కో-వి-డ్ వ్యాప్తి- ప్రజాప్రతినిధుల బాధ్యత అనే అంశంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ క-రో-నా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్థిష్ట ప్రణాళితో ముందుకెళ్లాలని, పటిష్ట వ్యూహం అమలు చేయాలని తెలిపారు. కొ-వి-డ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా నిలబడటమే కాక, వారికి సరైన మార్గదర్శకత్వం అందిస్తూ ముందుండి దిశానిర్దేశం చేయాలి. క-రో-నా 2వ దశలో ప్రపంచంలోనే అత్యధిక కేసులు భారతదేశంలో నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 38 శాతం కేసులు మన దేశంలోనే నమోదవుతున్నాయి. ఇతర దేశాల్లో పోలిస్తే టీకా ప్రక్రియ భారత్ లో నెమ్మదిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా ప్రజలందరికీ టీకా అందించాలి. ఓవైపు క-రో-నా నిబంధనలను కఠినంగా అమలుచేస్తూ, మరోవైపు టీకా ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా వైరస్ కు అడ్డుకట్ట వేయాలి. ఏపీలో క-రో-నా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల నమోదులో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో ఉంది. పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 9.6 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 7,437మంది వైరస్ కు బలయ్యారు.

cbn 19042021 2

క-రో-నా నిబంధనలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. టెస్టింగ్, ట్రేసింగ్ , ట్రాకింగ్ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించకపోవడం వల్ల పరిస్థితి చేయిదాటింది. క-రో-నా మొదటి దశలో ఏపీ ప్రభుత్వం ఎలాగైతే ఒక వ్యూహమంటూ లేకుండా వ్యహరించిందో సెకండ్ వేవ్ లోనూ అదే రీతిలో వ్యవహరించడం బాధాకరం. దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఏపీలోనే నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14 నుంచి 20 ఉండటం ఆందోళన కలిగించే అంశం. విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ సామర్థ్యం బయటపడుతుంది. వైద్య రంగంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలి. పారామెడికల్ సిబ్బంది తమ విధులను యుద్ధప్రాతిపదికన నిర్వర్తించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే రోజువారీ టెస్టుల సంఖ్యను పెంచాలి. టీకా ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం, నిర్ధిష్ట ప్రణాళికల రూపకల్పనతో ద్వారా క-రో-నా వైరస్ కట్టడి సాధ్యమవుతుంది.

సచివాలయ ఉద్యోగుల మృతి దురదృష్టకరం - నారా చంద్రబాబునాయుడు. ఉద్యోగులకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలి. ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న క-రో-నా బారిన పడకుండా ఉద్యోగులు సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలా రక్షణ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. వారం రోజుల వ్యవధిలో సచివాలయంలో నలుగురు ఉద్యోగులు క-రో-నా బారిన పడి మృతి చెందడం రాష్ట్రంలో ఉన్న భయంకర పరిస్థితికి అద్దం పడుతుంది. క-రో-నాతో సాధారణ పరిపాలన శాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీ రవికాంత్, ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ పద్మారావు, పంచాయితీ రాజ్ సెక్షన్ ఆఫీసర్ శ్రీమతి శాంతి కుమారి మృతి చెందడం దురదృష్టకరం, బాధాకరం. బాధిత కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ అన్ని విధాల ఆదుకోవాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా లోపం, అవగాహనా రాహిత్యంతో ప్రభుత్వ ఉద్యోగులు క-రో-నా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఉద్యోగుల రక్షణపై ముఖ్యమంత్రి ఎందుకు శ్రద్ద పెట్టడం లేదు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రి కాలు బయటకు పెట్టకుండా ఉద్యోగులను మాత్రం తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని బెదిరింపులకు దిగడం దుర్మార్గం. క-రో-నాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలసత్వం ప్రదర్శించడం వల్లే రాష్ట్రంలో క-రో-నా విశ్వరూపం చూపిస్తోంది.

serious 19042021 2

ఆదాయం కోసం మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసి జగన్ ప్రభుత్వం వేధించింది. క-రో-నా నియంత్రణలో విఫలమైన ముఖ్యమంత్రిగా శ్రీ జగన్ రెడ్డి దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచారు. కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ వాక్సినేషన్ ను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి. ఉద్యోగులకు ఎన్-95 మాస్కులు, పిపిఇ కిట్లు, శానిటైజర్ వంటివి అందజేయడంతో పాటు ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. క-రో-నా బారిన పడిన ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలి. రిటైర్ అయిన ఉద్యోగుల ఆరోగ్యంపై కూడా శ్రద్ద తీసుకుని మెరుగైన వైద్యం అందించాలి. అవసరమైన ఉద్యోగస్తులందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలి.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో భాగంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో దొంగ ఓట్ల కలకలంతో అధికార పార్టీ నేతల తీరుపై ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, నిరసనలకు దిగాయి. తిరుపతిలోని అన్ని పోలింగ్ బూత్ లలో దొంగ ఓట్లు పోలయ్యాయంటూ టిడిపి, బిజెపి పార్టీల అభ్యర్థులు నిరసనలకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు అధికార పార్టీ తీరు, పోలీసుల వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తిరుపతిలో జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దొంగ ఓటర్లను అడ్డుకున్నందుకు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌ వర్మను అరెస్టు చేసి ఎమ్మారపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలాగే టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పిఎఆర్ కన్వెన్షన్ హాలులో దొంగ ఓట్లు వేసేందుకు బస్సులు, ఇతరవాహనాల్లో తరలి వచ్చారని, అక్కడికెళ్లి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు తరలించా రు. దొంగ ఓట్లు భారీగా పోలవడంతో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారంటూ వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా పోలీసులు గానీ, పోలింగ్ విధుల్లో ఉన్న ఇతర అధికారులు, సిబ్బంది పూర్తిగా చేతులెత్తేశారు.

chevireddy 19042021 2

ప్రతిపక్ష టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తిరుపతిలో రీపోలింగ్ నిర్వహించాలని, దొంగ ఓటర్లను తరలించిన వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని చంద్రబాబు ప్రకటనలో కోరారు. అధికార పార్టీకి చెందిన నాయకులు మదనపల్లి, చిత్తూరు, పుంగనూరు, పీలేరు, పూతలపట్టు నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను దాదాపు 10 వేలమందికి పైగా శనివారం ఉదయానికల్లా ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులలో, జీపులు, టాక్సీలలో తిరుపతికి చేరుకున్నారు. వారందరినీ కళ్యాణ మండపాలు, లాడ్జీలలో పెట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి 2 వేల మంది నుండి 3 వేల మందిని దొంగ ఓట్లు వేసేందుకు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి, విప్ చెవిరెడ్డిదిగా చెప్తున్న ఆడియో టీవీ చానల్స్ వస్తుంది. దొంగ ఓట్ల గురించి మాట్లాడుకుంటూ, వేరే ప్రాంతం నుంచి ఇప్పటికిప్పుడు రమ్మంటే కష్టం అని, 400 దొంగ ఓట్లు మేము వేపిస్తాం అంటూ చెవిరెడ్డిదిగా చెప్తున్న వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఆయన దాని పై స్పందించలేదు.

క-రో-నాతో భారత దేశం విలవిల లాడుతుంది. ఈ నేపధ్యంలోనే లాక్‍డౌన్ దిశగా పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. అలాగే పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేస్తున్నారు. మాల్స్, సినిమాహాళ్లు కూడా ఎక్కడికక్కడ మూసివేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఆరు రోజులు లాక్‍డౌన్ ప్రకటించారు. రాజస్థాన్‍లో 15 రోజులు లాక్‍డౌన్ ను ఆ ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో ఏడు రోజులు లాక్‌డౌన్ ప్రకటించారు. తమిళనాడులో ప్రతి ఆదివారం లాక్‍డౌన్ విధిస్తూ, అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జమ్ము-కశ్మీర్‍లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. హర్యానాలో కూడా నైట్ కర్ఫ్యూ పెట్టారు. ఇక ఉత్తరప్రదేశ్‍లో కూడా నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  బిహార్‌, పంజాబ్‍, గుజరాత్‌, కర్నాటక, ఉత్తరాఖండ్, ఛండీగడ్‍, అండమాన్ నికోబార్‍లో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు. కర్నాటక కూడా లాక్‍డౌన్ దిశగా వెళ్తుంది. ఇక్కడ ఛత్తీస్ గఢ్‍లో 17 జిల్లాల్లో లాక్‍డౌన్ విధించారు.  తెలంగాణలో పెరుగుతున్న క-రో-నా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలోనూ క-రో-నా విజృంభిస్తుంది. ఏపీలోని విద్యాసంస్థల్లో క-రో-నా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం లాక్ డౌన్ విషయంలో తీసుకోలేదు. ఈ  రోజు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేదాని పై  చూడాల్సి ఉంది? - భారత్‍లో క-రో-నా కేసులు పెరగడంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు చేసుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read