"కర్ణాటకలో నివసిస్తున్న తెలుగు సోదర సోదరీమణులకు వినమ్రపూర్వక విన్నపం" సోదర సోదరీ మణులారా, ఎన్నో శతాబ్దాలుగా తెలుగు,కన్నడ ప్రజల మధ్య విడదీయరాని అన్యోన్య సోదర సంబంధం వుంది. బసవన్న సంఘ సంస్కరణోద్యమ గాలులు తెలుగు గడ్డపై కూడా వీచిన సంగతి మీకందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత కూడా దశాబ్దాలుగా ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడి ప్రజల సంస్కృతీ సంప్రదాయాలతో మమేకమై ఈ రాష్ట్ర అభివృద్దికి ఇతోధిక కృషిచేసిన, చేస్తున్న మీ అందరినీ ముందుగా హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.అలాగే గడిచిన 5 ఏళ్లుగా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని 2013 ఎన్నికల్లో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి, నాకు కల్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. 2013 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నూటికి 95 శాతం అమలు చేయడం ద్వారా ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. "అన్న భాగ్య" పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువనున్న( BPL) కుటుంబాలకు కిలో ఒక్క రూపాయికే నెలకు 30 కేజీల బియ్యం ఇస్తామన్న వాగ్దానం నెరవేర్చాం.

8200 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులకు రుణమాఫీ వాగ్దానాన్ని అమలు చేయడం జరిగింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాలేజీ విద్యార్ధులకు లాప్ టాప్స్ అందజేశాం. రైతులకోసం సోలార్ పంపు సెట్లపై 75% సబ్సిడీని, డ్రిప్ ఇరిగేషన్ లో 100% సబ్సిడీని అమలు జరిపాం. రైతాంగానికి 2లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశాం. "క్షీర భాగ్య" పధకం ద్వారా రైతులకు లీటరు పాలకు 4 రూపాయల చొప్పున సబ్సిడీ ఇచ్చాము. తద్వారా ఇబ్బడి ముబ్బడిగా పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, అలా ఉత్పత్తి అయిన పాలను స్కూలు పిల్లలకు ఉచితంగా సరఫరా చేయడం ద్వారా పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించే ప్రయత్నం చేశాం. 65 లక్షల మంది స్కూలు విద్యార్థులకు యూనిఫారాలు, టెక్స్ట్ పుస్తకాలు ఉచితంగా అందజేశాం. "విద్యా శ్రీ" పధకం కింద హాస్టళ్లలో సీటు లభించని విద్యార్ధులకు నెలకు 2000 రూపాయలు ఖర్చుల నిమిత్తం ఇవ్వటం జరిగింది. 2 లక్షల పైచిలుకు ఇరిగేషన్ పాండ్స్ తవ్వించాం. ఎస్.సి, ఎస్.టీ, బీసీ,మైనారిటీ వర్గాల ప్రజలు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డుల నుండి తీసుకున్న రుణాలను మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా మాఫీ చేయడం జరిగింది. రెవిన్యూ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదల ఇళ్లకు పట్టాలిచ్చి రెగ్యులరైజ్ చేశాం. ఇలా ఆనాడు మేము మా మేనిఫెస్టోలో ఇచ్చిన 165 వాగ్దానాలలో దాదాపు 158 వాగ్దానాలు నెరవేర్చగలిగామని సవినయంగా మనవి చేస్తున్నాను.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని, విభజన చట్టంలో పొందు పరిచిన హామీలను 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కి తెలుగు ప్రజలకు తీరని అన్యాయం, ద్రోహం చేసింది. ఆ విషయం నేను మీకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. గుండెల్లో దించిన బాకులాగా ఆ విషయం మిమ్ములను బాధిస్తుందన్న సంగతి నేను అర్ధం చేసుకోగలను. నాటి ప్రధాని పార్లమెంటులో ఇచ్చిన హామీలు, పార్లమెంటు చేసిన చట్టాలపై కూడా ఇసుమంత గౌరవం లేకుండా వ్యవహరిస్తూ బీజేపీ వారు ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చారు.

విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చటంలో మోడీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోయిన విషయం గమనార్హం. నాడు పార్లమెంటులో హడావుడి చేయటమే కాకుండా, 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో, ప్రచారంలో వాగ్దానం చేసి, స్వయంగా నరేంద్ర మోడీ గారు తిరుపతి సభలో ఏపీకి 10 సం.ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టంలోని అన్ని హామీలను తు చ తప్పకుండా నెరవేరుస్తామని ఘంటాపథంగా చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దారుణంగా మోసం చేసిన విషయాన్ని మీరు ఎన్నటికీ మరిచిపోలేరు. దానివల్ల ఏపీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్ధం చేసుకోవటమేగాక, ఈ విషయంలో బీజేపీ వారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా పలు సందర్భాలలో వ్యవహరించిన తీరుతో మీకు కలిగిన ఆవేదనని, ఆక్రోశాన్ని ఓ ప్రజాహితం కోరుకునే రాజకీయవేత్తగా నేను మీతో సరి సమానంగా పంచు కుంటున్నాను. 2016 జూన్ 9 వ తేదీన శ్రీమతి సోనియా గాంధీ గారి అధ్యక్షతన జరిగిన 9 రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని తీర్మానం చేశాం. ఎంతో ఆర్తితో, చిత్తశుద్ధితో ఆ తీర్మానం చేసిన ఆ సమావేశంలో నేను కూడా భాగస్వామిని అన్న విషయం మీకు సవినయంగా మనవి చేస్తున్నాను.

చేయటానికి అవకాశం ఉండి కూడా ఇబ్బందుల్లో వున్న, ఆర్ధిక లోటుతో సతమతమవుతున్న ఏపీని ఆదుకోకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగనామం పెట్టిన బీజేపీకి తెలుగు ప్రజలంతా తగిన రీతిలో బుద్ధి చెప్పగలరని ఆశిస్తున్నాను. ఇదిలా ఉండగా పేరులో 'సెక్యులర్' అని ఉన్నా ప్రజా వ్యతిరేక, ఉన్మాద బీజేపీతో కుమ్మక్కైన, బీజేపీకి 'బి' టీమ్ గా పనిచేస్తున్న జే.డి(ఎస్) వారి నిజ స్వరూపాన్ని గ్రహించి వారికీ తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. ఆ విజ్ఞత, చైతన్యం మన రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ఉందన్న విషయం నాకు తెలుసు. ఓ పక్క అవినీతి వ్యతిరేక జపం చేస్తూ మరో పక్క మైనింగ్ మాఫియా గాలి జనార్ధన్ రెడ్డి బృందంతో కర్నాటక అసెంబ్లీని నింపజూస్తున్న బీజేపీని ఎలా అర్ధం చేసుకోవాలో, ఎక్కడ ఉంచాలో మీకు తెలుసు. మొత్తంగా దేశంలో అరాచక పాలన సాగిస్తూ, ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతూ అధోగతి పాలు చేస్తున్న బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి కర్ణాటకలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ఈ ఎన్నికల్లో మరిచిపోలేని తీరున గుణపాఠం నేర్పాలని వినమ్రంగా కోరుతున్నాను.

గడిచిన 5 ఏళ్ల పాటు చిత్తశుద్ధితో కృషి చేసి మీకు ఎలా సుపరిపాలనను, అభివృద్ధి, సంక్షేమాలను అందించామో విజ్ఞులైన మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత ఐదేళ్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, రైతులు బడుగు బలహీన వర్గాలపై ప్రత్యేక శ్రద్ధను కొనసాగిస్తూనే...2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్య, ఐటీ రంగం, సుపరిపాలనపై దృష్టి సారించి ఆకాంక్షాయుత వర్గాల( aspirational sections) ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రతిన బూనుతున్నాము. మళ్లీ ఈ ఎన్నికల్లో కూడా ఆశీర్వదించి రాబోయే ఐదేళ్లు కూడా మీకు మరింతగా సేవ చేసే సదవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి, నాకు కల్పించవలసిందిగా వేడుకుంటున్నాను."

గాలి జనార్దన్ రెడ్డి... ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు... రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అక్రమ మైనింగ్ లో, ఒక పీకు పీకాడు... జగన్ సొంత కొడుకు అయితే, గాలి నా పెద్ద కొడుకు అంటూ అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చెప్తూ ఉండే వారు... అలాగే, జగన్ లక్ష కోట్లు కొట్టేస్తే, పెద్ద కొడుకు గాలి జనార్ధన్ రెడ్డి కొట్టేసిన అక్రమ మైనింగ్ లెక్క అంతా ఇంతా కాదు.. చివరకు ఇద్దరు కొడుకులు జైలుకు వెళ్లి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు అనుకోండి... అయితే, కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న వేళ, గాలి జనార్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చే విధంగా, సిబిఐ ప్రమాణ పత్రాలు ఇచ్చింది.. అది కూడా రహస్యంగా..

gali 01052018

అయితే, ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్, సిబిఐ ప్రమాణ పత్రాలు బయట పెట్టింది... 50 వేల కోట్లు... సాంకేతిక కారణాలతో కేసు కొట్టేసే విధంగా, సిబిఐ ప్రమాణ పత్రం దాఖలు చేసింది... గోవా, కర్ణాటకలో ఎప్పుడు మైనింగ్ చేసారో, ఎలా తరలించారో, చెప్పటం కష్టం అంటూ, సిబిఐ కోర్ట్ కు తెలిపింది... ఇలా చెప్తే, గాలి జనార్ధన్ రెడ్డి పై పెట్టిన కేసు వీగిపోతుంది అని , న్యాయవాదులు అంటున్నారు... అక్రమ మైనింగ్ లో దేశ సహజ సంపదను కొల్లగొట్టిన విషయం తెలిసిందే... అప్పట్లో, సిబిఐ, 50 వేల కోట్ల మేర, అవినీతి జరిగినట్టు నిర్ధారించింది కూడా... మరో పక్క, బెయిల్ ఇచ్చే విషయంలో, జడ్జికి లంచం కూడా ఇవ్వబోయి దొరికిపోయాడు గాలి.. ఇంత ఘన చరిత్ర ఉన్న గాలికి, ఇప్పుడు క్లీన్ చిట్ రానుంది...

gali 01052018

కర్ణాటక ఎన్నికలకు ముందే, గాలి జనార్ధన్ రెడ్డికి, తన కేసుల్లో క్లీన్ చిట్ ఇచ్చేందుకు, బీజేపీ పెద్దలు ప్రణాలిక సిద్ధం చేసినట్టు, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు, ఇవి ఊతం ఇస్తున్నాయి... ఎన్నికల ముందు, క్లీన్ ఇమేజ్ ఉంది అని చెప్పుకునే విధంగా, తద్వారా ఓటర్లను ప్రభావితం చెయ్యవచ్చు అనేది ఢిల్లీ పెద్దల ఆలోచన... మరో పక్క, ఇక్కడ గాలి తమ్ముడు అయిన, జగన్ కు కూడా ఇదే భరోసా ఉంది అని తెలుగుదేశం ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది... అందులో భాగంగానే విజయసాయి రెడ్డి, ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నారని ఆరోపించింది... అవసరమైతే, పార్టీని, బీజేపీకి ఇచ్చేయ్యటానికి కూడా జగన్ సిద్ధం అయ్యాడు... ఇలాంటి వారిని దగ్గరకు తీసుకుని, అవినీతి పై యుద్ధం చేస్తా అంటున్నారు మన ప్రధాని...

దుట్టా రామచంద్రరావు, గన్నవరం నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు... పోయిన ఎన్నికల్లో వల్లభనేని వంశీతో పోరాడారు... ప్రస్తుతం, వైకాపా రాష్ట్ర రాజకీయ సలహాదారుగా ఉన్నారు... సహజంగా, ఈయన వివాదాల జోలికి వెళ్లరు... ఆయన పని ఆయన చేసుకుంటూ, పార్టీ ఆదేశాలు ప్రకారమే నడుచుకుంటే ఉండేవారు... అయితే, అలాంటి నేత, నిన్న జగన్ చేసిన ప్రకటన పై తిరగబడ్డారు... ఇది పధ్ధతి కాదు అంటూ, హెచ్చరించారు.. సీనియర్లను సంప్రదించకుండా, ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తే ఎలా అనే ధోరణిలో, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్ పై విరుచుకు పడ్డారు.. నిర్ణయం వెనక్కు తీసుకోపోతే, తాము పార్టీకి రాజీనామా చేసి ఉద్యమబాట పడతామని రామచంద్రరావు హెచ్చరించారు.

jagan 01052018

ఇంతకీ విషయం ఏంటి అంటే, నిన్న జగన్ మోహన్ రెడ్డి, నిమ్మకూరులో పర్యటించారు... అది స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం.. అయితే, ఒక సామాజిక వర్గాన్ని మంచి చేసుకోవటానికి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాను అంటూ, ఎన్టీఆర్ పై ఎక్కడ లేని ప్రేమ చూపించారు... ఎన్టీఆర్ ను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు అని, ఆయన సేవలకు గుర్తింపుగా, కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు మారుస్తా అంటూ ఒక తలతిక్క ప్రకటన చేసారు... అయితే, ఈ ప్రకటన పై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి... మీ నాన్న, ఎన్టీఆర్ పేరును కనీసం ఒక ఎయిర్ పోర్ట్ కు పెట్టలేదు, నువ్వు వచ్చి ఒక జిల్లాకు పెడతావా ? ఆ మహానుభావుడుని, ఒక జిల్లాకు పరిమితం చేస్తావా అంటూ విమర్శలు వచ్చయి...

jagan 01052018

అయితే, ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఎదురుతిరుగుతున్నారు.. పైగా, ఎప్పుడూ కూల్ గా ఉండే, దుట్టా రామచంద్రరావు లాంటి వారు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.. ఎంతోమందికి జీవనాధారమైన కృష్ణా నది పేర ఏర్పడిన జిల్లా పేరు మార్చితే సహించేది లేదని రామచంద్రరావు అన్నారు. కృష్ణమ్మ ఎన్నో రాష్ట్రాలు దాటుకుని ఏపీలో ప్రవహిస్తోందని... కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తోందని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ కూడా కృష్ణా పేరుతో జిల్లా లేదని... మన రాష్ట్రంలో మాత్రమే ఉందని, అలాంటి మహా తల్లి పేరును మారిస్తే సహించబోమని హెచ్చరించారు. ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉన్నప్పుడు విగ్రహాలు పెట్టుకోవాలని, స్మారక భవనాలు కట్టుకోవాలని... జిల్లా పేరును మార్చడానికి మాత్రం ఒప్పుకోబోమని తెలిపారు. పేరు మార్పు హామీని జగన్‌ ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. ఒకవేళ జగన్‌ తన నిర్ణయం మార్చుకోకపోతే తాము పార్టీకి రాజీనామా చేసి ఉద్యమబాట పడతామని రామచంద్రరావు హెచ్చరించారు.

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో అగ్రెసివ్ గా పోస్ట్ లు పెడుతున్నారు... మొన్నటి దాకా జనసేన ట్విట్టర్ ఎకౌంటు నుంచి తన పై వచ్చిన విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు... అయితే, తాజాగా బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల పై, గల్లా పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి ట్వీట్ చేసారు.. గత రెండు రోజుల నుంచి బీజేపీ నేతలు, చంద్రబాబు మార్ఫింగ్ వీడియోలు ప్లే చేస్తున్నారని, మోడీ ఏ నాడు ప్రత్యెక హోదా ఇస్తామని కాని, చంద్రబాబు చూపిస్తున్నట్టు ఆ వీడియోలో అసలు మోడీ అలా మాట్లాడలేదు అంటూ, తల తిక్క విమర్శలు చేస్తున్నారు... బీజేపీ విమర్శలు ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది... ఈ విషయం పై గల్లా ట్వీట్ చేసారు...

galla 01052018 1

మోదీ ప్రసంగానికి సంబంధించి మార్ఫింగ్ చేసిన వీడియోలతో ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన ఆ కథనాన్ని గల్లా జయదేవ్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ట్వీట్ చేశారు. ‘‘పవన్ కల్యాణ్ గారూ.. ఆ సభలో మీరు కూడా ఉన్నారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో తెలిసినప్పుడు మాట ఇచ్చి ఎందుకు వెనక్కి తగ్గారని మీరే నేరుగా మోదీని నిలదీయొచ్చు కదా!. ఆ రోజు జరిగిన దానికి మీరే సాక్ష్యం. మీరే చెప్పండి ఇవి మార్ఫింగ్ వీడియోలా?’’ అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. మరి దీని పై, పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తారో, లేక జనసేన రిప్లై ఇస్తుందో కాని, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అయితే, మోడీని, బీజేపీని ఎక్కడా విమర్శలు చెయ్యటం లేదు..

galla 01052018 1

మరో పక్క, చంద్రబాబు విమర్శలు ఎలా బదులు ఇవ్వాలో తెలియక, బీజేపీ నేతలు కొత్త పంధా ఎత్తుకున్నారు... అసలు మోడీ, ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏ హామీ ఇవ్వలేదు అని, చంద్రబాబు మార్ఫింగ్ వీడియోలు ప్రజలకు చూపిస్తున్నారు అంటూ, ఎదురు దాడికి దిగుతున్నారు.. మరీ ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారు... ఏ హామీ ఇవ్వనప్పుడు, ప్రత్యెక హోదా, మీ వెంకయ్య చలువే అని మోడీ ఎందుకు చెప్పారు ? అయినా మార్ఫింగ్ అనేది అతి పెద్ద నేరం... మార్ఫింగ్ చేసినట్టు రుజువు అయితే, 3 ఏళ్ళ పైనే జైలు శిక్ష పడుతుంది.. మరి వెళ్లి కోర్ట్ లో, చంద్రబాబు మీద కేసు వెయ్యచ్చుగా ? టీవీ9 ఛానల్, ఇలాగే పవన్ కళ్యాణ్, మా ఛానల్ వీడియో మార్ఫింగ్ చేసారని కేసు పెట్టింది... మీరు, అదే పని చెయ్యవచ్చుగా ?

Advertisements

Latest Articles

Most Read