తిరుమలలోని దేవాలయాలన్నింటినీ కబ్జా చేయడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. తిరుమలలో టిటిడి పరిధిలో ఉన్న ఆలయాలన్నింటినీ పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నది. తిరుమలలో ఉన్న ఆలయాలను, వాటి చరిత్రను పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ వాటిని పూర్వకాలంలో నిర్మించినవిగా గుర్తించింది. తిరుమలలోని ఆలయాలు, భవనాల వివరాలు అందించాలని పురావస్తు శాఖ టిటిడికి లేఖ రాసింది. ఢిల్లి కేంద్ర కార్యాలయం ఆదేశాలతో రాష్ట్ర పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చారు. తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని, పురాతన కట్టడాలు తొలగించి, కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర పురావస్తు శాఖ, ఒక సాకుగా చూపించి, ఈ కుట్రకు తెర లేపింది.

tiruamal 05052018 2

కేంద్ర పురావస్తు శాఖ అధికారులు తిరుమలను సందర్శించనున్నారు. టిటిడినుంచి కట్టడాల జాబితా అందిన తరువాత అధికారులు తిరుమలను సందర్శించే అవకాశం ఉంది. పరిశీలన అనంతరం దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమలలోని ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆ ఆలయాలపై ఎలాంటి అధికారం ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కేంద్రం తీసుకునే అవకాశముంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లను నామినేట్‌ చేసే అధికారం కూడా రాష్ట్రానికి లేకుండా పోతుంది. ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ లోని, స్వామిజీలు మండిపడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పై కక్ష సాధింపుగా భావిస్తున్నారు..

tiruamal 05052018 3

మా తిరుపతి పై నీ పెత్తనం ఏమిటి మోడి అంటూ ఆందోళనకు సిద్దమవుతున్నారు.. తీవ్ర పర్యవసానాలు వుంటాయని ప్రజలు హెచ్చరిక చేస్తున్నారు... మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయాం.. మద్రాసు పోయినా తిరుమల ఉందని సంతోషించాం.హైదరాబాద్ పోయింది.తిరుమల ఉందని ఊపిరి నిలుపుకున్నాము.తిరుమల జోలికి రావద్దు. తిరుమల మాదే, ఏడుకొండలు మావే ! వెంకటేశ్వరుడు మా దేవుడే !! ఇందులో ఎలాంటి డౌటు లేదు. అనవసర ప్రయాసలు మానుకోండి!! అసలే ఆంధ్రులు అసంతృప్తి చూసి వెంకన్న ఆగ్రహంతో ఉన్నాడు. పొరపాటు జరిగిందో ఇక మీకు శంకరిగిరి మాన్యాలే గతి !!

వీరంతా ముసలి వాళ్ళు... ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తో బ్రతికే వారు.. అయతే ఏంటి, వారికి ఎంతో పెద్ద మనుసు ఉంది... రాజధాని అమరావతి నిర్మాణానికి ఎంతో ఔదార్యంతో, పెద్దమనసుతో రూ.40 వేల విరాళంగా అందజేసారు. వీరంతా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం వాసులు. వీరంతా రైతు కూలీలు. ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లలోని సొమ్మును సేకరించి ముఖ్యమంత్రికి అందచేసారు. తమ పెన్షన్లు రూ. 40 వేలు విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసి, రాష్ట్ర భవిష్యత్తుకు వారి సహాయం కూడా అందించారు. నలభై మంది తరపున పెన్షన్ డబ్బు రూ.40 వేలను ముఖ్యమంత్రికి అందజేసిన వారిలో కఠారి ఆదెమ్మ, చాగంటి బాలమ్మ, సి. ప్రసాద్, నడింపాలెం గ్రామపెద్దలు ఎలిపిల్లి వెంకట సుబ్బారావు, నేలపాటి జయరాజ్, ఉప సర్పంచ్, జాగర్లమూడి వెంకటేశ్వరరావు, ఐటీ నిపుణులు బిక్షాల రావు ఆధ్వర్యంలో వచ్చి సీఎంను కలిసారు.

amaravati 05052018 2

కఠారి ఆదెమ్మ మాట్లాడుతూ, "మీరు నా పెద్ద కొడుకుగా ఆదుకొంటానన్నారు. ఆదుకున్నారు. సంతోషంగా ఉంది. మీరు రాజధాని నిర్మించాలి. రాజధాని చూసి తనువు చాలిస్తానయ్యా." అంటూ ఆమె చంద్రబాబు వద్ద భావోద్వేగానికి గురైయ్యారు... చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని రైతుకూలీలు ప్రశంసించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, నేను రాజధానిని తప్పక నిర్మిస్తాను, మీరు చూస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి విరాళం ఇచ్చిన స్ఫూర్తిని ముఖ్యమంత్రి అభినందించారు. తనకున్నంతలో ఎదుటివారికి సహాయపడాలి అనే తెలుగువారి సేవా గుణానికి ఇదొక నిదర్శనమని ముఖ్యమంత్రి కొనియాడారు.

amaravati 05052018 3

మరో పక్క, ఇలాంటి వారిని చుసైనా, పవన్, జగన్, మనసు మార్చుకోవాలని, నిత్యం అమరావతి పై చేసే కుట్రలు ఇలాంటి వారిని చూసైనా ఆపాలి.. జగన్, విజయవాడ పాదయత్రకు వచ్చి, భ్రమరావతి అంటూ యెగతాళి చేసాడు.. మంగళగిరిలో పాదయాత్ర చేసినా, కూత వేటు దూరంలో ఉన్న అమరావతికి రావటానికి మాత్రం ఇష్టపడలేదు... ఇక జగన్ మీడియా, పార్టీ, అమరావతి పై చిమ్మే విషం గురించి చెప్పే పని లేదు... ఇక పవన్ విషయానికి వస్తే, ఐవైఆర్, ఉండవల్లి లాంటి వారితో కలిసి, ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తాకాలు వదులుతాడు.. అమరావతికి అన్ని ఎకరాలు ఎందుకు అంటాడు... వీరందరూ కలిసి, అదే స్టేజి పై, అమరావతి రైతుల త్యాగాలను కూడా అవహేళన చేస్తారు... కానీసం ఇలాంటి వారిని చూసైనా, బుద్ధి తెచ్చుకుని, రాజధానికి అడ్డు రాకుండా, సహకరిస్తారని ఆశిద్దాం..

ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో సూర్యుడిలా ఉదయించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమందరికి కొత్త వెలుగు ప్రసాదించారని ఐఐటీ-జేఈఈ ర్యాంకర్లు తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, తాము ప్రతిభ చాటుకునేందుకు మీరిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్ధులు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతూ ఐఐటీ-జేఈఈ మెయిన్స్, పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్ధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. 

cbn students 05052018

రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 216 మంది విద్యార్ధులు ఐఐటీ-జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించడం తనకు గర్వకారణంగా వుందని ముఖ్యమంత్రి అన్నారు. ఐఐటీ-జేఈఈ మెయిన్స్‌లో జనరల్ కటాఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించిన కె. శ్రీకాంత్, కె. అమృత, డి. లావణ్య, భూక్యా లలిత, టి. జీవిత, పి. కోటి, బి. అశోక్ కుమార్, నిరూప, రవికుమార్‌లను పేరుపేరునా భుజంతట్టి ముఖ్యమంత్రి అభినందించారు. 140 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షల్లో పదికి పది జీపీఏ సాధించి మిగిలిన విద్యార్ధులకు స్ఫూర్తిదాయంగా నిలిచారని ప్రశంసించారు. ఈ ఏడాది ర్యాంకర్ల సంఖ్య వందల్లో వుంటే, వచ్చే ఏడాది ఈ సంఖ్య వేలల్లో వుండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

cbn students 05052018

పేద విద్యార్ధుల అందరికీ కార్పొరేట్ స్థాయి విద్యను, నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, చదువుకునే తెలివితేటలు-సామర్ధ్యం మీదని, ప్రోత్సహించే బాధ్యత తమదని అన్నారు. రాష్ట్రంలో మరిన్ని రెసిడెన్షియల్ పాఠశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రతి పేద విద్యార్ధి రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అభ్యసించడం ద్వారా నాణ్యమైన విద్య అందుకోవాలనేదే తన సంకల్పమని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు విదేశాల్లో సైతం చదువుకునేందుకు ఒకొక్కరికి రూ. 15 లక్షలు వరకు ఆర్ధిక సాయం చేస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పేద పిల్లలు చదువుకుంటే సమాజంలో ఆర్ధిక అసమానతలు వాటంతటవే తొలిగిపోతాయన్నారు. అవకాశాలు ఇస్తే ఎవరైనా రాణిస్తారనే విషయాన్ని మీరంతా మరోసారి నిరూపించారని విద్యార్ధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చెప్పారు. విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా తన అభినందనలను తెలిపారు. పిల్లలకు ఆస్తులు ఎంత ఇచ్చామనేది ముఖ్యం కాదని, ఎంత బాగా చదువు-సంస్కారం నేర్పామనేదే ప్రధానమని ముఖ్యమంత్రి అన్నారు. ఐఐటీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా భవిష్యత్‌కు బాటలు వేస్తున్నట్టు చెప్పారు.

దగా పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరుకునేది అభివృద్ధి... ఒకడు దెబ్బ కొట్టి రోడ్డున పడేసాడు... ఇంకొకడు వచ్చి, అదే దెబ్బ మీద మళ్ళీ కొట్టాడు... వీళ్ళ దెబ్బలు తట్టుకుని, నిలబడి పోరాడుతుంది, ముందుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్... మా మీదే ఎదురు తిరుగుతారా, మీ పై ఆపరేషన్ గరుడ అంటూ వస్తున్నాం, మీ మనుషుల చేతే మిమ్మల్ని దెబ్బ కొడతాం... మీలో కులాల బలహీనతను ఆసరాగా తీసుకుని, మీ మధ్యే గొడవలు పెడతాం అంటూ, ఒక బ్యాచ్ తయారయ్యింది.. రాష్ట్రంలో అల్లకల్లోలం చేస్తాం... కులాల మధ్య గొడవలు పెట్టి, రాష్ట్రంలో అనిశ్చితి నెలకోల్పుతాం అంటూ రెచ్చిపోతున్న ఆపరేషన్ గరుడ బ్యాచ్ కి, నిన్న దాచేపల్లి సంఘటన ఒక చెంప పెట్టు...

dachepalli 05052018 2

9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. అతను రెండు రోజుల పాటు పరారీలో ఉన్నాడు. మరో పక్క, ఇటు రెండు మతాల మధ్య గొడవగా మారే పరిస్థతి వచ్చింది.. ఒక వైపు ముస్లింలు ఆందోళన... ఇదే అదనుగా చూసుకుని, కొంత మంది అక్కడ గొడవలు రేపటానికి ప్రయత్నించారు.. కాని, అక్కడ ఉన్న ముస్లిం సోదరులు ఎక్కడా బ్యాలన్సు తప్ప లేదు.. మాకు న్యాయం జరగాలి, ఆ రేపిస్ట్ ను అరెస్ట్ చెయ్యాలి, శిక్ష వెయ్యాలి అని ఆందోళన చేసారు కాని, ఎక్కడా లైన్ దాటలేదు... ఆందోళన చేస్తూనే, పోలీసులకి సహకరించారు.. కొంత మంది, అన్ని విధాలుగా, అక్కడ ఉన్న వారిని రెచ్చగొట్టటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసారు..

dachepalli 05052018 3

కొంత మంది, సుబ్బయ్య మా చేతుల్లో చావలేదు, సుబ్బయ్య కొడుకును కూడా ఉరితీయాలి అంటూ ఆందోళన చేసారు. సుబ్బయ్య తప్పుచేస్తే అతని కొడుకును ఉరితీయాలని చెప్పడం మరింత విచిత్రంగా ఉందని, పోలీసులు అలెర్ట్ అయ్యారు. అక్కడ ఉన్న కొంత మంది పెద్దలకు నచ్చ చెప్పి, పరిస్థితి అదుపులోకి తెచ్చారు. మరో వైపు, సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని, నడిరోడ్డుపై సుబ్బయ్య మృతదేహాన్ని తగలబెట్టాలన, హోం మంత్రి కాన్వాయ్ అడ్డుకున్నారు... ఇక్కడ కూడా పోలీసులు వెనక్కు తగ్గారు. ఆందోళనకారులను ఏమి అనవద్దని హోం మంత్రి ఆదేశాలివ్వడంతో పోలీసులు వెనక్కు తగ్గారు. పోలీసులు, ప్రభుత్వం, ఉద్రిక్తతను తగ్గించారు. అక్కడ కొంత మంది, ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా, అక్కడ ప్రజలు ఎక్కడా విధ్వంసం చెయ్యలేదు.. కేవలం ఆ రేపిస్ట్ ను శిక్షించాలి అనే డిమాండ్ మాత్రమే చేసారు.. అదే ఇంకొక రాష్ట్రంలో అయితే, ఇలాంటి ఘటనలు రెండు మతాల మధ్య గొడవకు దారి తీసేది.. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజ్ఞత.. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోకి తెచ్చిన వైనం... ఆపరేషన్ గరుడ బ్యాచ్, ఇక రెలాక్స్ అవ్వండి.. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలకు ఆంధ్రపదేశ్ ప్రజలు సిద్దంగా లేరు...

Advertisements

Latest Articles

Most Read