ఈ రోజు రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి, చుక్కెదురైంది. రాజ్యసభలో కరోనా వైరస్ పై చర్చ సందర్భంగా, విజయసాయి రెడ్డికి అవకాసం రావటంతో, ఆయన కరోనా సబ్జెక్ట్ పైన కాకుండా, కోర్టులను, జడ్జీలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తమ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పై అడ్డు చెప్తూ, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటూ, కోర్టులు తమ ప్రభుత్వ నిర్ణయాల పై స్టే ఇస్తున్నాయని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తమ రాష్ట్రంలో శాసన వ్యవహారాలు, కార్యనిర్వాహిక వ్యవహారాలు కోర్టులు నడిపిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేయటం దుమారం రేగింది. అయితే విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ప్రసాద్, అభ్యంతరం చెప్పారు. కోర్టుల విషయం ఇక్కడ కాదని, సబ్జెక్టు పై మాట్లాడాలని కోరారు. అయినా విజయసాయి రెడ్డి కోర్టుల పై విమర్శలు చేస్తూనే ఉన్న సమయంలో, తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అభ్యంతరం చెప్పారు.

కోర్టు పరిధిలో ఉన్న అంశాలు ఇక్కడ మాట్లాడ కూడదు అని, అయినా కోర్టులను బెదిరించే ధోరణిలో మాట్లాడటం సరికాదని, చైర్మెన్ ఇచ్చిన సబ్జెక్ట్ పై మాట్లాడాలని, ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇదే అంశం పై తెలుగుదేశం ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. కోర్టులు ఎప్పుడైనా చట్టాల ప్రకరామే నడుచుకుంటాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాలను దాటి ప్రవర్తిస్తుంది కాబట్టే, అన్ని కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయని అన్నారు. విజయసాయి రెడ్డి మాటలు, న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే విధంగానే ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలు పై కోర్టుకు వెళ్తామని అన్నారు. నిన్న పార్లమెంట్ లో, ఈ రోజు రాజ్యసభలో, ఓక ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తున్నారని, అలాగే సోషల్ మీడియాలో కూడా జడ్జిల పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, ఇవన్నీ కోర్టు దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. ఒక పాక చర్చ కరోనా పైన అయితే, విజయసాయి రెడ్డి మాత్రం, చంద్రబాబు జపం, న్యాయస్థానాల జపం చేస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 2012 నుంచి అనేక అటుపోట్లు ఎదుర్కుంటుంది. విభజన సమయంలో ఈ దేశంలో ఉన్న మీడియా మన పక్షాన నిలవలేదు. రాజధాని లేకుండా రోడ్డున పడేస్తున్నా, సానుభూతి చూపించలేదు. ఇక విభజన తరువాత, విభజన హామీలు అమలు పరచకపోయినా, మన వైపు చూడలేదు. కేంద్రంతో, 5 కోట్ల మంది ఎందుకు పోరాడుతున్నారు అనేది ఎవరూ పట్టించుకోలేదు. కానీ, మోడీ చంద్రబాబుని, చంద్రబాబు మోడీని తిట్టినా, అది జాతీయ మీడియాను ఆకర్షించింది. అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, మీడియా గొంతు నొక్కేస్తూ, మా అనుకూల వార్తలే రాయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఊరుకునేది లేదు అంటూ జీవో 2430 ఇస్తే, ఒక్కరు కూడా జాతీయ మీడియా నుంచి మాట్లాడటలేదు. ఇదేమిటి అని ప్రశ్నించలేదు. కానీ కావాలని ఒక వ్యక్తిని, కొంత మంది జడ్జిలను ఇబ్బందులు పెట్టాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు వేసారని, హైకోర్టు చెప్తూ, ఆధారాలు లేని ఈ ఎఫ్ఐఆర్ ను ప్రచారం చెయ్యవద్దు అంటూ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వగానే, ఎవరో స్పందించండి అని చెప్పినట్టే, వరుస పెట్టి జాతీయ మీడియాలోని కొంత మంది స్పందించిన తీరు చూస్తూ, ఆశ్చర్యం వెయ్యక మానదు.

ఈ పని చెయ్యటానికే, నెలకు 4 లక్షలు జీతం ఇచ్చి, జాతీయ మీడియా అడ్వైజర్ ని పెట్టారని, తెలుగుదేశం ఆరోపిస్తుంది కూడా. అయితే అమరావతి విషయంలో స్పందించిన ఈ జర్నలిస్టులు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వాటి పై ఎందుకు స్పందించలేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. జీవో 2430 పై కానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ పై కుట్రలు కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇలాంటి వాటి పై ఎవరూ స్పందించలేదు. అయితే కోర్టులు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటం అనేది కొత్త కాదు. ఎందుకంటే, గతంలో, గతంలో కాదు, ఏడాది క్రితమే, వైఎస్ వివేక కేసు పై ఎక్కడ ప్రచారం చెయ్యకుడు అని, కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంది, ఇదే వైసీపీ పార్టీ. ఇదే వైసీపీ పార్టీ ఎమ్మేల్యే అంబటి రాంబాబు పై, ఒక కేసులో, హైకోర్ట్ గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. అంత ఎందుకు ఈ రోజు ఢిల్లీ హైకోర్టు, అన్ని రాష్ట్రాల ఐ అండ్ పీఆర్ వాళ్లకు ఆదేశాలు ఇస్తూ, నటి రకుల్ ప్రీత్ సింగ్ విషయం మీడియాలో ప్రస్తావించవద్దు అని ఆదేశాలు ఇచ్చాయి. గతంలో అమిత్ షా కొడుకు, జే షా పై కూడా ఇలాంటి గ్యాగ్ ఆర్డర్ వచ్చింది. మరి అప్పుడు లేని బాధ, ఈ సో కాల్డ్ నేషనల్ మీడియా జర్నలిస్టులకు, ఇప్పుడే ఎందుకు వచ్చిందో అనే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం రోజు రోజుకీ దిగాజారి పోతుంది. అసలకే లోటుతో ప్రారంభం అయిన రాష్ట్రం, గత ప్రభుత్వం కూడా 5 ఏళ్ళలో లక్ష కోట్ల వరకు అప్పు చేసింది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చిన తరువాత, ప్రజలకు పంచె పధకాలు ఎక్కవ కావటంతో, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో ఆదాయం తగ్గిపోతూ వస్తుంది. ముందు ఆరు నెలలు ఇసుక లేక పనులు లేక, ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోవటంతో ఆదాయం తగ్గిపోయింది. గత 4-5 నెలల నుంచి క-రో-నా రావటం పూర్తిగా చతికల పడింది. అయితే ఈ 15 నెలల్లోనే ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని కాగ్ రిపోర్ట్ లు చెప్తున్నాయి. తగ్గిపోతున్న ఆదాయం ఓక వైపు, పెరిగిపోతున్న ఖర్చులు ఒక వైపు, అప్పులు మరో వైపు, ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి, అక్టోబర్ 11 గండం ఉంది అంటూ ఒక ప్రముఖ పత్రిక ఆసక్తికర కధనం ప్రచురించింది. ఈ నెలలో ఇప్పటికే ప్రభుత్వం 5 వేల కోట్లు అప్పు చేసింది. నెల మొదటిలో 3 వేల కోట్లు, రెండో వారంలో మరో 2 వేల కోట్లు అప్పు చేసారు. తరువాత 2400 కోట్లు ఓడీ కూడా తీసుకున్నారు. అయితే ప్రభుత్వ ఖర్చులు, తీర్చాల్సిన బాకీలు చూసుకుంటే, అక్టోబర్ 11 నాటికి ప్రభుత్వానికి 14 వేల కోట్లు కావలసిన అవసరం ఉంది.

అయితే ఆదాయం ఆ స్థాయిలో వచ్చే అవకాసం లేకపోవటంతో, ప్రభుత్వం దీన్ని ఎలా అదిగమిస్తుంది అనేది చూడాలి. ఈ స్థాయిలో అప్పులు కూడా పుట్టే అవకాసం లేదు. మరి ఈ పరిస్థితి నుంచి బుగ్గన ఎలా గట్టేక్కిస్తారో చూడాలి. ఇక ఖర్చులు విషయానికి వస్తే, అక్టోబర్ 11 నాటికి ఉద్యోగాలకు పెట్టిన పెండింగ్ జీతాలు , వడ్డీతో సహా ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు , పెన్షన్లు, అలాగే సామాజిక పెన్షన్లు, అప్పుల రీ పేమెంట్లు, ఓడి పేమెంట్ ఇలా అనేక ఖర్చులు ప్రభుత్వం ముందు ఉన్నాయి. అయితే ఇందులో ప్రభుత్వానికి ఉన్న ప్రత్యామన్యాయం, మళ్ళీ కోర్టుకు కానీ, పై కోర్టుకు కానీ వెళ్లి, ఉద్యోగులకు పెండింగ్ జీతాల ఇవ్వటానికి టైం అడగటం. అలాగే కేంద్రం నుంచి ఎక్కువ అప్పు తెచ్చుకోవటానికి అనుమతి తెచ్చుకోవటం. అయితే ఆ పత్రికలో వచ్చిన కధనం పై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించ లేదు. మరి ప్రభుత్వం ఈ విషయం పై క్లారిటీ ఇస్తుందా, లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి, అపులు పెరిగాయనేది మాత్రం కాగ్ రిపోర్ట్ లు చూస్తే అర్ధం అవుతుంది.

వారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. అధికార పార్టీ ఎంపీలు. పార్లమెంట్ లో చాలా బలమైన పార్టీ. 22 ఎంపీలతో, నాలుగో అతి పెద్ద పార్టీ పార్లిమెంట్ లో. వీళ్ళు కేంద్రంలో ఉన్న బీజేపీకి మిత్ర పక్షము కాదు, కేంద్రంలో భాగస్వామ్యం కాదు. అంటే కేంద్రంలో విపక్షం అనే చెప్పాలి. బలమైన ప్రతిపక్షం అనే చెప్పాలి. అయితే వైసీపీ ఎంపీలు మాత్రం, ప్రజా సమస్యల పై మిగతా పక్షాలతో కలిసి ఆందోళన చెయ్యటం లేదు. ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత బలం ఉంది అంటే, దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలకు పెద్దన్నగా ఉండాలి. అయితే వైసీపీ అందుకు భిన్నం. మిత్రపక్షం కంటే ఎక్కువగా బీజేపీని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటుంది. ఈ రోజు పార్లమెంట్లో అన్ని విపక్షాలు, ప్రాంతీయ పార్టీలు, జీఎస్టీ బకాయలు విడుదల చెయ్యాలని ఆందోళన చేసాయి. పార్లమెంట్ బయట కూడా ప్రదర్సన చేసాయి. తెలంగాణాలోని టీఆర్ఎస్ కూడా ఆందోళన చేసింది. అయితే వైసీపీ కూడా ఆందోళన చేసింది. ఈ ఆందోళన చూసిన రాష్ట్ర ప్రజలు అవాక్కయ్యారు. ఇందుకేనా ఇంత మందిని గెలిపించుకుంది అని ముక్కన వేలు వేసుకున్నారు.

ఇంతకీ వాళ్ళు చేసిన ఆందోళన రాష్ట్ర సమస్యల పై కాదు. సొంత కక్ష పై, ద్వేషం పై. చంద్రబాబు పై సిబిఐ విచారణ వెయ్యాలని, ప్లే కార్డులు పట్టుకుని ఆందోళన చేసారు. సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా ఆందోళన చెయ్యరు. ఎందుకంటే, అధికారంలో ఉన్న వాళ్ళు సిబిఐ కోరితే అడ్డు పడేది ఎవరు ? మొన్న అంతర్వేది కేసు సిబిఐకి వైసీపీ ప్రభుత్వమే ఇచ్చింది. అలా ఈ కేసు కూడా సిబిఐకి ఇచ్చేయవచ్చు కదా ? దానికి ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆందోళన ఎందుకు ? అక్కడ ఆందోళన చెయ్యల్సింది మన హక్కుల పై, విభజన హామీల పై, మనకు రావాల్సిన బకయాల పై, స్పెషల్ స్టేటస్ పై, రైల్వే జోన్ పై, పోర్టు పై, స్టీల్ ఫ్యాక్టరీ పై, వెనుకబడిన జిల్లాల నిధుల పై, పోలవరం నిధుల పై, ఇలా అనేక సమస్యలు కేంద్రం వద్ద పెండింగ్ ఉండగా, తమ చేతిలో ఉన్న పని, సిబిఐ ఎంక్వయిరీ వెయ్యండి అని కేంద్రానికి ఒక ఉత్తరం రాయకుండా, ఈ ఆందోళన ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. పోనీ విపక్షాలు జీఎస్టీ పై చేసిన ఆందోళనలో పాల్గున్నారా అంటే అదీ లేదు. ఇది మన రాష్ట్రంలో 23 ఎంపీలు రాష్ట్రం కోసం కాకుండా, చంద్రబాబు పై ఎంక్వయిరీ వెయ్యాలని ఈ రోజు వేస్ట్ చేసేసారు.

Advertisements

Latest Articles

Most Read