వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకో రాదంటూ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మరుసటిరోజైన సోమవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ఏకగ్రీవాలైన 11 చోట్ల రీ నామినేషన్ కు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్‌ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీనామినేషన్ కి అవకాశమిస్తున్నట్లు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి కార్పొరేషన్లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్ జరగనున్నది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2, 8, 10, 21,41, 45 డివిజన్లు, పుంగనూరు మున్సిపాలిటీలో 9, 14, 28 వార్డులు, రాయచోటి మున్సిపాలిటీలో 20, 21 వార్డుల్లోనూ రీనామినేషను ఆదేశాలు జారీచేశారు. అలాగే, కడప జిల్లా యర్రగుంట్ల నగర పంచాయతీకి సంబంధించి 6,11, 15 వార్డుల్లో 2020 మార్చి నెలలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించడానికి కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని, ఇప్పుడు కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి అభ్యర్థులకు తెలియజేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు మరియు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎన్నికల అధికారులను ఆదేశించారు.

రీ నామినేషన్‌కు షెడ్యూల్ ఇలా.. రీనామినేషన్ కొరకు ఆయనషెడ్యూల్‌ను కూడా ఆ ఆదేశాల్లోనే పేర్కొన్నారు. నామినేషన్ దాఖలుకు 2వ తేదీ అనగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలు వరకూ సమయం ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి నామి నేషన్ల పరిశీలన చేస్తారని, 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు ఉపసం హరణలకు సమయం ఇస్తన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ 11 చోట్లరీ నామినేషను అవకాశం ఇవ్వడంపై గెలిచిన అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎఈసీ నిర్ణయంపై కోర్టుని ఆశ్రయించనున్నట్లు తెలిసింది. అయితే మిగతా చోట్ల కూడా బలవంతపు ఏకాగ్రీవాలు జరిగాయని, వాటి పై కూడా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను వివిధ పార్టీలు కోరుతున్నాయి. వీటికి సంబంధించి ఆధారాలను ఎన్నికల కమిషన్ కు పంపించినా, వాటి పై నిర్ణయం తీసుకోలేదని అసంతృప్తిలో ఉన్నారు. ఎన్నికలు అంటేనే ఎన్నిక జరగాలని, ఇలా బలవంతంగా ఏకాగ్రీవాలు చేసుకోవటం ఏమిటి అని వాపోతున్నారు.

హైకోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలంటూ దాఖలు అయిన పిటీషన్ పై నిన్న విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మేనిఫెస్టో విడుదలపై కమిషన్ సరిగా స్పందించ లేదని, కేవలం మ్యానిఫెస్టోని బయటకు వెళ్ళకుండా ఆపారని, కె.శివరాజశేఖర్‌రెడ్డి అనే పిటిషనర్ పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమ వారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ అరూప కుమార్ గోస్వామి, న్యాయ మూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు ఉపక్రమించింది. మేనిఫెస్టో విడుదలై ఎస్ఈసీ స్పందించకపోతే తగిన వేదికను ఆశ్రయించాలని సూచించింది. ఈ అంశంపై పిల్ ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై మీకు అభ్యంతరం ఉంటే, నిబంధనలు మేరకు తగిన వేదికను ఆశ్రయించాలని కోర్టు పేర్కొంది. మ్యానిఫెస్టో ఉపసంహరించారని, కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాత్రం, ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ పిటీషన్ వాదించారు. అందుకే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ చంద్రబాబు పై చర్యలు తీసుకోలేదు కాబట్టి, మీరు చర్యలు తీసుకోవాలి అంటూ, హైకోర్టుని ఆశ్రయించారు.

అయితే ఈ వాదన పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మ్యానిఫెస్టో ప్రచురణ చేసింది, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అయితే, మీరు పదే పదే ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేరు ఎందుకు చెప్తున్నారు అని వ్యాఖ్యానించిన కోర్టు, చంద్రబాబుని ప్రతివాదిగా చేర్చటం పై అసహనం వ్యక్తం చేసింది. ఈ పిల్ కు విచారణ చేసే అర్హత లేదని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరైన చర్యలు తీసుకోలేదు అంటే, తగిన నిబంధనలు చూపించి, తగిన వేదికను ఆశ్రయించాలని హైకోర్టు పేర్కొంది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా, పంచ సూత్రాల పేరుతో, తెలుగుదేశం పార్టీ ఒక మ్యానిఫెస్టో విడుదల చేసింది. తాము బలపరిచిన అభ్యర్ధులు గెలిస్తే, ఏమి చేస్తామో చెప్పారు. అయితే, పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు సంబంధం లేదని చెప్పిన వైసీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీని పై స్పందించిన ఎన్నికల కమిషన్, తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో ని వెనక్కు తీసుకోవాలని, ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆ మ్యానిఫెస్టో బయటకు రాలేదు.

ఒక మాజీ ముఖ్యమంత్రిని పది గంటల పాటు నిర్బంధించటం, ఎప్పుడో అరుదుగా చూస్తూ ఉంటాం. ఆయన ఏమీ ఆరాచకాం చేయటానికి వెళ్ళ లేదు. శాంతియుతంగా, శాంతికి మారు పేరు అయినా, గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలపటానికి వస్తున్నారు. అదే ఆయన చేసిన పాపం. అందుకే ఈ నిర్బంధం. మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ, వైసీపీ చేస్తున్న అరాచకాల పై చంద్రబాబు నిరసన దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేస్తానని పిలుపు ఇచ్చారు. అలాగే తిరుపతిలో పోటీలో ఉన్న టిడిపి 43 వ వార్డుకు చెందిన అబ్ధ్యర్ది, తమకు లొంగలేదని, ఆయనకు కొన్నేళ్లుగా ఉన్న షాపుని కూల్చివేసిన సంఘటన ప్రదేశానికి వెళ్ళాలని కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారమే ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. నిన్న చిత్తూరు జిల్లా నాయకులు, పోలీస్ పర్మిషన్ అడగగా, నిన్న రాత్రి పొద్దు పోయిన తరువాత, పర్మిషన్ లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం, నిరసన దీక్షలో పాల్గుంటానని తేల్చి చెప్పారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచే హైడ్రామా నెలకొంది. రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు వస్తున్న నేతలను హౌస్ అరెస్ట్ చేసారు. అంతే కాదు కార్యకర్తలను ఎవరినీ ఎయిర్ పోర్ట్ వద్దకు రానివ్వ లేదు. ఉదయం నుంచి ఇదే పనిగా వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసారు. పెద్ద స్థాయి నేతలను ఇంట్లోనే నిర్బందిన్చారు. వీటి అన్నిటి మధ్య తొమ్మిది గంటల సమయంలో చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.

ఆయన ఫ్లైట్ దిగటంతోనే, పోలీసులు ఆయన్ను చుట్టు ముట్టారు. మీ పర్యటనకు అనుమతి లేదని అన్నారు. కరోనా, ఎన్నికల నిబంధనలు కారణంగా చెప్పారు. తనకు ఈసీ పర్మిషన్ ఉందని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో చంద్రబాబు నిరసన దీక్షకు దిగారు. నేల పై కూర్చుని నిరసన తెలిపారు. తను జరుగుతున్న అన్యాయం పై ఎస్పీ, కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయాలనీ, నిరసన దీక్ష చేయాలని అన్నారు. ఎంతకీ పోలీసులు ఒప్పుకోలేదు. గంట, రెండు గంటలు, మూడు గంటలు, ఇలా పది గంటలు గడిచి పోయాయి. చంద్రబాబు నీళ్ళు కూడా ముట్టలేదు. భోజనం చేయలేదు. అలాగే పది గంటల పాటు దీక్ష కొనసాగించారు. ఆయన్ను ఏదో ఒక ఫ్లైట్ లో తిప్పి పంపించాలని పోలీసులు చూసినా వల్ల కాలేదు. చివరకు జాయింట్ కలెక్టర్, ఎస్పీ వచ్చి, సాయంత్రం ఏడు గంటల ఫ్లైట్ కు వెళ్ళాలని, అదే చివరి ఫ్లైట్ అని, మీరు ఇక్కడే ఉంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, బలవంతంగా ఫ్లైట్ ఎక్కించటంతో, చివరకు 10గంటల ఉత్కంఠ కు తెర పడింది. అయితే చంద్రబాబు మాత్రం, తాను అనుకున్నట్టే, అధికార పార్టీ అరాచకాలను ప్రజలు చెప్పగలిగారు. అలాగే దీక్ష కూడా చేసారు. ఆయన్ను అలా వదిలేసి ఉంటే, ఒక రాజకీయ పార్టీ ప్రసంగం అయ్యేది, కానీ ఇప్పుడు అడ్డుకుని, ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేసి, సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.

2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలు అని, ముద్రగడ జాతి కోసం యాత్రలు అని ట్రైన్ తగలు బెట్టటం, ప్రత్యెక హోదా పోరాటం అని చలసాని శ్రీనివాస్ హడావిడి, మరో వైపు ఉండవల్లి, రమణ దీక్షితులు, మోత్కుపల్లి, లాంటి వాళ్ళు, ఇక అందరి కంటే మించి మూడు వేల కిమీ పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి. వీళ్ళ పర్యటనలను చంద్రబాబు స్వేఛ్చగా చేసుకోనిచ్చారు. జగన్ రెడ్డి వైజాగ్ లో జరుగుతున్న సమిట్ ని భగ్నం చేస్తున్నారని సమాచారం ఉండటంతో, ఒకే ఒకసారి ఆయన్ను అడ్డుకున్నారు అంతే. అంత స్వేచ్చగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పట్లో ప్రతిపక్షాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు ప్రజాస్వామ్యానికి విలువు ఇస్తారు కాబట్టి. ప్రతిపక్షం బలంగా ఉంటేనే రాష్ట్రం బాగుటుందని నమ్మేవారు కాబట్టి. కానీ ఇప్పుడు జరుగుతుంది మాత్రం, వేరు. చంద్రబాబు అధికారం కోల్పోయారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి, జగన్ మోహన్ రెడ్డి అనేక తప్పులు చేస్తున్నారు. వీటి పై సహజంగానే ప్రతిపక్షాలు, ప్రజల తరుపున పోరాటం చేస్తాయి. ఇందులో ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పాత్ర చాలా ఎక్కువ. అందులోనూ ప్రజా పోరాటాల కోసం, చంద్రబాబు ఎప్పుడూ ముందు ఉంటారు.

ఈ 21 నెలల్లో చంద్రబాబుని, ఎనిమిది సార్లు అడ్డుకున్నారు జగన మోహన్ రెడ్డి. మొదటి సారిగా, ఇసుక కొరత పై, దీక్ష పెడితే, హౌస్ అరెస్ట్ అన్నారు. తరువాత చలో ఆత్మకూరు అంటే, హౌస్ అరెస్ట్ అన్నారు. ఆయన ఇంటికి తాడులు కట్టి మరీ నిర్బందించారు. తరువాత అమరావతి జేఏసీ బస్సులు ఆపిన చోటుకు వెళ్తాం అంటే, అరెస్ట్ చేసారు. ఆయన రాత్రి పూట బెంజ్ సర్కిల్ లో కూర్చోవాల్సిన పరిస్థితి. తరువాత, మందడంలో రైతులు పై లాఠీచార్జ్ చేసారు, పరామర్శిస్తాం అంటే, అరెస్ట్ చేసారు. ఆయన్ను రాత్రి పూట అన్ని ఊళ్ళు తిప్పుతూ, అర్ధరాత్రి వదిలి పెట్టారు. తరువాత అమరావతి పరిరక్షణ మీటింగ్ కోసం, తెనాలి వెళ్తాం అంటే, అరెస్ట్ చేస్తాం అని ఆపారు. ఆ తరువాత విశాఖలో మీ భూదందాల బారిన పడిన ప్రజల సమస్యలు వినటానికి వస్తే, అరెస్ట్ చేసారు. చివరి డీజీపీ కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత రామతీర్ధం ఘటనలో కూడా, చంద్రబాబుకు పర్మిషన్ ఇచ్చి, ఆపే ప్రయత్నం చేసారు. ఇప్పుడు తాజాగా చిత్తూరు సంగతి. ఇన్ని సార్లు చంద్రబాబుని బయటకు వెళ్ళనివ్వకుండా ఆపేసారు. అయితే, ఇలా ఆపి, జగన్ రెడ్డి సాధించింది ఏమిటి అంటే, ఏమి లేదు. జగన్ మోహన్ రెడ్డి, తన స్వభావం బయట పెట్టుకుంటున్నారు. చంద్రబాబుని వదిలేస్తే, ఒక రెండు కాలమ్స్ న్యూస్ అయ్యేది, ఇలా అడ్డుకుని బ్యానేర్ ఐటెంగా చేసి, ఆయన దేని పై పోరాడుతున్నారో, ప్రజలందరికీ అర్ధం అయ్యేలా చేస్తున్నారు జగన్ మొహన్ రెడ్డి అండ్ బ్యాచ్.

Advertisements

Latest Articles

Most Read