ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ఇచ్చిన స్వాతంత్ర దినోత్సవ సందేశం, ఆసక్తి రేపుతుంది. డైరెక్ట్ గా ఏ సందర్భం కానీ, లేక ఏ వ్యక్తి పేరు తీసుకోలేదు కానీ, ఆయన చేసిన సందేశం మాత్రం, నేడు ఏపిలో జరుగుతున్న విషయాలకు, అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలు చూసిన తరువాత, ఆసక్తిని కలిగిస్తున్నాయి. సీజే మహేశ్వరి ఇచ్చిన సందేసంలో, మన రాజ్యాంగంలో ప్రతి వ్యవస్థ సమాజం కోసం, న్యాయం కోసమే పని చెయ్యాలని చెప్పారు. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడు, గూడు ఎంత ముఖ్యమో, ఆ వ్యక్తికి సరైన న్యాయం కూడా అందినప్పుడే రాజ్యాంగ ఫలాలు ఈ సమాజానికి అందినట్టు అని చెప్పారు. సమాజంలో ఉన్న ప్రజలకు సరైన న్యాయం జరగాలి అంటే, న్యాయ వ్యవస్థ జోక్యం ఉంటుందని అన్నారు. రూల్ అఫ్ లా అనే దానిని అందరూ అమలు చెయ్యాల్సిందే అని, ఇందులో న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్ధకు రూల్ అఫ్ లా అమలు చెయ్యాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు.

భవిష్యత్తులో, న్యాయ వ్యవస్థ మరిన్ని సవాళ్ళు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక మన దేశంలో వ్యవస్థల మధ్య సంక్షోభాలకు అవకాసం లేదని, ఎవరైనా దేశం కోసమే పని చేసి, రాజ్యాంగాన్ని కాపాడాలని అన్నారు. రాజ్యాంగా పరిరక్షణ కోసం పని చేస్తే, వ్యవస్థల మధ్య ఎలాంటి సంక్షోభం వచ్చే అవకాశాలు ఉండవని అన్నారు. అలాగే ఎవరు రాజ్యాంగాన్ని ఉల్లంఘీంచినా, న్యాయ వ్యవస్థ జోక్యం ఉంటుందని అన్నారు. రాజ్యాంగా వ్యవస్థలో ఉన్న వాళ్ళు రూల్ అఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ బెఫోర్ లా, ప్రొటెక్షన్ అఫ్ పర్సనల్ లిబర్టీ అనేవి పాటించాలని అన్నారు. అలాగే పలువురు జాతీయ నాయకులు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. ఇక ఇటీవల మరణించిన హైకోర్టు రిజిస్టార్ ని స్మరించుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మన స్వాతంత్రం కోసం పోరాడిన వారిని గుర్తు చేసుకున్నారు.

గత వారం, విజయవాడ స్వర్ణా ప్యాలెస్ హోటల్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం గురించి తెలిసిందే. దాదాపుగా 10 మంది వరకు ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. విజయవాడ రమేష్ హాస్పిటల్ కు అనుసంధానంగా, ఈ కోవిడ్ కాలంలో, ఈ హోటల్ పని చేస్తుంది. రమేష్ హాస్పిటల్ లో కోరనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో కొంత మందిని, ప్రభుత్వం అనుమతి తీసుకుని, స్వర్ణా ప్యాలెస్ హోటల్ లో కూడా పెట్టారు. అయితే ఘోర అగ్ని ప్రమాదం జరగటం అన్నీ జరిగిపోయాయి. ఏది ఏమైనా, ఇక్కడ ప్రమాదంలో హాస్పిటల్ బాధ్యతా, హోటల్ బాధ్యత ప్రప్రధమం, అందులే అనుమానమే లేదు. అలాగే అసలు ఇక్కడ అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి కూడా తప్పే అవుతుంది. అయితే ప్రభుత్వం పై నింద రాకుండా, అధికార పార్టీ నేతలు ఎదురు దాని ప్రారంభించారు. హాస్పిటల్, హోటల్ యజమానుల కులం బయటకు తీసి, కులం పేరుతొ టార్గెట్ చేసారు. అయితే తరువాత రెండు రోజుల నుంచి ఏమైందో కానీ, హోటల్ యాజమాన్యాన్ని వదిలేసారు.

కేవలం రమేష్ హాస్పిటల్ ని పట్టుకున్నారు. ఈ మొత్తం పరిణామాల పై డాక్టర్ రమేష్ కూడా స్పందించారు. విచారణకు సహకారం అందిస్తామని చెప్పినా, తమను వేదిస్తున్నారని, తన పేరు వెనకాల లేని కులాన్ని కూడా పెట్టి, అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. తాము 10 లక్షల హార్ట్ ఆపరేషన్స్ చేసామని, ప్రమాదం జారింది అని, దానికి బాధ్యత వహిస్తున్నామని, అయినా ఇలా వేధిస్తున్నారని అన్నారు. అయితే ఇప్పుడు హీరో రాం కూడా ఈ అంశం పై ట్విట్టర్ లో సంచలన ట్వీట్లు చేసారు. జగన్ మోహన్ రెడ్డి పై ఎవరో కుట్ర పన్నారని, ఆ కుట్రలో భాగంగా ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఫైర్ నుంచి ఫీజ్ వైపు విషయన్ని మళ్ళించి, అందరినీ ఫూల్స్ ని చేస్తున్నారని అన్నారు. జగన్ ని తప్పుగా చూపించటానికి, ఆయనకు తెలియకుండా ఆయన మనుషులే కుట్ర పన్నారని అనిపిస్తుందని అన్నారు. రమేష్ హాస్పిటల్స్ కు, స్వర్ణా ప్యాలెస్ ఇచ్చే ముందు, ప్రభుత్వమే అక్కడ క్వారంటైన్ కేంద్రం నడిపింది అని, మరి అప్పుడు ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని బాధ్యులను చేసే వారని ప్రశ్నించారు. అక్కడ వసతి బిల్లింగ్ మొత్తం, స్వర్ణా ప్యాలెస్ చేసిందని, వాటి ఆధారాలు పోస్ట్ చేసారు.

రాజధానిని విశాఖ తీసుకు వెళ్తాను అని చెప్తున్న ప్రభుత్వం, అక్కడ గతంలో కేటాయించిన ప్రణాళికను పక్కన పెట్టి, ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వటం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గతంలో విశాఖలో, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టటానికి ప్రణాలికలు రూపొందించారు. అయితే ఇప్పుడు ఆ భూమిని రద్దు చేసి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాకుండా, ఆ భూమిని ఇళ్ళ పట్టాల కింద ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో విశాఖ వాసులు షాక్ తిన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం, త్వరలోనే మరో చోట భూమి చూసి, ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్కడ వచ్చేలా చూస్తామని ప్రకటన చేసింది. ముధురవాడలో కానీ, భీమిలిలో కానీ, భూమి లభ్యత చూసి, అక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామని చెప్తున్నారు. అయితే ఒకసారి రద్దు అయిన తరువాత, అదీ భూమి కేటాయించిన ప్రాజెక్ట్, మళ్ళీ వేరే చోట రావటం అంటే ఎంతో కష్టం. గతంలో విశాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, అమరావతికి ధీటుగా విశాఖను తయారు చెయ్యాలని తలిచింది.

ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను, 150 ఎకరాల్లో తేవటానికి ప్రణాళికలు రచించింది. గతంలో హైదరాబాద్ లో ఎలా అయితే గచ్చిబౌలిని నిర్మాణం చేసారో, అలాగే విశాఖలో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను చెయ్యాలని అనుకున్నారు. దీని కోసం 80 ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్రప్రదేశ్ కు అగనంపూడిలో ఇచ్చారు కూడా. మిగతా 70 ఎకరాలు సేకరించి, ఈ ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటే, గతంలో ఇచ్చిన 80 ఎకరాలు కూడా రద్దు చేసి, ఇళ్ళ పట్టాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామంతో అటు విశాఖ వాసులే కాకుండా, రాష్ట్రంలో క్రీడా ప్రేమికులు అందరూ నిరుత్సాహపడుతున్నారు. అసలకే మన రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహం తక్కువ. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ గాండీవ లాంటివి మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు క్రీడల గురించి పట్టించుకోకుండా, ఇలా ఇళ్ళ పట్టాలకు ఆ భూమి ఇవ్వటంతో, క్రీడా ప్రేమికులు నిరుత్సాహపడుతున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా తొందరగా వేరే చోట భూమి కేటాయించాలని, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.

గత ప్రభుత్వ హయంలో, చంద్రబాబుని చీటికి మాటికీ విసిగిస్తూ, మా జాతి మా జాతి అంటూ, ముద్రగడ పద్మనాభం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. గతంలో చంద్రబాబు కాపు కార్పొరేషన్ పెట్టి చదవుకు సహకరించటం, కార్లు ఇవ్వటం, లోన్లు ఇవ్వటం లాంటివి చేసే వారు. అయితే చివరల్లో 5 శాతం రిజర్వేషన్ కూడా ఇచ్చారు. అయినా ముద్రగడ మాత్రం, చంద్రబాబు ఓడిపోవాలని, జగన్ గెలవాలని పని చేసారు. ఆయన అనుకున్నట్టే జగన్ వచ్చారు. కానే రిజర్వేషన్ రద్దు చేసారు, కాపు కార్పొరేషన్ నుంచి లోన్లు ఆగిపోయాయి, విదేశీ విద్య ఆగిపోయింది. అయినా ముద్రగడ మాత్రం కుయ్యి కయ్యి మనలేదు. చివరకు ఒక రోజు, నన్ను సోషల్ మీడియాలో తిడుతున్నారు, నేను కాపు ఉద్యమం చెయ్యను అంటూ, తప్పుకున్నారు. ఈ పరిణామం అందరినీ ఆశ్చర్య పరిచింది. గత ప్రభుత్వ హయం కంటే, ఇప్పుడే కాపులకు అన్యాయం జరుగుతున్న సమయంలో, ముద్రగడ లాంటి వాళ్ళు వెళ్ళిపోవటంతో, ఇప్పుడు కాపు ఉద్యమం ముందుండి నడిపించటానికి, మరో నేత రెడీ అవుతున్నారు.

ఆయనే సీనియర్ నేత మాజీ ఎంపీ చేగొండి వెంకట హరి రామజోగయ్య. కాపుల తరుపున పోరడానికి, ఆయన కాపు సంక్షేమ సేనను ప్రారంభించారు. పశ్చిమ గోదావరిలోని పాలకొల్లులో, తన నివాసం నుంచి, ఈ వివరాలు చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా బీసిల కోసం, కాపులను దూరం పెట్టారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత, కాపులను దగ్గర చేసుకోవానికి, కాపు నేస్తం అంటూ, 50 లక్షల మంది ఉంటే, కేవలం 2.50 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, జగన్ పై విమర్శలు గుప్పించారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ రద్దు చేసారని అన్నారు. ఈ పరిస్థితిలో కాపులకు జరుగుతున్న అన్యాయాల పై మాట్లాడటానికి, కాపు సంక్షేమ సేనను మొదలు పెట్టినట్టు చెప్పారు హరిరామ జోగయ్య. తదుపరి కార్యాచరణ తొందరలో ప్రకటిస్తామని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read