ఇంద్రకీలాద్రికి చెందిన వెండి రథంలోని మూడు సింహాలు మాయం అయ్యాయన్న సమాచారం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఈ నెల 5వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఆలయ రధం అగ్నికి ఆహుతి అయిన సంఘటన నేపధ్యంలో రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన రధాలు, ఇతర ఊరేగింపునకు వినియోగించే పల్లకిలు, వాహనాలు తదితరాలను భద్రపరుచుకోవాలని పోలీసులు సూచించారు. వాటికి జీయో ట్యాగింగ్ చేయాలని వాటి పరిరక్షణ దేవస్థానాల నిర్వహకులు, అధికారులు బాధ్యత వహించాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అంతర్వేది, అంతకముందుగత 15 నెలలుగా వివిధ దేవాలయాలలో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ సంఘటనలపై రాష్ట్ర వ్యాప్తంగా రగడ నడుస్తోంది. రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి పరిస్తితిలో దుర్గగుడి వెండి రధంలోని రెండు సింహాలు మాయమయ్యాయన్న సమాచారం సంచలనం కలిగిస్తోంది. మహమండపం సమీపంలో వెండి రధాన్ని పార్కింగ్ చేసి ఉంచారు. ఊరేగింపులప్పుడు ఈ రధాన్ని బయటకు తీస్తారు. దసరా ఉత్సావలలో ప్రతి రోజు సాయంత్రం జరిగే నగరోత్సవం, చైత్రమాసం బ్రహ్మోత్సవాలు, ఉగాది సందర్భంగా, భవానీ దీక్షలలో కలశ పూజోత్సవం సందర్భంగా రధంలో అమ్మవారి ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు.

వెండి రధానికి బీమా సౌకర్యం ఉందని తగు జాగ్రత్తలు తీసుకున్నామని రెండు రోజుల క్రితమే దుర్గగుడి ఈవో సురేష్ బాబు వివరణ ఇచ్చారు. తాజాగా సింహాలు మాయమయ్యాయన్ని మీడియాలో విపరీత ప్రచారం జరుగుతోంది. అయితే ఈవో సురేష్ బాబు సింహాలు మాయమయ్యాయన్న విషయాన్ని స్పష్టం చేయడం లేదు. వెండి సింహాలు రధంలో ఉండే అవకాశం లేదని, వాటిని వాహనాలు భద్రపరిచే చోట లేదా వెండి సామానులు ఉంచే గదిలో, లాకర్లో ఉంచే అవకాశం ఉందని వివరణ ఇచ్చారు. వెండి సింహాల విషయమై రికార్డుల్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని, లాకరన్ను చూసిన తరువాత కానీ ఇందులో వాస్తవం ఎంతనేది చెప్పలేమని చెబుతన్నారు. నిజంగా సింహాలు మాయమైనట్లయితే సెక్యూరిటీ సిబ్బందే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానం వెండి రథంలోని వెండి సింహాలు మూడు మాయమయ్యాయన్న సమాచారం కలకలం రేపుతోంది.

కొండపై ఇరవై మంది హోంగార్డులు, 150మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. ఇంత పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ వెండి సింహాలు ఎలా మాయం అయ్యాయన్నది మిస్టరీగా మారింది. ప్రతి ఏడాది ఉగాది రోజు మాత్రమే రథంపై అమ్మవారిని ఊరేగిస్తారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఉగాది ఉత్సవాలు నిర్వహించలేదు. 2019లో చివరి సారిగా ఊరేగింపు జరిగింది. అనంతరం వీటిని లాకర్ లో భద్రపరచాల్సి ఉంటుంది. వెండి సింహాలు భద్రంగా ఉన్నాయా.. లేదా అన్న విషయం తేలాలంటే రికార్డులు, లాకర్‌ను పరిశీలిస్తే కానీ చెప్పలేమని అధికారులు అంటున్నారు. తాజా ఘటన పాలకులు, అధికారులను ఇరకాటంలో పడేసింది. వెండి సింహాలు మాయమైన మాట నిజమైతే పెద్ద దుమారమే రేగుతుందనడంలో సందేహం లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసిపీ ప్రభుత్వం, ముందుగా కొంత మంది మంత్రులతో కలిసి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, గౌతమ్ రెడ్డి, అలాగే స్పెషల్ ఆహ్వానితుడుగా విజయసాయి రెడ్డి ఉన్నారు. వెళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసారని తేల్చారు. దీంతో ప్రభుత్వం ఒక సిట్ వేసింది. అలాగే ఆ సిట్ కు కొన్ని అధికారాలు కూడా ఇచ్చింది. అయితే ఏ విధమైన ప్రాధమిక ఆధారాలు లేకుండా, ఏమి బయటకు చెప్పకుండా, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే, ప్రతిపాక్షలను టార్గెట్ చెయ్యటానికే ఈ సిట్ వేసారని, ప్రాధమిక ఆధారాలు లేకుండా, గత ప్రభుత్వం చేసిన నిర్ణయాల పై సమీక్షలు చెయ్యటం కోసం ఎంక్వయిరీలు వెయ్యటం గతంలో లేవని, ఏదైనా తప్పిదాలు ఉంటే, ఆధారాలు చూపించి ముందుకు వెళ్ళాలని తెలుగుదేశం తన వాదన వినిపించింది.

అయితే దీని పై ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తూ ఉండటంతో, తమను ఇబ్బంది పెట్టటానికి ప్రభుత్వం వ్యూహ రచన చేసిందని గ్రహించి, సిట్ ఏర్పాటు పై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఏ విధమైన ప్రాధమిక ఆధారాలు లేకుండా, కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చెయ్యటానికి, గత ప్రభుత్వ నిర్ణయాల పై సమీక్ష చేస్తున్నారని, ఇది సరి కాదని హైకోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, దీని పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, సిట్ విచారణ పై స్టే విధించింది. ఇది కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చెయ్యటానికి దురుద్దేశంతో చేసిన పని అంటూ, తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వేసిన పిటీషన్ పై హైకోర్ట్ స్టే ఇస్తూ, తదుపరి ఆదేశాల వరకు స్టాయ్ విధించింది. దీని పై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ, ఎలాంటి వివాదం లేకున్నా, ఏ ఆధారాలు లేకుండా, తమ పై ఆరోపణలు చేసి, అల్లరి చెయ్యటానికే సీట్ వేసారని, ఏదైనా చేస్తాం అని ప్రభుత్వం బెదిరిస్తుందని, న్యాయ స్థానం తమ వాదనతో ఏకీభావించి, ప్రభుత్వ దురుద్దేశ చర్యను అడ్డుకుందని అన్నారు.

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి, పోలీసు శాఖ పై హైకోర్టు ధర్మాసనం సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సహజంగా రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తే, అవి రాజకీయంగా కొట్టి పారేస్తాం కానీ, తమ దృష్టికి వచ్చిన అంశాల పై హైకోర్టు అనేక పర్యాయాలు ఏపి పోలీసుల పై ఫైర్ అయ్యింది. ముఖ్యంగా డీజీపీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే పోయిన వారం సిఐడి తీరు పై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సిఐడి అంటే నేరాలు జరగకుండా ఉండాలని, అంతే కానీ అధికార పక్షాన్ని సంతోష పెట్టటానికి కాదు అంటూ, తెలుగు వన్ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు మరోసారి ఏపి సిఐడి వార్తల్లోకి ఎక్కింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పాధ్యక్షుడు డాక్టర్‌ గంగాధర్‌, కరోనలో వైద్యులు కష్టాలు వివరిస్తూ వ్యాఖ్యలు చేసారు. వైద్యులకు ప్రభుత్వం సరైన రక్షణ పరికరాలు ఇవ్వటం లేదని, పీపీఈ కిట్లు ఇవ్వటం లేదని, ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారు. అయితే దీని పై ఆయనకు ఆంధ్రప్రదేశ్ సిఐడి నోటీసులు జారీ చేసింది.

ఆయన విచారణకు కూడా హాజరు అయ్యారు. అయితే దీని పై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. సమస్యలు ఎత్తి చూపిస్తే కూడా ప్రభుత్వం తట్టుకోలేక పోతుందని వ్యాఖ్యానించారు. అంతే కాదు, దీని పై న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. లేఖ ద్వారా ఆయన జరిగిన విషయం మొత్తం చెప్తూ, రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ లేదని, స్వేఛ్చ లేదని, పోలీసులు జీవించే హక్కుని కూడా హరిస్తున్నారు అంటూ, ఫిర్యాదు చేసారు. దీని పై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందిస్తూ, ఆయన లేఖను ఫిర్యాదుగా తెసుకుని, కేసు నమోదు చేసింది. దీని పై త్వరలోనే విచారణ జరగనుంది. ఇదే అంశం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీని పై లీగల్‌ అథారిటీ ఆంధ్ర రత్న భవన్ కు వచ్చి, ఆ లేఖకు సంబంధించి సమాచారం తీసుకుని వెళ్లారు. మరి హైకోర్టు దీని పై స్పందిస్తుందో లేదో చూడాలి.

కేంద్ర ప్రభుత్వ షరతులకు తలొగ్గి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులు వాడే కరెంటుకు మీటర్లు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే గత మూడు దశాబ్దాలుగా, రైతులుకు మీటర్లు లేవని, ఉచిత విద్యుత్ అనే దానికి, మీటర్లు పెడితే అర్ధం ఉండదని, వాదనలు వినిపిస్తున్నాయి. పైగా ఈ మీటర్లు పెట్టటం వల్ల ప్రభుత్వానికి అదనపు ఖర్చు అని, అలాగే రైతులకు కూడా భరోసా ఉండదని, తరువాత మీటర్ రీడింగ్ పలానా దాటితే, చార్జ్ చేస్తాం అని చెబితే పరిస్థితి ఏమిటి అనే వాదనలు కూడా వచ్చాయి. ఇప్పుడు కేంద్రానికి తలొగ్గి, ఎక్కువ అప్పు తెచ్చుకోవటానికి, ఇలా చేస్తుంటే, మీరు ఉచిత విద్యుత్ ఎత్తేస్తేనే ఎక్కువ అప్పు ఇస్తాం అని కేంద్రం అంటే, అప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అలాగే ఇప్పుడు దిస్కంలకు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక, బాకీ పడుతుందని, మరి నెల నేలా రైతులకు ఎలా నగదు బదిలీ చేస్తారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇలా ఆంధ్ప్రరదేశ్ ప్రభుత్వం తీసుకున్న, నిర్ణయం పై, అనేక ప్రశ్నలు, అనేక విమర్శలు, అనేక విశ్లేషణలు వస్తున్న వేళ, పక్కన ఉన్న తెలంగాణా ప్రభుత్వం తన అభిప్రయాన్ని చెప్పింది.

నిన్న అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ, కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది ఒక రాక్షస చట్టం అని, ఇవి అమలు చేస్తూ, రాష్ట్రాలు ఏమి కావాలని, ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం ప్రతిపాదనలు అమలులోకి వస్తే, రైతులకు ఇచ్చే సబ్సిడీ ఆగిపోతుందని కేసీఆర్ అన్నారు. మీటర్లు పెడుతున్నాం కాబట్టి, వసూలు చేయ్యమంటారని కేసిఆర్ అన్నారు. ఇప్పుడు ఈ మీటర్లు ఖర్చు రాష్ట్రాలు భరించాలని, తెలంగాణా ప్రభుత్వానికి ఈ మీటర్లు కొనాలి అంటే 750 కోట్ల ఖర్చు అవుతుందని, ఈ భారం అంతా రైతుల పైనే మోపాలని, వేరే మార్గం లేదని కేసిఆర్ అన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో విద్యుత్ బిల్లు కలెక్టర్లు వస్తుంటే, ప్రజలు బెదిరిపోయే వారని, ఆ సంఘటనలు ఇంకా మాకు గుర్తున్నాయని, ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి వచ్చే అధికారం ఉందని అన్నారు. ఈ విషయం పై రెండు తెలుగు రాష్ట్రాలు రెండు రకాలుగా స్పందించాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం సమర్ధిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, కేసీఆర్ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

Advertisements

Latest Articles

Most Read