స్వామివారిని దర్శించుకోవడానికి రాలేదు. పెద్దిరెడ్డిస్వామివారి తరుపున దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు. పీఎల్ ఆర్ కళ్యాణమండపంలోఎంతమంది రాత్రి నిద్ర చేశారో పోలీసులకు, డీజీపీకి తెలియదా? దొంగఓట్లు అంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వేస్తుంటే పోలీసులకు తెలియదా? ఎన్నికలకమిషన్ ఎంతలా, ఎన్నిరకాలుగా ఆదేశిస్తున్నా కింద అమలుచేయాల్సింది జగన్ బృందమే కదా. ఆ బృందం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాలను సరిగా అమలుచేయడంలేదుకదా? దొంగఓట్లు వేసేవారిని ఎవరు ఆపుతారా? ఎవరో ఏజెంట్ దొంగ ఓట్ వేస్తున్నాడంటే, అతన్ని పట్టుకొని బూత్ లోనే పడేసి కొట్టారంట. అలాగైతే ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు? కొందరు ఆడవారు వ్యాన్లలో వచ్చి తిరుపతిలో దిగారు. వారిభర్త పేరు, తండ్రిపేరు అడిగితే చెప్పడంలేదు. వారంతా పెద్దిరెడ్డి పంపిన దొంగఓటర్లే. ఈ తంతు ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యాన్ని ఎవరురక్షిస్తారు? తిరుపతిలో ప్రజాస్వామ్యాన్నికాపాడేది ఎవరని నేను ప్రశ్నిస్తున్నాను. " అని వర్ల రామయ్య అన్నారు.

Advertisements

Latest Articles

Most Read