తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, అన్యమతస్తుల వ్యవహారం మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. హిందువులు కాకుండా, వేరే మతం ఆచరించే వారు, కలియుగ దైవం వెంకన్నను దర్శించుకోవాలి అనుకుంటే, గతంలో ఉన్న చట్టాలు ప్రకారం, అన్యమతస్తులు, తమకు స్వామి వారి మీద నమ్మకం, విశ్వాసం ఉంది అని డిక్లరేషన్ ఇచ్చి తిరుమల దర్శనం చేసుకోవాలి. అయితే జగన్ మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళిన ప్రతి సారి డిక్లరేషన్ ఇవ్వకుండా, స్వామి వారిని దర్శించుకోవటం చర్చకు దారి తీస్తుంది. గతంలో రాష్ట్రపతిగా పని చేసిన అబ్దుల్ కలాం కానీ, ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో సోనియా గాంధీ కానీ, ఇలా అనేక మంది స్వామి వారి పట్ల తమకు విశ్వాసం ఉందని, డిక్లరేషన్ ఇచ్చే వారు. అయితే జగన్ మోహన్ రెడ్డికి, స్వామి వారి పట్ల నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వటానికి బాధ ఏమిటి అంటూ, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ తిరుమల వెళ్లి, శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వటానికి వెళ్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ చర్చ మళ్ళీ మొదలైంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు కూడా ఈ విషయం ప్రస్తావించారు.

దీంతో అందరూ ఇదే మాట్లాడుకోవటం, అసలు ఒక డిక్లరేషన్ ఇవ్వటానికి ఇబ్బంది ఏమిటి అనే చర్చ జరుగుతూ ఉండటంతో, దీని పై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పని లేదు అంటూ, గతంలో ఉన్న రూల్స్ ని మార్చేస్తూ, ప్రకటన చేసారు. మనసులో విశ్వాసం ఉంటే చాలని, డిక్లరేషన్ అవసరం లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపాయి. అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఎలా మార్చేస్తారు, అందులోను ఇది చట్టం అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐవైఆర్ కృష్ణారావు కూడా ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఇక ఇదే విషయం పై చంద్రబాబు స్పందించారు. జగన్ కోసం సంప్రదాయాలు మార్చేస్తారా ? పాలకులు మారిన ప్రతిసారి సంప్రదాయాలు మార్చేస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్వామి వారి పట్ల అన్యమస్తులకు నమ్మకం ఉంది అని చెప్పటానికి డిక్లరేషన్ ఇస్తారు, దాన్ని ఈ నమ్మకం లేని వ్యక్తి కోసం మార్చేస్తారా, ఇది సమాజానికి అరిష్టం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

విశాఖ ఏజెన్సీ గిరిజనులను వింతవ్యాధి వట్టిపీడిస్తోంది. ఒక్కసారిగా జ్వరం రావడంతోపాటు శరీరమంతా పట్టు వదిలేసినట్టు అయి కుప్పకూలిపోతున్నారు. స్థానిక పీ హెచ్ సీలకు వెళితే, వారు ఇచ్చిన మందులకు జ్వరం తగ్గక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు వడుతున్నారు. వ్యాధి తీవ్ర పెరగడంతో పలువురిని విశాఖ కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కో-వి-డ్ మహమ్మారి విశాఖ ఏజెన్సీలో విస్తృతంగా వ్యాపిస్తుండగా మరోవైపు వింత వ్యాధితో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఏజెన్సీలో ఎక్కువగా మలేరియా వ్యాధి ప్రబలడం జరిగేవి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా వ్యాధి ఏమిటో అన్నది తెలియకుండా గిరిజనులు మంచాన పడుతున్నారు. విశాఖ ఏజెన్సీ అనంతగిరి పంచాయతీ కరకవలస, చినరాభ గ్రామాల్లో మూడు వారాల వ్యవధిలో పదుల సంఖ్యలో గిరిజనులు మంచాన పడ్డారు. వారిని విశాఖ కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జ ్వరం, కడుపునొప్పితో పాటు కాళ్లు చేతులు విపరీతంగా వావులు వచ్చి అనారోగ్యం బారిన పడుతున్నారు.

ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ఏడీఎంపావో ఏజెన్సీ గ్రామాలకు చేరుకుని వింతవ్యాధికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. జ్వరంతోపాటు కాళ్లు, చేతులు వాపులు, అంతేకాదు అనారోగ్యం బారిన పడిన కరకవలస, తట్టుకోలేని కడుపునొప్పి వస్తుండటంతో అసలు సొట్టడివలస, చినరాభ గ్రామాలకు చెందిన ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో, 18మంది గిరిజనులను గజపతినగరానికి తరలించి ఏర్పడ్డాయి. విశాఖ ఏజెన్సీలో మారుమూల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారందరికీ కోవిడ్ గ్రామాలు ఎక్కువగా వున్నాయి. వారికి నెగేటివ్ వచ్చింది. అయినప్పటికీ విశాఖ ఆసుపత్రులు అందనంత దూరంగా వుండటంతో కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, కడుపునొప్పి, కాళ్లు, చేతులు వాపు రావడం వంటి లక్షణాలతో విశాఖ కేజీ హెచ్ లో గిరిజనులు చికిత్స పొందుతున ఇప్పటికీ ఈ వ్యాధి ఏమిటో అన్నది ఇంకా వైద్యులు నిర్ధారించుకోలేకపోతున్నారు. పేడ పురుగు కుట్టినా ఇదే తరహాలో జ్వరం వచ్చి శరీరం వట్టువదిలేసే వరిస్థితులు ఏర్పడతాయని పలువురు చెబుతుండగా మరోవైపు అటువంటిదేమి లేదని మరో వాదన వినిపిస్తోంది. పేడ పురుగు కుడితే శరీరంపై ఎరుపురంగు మచ్చలు ఏర్పడతాయన్న వాదన కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలో గిరిజనులు విచిత్రమైన లక్షణాలతో మంచానపడి సతమతమవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోతే పరిస్తితి చెయ్యి దాటిపోయే ప్రమాదం వుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం(దుర్గగుడి) రథంలో మూడు వెండి సింహాలు ఈ ఏడాది మార్చి తర్వాతనే మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. గత మార్చిలో లాక్ డౌన్ విధించిన సమయంలో వీటిని చోరీ చేసి ఉండొచ్చని పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. క-రో-నా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి ఆఖరి వారంలో ఉగాది ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని రథం తదితర వస్తువులకు పాలిష్ పెట్టే కాంట్రాక్టరు వీటిని పరిశీలించినట్లు పోలీసు విచారణలో రూఢీ అయ్యింది. దుర్గగుడి అధికారుల ఫిర్యాదు మేరకు రథంలోని మూడు వెండి సింహాల మాయంపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం నుంచి దర్యాప్తను ముమ్మరం చేశారు. విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం నేరపరిశోధన విభాగం (క్రైం) డీసీసీ కోటేశ్వరరావు మూడు సింహాలు మాయమైన రథాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించిన కీలక సమాచారం పోలీసులకు చేరింది. వెండి, బంగారు, ఇత్తడి తదితర వస్తువులకు పాలిష్ పెట్టేందుకు శ్రీ శర్వాని ఇండస్ట్రీస్ సంస్థకు నెలకు రూ.47 వేలకు కాంట్రాక్టు ఇచ్చారు. వీరి నుంచి వెంకట్ అనే వ్యక్తి సబ్ కాంట్రాక్టు తీసుకొని పాలిష్ పనులు చేపడుతున్నారు.

ఉగాది ఉత్సవాల్లో వెండి రథంఅవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పక్షం రోజుల ముందు రథం పరిశీలించిన వెంకట్ పాలిష్ వ్యవహారంపై ఆలయం గోల్డ్ అప్రెజర్ డీ. షమ్మీకి ఫోన్ చేసి చర్చించారు. పోలీసుల విచారణ సందర్భంగా షమ్మీ ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే సబ్ కాంట్రాక్టర్ వెంకటను విచారించేందుకు పోలీసు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందుబాటులో లేకపోవడంతో పాటు మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో అతను వస్తే కీలక సమాచారం తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా క-రో-నా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఆలయాల్లోకి భక్తులను అనుమతించ లేదు. కేవలం అధికారులు, ఆలయ సిబ్బంది సమక్షంలోనే ఆలయాల్లో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. జూన్ 10వ తేదీ నుంచి మాత్రమే భక్తులకు అనుమతించినందున ఆ మధ్యలోనే వెండి సింహాలు చోరీకి గురై ఉండొచ్చని పోలీసులు ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఇందులో భాగంగా దర్యాప్తు వేగాన్ని పెంచిన పోలీసులు తొందరలోనే నిందితులను గుర్తించి పట్టుకుంటామని చెపుతున్నారు. గత కొద్ది రోజులుగా గత ప్రభుత్వ హయాంలో కూడా చోరీకి గురై ఉండే అవకాశం ఉందని ప్రకటనలు చేసిన అధికార పార్టీ నేతలు మార్చి తర్వాతనే ఘటన చోటు చేసుకున్నట్లు నిర్ధారణ కావడంతో మిన్నుకుండిపోయారు.

ఏపి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను మరో వివాదం చుట్టు ముట్టుకుంది. ఈఎస్ఐ కుంభకోణంలో 14వ నిందితుడైన కార్తీక్ మంత్రి గుమ్మనూరు కుమారిడికి బెంజి కార్ బహుమానం ఇవ్వడంలో అంతర్యం ఏమిటని మాజీ మంత్రి , తెదేపా నేత అయన్న పాత్రుడు బహిరంగంగా దుయ్యబట్టారు. ఈఎస్ఎ కుంభకోణంలో నిందితుడు కార్తీక్ మంత్రికి బినామీగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు వ్యాఖనించడం సంచలనం రేపుతుంది. ఇటీవలే మంత్రి స్వ గ్రామమైన గుమ్మనూరులో భారీగా పేకాట దందా నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించి వాటిని బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా నగదుతో పాటు 35 కార్లు, 39 మందిని అరెస్టు చేశారు. కాగా మంత్రి ఇలాఖాలో పేకాట డంపు బహిర్గతం కావడంతో గుమ్మనూరు కుటుంబ సభ్యుల నేతృత్వంలోనే ఈ దందా జరుగుతుందని వివిధ రాజకీయ పార్టీలతో పాటు నేతలు దుయ్యబట్టారు. ఈ వివాదం మంత్రికి తలపోటుగా మారగా, ఇదే క్రమంలో ఇటాలీ భూముల కొనుగోలు వ్యవహారం ఆయనకు మరో తలపోటుగా మారింది. ఇలా ఇప్పటికే అనేక వివాదాలతో మంత్రి సతమతమవుతుండగా, తాజాగా మరో వివాదం చుట్టుముట్టింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయన్నపాత్రుడు మంత్రి గుమ్మనూరుపై ఊహించని అరోపణలు చేశారు.

ముఖ్యంగా ఈ ఎప్ స్కాంలో 14వ నిందితుడిగా ఉన్న కార్తీక్ అనే వ్యక్తి మంత్రి జయరాం కుమారుడికి బెంజికార్ బహుమతిగా ఇచ్చాడని అయ్యన్నపాత్రుడు విజయవాడలో సంచలన వ్యాఖలు చేయడం ప్రస్తుతం రాష్ట్రంలోనే ఇది హాట్ టాపిక్ గా మారింది. ఏ సంబంధంతో కార్తీక్ కారును కానుకగా ఇచ్చారో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఏ 14 అయిన కార్తీక్ మంత్రి జయరాంకు బినామీగా ఉన్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఈఎన్ఏ కుఱకోణంలో ఏ 14 నిందితుడైన కార్తీక్ గుమ్మనూరు కుమారుడు జన్మదినోత్సవం రోజున బెంజీ కారు బహుమతిగా ఇవ్వడం వీటిని మరింత బలపరుస్తుందన్నారు. డెలీవరి తీసుకున్న బెంజ్ జిఎల్‌ఎస్ 350 కారు కానుకగా ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే ఈ ఎన్ఏ కుంభకోణం మూలాలు వైకాపాకి చెందిన మంత్రి జయ రాం దగ్గర తేలుతాయన్నారు. ఈ విషయం మీద ఆలూరులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఆలూరులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేస్ బుక్ లో తన కుమారుడు ఫోటో దిగిన బెంజీకారు తన కుమారిడిది కాదన్నారు.

వేరేవాళ్ల కారు ప్రక్క ఫోటో దిగారు అంతేనన్నారు. హెలిక్యాప్టర్ , ట్రైన్ వద్ద ఫోటో దిగితే అది మనదే అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. కారు తమదే అని రుజువుచేస్తే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం సవాల్ విసరడం గమనార్హం. అయితే మంత్రి చాలంజ్ పై ఈ రోజు అయ్యన్నపాత్రుడు స్పందించారు. మరిన్ని ఆధారాలు చూపిస్తూ ఈ రోజు మీడియా సమావేశం పెట్టారు. మంత్రి మాట్లాడుతూ, కేవలం ఆ కార్ డెలివరీ మాత్రమే తన కొడుకు తీసుకున్నాడని, తన కొడుకు ఫాన్స్ ఎవరో అడిగితే అలా చేసారని, ఆ కార్ తో మాకు సంబంధం లేదు అంటున్నారని, మరి ఆ కారు వేసుకుని, అన్ని చోట్లా తిరుగుతున్న ఈ వీడియోలు ఏమిటి, కారు పై ఎమ్మెల్యే స్టిక్కర్ ఏమిటి అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. దీనికి సంబంధించి, వీడియో, ఫోటోలు ప్రదర్శించారు.

Advertisements

Latest Articles

Most Read