ప్రపంచం అంతా ఈ మహమ్మారి వైరస్ పై యుద్ధం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, ఎప్పుడూ ఏదో ఒక వివాదమే నడుస్తూ ఉంటుంది. రాజధాని మార్పు కాని, ఎన్నికలు కాని, ఎన్నికల కమీషనర్ ను మార్చటం కాని, రంగులు కాని, ఇలా ఏదో ఒక వివాదం. తాజాగా ఎల్జీ పాలిమర్స్ వివాదం. ఎల్జీ పాలిమర్స్ విషయంలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారని, అందుకే ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు అనే చర్చ నడుస్తున్న వేళ, రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రి కొత్త సమస్య పుట్టుకు వచ్చింది. అదే పోతిరెడ్డిపాడు నీటి వివాదం. అటు తెలంగాణాలో కేసీఆర్, హరీష్ రావు, ఇతర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నారు. మా నీళ్ళు తీసుకు వెళ్ళిపోయే ప్రాజెక్ట్ కు మేము ఒప్పుకోం అంటూ, విమర్శలు మొదలు పెట్టారు. ఇక ఇటు వైపు నుంచి జగన్ మోహన్ రెడ్డి, మా నీళ్ళు మేము వాడుకుంటాం, దాంట్లో తప్పు ఏమి ఉంది, మానవత్వంతో ఆలోచించండి అంటూ వ్యాఖ్యలు చెయ్యటం చూస్తున్నాం. అయితే ఉన్నట్టు ఉండి ఈ వివాదం ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

అయితే ఇది కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులు ఆడుతున్న డ్రామా అంటూ, తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సమస్యలు, వైఫల్యాలు గురించి ప్రజలను డైవర్ట్ చేసే పనిలో భాగంగానే ఇవి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కేసీఆర్-జగన్ ఇద్దరు సోడా-విస్కీ లాగా కలిసిపోయారని, ఇదంతా డ్రామా అని, ఏపి ఇచ్చిన ఆ నీటి జీవో, ప్రగతి భవన్ లో తాయారు అయ్యిందే అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అయితే దీని పై విశ్లేషకులు కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపి చేపట్టింది కొత్త ప్రాజెక్ట్ కాదు, అది కూడా కేవలం ఒక 10 రోజులు వరదలు వస్తే పని చేసే ప్రాజెక్ట్. ఒక్కే ఏడాది అసలు వరదలు కూడా రావు. అలాంటి విషయంలో ఇంతలా గొడవ ఎందుకు అవుతుందో అర్ధం కావటం లేదని అంటున్నారు.

గతంలో చంద్రబాబు ఉండగా, ఇదే శ్రీశైలం పై, ముచ్చుమర్రి కట్టారని, అప్పుడు తెలంగాణాతొ సమన్వయం చేసుకున్నారని, అలాగే, 2017లోనే, ఇదే పోతిరెడ్డిపాడు వద్ద, అప్రోచ్ ఛానల్ extension, వైడనింగ్ చేసారని, అప్పుడు ఎలాంటి వివాదం తెలంగాణాతో రాలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కేవలం పోతిరెడ్డి పాడు కాలువలు వెడల్పు చేస్తున్నారని, ఇదేమీ కొత్త ప్రాజెక్ట్ కాదని, మరి దీనికి జగన్ "రాయలసీమ ఎత్తిపోతల" అని ఏదో కొత్త ప్రాజెక్ట్ లా ఎందుకు చెప్పారు ? దానికి కేసీఆర్ ఇంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్ధం కావటం లేదని, అంటున్నారు. ఏమి లేని సమస్యను, ఏదో సమస్యగా చూపిస్తున్నారని, అసలు జగన్ ఇప్పుడు చేసేది ఏదో పెద్ద ప్రాజెక్ట్ కూడా కాదని, 10 రోజులు వరదలు వస్తే ఉపయోగపడే దానికి , ఇంత హడావిడి ఏమిటో అనే విమర్శలు వస్తున్నాయి. ఇక మరో పక్క తెలంగాణాలో కడుతున్న కాళేశ్వరం , పాలమూరు ప్రాజెక్టులలో, వైసీపీ పెద్ద తలకాయలు కాంట్రాక్టరులుగా ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక ప్యాకేజీ ఇస్తున్నట్టు వెల్లడించారు. భూమి, కార్మిక చట్టాలు, ద్రవ్య లభ్యత, చట్టాలు... ఇలా ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీని రూపొందించినట్లు వివరించారు మోదీ. పేదలు మొదలు పరిశ్రమల వరకు.. ప్రతి వర్గానికి అండగా నిలిచేలా ఈ ప్యాకేజీ ఉంటుందని తెలిపారు.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సాహసోపేత సంస్కరణలతో ముందుకు సాగడం అనివార్యమన్నారు మోదీ. గత ఆరేళ్లలో చేపట్టిన సంస్కరణల కారణంగానే ఈ సంక్లిష్ట సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ సుదృఢంగా ఉందని చెప్పారు. కరోనా సంక్షోభంతో నిలిచిన ప్రగతి రథాన్ని తిరిగి గాడిన పెట్టే లక్ష్యంతో చారిత్రక అడుగు వేసింది మోదీ సర్కార్. ఆత్మ నిర్భర భారత్​ అభియాన్​ పేరిట ఏకంగా రూ.20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.

ప్రధాని మాట్లాడుతూ "కరోనాపై యుద్ధం చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం. ఈ బాధ్యతను 130 కోట్ల మంది భారతీయులం తలకెత్తుకుందాం. లాక్‌డౌన్‌-4లో కూడా అన్ని జాగ్రత్తలు, నియమాలు పాటిద్దాం. కరోనాతో పోరాడుతూనే ముందడుగు వేయాలి. 21వ శతాబ్దం మనదే.. ఆత్మ నిర్భర భారతదేశమే మన లక్ష్యం. 21వ శతాబ్దం భారత్‌దేనని గత శతాబ్దం నుంచి ఎప్పుడూ వింటూ వచ్చాం. ఈ కష్టకాలంలో చిన్న వ్యాపారులు, ఇళ్లల్లో పనిచేసేవారు, శ్రామికులు ఇబ్బందులు పడ్డారు. సంఘటిత, అసంఘటిత రంగంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక ప్యాకేజీ కాపాడుతుంది. స్థానిక మార్కెట్లను విస్తరించాల్సిన అవసరాన్ని ఈ సంకట స్థితి తెచ్చింది. గ్లోబల్‌ డిమాండ్‌తో పాటు, స్థానిక డిమాండ్‌ను సృష్టించాలి. మనం స్థానికంగా తయారు చేసిన వస్తువులకు గ్లోబల్‌ డిమాండ్‌ సృష్టించాలి."

"మన వస్తువులను మనమే కొనుగోలు చేస్తే కొత్త ఉపాధి లభిస్తుంది. ఖాదీ కొనండి, స్థానిక చేనేత కారులకు ఉపాధి లభిస్తుంది. మాస్కులు కట్టుకుందాం, ఆరడుగుల దూరం పాటిద్దాం. పనిని ఆపకుండానే కరోనాను ఎదుర్కోందాం. నాలుగో దశ లాక్‌డౌన్‌కు కొత్త మార్గదర్శకాలు మే 18 లోపు ఇస్తాం. కరోనాపై యుద్ధం చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం. ఈ బాధ్యతను 130 కోట్ల మంది భారతీయులం తలకెత్తుకుందాం. నవీన సంకల్పం, కొత్త ప్రాణశక్తితో అడుగు ముందుకు వేద్దాం. కొత్త నైపుణ్యాలు, కొత్త ఆలోచనలతో భారత్‌ను ముందుకు తీసుకెళ్దాం. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు అనేక అవకాశాలు ఉన్నాయి. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుకుపుకొని పోయేలా ప్యాకేజీ." అని ప్రధాని మోడీ అన్నారు.

విషవాయువు లికెజ్ ఘటనలో 12 మంది ప్రాణాలను హరించి, వందలాది మందిని ఆసుపత్రి పాల్టేసిన వెంకటాపురం ఎల్జీ పాలిమర్సు కంపెనీ 'కన్సుంట్ ఫర్ ఆపరేషన్' రద్దయింది. ఈమేరకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా ఏదేని ఫాక్టరీలు తమ ఉత్పత్తుల కార్యకలాపాలు కొనసాగించాలంటే ప్రధానంగా కన్సుంట్ ఫర్ ఆపరేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి. వాతావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా, పరిసర ప్రాంతాలలో ఎటువంటి కాలుష్యం వెదజల్లకుండా ప్రొడక్షన్ చేపడతామంటూ సంస్థ అందజేసిన ఒప్పుదల అంగీకార వత్రం మేరకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విచారణ చేసి నమ్మకం కుదిరిన అనంతరం ఆ సంస్థకు సిఎఫ్ఓను జారీచేస్తుంది. ఈ మేరకు సదరు సిఎఫ్ఓలో పొందుపరిచిన నిబంధనలనన్నింటిని తూచా తప్పకుండా సంస్థ పాటించాల్సి వుంటుంది.

అయితే ఎల్జీ సంస్థ నుంచి ప్రమాదకర విషయవాయువు లీకవడం, మరణాలు సంభవించడం, వందలాది మంది రోగగ్రస్తులు కావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న సిపిసిబి కొరడా ఝుళిపించింది. ఎట్టి సంస్థకు చెందిన సిఎఓ సర్టిఫికేట్ ను రద్దు చేసింది. దీంతో ఎల్జీ సంస్థ ఎటువంటి ఉత్పత్తులను చేపట్టరాదు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం వత్తిడికి మేరకు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం విశాఖ యూనిట్లోని స్టెరైన్ తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది. గ్యాస్ లీకేజీ సంభవించిన ట్యాంకులోప్రస్తుతం 73 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందని, ప్రస్తుతం సురక్షిత స్థాయిలో ఉందని కలెక్టర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం స్టెరైన్ 100 శాతం పాలిమరైజ్ అయిందని అధికారుల నివేదికలు పేర్కొన్నాయి. పరిశ్రమలో సామర్థ్యానికి మించి స్టెరీన్ నిల్వలున్నట్టు అధికారులు గుర్తించారని తెలుస్తోంది.

దీంతో ఈ నిల్వలను కొరియాకు తరలించేందుకు యుద్ధప్రాతి పదికన చర్యలు మొదలు పెట్టారు. దీనిపై పరిశ్రమ యాజమాన్యం ముందుగా 8వేల టన్నులను వెసల్ ద్వారా దక్షిణ కొరియాకు తరలిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. మరొక వెసల్ కూడా అందుబాటులోకి వచ్చిందని మరో అయిదురోజుల్లో 13వేల టన్నుల స్టెరైన్ తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిపై అత్యున్నత స్థాయి బృందం కంపెనీలో నిశిత పరిశీలన చేసిందని, ఒకప్రణాళిక ప్రణాళిక కూడా రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఎల్జీ సంస్థ ప్రాంగణంలో వున్న 2700 లీటర్లతో పాటు ఈస్ట్రన్ పవర్ పెట్రో కెమికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ వద్ద వున్న నిల్వలతో కలిపి సుమారు 13000 టన్నుల స్టెరీను సౌత్ కొరియా పంవనున్నారు.. సోమవారం నాటికే 8000 టన్నుల స్టెరీన్ వెనకకు పంపినట్టు తెలుస్తుంది. కాగా అంతర్జాతీయ మార్కెట్ లో ఒక టన్ను స్టెరీన్ విలువ సుమారు 85 వేల రూపాయలు పలుకుతుంది. ఈ మేరకు సుమారు 110 కోట్ల రూపాయల స్టెరీర్‌ను విశాఖ నుంచి సౌత్ కొరియా పంపుతుండడం గమనార్హం.

గత వారం విశాఖపట్నంలో, ఎల్జీ పాలిమర్స్ లో, గ్యాస్ లీక్ అవ్వటం, 12 మంది చనిపోవటం, ఊళ్ళకు ఊళ్లు రోడ్డుల మీద పరిగెత్తటం, స్పృహ తప్పి పడిపోవటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే, ఆ రోజే మధ్యానం, జగన్ మోహన్ రెడ్డి, విశాఖ పర్యటనకు బయలు దేరారు. అయితే ఈ సమయంలో, వచ్చిన ఒక వీడియో, అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఆ సమయంలో జగన్ మోహన్ రెడ్డి, అధికారులు, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, విజయసాయి రెడ్డి బయటకు వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇద్దరు అధికారులు కార్ ఎక్కారు. అయితే ఇదే సందర్భంలో ఆళ్ళ నాని , జగన్ తో మాట్లాడటం, తరువాత జగన్, విజయసాయి రెడ్డికి ఏదో చెప్పటంతో, విజయసాయి రెడ్డి కార్ దిగిపోయారు. తరువాత జగన్, ఆళ్ళ నాని, చీఫ్ సెక్రెటరి, మరొక అధికారి, హెలికాప్టర్ లో విశాఖపట్నం వెళ్ళిపోయారు. అయితే, విజయసాయి రెడ్డి కార్ దిగిపోవటం పై, సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అయ్యింది.

విజయసాయి రెడ్డిని అవమానించేలా ఉన్న వీడియో, అంత దగ్గర నుంచి తియ్యటమే కాకుండా, దాన్ని బయటకు వదలటం పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇక ప్రతిపక్షాలు అయితే, జగన్, విజయసాయి రెడ్డిని కావాలనే దించేసారని, ఈ రోజు విశాఖ ఇలా అవ్వటానికి కారణం, విజయసాయి రెడ్డి మాత్రమే అని అభిప్రాయం, విశాఖ ప్రజల్లో ఉండటంతో, ఆ కోపం చల్లార్చటానికి, జగనే ఇలా చేసారని ప్రచారం సాగింది. అయితే, అప్పటి నుంచి, ఈ విషయం పై వివరణ రాలేదు. అయితే ఈ రోజు ఈ విషయం పై స్వయంగా విజయసాయి రెడ్డే మాట్లాడారు. నిన్న రాత్రి విశాఖలో ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన ఏరియాలో నిన్న విజయసాయి రెడ్డి, ఒక భవనం డాబా పై, పడుకున్నారు.

ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు ఇలా చేసాం అని చెప్తూ, ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో జరుగుతున్న అన్ని విషయాల పై, ప్రెస్ కి చెప్పారు. ఈ సందర్భంలో, కార్ లో నుంచి, దిగిపోయిన సంఘటన పై, ప్రెస్ అడిగింది. దీని పై విజయసాయి రెడ్డి సమాధానం చెప్తూ, తనను ఎవరూ దిగిపోమని చెప్పలేదని, నేనే దిగిపోయానని చెప్పారు. ఆ రోజు హెలికాప్టర్ లో, ఒక్కరికి మాతమే ఖాళీ ఉందని, అందుకే తాను దిగిపోయి, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నానిని వెళ్ళమని, చెప్పానని అన్నారు. హెలికాప్టర్ లో సీటు లేక వెళ్లలేదని, అంతే కాని తనను దింపేసారని, ప్రచారం జరుగుతున్న దాంట్లో వాస్తవం లేదని, కావాలని ఇలా ప్రచారం చేసారని విజయసాయి రెడ్డి చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read