తూర్పు గోదావరి జిల్లాల్లో, అధికార వైసీపీ నేతల అరాచకానికి మచ్చుతునకగా ఉన్న, శిరోముండనం బాధితుడు వరప్రసాద్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు ఈ రోజు విచారణకు వచ్చింది. తన కేసును సీబీఐకి అప్పగించాలని బాధితుడు ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. శిరోముండనం బాధితుడు ప్రసాద్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు, సీబీఐ, ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశాలు జారీ చేసింది. తన పై పదే పదే కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారంటూ పిటిషన్‍లో పేర్కొన్నారు శిరోముండనం బాధితుడు ప్రసాద్. రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కోర్టుకు తెలిపారు. ఇసుక మాఫిను అడ్డుకున్నందుకు ప్రభుత్వం వేధిస్తోందని, హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ ప్రసాద్. అధికార పార్టీ నేతలు, పోలీసులు పై ఒత్తిడి తీసుకుని వచ్చి, ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేసారని తెలిపారు. అయితే ఈ కేసులో దళిత సంఘాలు ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదని, బాధ్యులైన వారి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కేవలం పోలీస్ శాఖకు చెందిన ఎస్ఐ పై మాత్రమే , చర్యలు తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు.

hc 020332021 2

అయితే సదరు ఎస్ఐ, ఎవరి ఆదేశాల మేరకు, శిరోముండనం చేసారో, ఆ వైసీపీ అధికార పార్టీ నేతల పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి న్యాయం జరిగాలి అంటే, దీని వెనుక ఉన్న దోషులకు తగిన శిక్ష పడాలి అంటే, ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని కోర్టుని కోరారు. ఈ నేపధ్యంలోనే, వరప్రసాద్ తరుపు న్యాయవాది శ్రావణ్ కుమార్, గత కొంత కాలంగా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు అనే విషయాన్ని ధర్మాసనం ముందుకు తీసుకుని వచ్చారు. అయితే అందరి వాదనలు విన్న హైకోర్టు, సిబిఐని ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్తూ, తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఇదే నేపధ్యంలో వరప్రసాద్ పై మరో కేసు నమోదు చేయటంతో, తన పై అనవసరంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. అయితే పిటీషనర్ వరప్రసాద్ స్వయంగా కోర్టుకు కూడా విన్నవించుకున్నారు. ఈ కేసును సిబిఐకి అప్పచెప్పి, శిరోముండనం చేయటానికి బాధ్యలును శిక్షించాలని హైకోర్టుని కోరారు.

పురపాలక సంఘాల ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ ప్రభుత్వం హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యవసర విచారణ జరిపి ఉత్తర్వుల ఉపసంహరణకు ఆదేశాలివ్వా లని కోరింది. గ్రామ, వార్డు సచి వాలయాల విభాగం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణ నిమిత్తం సింగిల్ జడ్జి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ముందుకు వచ్చింది. ప్రభు త్వం తరుపున అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరాం వాదనలు వినిపించారు. ఎస్ఈసీ ఆదేశాల వల్ల రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాల అమలుకు విఘాతం కలుగుతుందని దీనివల్ల పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందే పరిస్థితి ఉండదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్లు, ఇతర పథకాలకు సంబంధించి లబ్దిదారుల నుంచి బయోమెట్రిక్ తీసుకునేం దుకు మొబైల్ ఫోన్లు అవసరమవుతా యన్నారు. దీన్ని నిలువరించటం వల్ల ప్రజలు నష్టపోతారన్నారు. ఎన్నికల ప్రక్రియకు వలంటీర్ల వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వాలంటీర్లకు రాజకీయాలతో సంబంధం లేదని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీల కతీతంగా లబ్దిదారులను గుర్తించి స్వచ్చంద వేసలందిస్తున్నారని వివరించారు.

అలాంటప్పుడు నిత్యావసరాలను, సంక్షేమ కార్యక్రమాలను ఆపే అధికారం ఎఈసీకి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో వాలంటీర్లు ఏ పని చేసే అవకాశం లేదన్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఫిర్యాదులు వచ్చినందునే పురపాలక ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వలంటీర్లను నియంత్రించేలా ఆదేశాలు జారీ చేశామనే ఎన్నికలకమిషన్ వాదన సరైంది కాదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చినవి అవాస్తవ ఆరోపణలను ఆధారాలులేవని ఏజీ కోర్టుకు వివరించారు. ఒకవేళ ఆధారాలతో ఆరోపణలు వాస్తవమని తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికెలాంటి అభ్యంతరం లేదని అయితే మొత్తం వ్యవస్థను నిలువరించే అధికారం లేదన్నారు. ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు వాలంటీర్లను బెదిరించేవిగా ఉన్నాయన్నారు. ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రకటించటం తమకు విస్తృత అధికారాలు ఉన్నాయనే భావన సమంజసం కాదన్నారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీల కతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని తెలిపారు. ఇంటింటికీ తిరిగి పింఛన్ అందిస్తున్న వారి స్వచ్చంద సేవలను ఎలా కట్టడి చేస్తుందని ప్రశ్నించారు. ఇతర సంక్షేమ పథకాలు కూడా నిషక్షపాతంగా అమలవుతున్నాయని చెప్పారు. ఎన్నికల విధుల్లో ఏమాత్రం భాగస్వామ్యం కాని వాలంటీర్లను పూర్తి స్థాయిలో స్తంభింపచేస్తే అందాల్సిన ఫలాలు అందవన్నారు. ఎస్ఈసీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. దీని పై ఈ రోజు కూడా విచారణ చేసిన న్యాయస్థానం, తీర్పుని రిజర్వ్ చేసింది

నిన్న ఒక ప్రాముఖ పత్రికలో వచ్చిన వార్త, ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపింది. అయితే నిన్న చంద్రబాబు టూర్ ఉద్రిక్తంగా మారటంతో, అందరూ ఈ విషయం మర్చిపోయారు. ఆ వార్త ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ నేతలు, రూ.30 కోట్ల రూపాయాలు, డీల్ లో లబ్ది పొందారని. రాయలసీమలోని ఒక అశ్రామంలో ఐటి అధికారులు సోదాలు జరపగా, రూ.400 కోట్లకు పైగా అనధికారికంగా ఉన్న లావాదేవీలను వారు గుర్తించారు. దీంతో విషయం తెలుసుకున్న ఆ బీజేపీ నేత, రంగంలోకి దిగి, తనకు కేంద్రంలో పలుకుబడి ఉందని, మీకు సాహయం చేస్తాను అంటూ రంగంలోకి దిగారు. ఆ నేతకు తోడుగా, మరో నేత కూడా తోడయ్యారు. అందరూ కలిసి తిరుపతిలో మీటింగ్ అయ్యి, డీల్ కుదుర్చుకున్నారు. 30 కోట్లు ఇస్తే, ఈ కేసులో ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, డీల్ సెట్ చేసుకున్నారు. అంతా సాఫీగా జరిగిపోయినా, విషయం బయటకు పొక్కింది. కేంద్ర నిఘా సంస్థలు రంగంలోకి దిగి, మొత్తం విషయం కూపీ లాగాయి. విషయం జాతీయ బీజేపీ అధిష్టానం వద్దకు చేరింది. ఆ ఇద్దరి నేతల వల్ల పార్టీ పరువు పోతుందని, అధిష్టానం భావించింది. వారి పై చర్యలు తీసుకునే, మరింతగా వారు చేసిన పనులు పై ఆధారాలు సేకిరించి, వారి పై వేటు కూడా వేస్తారని, నిన్న పత్రికలో వచ్చిన కధనం.

అయితే ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు అనేది మాత్రం ఆ పత్రిక రాయలేదు. ఒకరు కేంద్రంలో కేబినెట్‌ హోదా ఉన్న వ్యక్తి అని, అలాగే ఇంకొకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరచూ వచ్చి వెళ్లే ప్రముఖ నేత అంటూ రాసుకుని వచ్చారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు వీరే అంటూ సిపిఐ రామకృష్ణ బాంబు పేల్చారు. అనంతపురంలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన రామకృష్ణ, ఆశ్రమం పై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసి, అక్రమ ఆస్తులు గుర్తించారని, ఇదే అదునుగా బీజేపీ నేతలు రంగంలోకి దిగారని, దీని కోసం ఇద్దరు నేతలు డీల్ కుడుర్చుకున్నారని, ఆ ఇద్దరు నేతలు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు అని, వారి పేర్లు బలంగా వినిపిస్తున్నాయని సిపిఐ రామకృష్ణ బాంబు పేల్చారు. కోట్ల రూపాయాలు సంపాదించిన దొంగ స్వాములతో, ఈ బీజేపీ నేతలు అంటకాగుతున్నారని వాపోయారు. తాను ఈ విషయం పై తిరుపతికి ఫోన్ చేసి అడిగితే, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు పేర్లు చెపుతున్నారని, ఈ కధనం వచ్చి 24 గంటలు అయినా, ఎవరూ ఖండించలేదని, వారిద్దరూ కాకపోతే, ఎందుకు ఇప్పటి వరకు ఎవరూ ఖండించలేదని ప్రశ్నించారు.

జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్టుఉండి, ప్రధాని మోడి, హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరటం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు సాయంత్రం కానీ, రేపు కానీ ఢిల్లీ వెళ్లనున్నారు. నిజానికి ఈ నెల నాలుగవ తేదీన, హోం మంత్రి అమిత్ షా తిరుపతిలో, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సమావేశం వాయిదా పడింది. దీంతో అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దు అయ్యింది. ఆ సమావేశంలో ఎన్నో అంశాలు లేవనెత్తాలని జగన్ మోహన్ రెడ్డి భావించారని, ఆ సమావేశం రద్దు కావటంతో, ఇప్పుడు ఢిల్లీ వెళ్లి కలిసి విన్నవించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రధాని మోడీతో పాటుగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ కూడా కోరారు. ఈ అప్పాయింట్మెంట్ లు ఖరారు అయితే, ఈ రోజు రాత్రి కాని, రేపు కాని జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అమిత్ షాతో రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు ప్రస్తావిస్తారని, ముఖ్యంగా పోలవరం విషయంలో ఉన్న గందరగోళం పై చర్చిస్తారని చెప్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గించే అంశం పై వార్తలు వస్తున్న నేపధ్యంలో, అలాగే కేంద్ర జల శక్తి శాఖ కూడా ఈ అంశం పై చర్చలు జరుపుతూ ఉండటంతో, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.

అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఇతర ఆర్ధిక పరమైన అంశాలతో పాటుగా, విభజన సమస్యల పై కూడా చర్చిస్తారని చెప్తున్నారు. దక్షినాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏ అంశాలు అయితే చర్చించాలని అనుకున్నారో, ఆ అంశాలు అన్నీ అమిత్ షా తో చర్చిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తుంది. పనిలో పనిగా, ప్రధాని మోడీని కలిసి చాలా రోజులు అయిన నేపధ్యంలో, ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఆయన వద్ద ప్రస్తావించనున్నారు. అయితే గత రెండు మూడు సార్లుగా జగన్, మోడీ అపాయింట్మెంట్ కోరుతున్నా, అది వీలు పడటం లేదు. ఈ సారైనా అపాయింట్మెంట్ లభిస్తుందని భావిస్తున్నారు. అయితే వీరి ఇరువురిలో ఒకరి అపాయింట్మెంట్ లభించినా, జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఇంట సడన్ గా ఢిల్లీ వెళ్ళటం పై, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. పోలవరం కానీ, ఇతర సమస్యలు కానీ, ఇప్పుడు కొత్త ఏమి కాదని, వీటి కోసం ఇంట హుటాహుటిన జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళాల్సిన అవసరం ఏమి లేదనే వాదన కూడా ఉంది.

Advertisements

Latest Articles

Most Read