ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక్కసారి ఏబి వెంకటేశ్వర రావు పై క్రమశిక్షణా చర్యలు ఉపక్రమించింది. ఐపిఎస్ గా ఉంటూ, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా, ఏబి వెంకటేశ్వర రావు వ్యాఖ్యలు చేసారు అనే అభియోగంతో, ఆరు పేజీలతో కూడిన ఒక జీవోని చీఫ్ సెక్రటరీ ఒక గంట క్రితం విడుదల చేయటం జరిగింది. కమీషనర్ అఫ్ ఎంక్వయిరీస్ విచారణ అనంతరం, విచారణ పూర్తయిన సందర్భంగా, ఆయన మీడియాతో సచివాలయంలో మాట్లాడారు. మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన కొంత మందిని ఉద్దేశిస్తూ, అల్పులు, కుక్క మూతి పిందెలు అంటూ, పరుష పదజాలం ఉపయోగించారని, ప్రభుత్వాన్ని కార్నర్ చేసారని చెప్పి, ఆయన పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. కమీషనర్ అఫ్ ఎంక్వయిరీస్ విచారణ తరువాత, ఆయన మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు, ప్రత్యేకంగా ఆ జీవోలో పేర్కొనటం జరిగింది. 30 రోజుల్లో దీని పై ఆయన సమాధానం ఇవ్వాలని, లేని పక్షంలో, చర్యలకు ముందుకు వెళ్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఆయన పై, నిఘా పరికరాల కొనుగోళ్ళలో అక్రమాలు అంటూ, అసలు కొనుగోళ్ళు జరగని చోట, ఆరోపణలు మోపి, ఆయన్ను సస్పెండ్ చేసారు. దీని పై విచారణ సందర్భంగానే, ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం, ఈ వ్యాఖ్యలు సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం, అంటూ జీవోలో తెలిపారు.

abv 180422021 2

దీనికి సంబంధించి మొత్తం ఆరు పేజీలతో ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల్లో ఆయన మాట్లాడిన మాటలు, తెలుగులో పెట్టారు. ఇలా తెలుగులో పెట్టటం చాలా అరుదు. అయితే, ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలు కూడా పెట్టారు. ముఖ్యంగా ఆయన అల్పులు, అధములు, కుక్క మూతి పిందెలు, చట్టాల పై అవగాహన లేని వారు, తన పై ఆరోపణలు చేసారని, ఆయన చెప్పిన మాటలకు , ప్రభుత్వ పెద్దలు నోచ్చుకున్నట్టు అర్ధమవుతుంది. అలాగే తన పై కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్ లు సృష్టించారు అంటూ డీజీపీ, సిఐడి, ఏసిబి చీఫ్ ల పై, ఆధారాలను చీఫ్ సెక్రటరీకి కూడా సమర్పించారు. దీని పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని కూడా కోరారు. ఇదే సమయంలో వివేక కేసుకి సంబంధించి, సిబిఐకి రాసిన లేఖ విషయంలో కూడా, అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వానికి తెలియ చేయాల్సిన అంశాలు, ప్రభుత్వ పరువు తీసే విధంగా, మీడియా ముందు విడుదల చేయటం పై, ప్రభుత్వం సీరియస్ అవుతున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

నిన్న జరిగిన తిరుపతి ఎన్నికల్లో, నకిలీ ఎన్నికల ఓటర్ ఐడి కార్డులతో వచ్చి, బయట నుంచి వచ్చిన వేలాది మంది ఓట్లు వేసారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో టిడిపి వీడియోలతో సహా బయట పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా టిడిపి కుట్ర అంటూ వైసీపీ ఎదురు దాడి చేస్తుంది. ఈ విషయం మీద, టిడిపి పార్లమెంట్ అభ్యర్ధి పనబాక లక్ష్మి, ఓపెన్ సవాల్ విసిరారు. గురువారం నాడు తిరుమల శ్రీవారి నేత్ర దర్శనం రోజు, పవిత్రమైన రోజున, ఆ రోజున మీరు ప్రమాణానికి సిద్ధం అవుతారా అని సవాల్ విసిరారు. దొంగ ఓట్లు వేయలేదని, నకిలీ ఓటర్ కార్డులతో ఎవరూ రాలేదని, వారు అంతా భక్తులు అంటూ, తిరుమల దర్శనానికి, శ్రీకాళహస్తి దర్శనానికి వచ్చారు అంటూ, మంత్రి పెద్దిరెడ్డితో, ఇతర వైసీపీ నేతలు చెప్తున్న నేపధ్యంలో, పనబాక లక్ష్మి సవాల్ విసిరారు. వారు దొంగ ఓటర్లు కాదని, నకిలీ ఓటర్లు కాదని, మాకు సంబంధం లేదని మీరు ప్రమాణం చేయగలరా, ఆ విషయంలో మీరు మా పైన ఆరోపిస్తున్నట్టు, వారికి మాకు ఎలాంటి సంబంధం లేదని, మేము ప్రమాణం చేస్తాం అంటూ పనబాక లక్ష్మి ఓపెన్ చాలెంజ్ విసిరారు. గతంలో కూడా వివేక కేసు పై లోకేష్ మీద ఆరోపణలు చేయటం, లోకేష్ వెంకన్న పై ప్రమాణం చేద్దామని చాలెంజ్ చేయటం, ఆ తరువాత లోకేష్ ఒక్కడే ప్రమాణానికి రావటం, జగన్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ రాకపోవటం తెలిసిందే.

panabaka 18042021 2

ఈ నేపధ్యంలో, తిరుపతిలో మరోసారి సవాల్ చేసుకోవటం, ఇప్పుడైనా వైసీపీ నేతలు, ముఖ్యంగా పెద్దిరెడ్డి, ఈ సవాల్ ను స్వీకరిస్తారో లేదో చూడాలి. నిన్న పనబాక లక్ష్మితో పాటుగా, తెలుగుదేశం నేతలు స్వయంగా, దొంగ ఓటర్లను పట్టుకున్నారు. పెద్దిరెడ్డి కళ్యాణమండపం నుంచి తండోపతండాలుగా వస్తున్న దొంగ ఓటర్లను, వారిని తరలిస్తున్న బస్సులను పట్టుకున్నారు. ఏకంగా ఎస్పీ కార్యాలయం ఎదుటే టిడిపి నేతలు ఒక బస్సుని పట్టుకున్నారు. అందులో అంతా దొంగ ఓట్లు వేయటానికి వచ్చిన వారు ఉన్నారని, టిడిపి నేతలు ఆరోపించారు. దీని పై ఆందోళన కూడా చేసారు. అదే విధంగా ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ లలో కూడా నకిలీ ఓటర్లను పట్టుకున్నారు. కార్డు తీసుకుని తండ్రి పేరు అడిగితే చెప్పలేక పోయారు. భర్త పేరు అడిగితే చెప్పలేక పోయారు. కొంత మంది పరిగెత్తారు. ఇవన్నీ టీవీల్లో వచ్చాయి. అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా, సరే పెద్దిరెడ్డి మాత్రం, ఇదంతా టిడిపి కుట్ర అని చెప్పటంతో, పనబాక లక్ష్మి చాలెంజ్ చేసారు. మరి దీనికి పెద్దిరెడ్డి ఏమి అంటారో చూడాలి.

తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారు అయ్యింది. ఆ ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారు కావటంతో, ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికీ దీనికి సంబంధించి, ఇరు పార్టీల ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ రోజు మరోసారి ప్రత్యెక సమావేశం అయిన నేతలు, భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, ఎవరు ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఇరు పార్టీల అభ్యర్ధులు, ఏ ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంది అనే అంశం పై చర్చలు నడిచాయి. ఈ నేపధ్యంలో, మరోసారి భేటీ అయ్యి, అభ్యర్ధులని ఖరారు చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం జనసేన అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని రెండు రాష్ట్రాల్లో, ఇరు పార్టీలు కలిసి పాల్గుంటున్నాయి. హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి మాత్రమే, ఇద్దరూ వేరు వేరుగా పోటీ చేయాలని భావించటం, అప్పటి పరిస్థితితుల్లో జనసేన లిస్టు ప్రకటించిటం , తరువాత వెనక్కు తగ్గటం, పవన్ ని అవమానించారని జనసేన నేతలు అనటం, పవన్ బహిరంగంగా మాట్లాడటం, ఇవన్నీ చర్చకు దారి తీసాయి. అయితే ఇప్పుడు మాత్రం, ముందుగానే కూర్చుని మాట్లాడుకున్నారు.

వివేక కేసు విషయంలో, రోజుకి ఒక వార్త, గత నెల రోజులు నుంచి చోటు చేసుకుంటుంది. వివేక కుమార్తె సునీత ఢిల్లీ వెళ్లి, నాకు న్యాయం చేయండి అంటూ, బహిరంగంగా వేడుకున్న దగ్గర నుంచి, ఈ కేసు రోజు వార్తల్లోకి వస్తుంది. వివేక కుమార్తె ఆరోపణలు చేస్తే, టిడిపి పైన ఎదురు వైసీపీ అరొపణలు చేయటం, లోకేష్ సవాల్ విసరటం, ప్రమాణం చేయటం, వైసీపీ నేతలు ఎవరూ రాకపోవటం, ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఇందులో ఒక టర్నింగ్ పాయింట్ ఏమిటి అంటే, ఆ రోజు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వెంకటేశ్వర రావు, సిబిఐకి రాసిన లేఖలు బయటకు రావటం. ఈ కేసుకి సంబంధించి, తన వద్ద చాలా సమాచారం ఉంది అంటూ, ఆయన సిబిఐకి లేఖ రాసారు. ఈ విషయంలో సిబిఐకి గతంలో రెండు సార్లు ఫోన్ చేసినా, తన వద్దకు ఎవరూ రాలేదని చెప్పారు. వివేక కుటుంబ సభ్యులు అక్కడ స్పాట్ లో ఉండి ర-క్తం తుడవటం, కుట్లు వేయటం లాంటివి కూడా చెప్పారు. తరువాత విజయసాయి రెడ్డి, గుండె పోటు అని మీడియాకు చెప్పిన విషయం కూడా ఆ లేఖలో తెలిపారు. అయితే ఇవన్నీ వాస్తవాలు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వివేక కుటుంబం నుంచి, జగన్ మోహన్ రెడ్డి వైపు నుంచి ఏబి వెంకటేశ్వర రావుకి కౌంటర్ ఇవ్వాలి కానీ, ఎందుకో ఏపి పోలీసులు కౌంటర్ ఇచ్చారు.

abv 18042021 2

ఈ రోజు డీజీపీ, ఏబీ వెంకటేశ్వర రావు ఆరోపణల పై, ప్రెస్ మీట్ పెడతారని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే డీజీపీ కాకుండా, డిఐజి మీడియా ముందుకు వచ్చారు. ఏబీ వెంకటేశ్వర రావు చేసిన ఆరోపణలు ఖండించారు. ఏబీవీ దెగ్గర అంత సమాచారం ఉంటే, సిట్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇది సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం అని, నేరం కూడా అని అన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆరోపణలు వస్తుందే జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అయితే, మళ్ళీ జగన్ ప్రభుత్వానికే ఆధారాలు ఎలా ఇస్తారు ? అందుకే కదా ఆయన ఏడాది నుంచి సిబిఐకి రాస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే, అప్పట్లో ఏబివి జగన్ కుటుంబ సభ్యుల పై ఆధారాలు లేకపోయినా, వాళ్లని అరెస్ట్ చేయాలని, దర్యాప్తు అధికారి రాహూల్ దేవ్ శర్మపై ఒత్తిడి తెచ్చారని, డిఐజి ఆరోపించారు. ఇక ఫోర్జరీ డాక్యుమెంట్ లు అంటూ, ఆయన చేసిన ఆరోపణలు కూడా నిరాధారం అయినవి అని అన్నారు. కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ వివరాలు ఆయన మీడియాకు చెప్పటం కూడా తప్పు అని, సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం అని అన్నారు. మరి దీని పై ఏబి వెంకటేశ్వర రావు ఎలా స్పందిస్తారో చూడాలి..

Advertisements

Latest Articles

Most Read