నెల్లూరు జిల్లాలో, ఈ వేసవి కాలంలో, అన్ని గ్రామాల్లో కూడా పంట చేతికి వస్తుంది. ఆ తరువాత అక్కడ ఊరిలో ఉండే రాములు వారికి, అవి సమర్పించి, తిరునాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా నెల్లూరులోని విడవలూరు మండలం చౌకిచర్ల గ్రామంలో అందరూ చందాలు వేసుకుని భక్తీ శ్రద్ధలతో ఈ తిరునాళ్ళు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారం రోజుల పాటు, సీతారాముల వారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆ గ్రామమే కాకుండా, చుట్టుపక్కల వారు కూడా, ఆ ఉత్సవాల్లో పాల్గుని, రామనామం జపిస్తూ, తమ భక్తీని ప్రదరిస్తుంటే, ఇదే అదనుగా, వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. ఈ తిరునాళ్ళు చేసే పెత్తనం తీసుకున్న వైసిపీ నేతలు, ఈ తిరునాళ్ళలో రికార్డింగ్ డ్యాన్స్ లు ఏర్పాటు చేసారు. ఇతర జిల్లాల నుంచి యువతులను తీసుకుని వచ్చి, ఇక్కడ వారి చేత సినిమా పాటలకు రికార్డింగ్ డ్యాన్స్ లు వేయించారు. ఇందులో వైసీపీ నేతలు కూడా స్టేజ్ ఎక్కి, వారితో పాటు చిందులు తొక్కారు. కొమ్మిరెడ్డి మురళీ కృష్ణా రెడ్డి అనే సీనియర్ వైసీపీ నేత అయితే ఏకంగా చొక్కా విప్పి , లుంగీ మీద వారితో కలిసి డ్యాన్సులు వేయటం, జిల్లలో చర్చిగా మారింది. గ్రామస్తులు కూడా ఈ తతంగం పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

సీనియర్ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తుంది. కాసేపటి క్రితం వారి కుటుంబ సభ్యులు మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన, యశోదా హాస్పిటల్ లో , ఐసియిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. నిజానికి ఆయన వారం రోజులు క్రితమే క-రో-నా నిర్ధారణ కావటంతో, ఆయన యశోదా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. నిన్న, ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టు, ఆక్సిజన్ తీసుకోవటానికి మోత్కుపల్లి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. ఆయనకు షుగర్, బీపీ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు, పెద్ద వయసు కావటంతో, క-రో-నా సోకటంతో, ఆయన ఆరోగ్యం పై మరింతగా దెబ్బ పడిందని చెప్తున్నారు. ఆయనకు ప్రస్తుతం డాక్టర్లు ఐసియిలో చికిత్స అందిస్తున్నారు. క-రో-నా నిర్ధారణ కావటంతో, మొతుకుపల్లి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. అయితే ఆయన ఐసియిలో చికిత్స అందిస్తున్నా, ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ప్రాణాపాయం ఏమి లేదని, నిన్న, ఈ రోజు కొంత ఇబ్బంది పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానాలు ప్రార్ధిస్తున్నారు.

తిరుపటి ఉప ఎన్నిక జరిగిన తీరు పై చంద్రబాబు, మీడియాతో మాట్లడారు. ఆయన మాటల్లో.. "తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో అన్నీ పార్టీలు పాల్గొన్నాయి. వైసీపీ చేసిన దుర్మార్గాలను అన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాయి. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం 2,200 మంది సెంట్రల్ ఫోర్స్, 800 మంది మైక్రో అబ్జవర్స్, అన్ని బూతుల్లో వెబ్ కెమార్లు పెడతామని చెప్పింది. వందలాది బస్సులు, కార్లలో జనాలను తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను దొంగ ఓట్లు వేయించేందుకు తీసుకొచ్చారు. వందల మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. మామూలుగానైతే ఎన్నికల జరిగే సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన బలగాలతో తనిఖీ చేస్తారు.. కానీ అది ఎక్కడా జరగలేదు. ఇన్ని వేల వాహనాలను పోలీసులను ఎలా అనుమతించారు? ఎందుకు చెక్ పోస్టులను తీసేశారు? తెల్లవారు జాము నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వస్తున్న వారిని అన్ని రాజకీయ పార్టీలు పట్టుకున్నా ఎందుకు సెంట్రల్ అబ్జర్వర్లు పట్టించుకోలేదు? దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి ప్రశ్నిస్తే తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితి. భర్త పేరు తెలియని భార్య, తండ్రి పేరు తెలియని కుమారులు వచ్చి అడ్డంగా దొరికితే పారిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లోకి కొన్ని వేల మందిని తరలిస్తే పోలీసులు ఎక్కడున్నారు? ప్రశ్నించిన టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. ఇదేనా న్యాయం, ధర్మం, ఇదేనా ప్రజాస్వామ్యం కాపాడటం అంటే? రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న జగన్ రెడ్డి కోసం పోలీసులు పని చేస్తున్నారు. పనబాక లక్ష్మీ దొంగ ఓటర్లను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే మా నాయకులను అరెస్టు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులందరూ పోరాడుతున్నారు. బందిపోట్లను మరిపించేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. దీనిని ప్రజలంతా గమనించాలి. వైసీపీ ముఠా గ్యాంగ్ తో తిరుపతి నాశనం కావాల్సిందేనా? పోలీసులు వాలంటీర్లు, వైసీపీ నాయకులతో కుమ్మక్కై ఎన్నికలను ప్రహసనంగా మార్చారు. మా ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తుంటే అధికారులకు సిగ్గనిపించడం లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక వ్యక్తి కాకపోయినా తిరుపతిలో బరితెగించి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల జరిగే ప్రాంతాల్లో మంత్రులు ఎందుకు ఉన్నారు? ఒక్క ప్రతిపక్ష నాయకులనే అరెస్టు చేస్తాం, అధికారపక్షానికి ఊడిగం చేస్తామన్నట్లుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం.? ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరూ ప్రయత్నిస్తుంటే వైసీపీ మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఏది చేసినా ప్రజలు నమ్మేస్తారని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.

స్కూల్, కాలేజీ బస్సుల్లో తిరుపతికి అక్రమంగా దొంగ ఓటర్లను తరలించారు. దొంగల్ని పట్టుకోకుండా అమాయకులను అరెస్టు చేసి వీరంగం సృష్టించిన చంద్రగిరి ఎస్ఐ తీరు అందరూ గమనించారు. టీడీపీ నేతలు తెల్లవారు జామునుంచి పోరాడుతున్నారు. పోలీస్ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యమైంది? ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోవడం లేదు? వైసీపీ చేస్తున్న అరాచకాలకు సీఈసీ సమాధానం చెప్పాలి.? పోలీసు, పోలింగ్ సిబ్బంది ఏకపక్షంగా ప్రవర్తించారు. 10 ఏళ్లు కేంద్రంలో పని చేసిన వ్యక్తి, 4 సార్లు ఎంపీగా చేసిన మహిళ దొంగల్ని పట్టించినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం కేంద్రం ఎన్నికల కమీషన్ కూడా అదే తోవలో పోతుంటే మేం ఎవరికి చెప్పాలి.? వైసీపీ అరచకాలను గట్టిగా ఖండిస్తున్నాం. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో వైఫల్యం చెందిందా? వైసీపీ చేసిన దుర్మార్గాలను వీడియా ఆధారాలతో సహా సీఈసీకి అందిస్తాం. అవ్వన్నీ పరిగణలోకి తీసుకుని తిరుపతి ఎన్నికను రద్దు చేసి సెంట్రల్ ఫోర్స్ తో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా కేంద్రం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి ధర్మాన్ని కాపాడాలి. వాలంటీర్ లు, పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అవసరమైన చోట రీపోలింగ్ పెట్టాలి. బరితెగించిన అధికారులపైనా సీఈసీ చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా వారికి వంతపాడటం ఏమాత్రం సమంజసం కాదు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలి. ఢిల్లీలోని టీడీపీ ఎంపీలు ఎన్నికల కమిషన్ ను కలిసి తిరుపతిలో ఎన్నికను అడ్డు పెట్టుకొని చేసిన దుర్మార్గాలపై ఫిర్యాదు చేస్తారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ న్యాయం చేయాలి. వాస్తవాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్నికల సంఘంపై ఉన్న నమ్మకం పెంచడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.

దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని ప్రశ్నిస్తుంటే తడబడుతున్నారు. తప్పు చేస్తున్నామని వాళ్లే బాధపడుతున్నారు. సామాన్యులతో వైసీపీ నాయకులు నేరాలు చేయిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అఫడవిట్ ప్రకారం తిరుపతి ఎన్నికల నియమావళిని అతిక్రమించి అక్కడే ఉన్నారు. అలాంటి వ్యక్తి మంత్రిగా ఉండటానికి అనర్హుడు. వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి. పెద్దిరెడ్డి చేసిన దొంగ పనికి సిగ్గుపడకుండా బరితెగించి మాట్లాడుతున్నారు. పబ్లిక్ మీటింగ్, పెళ్లికో వచ్చినట్లు వేల మంది వచ్చారు. ఓటర్లకు నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది. తిరుపతిలో ఓటర్లందరికీ సాయంత్రం 7 గంటలకు ఓటు వేసే హక్కు ఉంటుంది. ఓటర్లు కేంద్రానికి వెళ్లినప్పుడు ఓటు వేసి ఉంటే ఛాలెంజ్ ఓటు వేస్తే ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయో భయటపడుతుంది. నిజమైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించకోకపోతే దొంగలదే పైచేయి అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి అందరం కలిసి ముందుకు రావాల్సి ఉంది. దుర్మార్గులను ఎక్కడికక్కడ నియంత్రణ చేయకపోతే రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను కోల్పోవాల్సి వస్తుంది.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం నేపధ్యంలో, మాజీ మంత్రి దేవినేని ఉమా, జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ, నారాయణ రెడ్డి అనే అడ్వొకేట్ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేయటం జరిగింది. ఈ మేరకు సిఐడి అధికారులు, రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసారు. అయితే ఆ నోటీసులు కొంత వివాదస్పదానికి దారి తీసాయి. మొన్న నోటీసులు జారీ చేసిన సమయంలో ఉదయం పది గంటల సమయంలో బెజవాడలోని ఇంటికి నోటీసులు ఇచ్చి, తిరుపతిలో ఉన్న దేవినేని ఉమాని, కర్నూల్ కు 10.30 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వటం జరిగింది. అయితే దానికి దేవినేని ఉమా తిరిగి ఒక లేఖ రాసారు. అసలు పది నిమిషాల్లో, విచారణకు రావటం ఎలా సాధ్యం అని దేవినేని ఉమా ప్రశ్నించారు. పెద్ద ఎత్తున దీని పై విమర్శలు వచ్చాయి. దేవినేని ఉమా కూడా దీని పై, సిఐడికి లేఖ రాసారు. తాను పార్టీ ఆదేశాల మేరకు, తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నాను, క-రో-నా సంరక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నాను కావున, నాకు పది రోజులు సమయం కావాలని దేవినేని ఉమా, సిఐడికి లేఖ రాసారు. ఈ లేఖని సిఐడి అధికారులకు కూడా దేవినేని ఉమా అందించారు. అయితే ఇప్పుడు మరోసారి సిఐడి అధికారులు, దేవినేని ఉమాకు నోటీసులు ఇవ్వటంతో, మళ్ళీ చర్చకు దారి తీసింది.

uma 17042021 2

ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో, రెండో నోటీసు దేవినేని ఉమాకు సిఐడి అందచేసింది. ఆయన నివాసం ఉన్న గొల్లపూడిలో, ఈ నోటీసులు అంటించారు. ఈ నోటీసులో ప్రధానంగా చూస్తే, ఈ నెల 19వ తేదీన, 10.30 గంటలకు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని దేవినేని ఉమకు నోటీసులు జారీ చేసారు. అయితే దీనికి రిప్లై గా దేవినేని ఉమా మరో లేఖ రాస్తారా, లేదా విచారణకు హాజరు అవుతారా అనేది చూడాల్సి ఉంది. అయితే మొన్నటి దాక ఇరిగేషన్ లో లక్షల కోట్లు ఉమా దోపిడీ చేసారు, ఆయన్ను ఆధారాలతో పట్టుకుంటాం, జైలుకు పంపిస్తాం అని చెప్పిన వైసీపీ నేతలు, ఇలా జగన్ మోహన్ రెడ్డిని తిట్టారని కేసులు పెట్టి, నోటీసులు ఇచ్చి, చివరకు అరెస్ట్ చేసే ప్లాన్ వేసారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వీడియోలో, జగన్ మోహన్ రెడ్డి తిరుపతిని కించపరిచినట్టు ఉందని, వీడియో మారినంత మాత్రాన, జగన్ మోహన్ రెడ్డి ఆ మాటలు అనలేదు అని చెప్పగలరా అంటూ, ఒరిజినల్ వీడియో చూపించి కౌంటర్ ఇస్తున్నారు. మరి సిఐడి ఏమి చేస్తుందో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read