ఆంధ్రప్రదేశ్ రాజకీయలను మరోసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చుట్టేస్తున్నాయి. నిన్న ఒక ప్రముఖ పత్రికలో, న్యాయమూర్తుల ఫోనులు ట్యాప్ అవుతున్నాయా ? అంటూ ఒక కధనం వచ్చి సంచలనం సృష్టించటం, దాని పై ప్రభుత్వం లీగల్ నోటీసులు ఇవ్వటం తెలిసిందే. ఈ సందర్భంగా, అధికార పార్టీ ఎంపీనే, తన ఫోన్ ట్యాప్ అవుతుంది అంటూ, సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు మాత్రమే కాదు, ఏకంగా కేంద్రాని హోం శాఖకు లేఖ రాసారు. ఫోన్ ట్యాపింగ్ నిజం అని తేలితే, ప్రభుత్వాలే కూలిపోతాయి అనటంలో సందేహం లేదు. గతంలో జరిగాయి కూడా. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎంపీ లేఖ రాసారు. హోం శాఖ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లాకు, రఘురామరాజు లేఖ రాస్తూ, గత కొన్ని నెలలుగా తన ఫోన్ లో రకరకాల శబ్దాలు వినపడుతున్నాయని, నాకు తెలిసిన సమాచారం ప్రకారం, మా రాష్ట్ర ఇంటలిజెన్స్ తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్టు తెలిసిందని, ఇది రాజ్యంగ ఉల్లంఘన అని, ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం, నేరం అని, ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు మీకు తెలుసని, తనకు ప్రాణ హాని ఉందని, కేంద్రం నుంచి వై క్యాటగిరీ బద్రత కూడా తెచ్చుకున్న విషయన్ని అయన లేఖలో తెలిపారు. ఇప్పటికీ తనకు కొంత మంది వివిధ రకాల నంబర్లు నుంచి ఫోనులు చేస్తున్నారని, ఈ సందర్భంలో స్టేట్ ఇంటలిజెన్స్ తన ఫోన్లు ట్యాప్ చేసి, తన మూమెంట్స్ తెలుసుకుంటూ ఉంటే తన బధ్రతకు ముప్పు అని అన్నారు. వివిధ దేశాల నంబర్లు నుంచి, ఫోనులు చేస్తున్నారని, ఒక వైఎస్ రెడ్డి అనే వ్యక్తీ తనను చంపేస్తా అని బెదిరిస్తున్నారని అన్నారు. తాను ఒక ఎంపీ అని, తన విధులకు ఇవన్నీ ఇబ్బంది కలిగిస్తాయని, మీరు ఈ విషయంలో కల్పించుకుని, తగు చర్యలు తీసుకోవాలని, కేంద్ర హోం శాఖను రఘురామరాజు కోరారు.

ముందుగా, స్వర్ణా ప్యాలెస్ లో జరిగిన ఘటనకు ఎవరు బాధ్యులు అయితే వారిని పోలీస్ వారు, కోర్టులు శిక్షిస్తాయి. వాటిని పక్కన పెడితే, వైద్యం రంగం పై కూడా కులం రంగు పులుముతున్న పైశాచికత్వం గురించి మాట్లాడుకుందాం. మనం చదువుకున్న గురువులు ఏ కులమో, ఇప్పటికీ చాలా మందికి తెలియదు. మనకు ఆపద వస్తే, మంచి హాస్పిటల్ లో కాదో చూస్తాం కానీ, ఆ డాక్టర్ కులం చూడం. సమాజానికి మంచి చేసే నాయకుడిని ఆదరిస్తాం కానీ, కులం చూడం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక వికృత క్రీడ నడుస్తుంది. విజన్ ఉన్న నాయకుడికి కులం అంటగట్టారు. సరే ఇది రాజకీయ ఆటలో ఒక భాగం అనుకుందాం. మన తెలుగు నేల నుంచి కష్టపడి పైకి వచ్చి, అంచెలంచెలుగా, ఉపరాష్ట్రపతి అయిన వ్యక్తి మన తెలుగు వాడు అని గర్వించకుండా కులం అంట గడతాం. అధికారులకు, న్యాయ వ్యవస్థకు కులం అంటగడుతున్నారు. చివరకు ఈ మధ్య విద్యా సంస్థలకు కూడా కులం అంట గడుతున్నారు. ఇప్పుడు మరికొంత ముందుకు వెళ్లి, వైద్య రంగానికి కూడా కులం రంగు పులిమి, పైశాచిక ఆనందం పొందుతున్నారు.

విజయవాడలో కానీ, కోస్తా జిల్లాల్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, హార్ట్ స్పెషలిస్ట్ గా డాక్టర్ రమేష్ గుర్తుకు వస్తారు. కానీ ఆయన్ను ఇప్పుడు రమేష్ చౌదరిని చేసి పడేసారు. ఇప్పటి వరకు 10 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ రమేష్ హాస్పిటల్స్, వచ్చే వాళ్ళు ఏ కులం అని చూసి ఉండరు. వచ్చే వారు కూడా, డాక్టర్ రమేష్ ఏ కులం అని తెలుసుకుని వచ్చి ఉండరు. ఆయనకు మంచి వైద్యుడిగా పేరు ఉంది కాబట్టి వచ్చి ఉంటారు. ఒకప్పుడు వైద్య మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌లో విస్తృతంగా ఏర్పాటవుతున్న దశలో అందరూ.. హైదరాబాద్‌లో పెడితే ఎలా.. కోస్తాలోనూ ఉండాలని విజయవాడలో ఆయన ఆస్పత్రి పెట్టారు. బహుసా ఇదే ఆయన చేసిన పాపం ఏమో. స్వర్ణా ప్యాలెస్ దుర్ఘటనకు కచ్చితంగా డాక్టర్ రమేష్ కూడా బాధ్యత వచించాలి. ఇది పక్కన పెడితే, ఆయన చౌదరి అంటూ చేస్తున్న వికృత ప్రచారం అభ్యంతరకరం. ఇలా అన్నీ కులం ఆధారంగా చేసుకుంటూ పొతే, దేశం ముందుకు పోతుంటే, మన ఏపి రాష్ట్రము వెనక్కు వెళ్తుంది అనేది గుర్తుంచుకోవాలి. ఎన్నో క్లిష్ట వైద్యాలు చేసిన డాక్టర్లు, ఈ కులం అనే రోగానికి మాత్రం చికిత్స అందించ లేక, వాళ్ళే దానికి బలి అవుతున్నారు. ఈ కులం అనే రోగం, ఇలాగే పాకితే, వైద్యం చెయ్యటానికి కూడా ఏమి మిగలదు.

నిన్న ఒక ప్రాముఖ పత్రికలో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటూ ఒక సంచలన వార్త ప్రచురితం అయ్యింది. ఈ వార్త చుసిన వారు అందరూ ఒక్కసారిగా అవాకయ్యారు. ఆంధ్రజ్యోతి కధనం ప్రకారం, కొంత మంది హైకోర్టు జడ్జీలకు జరిగిన స్వీయ అనుభవం రాసుకొచ్చారు. ఒక జడ్జికి ముందుగా, ఒక మెసేజ్ వచ్చి, సంచలన జడ్జిమెంట్ కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి అని రావటం, ఆయన ఆ లింక్ క్లిక్ చేసిన దగ్గర నుంచి, ఫోన్ లో ఏదో తేడా గమనించారని, ఆ వార్త ప్రచురితం అయ్యింది. అప్పటి నుంచి ఫోన్ వస్తున్నప్పుడు ఏవో శబ్దాలు రావటం, అలాగే వాట్స్ అప్ మెసేజిలు చూడకుండానే, చూసినట్టు రావటం, ఇవన్నీ అనుమానం వచ్చి, సర్వీస్ ప్రొవైడర్ ని పిలిపించగా, ఫోన్ లో ఏదో బగ్ ఉన్నట్టు, అది సరిచేసినట్టు, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ సమస్య అలాగే రావటం, ఒక్క జడ్జికి మాత్రమే కాకుండా, మిగతా వారికి కూడా ఇలాంటి ఇబ్బందులే రావటంతో, ఇది ఫోన్ ట్యాపింగ్ అంటూ, ఆ కధనం ప్రచురితం అయ్యింది. అయితే ఈ కధనంలో ఎక్కడా పలానా వ్యక్తి కాని, ప్రభుత్వం కాని ఈ పని చేస్తున్నట్టు రాయలేదు. అయితే నిన్న ప్రభుత్వం మాత్రం, ఈ విషయం పై సీరియస్ గా స్పందిస్తూ, ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు పంపించింది.

వచ్చిన కధనం పై క్షమాపణ చెప్పాలని, లేకపోతే క్రిమినల్ ఆక్షన్ తీసుకుంటామని చెప్పింది. అయితే ఈ ట్విస్ట్ ఇలా ఉండగానే, ఈ రోజు మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జడ్జిల ఫోన్ ట్యాపింగ్ పై, తాను రేపు హైకోర్టు లో పిల్ వేస్తున్నట్టు,. మాజీ జడ్జి న్యాయమూర్తి, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్రవణ్‌కుమార్ వెల్లడించారు. ఇది అత్యంత దారుణమైన విషయం అని, మన దేశంలో ఎప్పుడ ఇలాంటి పరిణామం జరగలేదని, దీని పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, తాను రేపు హైకోర్టు ముందుకు వెళ్తున్నాని అన్నారు. నిన్నటి నుంచి ఈ పరిణామం అనేక మలుపులు తిరుగుతుంది. నిన్న ఆంధ్రజ్యోతి కధనం రాయటం, ఎక్కడ ప్రభుత్వం చేసినట్టు చెప్పకపోయినా, ప్రభుత్వం మాత్రం క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులు పంపించటం, నేను ట్యాపింగ్ పై పిల్ వేస్తాను అని శ్రవణ్ కుమార్ చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే, ఈ పరిణామంలో ఒకవేళ కధనం తప్పు అయితే, అటు ఆంధ్రజ్యోతి కానీ, ఇటు ఈ ట్యాపింగ్ చేసింది నిజమే అయితే చేసిన వారు కానీ, బలి అవ్వటం ఖాయం. చివరకు ఇది ఎక్కడ తేలుతుందో చూడాలి.

విజయవాడ స్వర్ణా ప్యాలెస్ లో, ఘోరం జరిగి నేటికి వారం రోజులు. అప్పటి నుంచి, ఈ కేసు పై విచారణ జరుగుతుంది. స్వర్ణా ప్యాలెస్, రమేష్ హాస్పిటల్ ని ఇందులో బాధ్యులని చేసి, పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో కచ్చితంగా స్వర్ణా ప్యాలెస్, రమేష్ హాస్పిటల్స్ దే బాధ్యత ఉంటుంది. ఇందులో తప్పు ఏమి లేదు. అయితే అధికార వైసీపీ పార్టీ మాత్రం, దీన్ని కులం వైపుకు తీసుకు వెళ్ళింది. ఇప్పటి దాకా అందరికీ విజయవాడలో డాక్టర్ రమేష్ అనే తెలుసు కానీ, వైసీపీ మాత్రం, రమేష్ చౌదరి అంటూ, లేని తోక తగిలించి, ఒక వికృత రాజకీయ క్రీడకు తెర లేపారు. ఇక మరో పక్క ఈ కులం దాడి పై డాక్టర్ రమేష్ స్పందించారు. ఇప్పటి వరకు 10 లక్షల మందికి చికిత్స చేసాం అని, ఎప్పుడూ ఇలా కులం పెట్టి వేలు చూపించలేదని అన్నారు. ఇక మరో పక్క ఈ మొత్తం ఘటన పై నిన్న హీరో రాం, కొన్ని ట్వీట్లు చేసారు. జగన్ మోహన్ రెడ్డి కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ కుట్ర గురించి ఆయన జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేసారు. అలాగే జరిగింది ఫైర్ అయితే, ఫీజ్ మీదకు దృష్టి మళ్ళించి, ఫూల్స్ ని చేస్తున్నారని కొన్ని డాక్యుమెంట్లు పోస్ట్ చేసారు.

స్వర్ణా ప్యాలెస్ లో రూమ్ రెంట్ మొత్తం వారే వసూలు చేసారని, కేవలం ట్రీట్మెంట్ బాధ్యతే రమేష్ హాస్పిటల్స్ ది అని, అయినా ఇంతకు ముందు ఇక్కడ ప్రభుత్వమే కదా క్వారంటైన్ సెంటర్ కు పర్మిషన్ ఇచ్చింది అని ప్రశ్నించారు. ఇలా కొన్ని ప్రశ్నలు సంధించటంతో, ఈ రోజు విజయవాడ పోలీసులు స్పందించారు. ఏసీపీ మాట్లాడుతూ, హీరో రాం విచారణకు ఆటంకం కలిగిస్తే ఆయన పై కూడా విచారణ చేస్తామని అన్నారు. ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి, అంతే కాని విచారణకు ఆటంకం కలిగించవద్దు అని అన్నారు. జరిగిన ప్రమాదం పై సీరియస్ గా విచారణ చేస్తున్నామని, కొంత మంది విచారణకు రావటం లేదని, ఆరోగ్యం బాగోలేదని చెప్తున్నారని, అది నిజమో కాదో వెరిఫై చేస్తున్నామని అన్నారు. అయితే హీరో రాం లేవనెత్తిన ప్రశ్నలకు, చేసిన వ్యాఖ్యలకు, అవసరం అయితే ఆయనకు నోటీసులు ఇస్తాం అని పోలీసులు చెప్పటం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. అయితే ఈ విషయం పై ఇదే నా చివరి ట్వీట్ అంటూ రామ్ మరో ట్వీట్ చేసారు. న్యాయం మీద నమ్మకం ఉందని, ఈ విషయంతో సంబంధం ఉన్న వారు, లేని వారు అయినా, తప్పు చేసిన వారికి శిక్ష పడి తీరుతుందని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read