విశాఖపట్నం శిరోమండనం కేసులో నూతన్ నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆయన ముంబై పారిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, కర్ణాటకలోని ఉడిపి రైల్వే స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి, ఏపి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. అరెస్ట్ సమయంలో నూతన్ నాయుడు దగ్గర కొన్ని ఫోనులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో నూతన్ నాయడు ఆ ఫోన్ ని పక్కకు పడవేసే ప్రయత్నం చేసారు. అయితే ఆ విషయన్ని పసిగట్టిన పోలీసులు, ఆ ఫోన్ ని కూడా స్వాదీనం చేసుకున్నారు. అయితే ఆ ఫోన్ ని పరిశీలించిన పోలీసులకు సంచలన విషయాలు తెలుసుకున్నారు. నూతన్ నాయుడు గతంలో చేసిన దందాలు మోసాలకు సంబందించిన కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నూతన్ నాయుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మొన్నటి వరకు జగన్ పేషీలో ఉన్న పీవీ రమేష్ పేరుతో పలువురికి ఫోనులు చేసి, మోసం చేసినట్టు, పోలీసులు కనుకున్నారు. తన భార్యని పోలీసులు అరెస్ట్ చెయ్యకుండా అడ్డుకునేందుకు, నూతన్ నాయుడు పీవీ రమేష్ పేరుతొ పలువురు వైద్య అధికారులకు ఫోనులు చేసి, తాను సియం పేషీ నుంచి మాట్లాడుతున్నాను, ఆమెకు ఆరోగ్యం బాగోనట్టు సర్టిఫికేట్ ఇవ్వమని కోరారు.

nutan 040902020 2

అయితే ఆ ముగ్గురు వైద్య అధికారులకు అనుమానం వచ్చి, నేరుగా అసలైన పీవీ రమేష్ కు ఫోన్ చేసి, ఇందాక ఫోన్ చేసారా అని ఆరా తీయగా, అసలు విషయం తెలిసింది. అయితే ఈ విషయం గుర్తించిన పీవీ రమేష్ విశాఖ పోలీసులకు కూడా విషయం తెలియ చేసారు. తన పేరుతో ఎవరో ఫోనులు చేస్తున్నారు, దాని పై ఆరా తియ్యమని పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీని పై విచారణ కొనసాగుతూ ఉండగానే, నూతన్ నాయుడు పోలీసులకు దొరికారు. ఆయన ఫోన్ పరిశీలించగా అసలు విషయం బయట పడింది. పోలీసులు విచారణ చేయగా, వైద్య అధికారులకు ఫోన్ చేసింది, ఈ నంబర్ నుంచే అని గుర్తుంచారు. దీంతో నూతన్ నాయుడే పీవీ రమేష్ పేరుతో ఫోన్ చేసారని పోలీసులు గుర్తించారు. అలాగే మరో 30 మందికి నూతన్ నాయుడు, పీవీ రమేష్ పేరుతొ ఫోనులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఒక దశలో గాజువాక సిఐకి కూడా ఫోన్ చేసినట్టు బెదిరించినట్టు, తెలిసింది. అయితే ఎదుటి వారిని నమ్మించటానికి, ట్రూ కాలర్ లో కూడా, ఏపి సియంఓ అని స్టోర్ చేసి, నిజంగానే పీవీ రమేష్ అని నమ్మించే ప్రయత్నం చేసారు. అయితే పోలీసులు ఈ మొత్తం వ్యవహరం పై ఆరా తీస్తున్నారు. ఇక పీవీ రమేష్ కూడా ఈ విషయం పై ట్వీట్ చేస్తూ, అప్రమత్తం చేసారు. నా పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే, నమ్మవద్దని కోరారు.

కేంద్ర ప్రభుత్వం పై ఎన్డీఏ భాగస్వామ్యం కానీ రాష్ట్రాలు అన్నీ పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. చాలా రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా లేఖలు రసారు. కేసిఆర్ అయితే కేంద్ర వైఖరి పై కోర్టుకు కూడా వెళ్తాం అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం, ఈ విషయంలో పెద్దగా వాయిస్ వినిపించటం లేదు. ఆర్ధిక మంత్రి బుగ్గన దీని పై క్లారిటీ ఇస్తే, చూద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక విషయానికి వస్తే, దేశంలో జీఎస్టీ వసూళ్ళు భారీగా తగ్గిపోయాయి. అటు రాష్ట్రాలకు వసూళ్ళు లేకపోవటంతో, కేంద్రం పై కూడా ఈ భారం పడింది. జీఎస్టీ రీయింబర్స్మెంట్ విషయంలో, కేంద్రం చేతులు ఎత్తేసింది. ఈ విపత్తు ఆక్ట్ అఫ్ గాడ్ అని, దీనికి కేంద్రం ఏమి చెయ్యలేదని, రాష్ట్రాలు సహకారం అందించాలని కోరింది. అవసరం అయితే ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చుకోండి అంటూ సలహా ఇచ్చింది. అయితే కేంద్రం చేసిన ప్రకటన పై అన్ని రాష్ట్రాలు భగ్గు మన్నాయి. చివరకు కొన్ని ఎన్డీఏ రాష్ట్రాలు కూడా ఈ ప్రతిపాదన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్తీ లాసులు రీయింబర్స్మెంట్ చేస్తామని కేంద్రం హామీ ఇస్తేనే, అందరం జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలపాం అని, ఇప్పుడు కేంద్రం చేతులు ఎత్తేసి ఆక్ట్ అఫ్ గాడ్ అంటూ, మాకు సంబంధం లేదని చెప్తే ఎలా అంటూ పలు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

gst 040902020 2

తెలంగాణా ఆర్ధిక మంత్రి హరీష్ రావు అయితే, కేంద్రం జీఎస్టీ చట్టం చేసిందని, ఆ చట్టం ప్రకారం జీఎస్తీ లాసులు రీయింబర్స్మెంట్ చెయ్యాలని, అలా చెయ్యకపోతే కేంద్రం పై కోర్టు వెళ్లేందుకు కూడా వెనకాడం అంటూ, వ్యాఖ్యానించారు. ఇక ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఈ విషయం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత, కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, తమిళనాడు ముఖ్యమంత్రి పలనీర్ స్వామీ , తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్, చత్తీస్గడ్ ముఖ్యమంత్రి బూపేష్, కేంద్రానికి లేఖలు రాసారు. వీరందరూ ఎన్డీఏతర పార్టీల ముఖ్యమంత్రులు. అయితే ఈ లిస్టు లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేరు. ఆయన ఈ విషయం పై కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదో ఎవరికీ అర్ధం కాలేదు. రావాల్సిన హక్కు గురించి పోరాడకుండా, ఎక్కువ అప్పు తీసుకోవటానికి కేంద్రం సూచించిన రిఫార్మ్స్ ని ఇంప్లెమెంట్ చేస్తూ, విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మనకు రావాల్సిన హక్కు పై జగన్, ఇతర రాష్ట్రాలు లాగా కేంద్రం పై గట్టిగా పోరాడాలని, ప్రతిపక్షాలు అంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. రాజమహేంద్రవరం వైశ్య సేవా సదన్ భూములు, ఇళ్ళ పట్టాలకు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా, హైకోర్టు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై స్టే ఇచ్చింది. 1922లో తెలుగు, సంస్కృతం అభివృద్ధి, వైశ్య పేద మహిళలకు సహాయం చెయ్యటం కోసం, ఈ వైశ్య సేవా సదన్ ఏర్పడినట్టు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు న్యాయవాది. వాదనలు విన్న ధర్మాసనం, ప్రభుత్వ నిర్ణయం పై స్టే ఇచ్చింది. అలాగే వైశ్య సేవా సదన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ నాటికి కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది. పిటీషనర్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ, కేసు వివరాలు చెప్పారు ఆయన మాట్లాడుతూ, రాజమహేంద్రవారంలో, 1922లో ఏర్పాటు చేసారని, ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం, హిందీ, సంస్కృతం, ఆంగ్లం, వంటకు సంబంధించి, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇలాంటి అనేక విద్యలు ఇలాంటివి నేర్పాలి, ప్రత్యేకించి వైశ్య మహిళలకు నేర్పాలని ఇది స్థాపించారని చెప్పారు. ఈ సందర్భంగా, దాదాపుగా 500 ఎకరాల భూముల్లో అనేక భావనను, కాలేజీలు, గుడిలు ఇవన్నీ ఏర్పాటు చేసారు. వీటి పై వచ్చిన ఆదాయంతోటి, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.

hc 04092020 2

అయితే దీనికి సంబందించిన 32 ఎకరాల భూమిని, ప్రభుత్వం ఇళ్ళ స్థాలలాకు తీసుకోవటానికి మొదలు పెట్టిందని, ఈ సందర్భంగా మార్చ్ 16 వ తేదీన ఎన్డౌమెంట్స్ కమిషనర్ గారు, ఈ భూములు తీసుకోవటానికి వీలు లేదని, హైకోర్టు తీసుకోవద్దని చెప్పిందని, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ కూడా రాసారని తెలిపారు. ఇన్ని వివరాలు ఇచ్చినా, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ముందుకు వెళ్తున్నారని, అందుకే స్థానికంగా ఉన్న ఒక పెద్ద మనిషి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారని, ఈ రోజు అది కోర్టు ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు ఇది రావటంతో, హైకోర్టు అన్నీ పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వ నిర్ణయం పై స్టే ఇచ్చిందని, అలాగే వైశ్య సేవా సదన్ కు కూడా నోటీసులు ఇచ్చి, కేసుని అక్టోబర్ నెలకు వాయిదా వేసిందని చెప్పారు. దేవాదాయ భూములు తీసుకుంటామని, ప్రభుత్వం చెప్పటం అన్యాయం అని, ప్రభుత్వం దేవాలయ భూముల జోలికి రాకుండా, చూసుకోవాలని పిటీషనర్ తరుపు న్యాయవాది తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అమరావతి సెగ గట్టిగా తగులుతుంది. అమరావతి రైతులను, వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూస్తున్న మిగతా ప్రాంతాల వారు, ప్రభుత్వానికి భూములు ఇవ్వాలి అంటేనే ససే మీరా అంటున్నారు. ఎంత పరిహారం ఇస్తాం అన్నా, ఏమి చేస్తాం అన్నా, మేము మాత్రం భూములు ఇవ్వం అంటున్నారు. మొన్నా మధ్య అమరావతి ప్రాంతంలోనే, గోదావారి - పెన్నా మహాఅనుసంధానికి, భూసమీకరణ కోసం వెళ్ళగా, అక్క ప్రజలు, అధికారులతో గొడవ పడి, మేము మీకు భూములు ఇవ్వం, ఎంత పరిహారం ఇచ్చినా ఇవ్వం, రేపు వేరే ప్రభుత్వం వచ్చి, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టం అంటే మా పరిస్థితి ఏంటి ? ఇప్పుడు అమరావతి రైతుల పరిస్థితే మాకు వస్తే, ఏమి చెయ్యాలి అంటూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇలాంటి పరిణామే మరొకటి ఎదురు అయ్యింది. చంద్రబాబు హయంలో, గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి కేంద్రం, భూసమీకరణ చేసి ఇస్తే, సహాయం చేస్తాం అని చెప్పింది. దీని కోసం, గన్నవర చుట్టు పక్కల గ్రామాల్లో, దాదాపుగా 700 ఎకరాలు కావాల్సి వచ్చింది. అయితే చంద్రబాబు హయంలో కూడా, ఇక్కడ భూసమీకరణ చెయ్యటానికి చాలా ఇబ్బంది పడ్డారు. చాలా ఖరీదు అయిన భూమి కావటంతో రైతులు ముందుకు రాలేదు.

collecotr 04092020 2

అయితే అప్పటి ప్రభుత్వం, ఇక్కడ భూములు ఇస్తే, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇస్తాం అని రైతులని ఒప్పించింది. దీంతో రైతులు కూడా అమరావతిలో భూమి ఉంటుందని ఆలోచింది, భూమి ఇచ్చారు. చాలా మందికి అమరావతిలో ఫ్లాట్ కేటాయింపు కూడా జరిగిపోయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అమరావతి మీద తీసుకున్న నిర్ణయంతో, అమరావతి నిర్వీర్యం అయిపొయింది. దీంతో ఇప్పుడు గన్నవరం రైతులు ఆలోచనలో పడ్డారు. ఖరీదైన భూములు ఇచ్చి, ఇప్పుడు అమరావతిలో ఏమి చెయ్యకుండా చేస్తాం అంటే, మాకు కుదరదు అని ఎదురు తిరిగారు. కొంత మంది రైతులు ఈ ఏడు సాగు కూడా ప్రారంభించారు. ఇక అలాగే ఇక్కడ ప్రముఖ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్ కు కూడా ఇక్కడ భూములు ఉన్నాయి. వీరి నుంచి భూమిని ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఇప్పించాలి అంటూ, కలెక్టర్ కు ఎయిర్ పోర్ట్ అధికారులు లేఖ రాయటంతో, కృష్ణా కలెక్టర్ రంగంలోకి దిగి వారితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. అయితే వారు మాత్రం, ససేమీరా అన్నారని సమాచారం. అమరావతిలో అభివృద్ధి చేసిన భూమి ఇస్తాం అని ఒప్పందం చేసుకుని, ఇప్పుడు అక్కడ ఏమి చెయ్యం అంటుంటే, మేము ఎలా భూములు ఇస్తాం అని ఎదురు తిరిగారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ విషయం పెద్ద భారంగా మారింది. మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read