ఏపీకి సంబంధించిన ప్రధాన సమస్య అమరావతి అంశం పక్కదారి పట్టింది. ఈనెల 14 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో అమరావతి సమస్యను కేంద్ర ప్రభుత్వంతో పాటు, యావత్ భారతదేశానికి పార్లమెంటు సాక్షిగా మరోమారు తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు సిద్ధమయ్యారు. రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా 33వేల ఎకరాలు భూములిచ్చిన 28వేల మంది రైతులు దాదాపు 275 రోజులుగా చేస్తున్న పోరాటాలు, మరోప్రక్క వైసీపీ ప్రభుత్వం రైతులపై సాగిస్తున్న వేధింపు చర్యలు, శాసనమండలి రద్దు ప్రతిపాదనలు.. వివిధ అంశాల్లో అనుసరిస్తున్న నియంతృత్వ వైఖరి.. కోర్టుల్లో వరుస మొట్టికాయలను పార్ల మెంటు సాక్షిగా వెలుగులోకి తెచ్చి ఎండగట్టాలని టీడీపీ పార్లమెంటరీ సభ్యులు భేటీలో నిర్ణయించారు. అమరావతి జేఏసీ సైతం పార్లమెంటు సభ్యులందర్నీ కలసి మూడు రాజధానుల పేరుతో అమరావతిని ఖూనీ చేసి రైతులకు చేస్తున్న అన్యాయాన్ని వివరించాలని నిర్ణయించింది.

కాని ఈ అంశాలేవీ పార్లమెంటులో ప్రస్తావనకు రాకముందే వైసీపీ వ్యూహాత్మకంగా వాటిని పక్కదారి పట్టించేలా అమరావతి రాజధాని పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్, పైబర్ గ్రిడ్ పేరుతో మరో కుంభకోణం జరిగిందని, వీటిపై సీబీఐచే విచారణ జరిపించాలంటూ ఉభయసభల్లో ప్రస్తావనకు తెచ్చింది. వీటితో పాటు గతంలో ఎన్నడూలేని విధంగా న్యాయవ్యవస్థ సైతం పక్షపాతంగా వ్యవహరిస్తూ ఏపీ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తుందని, కేంద్రం జోక్యం చేసు కోవాలంటూ వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. వాస్తవానికి ఈ అంశాలపై గురువారం ఉభయసభల్లో మాట్లాడడానికి అవకాశం లేనప్పటికీ వైసీపీ ఎంపీలు వ్యూహాత్మకంగా ప్రస్తావించారు. అలాగే తర్వాత పార్లమెంటు వెలుపల సైతం అమరావతి భూకుంభకోణంపై సీబీఐ విచారణ కోరుతూ ఎంపీలు ధర్నా చేశారు. రాజ్యసభలో కరోనా అంశంపై చర్చలో భాగంగా వచ్చిన అవకాశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సద్వినియోగం చేసుకున్నారు. ఇలా మొత్తానికి అమరావతి విషయం ప్రస్తావనకు రాకుండా, మూడు ముక్కల రాజధాని గురించి పార్లమెంట్ లో ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై రెండు సార్లు వ్యాట్ పెంచిన వైసీపీ ప్రభుత్వం, తాజాగా మరో రూపంలో బాదుతూ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఉన్న వ్యాట్, టాక్సులకి అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపున, ప్రతి లీటర్ పెట్రోల్, అలాగే హైస్పీడ్ డీజిల్‌ మీద, ప్రతి లీటర్ కు రూపాయి పెంచుతూ, ఆదేశాలు ఇచ్చింది. ఇది సెస్ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రతి డీలర్ నుంచి, ఈ మొత్తం వసూలు చేస్తారు. అయితే ఈ వసూలు చేసే సెస్ ని, రాష్ట్రంలో రోడ్డుల అభివృద్ధి కోసం ఉపయోగిస్తారని ప్రభుత్వం చెప్తుంది. ఈ పెంచిన సెస్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వానికి 600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అంటే, ఈ 600 కోట్లు ప్రజల పై భారం అనమాట. అధికారంలోకి రాగానే, ప్రమాణ స్వీకర వేదిక పై నుంచి, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటికి రెండు సార్లు వ్యాట్ పెంచారు. దాని వాళ్ళ 2 రూపాయల వరకు లీటర్ కు అదనపు భారం పడుతుంది.

ఒక వేళ కేంద్రం రేట్లు తగ్గించినా, ప్రభుత్వం పెంచిన వ్యాట్ మాత్రం అలాగే ఉంటుంది. ఇక ఇప్పుడు దీనికి తోడు లీటర్ కు ఈ రూపాయి సెస్ అదనం. అంటే జగన్ మొహన్ రెడ్డి వచ్చిన తరువాత, ఇప్పటి వరకు ప్రజల పై మూడు రూపాయల వరకు అదనపు భారం పడుతుంది. రోజుకి రెండు లీటర్లు వాడే వారు ఉన్నా, నెలకు 180 రూపాయల వరకు అదనపు భారం, ఏడాదికి, రెండున్నర వేలు అధిక భారం. ఇక ఈ పెంపు భారం మనం వాడే వాహనాల పైనే కాదు, బస్సు చార్జీలు, అటో చార్జీలు పై పడుతుంది. రవాణా చార్జీలు అంటూ, మనం వాడే ప్రతి నిత్యవసర వస్తువు పైనా, భారం పడుతుంది. ఇలా అనేక నష్టాలు ఉంటాయి. అయితే ఇప్పుడు పెంచిన సెస్ రహదారుల అభివృద్ధి అంటున్నారని కానీ, ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ లో, కేంద్రం కూడా రహదారులు కోసం పెద్ద ఎత్తున డబ్బులు కేటాయిస్తుంది. మరి ప్రభుత్వం, ఈ పెంచిన సెస్ తో మరిన్ని రహదారులు అభివృద్ధి చేస్తుందా ? చూద్దాం

ఈ రోజు తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో జరుగుతున్న మరో స్కాం బయట పెట్టింది. విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం కు సంబందించిన కొన్ని వివరాలు బయట పెట్టారు. అసలు ఈఎస్ఐ స్కాం చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అని చెప్పారు. ఇందుకు సంబంధించి వివరాలు చెప్తూ, ఇప్పటికీ ఈఎస్ఐ స్కాంలో అచ్చెంనాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసారని, ఆయన పై అనేక ఆరోపణలు చేసి, నాలుగు నెలలు విచారణ చేసి, రూపాయి కూడా అవినీతి ఆరోపణ నిరూపించలేక పోయారని వాపోయారు. అయితే ఇదే సమయంలో, ఈ స్కాంలో ఏ-14గా ఉన్న కార్తిక అనే వ్యక్తీ, విజయవాడలో ఒక చిన్న మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నారని, అలాంటి వ్యక్తి, మంత్రి జయరాం కుమారుడు పుట్టిన రోజు నాడు, ఏకంగా ఒక ఖరీదైన బెంజ్ కారు, గిఫ్ట్ గా ఇచ్చారని, ఆ బెంజ్ కారుని, మంత్రి కుమారుడు ఈశ్వర్ డెలివరీ తీసుకున్నారని, తరువాత ఆయనే ఆ కారు వాడుతూ ఉన్నారని చెప్పారు.

ఆ కారు పత్రాలు అన్నీ, ఈఎస్ఐ స్కాంలో ఏ-14 ఉన్న వ్యక్తి పేరు మీద ఉన్నాయని, కానీ కారు డెలివరీ తీసుకుంది, వాడుతుంది మంత్రిగారే కుటుంబం అని చెప్పారు. దీనికి సంబంధించి ఫోటోలు, పత్రాలు కూడా మీడియాకు చూపించారు. అయితే ఒక సామాన్య వ్యక్తి, ఇంత ఖరీదు అయిన కారు, ఒక మంత్రికి ఎలా గిఫ్ట్ గా ఇవ్వగలరని, దీని వెనుక ఈఎస్ఐ కుంభకోణం మేళ్ళు ఉన్నాయని వాపోయారు. అయితే ఈ విషయం పై ముఖ్యమంత్రి గారు చెప్పిన, అవినీతి నిరోధక శాఖ కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తున్నాని చెప్పి, మీడియా సమావేశంలోనే వారికి ఫోన్ చేసి, ఇలా ఈఎస్ఐ కుంభకోణంలో ఉన్న వ్యక్తి, మంత్రికి కారుని లంచంగా ఇచ్చారని, వారి పై ముఖ్యమంత్రి చెప్పినట్టు, 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అటు వైపు నుంచి మాత్రం, ఇలాంటివి మేము తీసుకొం అని, ఏసిబీ కార్యాలయానికి వచ్చి, వివరాలు ఇస్తే, వాళ్ళు చూస్తారని చెప్పటంతో, ఇది ప్రభుత్వ తీరు అంటూ, అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలోనే ఎండగట్టారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు హైకోర్టులో , బిల్డ్ ఏపి పిటీషన్ పై వాదనలు జరిగాయి.. ఈ సందర్భంగా హైకోర్టు ఇరు పక్షాల వాదనలు వింది. పూర్తీ ష్టాయి విచారణ చేస్తాం అని ఈ కేసుని అక్టోబర్ 16కి హైకోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ చోట్ల ఉన్న భూములు అమ్మి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవాలని బిల్డ్ ఏపి అనే కార్యక్రమం మొదలు పెట్టింది. ముఖ్యంగా వైజాగ్, గుంటూరులో ఉన్న ఆస్తుల విక్రయాల పై గుంటూరుకు చెందిన తోట సురేశ్ బాబు, హైకోర్టులో పుబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసారు. దీంతో పాటు పలు పిటీషన్ల పై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా విచరణ చేసిన కోర్టు, ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ శాఖల కార్యదర్శులకి, నోటీసులు ఇస్తూ, అక్టోబర్ 6 లోపు కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఈ బిల్డ్ ఏపి పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, భూములు విక్రయం చేయటానికి వీలు లేదని చెప్పింది.

అయితే ఈ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ చేసిన వ్యాఖ్యలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. విచారణ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డు పడుతున్నారని, వారిని పరిపాలన కూడా చేసుకోమనండి అంటూ, చేసిన వ్యాఖ్యల పై హైకోర్టు సీరియస్ అయ్యింది. మీ ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసారు అని గట్టిగా అడిగింది. హైకోర్టు ని అంటున్నారా ? లేక పిటీషన్ వేసిన వారినా అంటూ, వ్యాఖ్యలు చేసిన కోర్టు, రాజకీయ ఆరోపణలుకి హైకోర్టు వేదిక కాదని, అదనపు అడ్వకేట్ జనరల్ కు , హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ స్పష్టం చేసారు. విచారణ పూర్తయిన తరువాతే తీర్పు ఇస్తామని చెప్పారు. అయితే గత రెండు మూడు రోజులుగా ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కోర్టులను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు పార్లమెంట్ లో, ఇటు రాజ్యసభలో కూడా కోర్టులు ఇస్తున్న తీర్పుల పై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కోర్టులోనే ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారాయి.

Advertisements

Latest Articles

Most Read