తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు అవ్వగానే, భారీ బాదుడుకు, జగన్ మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారని, అలెర్ట్ గా ఉండాలని, ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఆయన మాటల్లో "తెలుగుదేశం పార్టీ గెలిచిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జగన్ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2021 నుండి పెంచిన ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్ మొదటి సమావేశంలోనే తొలి తీర్మానం చేస్తాం. రిజిస్టర్ విలువ ఆధారంగా పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటాం. జగన్ కు ఓటేస్తే ప్రజలపై భారం పడుతుందని చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం నాడు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుగారు మాట్లాడుతూ... అద్దె విలువ ఆధారంగా ఉండే పన్నులను ప్రభుత్వ రిజిస్టర్ విలువ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను పెరిగేలా జగన్ రెడ్డి చట్టం తీసుకొచ్చారన్నారు. నివాస భవనాలకు ఆస్థి పన్ను రిజిష్టర్డ్ విలువలో 0.5 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. ఉదాహరణ – ఖాళీ స్థలం విలువ నిర్మిత భవనం విలువ కలిపి ఆస్థి విలువ కోటి రూపాయలు ఉందనుకుంటే దానికి ఏప్రిల్ 1 నుండి ఆస్థి పన్ను సంవత్సరానికి రూ.50 వేల వరకు చెల్లించవలెను. గతంలో ఈ ఇంటికి సుమారు సంవత్సరానికి రూ.1.5 లక్షలు అద్దె వస్తే సుమారు రూ.5 వేల వరకు పన్ను ఉండేది. పన్ను రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు పెరుగుతుంది. దీనివల్ల పట్టణ ప్రజలపై మరింత భారం పడుతుంది. నివాసేతర భవనాలకు ఆస్థి పన్ను (కమర్షియల్ భవనాలు) రిజిష్టర్డ్ విలువలో 2 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. ఉదాహరణ - ఖాళీ స్థలం విలువ మరియు నిర్మిత, నివాసేతర భవనం విలువ కలిపి ఆస్థి విలువ కోటి రూపాయలు ఉంటే ఏప్రిల్ 1 నుండి సంవత్సరానికి రూ.2 లక్షల వరకు ఆస్థి పన్ను చెల్లించవలెను.

పాత పద్దతిలో ఇదే భవనానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పన్ను ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తన అప్పు పరిధి పెంచుకోవడానికి ప్రజలపై భారం వేయడం సిగ్గుచేటు. పట్టణాల్లో ఆస్తి పన్ను పెంచడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై అద్దెలు పెంచి మరింత భారం వేయనున్నారు. విద్యుత్ రంగంలో శ్లాబు విధానం తీసుకొచ్చి ప్రజల నెత్తిన వేలాది రూపాయలు భారం విధించే విధంగా ఆస్తి పన్ను పెంచి ప్రజలను అప్పులపాలు చేస్తున్నారు. ఖాళీ స్థలం పన్ను ఆస్థి విలువలో మున్సిపాలిటీలలో 0.2 శాతం, మున్సిపల్ కార్పోరేషన్ లలో 0.5 శాతం పన్ను చెల్లించాలి. ఉదాహరణ – ఖాళీ స్థలం విలువ కోటి రూపాయలు ఉందనుకుంటే మున్సిపాలిటీల్లో సంవత్సరానికి రూ.20 వేలు, మున్సిపల్ కార్పోరేషన్ లో సంవత్సరానికి రూ.50 వేలు పన్ను క్రింద చెల్లించవలెను. దీనికి అదనంగా ఖాళీ స్థలంలో చెత్త గనుక ఉన్నట్లయితే మున్సిపాలిటీలలో 0.1 శాతం పెనాల్టీ క్రింద అనగా సంవత్సరానికి రూ.10 వేలు మరియు మున్సిపల్ కార్పోరేషన్ లో అయితే పెనాల్టీ 0.25 శాతం అనగా సంవత్సరానికి రూ.25 వేలు అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా భారాలు వేసేందుకు మాత్రం జగన్ రెడ్డి చట్టాలు తీసుకొస్తున్నారు.

గతంలో పన్ను వేయని భవనాలు, ఖాళీ స్థలాలకు నూతన విధానంలో రిజిష్టర్డ్ విలువ ఆధారంగా పన్ను వేసేలా జగన్ రెడ్డి కొత్త చట్టం తీసుకొచ్చారు. పేద లేదా మధ్యతరగతి వారు కూడా 375 అడుగులు కన్నా ఎక్కువ నిర్మిత భవనంలో కనుక ఉన్నట్లయితే వారు కూడా రిజిష్టర్డ్ విలువ ఆధారంగా పన్ను చెల్లించేలా చట్టాలు తీసుకురావడం ప్రజలను వేధించడం కాదా? అపార్ట్ మెంట్లు వారు రిజిష్టర్డ్ విలువ ఆధారంగా పన్ను చెల్లించాలని నిబంధనలు పెట్టడం మధ్యతరగతి ప్రజల మీద భారం వేయడం కాదా? పేదలు అనధికారికంగా ప్రభుత్వ స్థలంలో గాని, మున్సిపల్ స్థలంలో గాని, ఎండోమెంట్ ల్యాండ్ లో గాని, వక్ఫ్ భూముల్లో గాని లేదా ఇతర పబ్లిక్ ప్రదేశాలలో ఇల్లు కట్టుకుంటే ఎటువంటి పట్టా గానీ, డాక్యుమెంట్ గానీ లేకపోయినా 100 శాతం అదనపు పన్ను విధించడం కక్ష సాధింపు చర్యలను నిదర్శనంలా కనిపిస్తోంది.

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓట్లేయలేదన్న అక్కసుతో, ప్రభుత్వం అనేకగ్రామాల్లో పింఛన్లు కట్ చేయడం, తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటిచర్యలకు పాల్పడుతోందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్.ఎస్.రాజు తెలిపారు. మంగళవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమపార్టీ అధికారంలో ఉందికదాని ఇటువంటి దుర్మార్గపుచర్యలతో అనేకప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు రాక్షసానందం పొందుతున్నాయన్నారు. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలోని అచ్చంపల్లి-చెన్నపల్లిలో 45, కొట్టగూడెంమండలంలోని కొండారెడ్డిపల్లెలో 25మందికి పింఛన్లు తొలగించారని రాజు తెలిపారు. గుంటూరుజిల్లాలోని అనేకగ్రామాల్లో ఇప్పటికే 150మందికి పింఛన్లు నిలిపివేశారని, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలుసహా, అనేకజిల్లాల్లో అధికారులు మూకుమ్మడిగా వైసీపీ నేతల ప్రాబల్యంకోసం పనిచేస్తూ, అర్హులైనవారికి అన్యాయం చేస్తున్నారని రాజు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో గెలుపోట ములను ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవాల్సిన పాలకులు ఈ విధంగా చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సొంత బాబాయిని ఖూనీచేసినంత తేలిగ్గా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు. తిరుపతి వెళ్లకుండా చంద్రబాబునాయుడిని అడ్డుకోవడంద్వారా జగన్మోహన్ రెడ్డి చరిత్ర లో ఎవరూచేయని తప్పు చేశాడన్నారు. చిత్తూరుజిల్లాను సామం తరాజ్యంగా మార్చుకున్న మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగ నూరు వీరప్పన్ లా వ్యవహరిస్తున్నాడని టీడీపీనేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు, పోలీసులసాయంతో మున్సిపల్ ఎన్నికల్లో టీ డీపీవారు నామినేషన్లు వేయకుండా పెద్దిరెడ్డి అడ్డుకోవడం సిగ్గుచేట న్నారు. టీడీపీవారితో ఇతరపార్టీలవారిని కూడా వైసీపీ బెదిరిస్తూ, ఏకగ్రీవాలు చేసుకోవాలని చూస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ఎన్నికల కమిషన్ చోద్యంచూస్తోందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందు అంకుశం సినిమాలో రాజశేఖర్ లా ఆవేశపడిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఇప్పుడెందుకు వైసీపీనేతల కబంధహస్తాల్లో కీలుబొమ్మగా మారాడని రాజు ప్రశ్నించారు. ము న్సిపల్ ఎన్నికల్లో గెలుపుకోసం, అత్యంత అరాచకంగా, నీచాతినీచంగా వైసీపీవారు వ్యవహరిస్తున్నా, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎందుకు మైనంగా ఉంటున్నాడన్నారు. గతంలో 26శాతం ఏకగ్రీవాలు ఎలా జరిగాయి..రాష్ట్రంలో ప్రజాస్వామ్యముందా అని ప్రశ్నించిన నిమ్మగడ్డ, నేడు జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు నోరెత్తడంలేదన్నారు? గవర్నర్ ను కలిసినతర్వాత నిమ్మగడ్డలో ఉన్నట్టుండి ఎందుకు మార్పువచ్చిందో, ఆమార్పుకు కారకులెవరో ఆయనే ప్రజలకు చెప్పాలని రాజు డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ, తనకున్న అధికారాలనుకూడా ఉపయోగించలేని హీనస్థితికి ఎందు కు దిగజారాడో ఆయనే స్పష్టంచేయాలన్నారు. చంద్రబాబునాయడిని అకారణంగా రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించిన ప్రభుత్వతీరుతో, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉందాఅనే సందేహం ప్రతిఒక్కరికీ కలుగుతోందన్నారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో జగన్ పీనల్ కోడ్ ను అమలుచేస్తూ, పెత్తందారీమనస్తత్వమున్న పెద్దిరెడ్డి అనే ఒకనీచుడిచేతుల్లో కాల్మొక్తా..బాంచన్ దొరా... అంటూ కీలుబొమ్మలుగా మారడం సిగ్గుచేటని రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు.

చంద్రబాబునాయుడుకూడా జగన్ లా ఆలోచించిఉంటే, ఏ1 పాద యాత్ర సమయంలో కాలుబయటపెట్టగలిగేవాడా అని రాజు ప్రశ్నిం చారు. చంద్రబాబు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తే, ఆయన మంచితనాన్ని వైసీపీనేతలు చేతగానితనంగా భావిస్తున్నా రన్నారు. నేటితరం యువత వైసీపీప్రభుత్వ కుట్రలు, కుతంత్రలను గమనించాలన్నారు. ఏంచేసినాసరే, చంద్రబాబునాయుడు లోకేశ్ తిరిగి ఏమీచేయలేరులే అనేభావనలో వైసీపీవారుంటే, వారి భ్రమ లు పటాపంచలయ్యలా, వైసీపీవారి పంచెలూడేలా వారిని తరిమికొ ట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రాజు తీవ్రస్వరంతో హెచ్చరించారు. చిత్తూరుజిల్లాలో మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నిన్నటికి నిన్న ఎర్రచందనం స్మగ్లింగ్ లో బిజీగా గడిపాడన్నారు. మీడియా మొత్తం చంద్రబాబునాయుడి నిర్బంధంపై దృష్టిపెడితే, పెద్దిరెడ్డి మాత్రం తన దొంగవ్యాపారాల్లో మునిగితేలాడన్నారు. టీడీపీతరుపున మున్సిప ల్ పోరులో నిలిచిన అభ్యర్థులను కాపాడుకోవడానికి, వారిని ఇతర రాష్ట్రాల్లోదాచే పరిస్థితులు ఎవరు కల్పించారో ఎస్ఈసీ ఆలోచన చేయాలన్నారు. వైసీపీ ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా మున్సిపల్ ఎన్నికలు జరిగే లా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్యలు తీసుకోవాలని రాజు కోరారు. ప్రతిపక్షపార్టీగా తామిచ్చిన ఫిర్యాదులన్నింటినీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వాటిని బుట్టదాఖలు చేశాడని, ఆయనకు తమపార్టీకి సంబంధమేమిటో విలేకరులే చెప్పాలన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇప్పుడు ఎవరికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడోప్రతిఒక్కరూ ఆలోచించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ, ఆందోళనలు జరుగుతున్నాయి. ఎందరో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను, ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, ఈ విషయం పై బుకాయిస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. బీజేపీ అయితే, అసలు మేము విశాఖ ఉక్కు పరిశ్రమ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాష్ట్రంలో తమ ఎదుగుదల చూసి, తెలుగుదేశం, కమ్యూనిస్ట్ లు ఇలా కుట్ర పన్నారు అంటూ వాపోయారు. ఇక వైసీపీ అయితే, పోస్కో కంపెనీ గురించి వస్తున్న వార్తలు అన్నీ అబద్ధం అని కొట్టి పారేసింది. ఏకంగా జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం పై స్పందిస్తూ, చంద్రబాబు కుట్ర పన్నారని, అసలు పోస్కోకి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధం లేదని, నేను వారిని కలిసింది, వేరే చోట స్టీల్ ప్లాంట్ పెట్టటానికి అంటూ, చెప్పుకొచ్చారు. అయితే, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ కానీ అబద్ధం చెప్తున్నారని, ఆర్టిఐ ద్వారా బట్టబయలు అయ్యింది. ఈ ఆర్టిఐ ప్రకారం, నాన్ - బైండింగ్ ఎంఓయి ఎప్పుడో జరిగిపోయింది. కొరియా కంపెనీ పోస్కో, అలాగే ఆర్ఐఎన్ఎల్ మధ్య అక్టోబర్ 23, 2019నే ఎంఓయు కుదిరిందని, ఆ ఆర్టిఐలో రిప్లై వచ్చింది.

posco 02032021 2

కొరియా కంపెనీ పోస్కో, అలాగే ఆర్ఐఎన్ఎల్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఒక జాయింట్ వెంచర్ కంపెనీ స్థాపించి, విశాఖలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తారు. ఈ ప్లాంట్ క్యాపసిటి, ఏడు నుంచి పది మిలియన్ టన్నుల వరకు, ఒక ఏడాదికి ఉంటుంది. ఈ ఆర్టిఐ రిప్లై ఇచ్చింది, కేంద్ర ఉక్కు పరిశ్రమ మంత్రిత్వ శాఖ. అలాగే ఈ ఎంఓయు ప్రకారం, కాయిల్స్, ప్లేట్స్, ఆయిల్డ్ కాయిల్స్, కోల్డ్ రోల్డ్ కాయిల్స్ తాయారు చేస్తారు. అలాగే ఈ ఒప్పందం ప్రకారం, ప్రస్తుతానికి పోస్కో కంపెనీకి 1167 ఎకరాల భూమి కేటాయిస్తారు. అయితే ఈ ఒప్పందంలో ఉన్న మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, కొరియా కంపెనీ పోస్కో, అలాగే ఆర్ఐఎన్ఎల్ కు, ఈ జాయింగ్ వెంచర్ లో, మూడో పార్టీని కూడా చేర్చుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ మూడో పార్టీ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. అయితే ఇంత స్పష్టంగా, విశాఖలో స్టీల్ ప్లాంట్ పై, కొరియా కంపెనీ పోస్కో, అలాగే ఆర్ఐఎన్ఎల్ మధ్య అక్టోబర్ 2019లోనే ఒప్పందాలు కూడా జరిగిపోతే, ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీకి తెలియకుండా ఉంటాయా ? మరి ఎందుకు ప్రజలను మభ్య పెడుతున్నారు ?

ఈ రోజు పార్టీ నేతల టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గున్నారు. గురువారం నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానన్నారు. కర్నూలు, చిత్తూరు, తిరుపతి, విశాఖ, విజయవాడ, గుంటూరులో రోడ్డు షో లో పాల్గొంటానని తెలిపారు. టీడీపీని గెలిపిస్తే ప్రజలకు అండగా వుంటుందని తెలిపారు. మద్యం సీసాలు వాళ్లే తెచ్చిపెట్టి టీడీపీ వారిపైనే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడరని, ఇలాంటి వాటి పట్ల నాయకులు జాగ్రత్త పడాలని అన్నారు. గతంలో తెనాలిలో ఇదే తరహా అరాచకానికి పాల్పడ్డారని అన్నారు. కష్టపడి పనిచేస్తే అనుకున్న ఫలితాలు తప్పకుండా వస్తాయని, సమస్యలు వస్తే వెంటనే అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు ఇవ్వాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులను కిడ్నాప్ చేసి బెదిరించే పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ చేయలేరన్నారు. అందరూ ధైర్యంగా పోరాడాలని కోరారు. అన్యాయం జరిగితే అందుబాటులో న్యాయవాదులుంటారని, ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆధారాలు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. న్యాయబద్ధంగా పోరాడితే తప్పు చేయడానికి అధికారులు కూడా భయపడతారన్నారు. అధికారులు ప్రభుత్వానికి సహకరిస్తూ ఏ నేరం చేసినా తప్పించుకోలేరని వివరించారు.

cbn teleconf 02032021 2

మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి బెదిరించినా అధికారులు తప్పు చేయకుండా వుండే పరిస్థితి రావాలన్నారు. కష్టకాలంలో పోరాడితేనే గుర్తింపు వుంటుందని, కలిసి కట్టుగా పోరాడితే విజయం వరిస్తుందని వివరించారు. వైసీపీ బెదిరింపులకు భయపడి నామినేషన్లు వెనక్కు తీసుకోవడం పిరికిచర్య అని, ఇబ్బందులుంటే అన్ని విధాలా అండగా టీడీపీ వుంటుందని భరోసా ఇచ్చారు. అందరూ ధైర్యంగా పోరాడాలని, ఏదైనా ఘటన జరిగితే తాను కూడా వచ్చి పోరాడతానన్నారు. వాలంటీర్లకు భయపడాల్సిన అవసరం లేదని, ఎస్ఈసీ కూడా వారి నుండి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిందని అన్నారు. న్యాయంగా పోరాడదామని, ఇప్పుడు పోరాటం చేస్తే భవిష్యత్తులోనూ అధికారులు సక్రమంగా పనిచేసే అవకాశం వుంటుందన్నారు. నాయకులందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. నాయకుడు ప్రజల్లో నమ్మకం కలిగించాలని అన్నారు. ప్రతి ఇళ్లూ తిరిగి ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆస్తి పన్ను పెరగడం వల్ల ఇంటి అద్దెలు పెరిగి మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడతారని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read