ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులోనే కాదు, సుప్రీం కోర్టులో కూడా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల కమిషనర్ ని తప్పించటం, రాజధని అమరావతి విషయం, రంగుల విషయం, ఇలా ప్రతి విషయంలోనూ ఎదురు దెబ్బలు సుప్రీం కోర్టులో తగిలాయి. తాజాగా మరో ఎదురు దెబ్బ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో తగిలింది. ఆంధ్రప్రదేశ్ లో, తెలుగు మీడియం ఎత్తేసి, ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవలో 81,85 లను, హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇది చట్టానికి విరుద్ధం అని, మాతృభాషలో విద్యాబోధన ఉండాలని, దీనికి సంబంధించి చట్టం కూడా ఉందని, హైకోర్టు తీర్పు ఇస్తూ, ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టేసింది. అయితే, దీని పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఏప్రిల్ నెలలో హైకోర్టు కేసు కొట్టేయగానే, రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేసింది. రాష్ట్రంలో 85 శాతం మంది ఇంగ్లీష్ మీడియం కావాలి అనుకుంటున్నారు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం తన పిటీషన్ లో తెలిపి, సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. దీని పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపున లాయర్ మాట్లాడుతూ, ఇది రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం కాదని, రాజ్యాంగంలో ఎక్కడా మాతృభాషలోనే ప్రాధమిక విద్యాబోధన ఉండాలని ఎక్కడా లేదని సుప్రీంకు తెలిపారు.

sc 03092020 2

అలాగే ఇంగ్లీష్ మీడియం అనేది ప్రభుత్వ స్కూల్స్ కే పెట్టాం అని, ప్రైవేటు స్కూల్స్ కి కాదని వాదించారు. ఇది ఏ విధంగా తప్పు కాదని, రాజ్యాంగ విరుద్ధం కాదు అంటూ వాదించారు. అందుకే దీన్ని అనుమతి ఇస్తూ, హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలని కోరారు. అయితే ఈ సందర్భంగా జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలుగు మీడియం బోధన అవకాసం లేని చోట, వేరే భాషలో బోధన చెయ్యవచ్చు కానీ, అవకాసం ఉన్న చోటు కూడా, వేరే భాష ఎందుకు అని ప్రశ్నించారు. అయితే దీనికి స్పందిస్తూ, తమకు ఇంగ్లీష్ మీడియం కావాలని అత్యధికులు కోరుతున్నారని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరుపు న్యాయవాది. పదే పదే హైకోర్టు ఆదేశాల పై స్టే ఇవ్వాలని కోరినా, సుప్రీం కోర్టు మాత్రం స్టే ఇవ్వటానికి నిరాకరిస్తూ, కేసుని 25కి వాయిదా వేసింది. అలాగే ఎస్ఎల్పీ, స్టే విషయం పై ప్రతి వాదులు అందరికీ నోటీసులు ఇచ్చింది. దీని పై అభిప్రాయం కోరింది. అయితే మొదటి నుంచి అందరూ కోరేది, ఇంగ్లీష్ మీడియంతో పాటుగా, తెలుగు మీడియం కూడా ఆప్షన్ పెట్టమని. మరి ఆప్షన్ ఇవ్వటానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఆప్షన్ ఇస్తే అయిపోయే దానికి, ప్రభుత్వం ఇక్కడ వరకు తెచ్చుకుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

'ఒక జడ్జినే ఇంట్లో నుంచి బయటకు రావద్దంటారా.. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. అంతేగాకుండా భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అడ్డుకున్నట్టే' అని ఏపీ హైకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సస్పెన్షన్లో ఉన్న చిత్తూరు జిల్లా జూనియర్ సివిల్ జడ్జి ఎస్.రామకృష్ణను ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ కొత్తకోట తహశీల్దార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పది రోజులపాటు సస్పెండ్ చేసింది. జడ్జి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొత్తకోట తహశీల్దార్ జారీ చేసిన ఆదేశాలపై జడ్జి రామకృష్ణ, ఆయన కుమారుడు ఎస్.వంశీకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరపున సీనియర్ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మంగళవారం విచారణ చేపట్టారు. తహశీల్దార్ ఆదేశాల వల్ల జడ్జి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. తహశీల్దార్ ఇచ్చిన ఆదేశాలు చట్ట, న్యాయ విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

hc 020920200 2

ఒక జడ్జినే బయటకు రావద్దంటూ ఆదేశాలు ఇవ్వడమంటే వ్యక్తిగత స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్చను అడ్డుకోవడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆదేశాలపై ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తహశీల్దార్ ఆదేశాలను పది రోజులపాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. పది రోజుల తర్వాత ఈ కేసులో మరోసారి వాదనలు విని, తుది నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. గత రెండు మూడు నెలలుగా జడ్జి రామకృష్ణ వ్యవహారం ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంది. ఆయనను అధికార పార్టీకి చెందిన నేతలు టార్గెట్ చేసారని, వేదిస్తున్నారని, కేసులు పెట్టటం, మీడియా ముందుకు రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక మరో పక్క జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారంలో, కోర్టులని ఈశ్వరయ్య టార్గెట్ చేసారు అంటూ, ఆయన ఆడియో టేప్ బయట పెట్టి, అది కూడా హైకోర్టు ముందుకు వెళ్ళిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రతిపక్ష నేత, 14 ఏళ్ళు సియంగా చేసిన వ్యక్తి ఏమి జరిగిందో తేల్చండి అని డీజీపీకి ఉత్తరాలు రాస్తుంటే, మీరు ఆధారాలు ఇవ్వండి అంటూ ఎదురు చంద్రబాబుకే సమాధానం చెప్పటం కొత్త పరిణామం. తాజాగా చంద్రబాబుకి పోలీసులు నోటీసులు జారీ చేసారు. వారం రోజులు క్రితం, చిత్తూరు జిల్లాలో, ఓం ప్రాతాప్ అనే ఆటో డ్రైవర్, లిక్కర్ మాఫియాని ప్రశ్నిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఆ వీడియోలో కొన్ని పరుష పదాలు కూడా వాడారు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. అయితే మరుసటి రోజే, ఓం ప్రతాప్ చనిపోయారు. ముందుగా ఆయన ఆ-త్మ-హ-త్య చేసుకుని చనిపోయారని చెప్పారు. అయితే తరువా కొద్ది సేపటికి అనారోగ్యం మృతి చెందారని అన్నారు. అయితే స్థానికంగా మాత్రం, కొంత మంది వ్యక్తులు అంతకు ముందు రోజు సాయంత్రం, తన ఇంటికి వచ్చి బెదిరించారని, భయపడి ఆ-త్మ-హ-త్య చేసుకున్నారు అంటూ కధనాలు వచ్చాయి. అయితే ఇందులో మంత్రి పెద్ది రెడ్డి హస్తం ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అలాగే స్థానిక ఎంపీ రెడ్డప్ప హస్తం కూడా ఇందులో ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

cbn 201092020 2

మంత్రి పెద్దిరెడ్డి దీని వెనుక ఉన్నారని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాసారు. అలాగే ఓం ప్రతాప్ ఫోన్ చూస్తే ఎవరు ఫోనులు చేసి బెదిరించింది తెలిసిపోతుందని లేఖలో రాసారు. అంతే కాదు, మృతదేహంకి పో-స్ట్ మా-ర్టం చెయ్యాలని కోరారు. అయితే అనుమానాస్పద మృ-తి అయినా, పోలీసులు పో-స్ట్ మా-ర్టం చెయ్యకపోవటంతో తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడటంతో, పూడ్చి పెట్టిన శ-వా-న్ని తీసి పో-స్ట్ మా-ర్టం చేసారు. ఇదంతా జరుగుతూ ఉండగా, ఇప్పుడు చంద్రబాబుకి చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసారు. మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, చంద్రబాబుకు సీఆర్​పీసీ 91 నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు డీజీపీకి రాసిన లేఖ ప్రస్తావిస్తూ, సాక్ష్యాలు అన్నీ తమకు ఇవ్వాలని కోరారు. నోటీసులు అందిన వారం లోపు తమ కార్యాలయానికి హాజరు అయ్యి, ఈ కేసు విషయం పై మీ దగ్గర ఉన్న సమాచారం, సాక్ష్యాలు ఇవ్వాలని నోటీసుల్లో తెలిపారు. అయితే ఈ నోటీసులు పై టిడిపి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే అసలు జగన్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అనే పేరు వాడటం పైనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. రెండు నెలల క్రిందట జగన్ పార్టీకి చెందిన సొంత ఎంపీ రఘురామకృష్ణం రాజు, ప్రజా సమస్యలను, రాష్ట్రంలో జరుగుతున్నా స్కాంలను, జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా, ఆయనకు అపాయింట్మెంట్ లభించకపోవటంతో, మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నా అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఆయన అనేక విషయాలు ప్రభుత్వం దృష్టికి తెస్తూ సమస్యలు ఏకరవు పెట్టారు. ఈ క్రమంలోనే, రఘురామకృష్ణం రాజుకి, జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో, విజయసాయి రెడ్డి, ఆయనకు క్రమశిక్షణ నోటీసు ఇచ్చారు. సరిగ్గా ఇక్కడ మొదలైంది పంచాయతీ. తనకు ఇచ్చిన నోటీస్ కి సమాధానం చెప్పకుండా, ఆయన ఒక లాజికల్ పాయింట్ బయటకు తీసారు. తనకు ఇచ్చిన నోటీస్ లెటర్ హెడ్ పై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉందని, అసలు తనకు ఈ పార్టీకి సంబంధం లేదని, తనకు పార్టీ ఇచ్చిన బీఫాం పై యువజన శ్రామిక రైతు పార్టీ అని ఉందని, దాని పై నోటీస్ ఇవ్వకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే వేరే పార్టీకి సమాధానం ఎలా ఇస్తాను అని చెప్పుకొచ్చారు.

ysr 02092020 2

అయితే అప్పటికే ఉన్న అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ మొత్తం వ్యవహారం పై అభ్యంతరం చెప్పింది. తమ పార్టీ జగన్ పార్టీ కంటే ముందే పెట్టాం అని, తమ పార్టీ పేరు ఎవరూ వాడుకో కూడదు అంటూ ఇది వరుకే ఎలక్షన్ కమిషన్, జగన్ పార్టీకి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు మహబూబ్ భాషా కోర్టు ముందుకు వచ్చారు. అయితే ఇంతకంటే ముందే ఆయన ఎలక్షన్ కమిషన్ వద్ద ఈ విషయం ప్రస్తావించినా, సరైన సమాధానం రాకపోవటంతో, ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు, జగన్ పార్టీకి, ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసు రేపు, గురువారం విచారణకు రానుంది. అయితే ఇప్పటి వరకు జగన్ పార్టీ, కోర్టులో కౌంటర్ దాఖలు చెయ్యలేదు. దీంతో ఈ కేసు పై కోర్టు ఏమి చెప్తుందా అనే టెన్షన్ నెలకొంది. జగన్ పార్టీ వ్యుహాత్మికంగా కౌంటర్ దాఖలు చెయ్యకుండా, ఈ కేసులో కౌంటర్ దాఖలకు మరి కొంత సమయం అడిగే అవకాసం ఉందని, అందరూ భావిస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాత్రం తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, రేపు ఈ విషయం పై కోర్టు విచారణ తరువాత మీడియాతో మాట్లాడుతానని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read