గత 5 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ హయంలో, ఎలాంటి విష ప్రచారాలు జరిగినియ్యో అందరికీ తెలిసిందే. 5 ఏళ్ళలో అన్ని కులాలను విడగొట్టి, తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తూ, నడిపిన క్యాంపైన్ ఎంతో సక్సెస్ అయ్యింది. సరైన టైంలో తెలుగుదేశం పార్టీ ఆ విష ప్రచారాన్ని తిప్పి కొట్టలేక పోవటంతో, ఏకంగా ఆ కులాల్లో చీలిక వచ్చి, అధికారమే కోల్పోవాల్సి వచ్చింది. సినిమాల దగ్గర నుంచి, ప్రతి విషయంలోనూ కులాన్ని లాగి, ఒక విష సంస్కృతిని తీసుకు వచ్చారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీలకు గ్యాప్ వచ్చేలా కూడా పని చేసారు. ఇందులో ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానెల్, పేపర్ ఆ పనికి లీడ్ తీసుకుంటే, కొన్ని వెబ్ సైట్స్ అదే పనిగా విషయం చిమ్మాయి. ఇవి తీసుకుని, సోషల్ మీడియాలో ఒక ప్రణాళిక ప్రకారం ప్రచారం చేసారు. తెలుగుదేశం పార్టీకి జరగాల్సిన నష్టం జరిగింది.

lokesh 19082019 2

అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా, ఇలాంటి విష ప్రచారమే చేస్తున్నారు. అయితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మారింది. విష ప్రచారం చేస్తుంటే, వెంటనే ఖండిస్తున్నారు. తాజగా, ప్రభాస్ సాహో సినిమా పై, విషం చిమ్మే ప్రయత్నం జరుగుతుంది. తన సినిమా ప్రమోషన్లో భాగంగా, ప్రభాస్ ఒక తమిళ వెబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంలో, అక్కడ యాంకర్, కొన్ని పేరులతో ఉన్న కార్డ్స్ పెట్టి, ఒక్కో కార్డు తియ్యమని ప్రభాస్ ని కోరారు. ఆ కార్డు మీద ఎవరి పేరు అయితే ఉంటుందో, వారి గురించి అభిప్రాయం అడిగారు. అలా కొంత మంది పేరులతో ఉన్న కార్డ్స్ తీసిన తరువాత, జగన్ పేరు కూడా వచ్చింది. యాంకర్ మాట్లాడుతూ, జగన్ ఇప్పుడు పొలిటికల్ బాహుబలి కదా, మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. దానికి ప్రభాస్ స్పందిస్తూ, నాకు పాలిటిక్స్ గురుంచి పెద్దగా తెలియదు, i "think" he will do very good. He is a young CM. I think AP will be very beautiful. Let's wait and see అని అన్నారు.

lokesh 19082019 3

అయితే ప్రభాస్, జగన్ ని పొలిటికల్ బాహుబలి అన్నారు అంటూ వైసీపీ ప్రచారం చెయ్యటంతో, కొంత మంది ఓవర్ గా రియాక్ట్ అయ్యే తెలుగుదేశం కార్యకర్తలు, ప్రభాస్ పై కొంత కోపగించుకుంటూ పోస్ట్ లు పెట్టారు. గతంలో కృష్ణంరాజు చంద్రబాబుని తిట్టారు అంటూ, అదీ ఇదీ కలిపి కొన్ని పోస్ట్ లు పెట్టారు. అయితే, దీనికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది. కాని, వైసిపీకి అనుకూలంగా ఉండే ఓక వెబ్ సైట్ మాత్రం, ఇదంతా తెలుగుదేశం ప్లాన్ అని, ప్రభాస్ సినిమా ఫ్లోప్ చెయ్యటానికి తెలుగుదేశం ప్లాన్ చేస్తుందని రాసారు. అయితే, ఈ విష ప్రచారం వెనుక, రాజులను, తెలుగుదేశం పార్టీకి దూరం చెయ్యాలనే కుట్ర ఉంది. ఇది గ్రహించిన తెలుగుదేశం పార్టీ వెంటనే స్పందించింది. నారా లోకేష్ దీని పై ట్వీట్ చేస్తూ, ఆ వెబ్ సైట్ మాడు పగిలేలా స్పందించారు. ఈ అబద్ధాలు రాసిన నకిలీ జర్నలిస్టు సిగ్గుపడాలి. కుల విభజన, విద్వేషం నింపి సంపాదించిన సొమ్ముతో తిండి ఎలా తింటున్నారు? మీకు మనస్సాక్షి అనేదే లేదా?. సాహో ఓ భారీ బడ్జెట్ చిత్రం. ఈ అద్భుతమైన సినిమాను చూడ్డానికి ప్రభాస్ ఫ్యాన్స్ లాగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. సాహో చిత్రాన్ని ప్రభాస్ ఫ్యాన్సే కాదు, టీడీపీ కార్యకర్తలు కూడా చూసి, ఆ పనికిమాలిన కథనాన్ని తిప్పి కొట్టండి" అంటూ ట్వీట్ చేశారు. దీని పై , బాగా బుద్ధి చెప్పారు అంటూ టిడిపి అభిమానులు, ప్రభాస్ ఫాన్స్, లోకేష్ చర్యను మెచ్చుకుంటున్నారు.

వరద అంచనా కోసం అంటూ, రెండు రోజుల పాటు, కేవలం చంద్రబాబు ఇంటి పైన డ్రోన్లు ఎగరేస్తూ, రెండో రోజు పట్టుబడిన మనుషులు, మమ్మల్ని జగన్ పంపించారని ఒకసారి, జగన్ ఇంట్లో ఉండే కిరణ్ పంపించారని ఒకసారి చెప్తూ, పట్టుబడ్డారు. అయితే ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎన్ఎస్జీ భద్రతలో ఉండే చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరేస్తూ, ఎన్ఎస్జీ పర్మిషన్ తీసుకోక పోవటం, అలాగే ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వదలటం వంటి అంశాల పై తెలుగుదేశం తీవ్రంగా పరిగణించింది. ఒక పక్క చంద్రబాబు భద్రత తగ్గిస్తూ, మరో పక్క, ఇలా ఆయాన ఇల్లు, అన్ని ఆంగెల్స్ నుంచి వీడియో తీసి, బయటకు వదిలారని, దీంట్లో కుట్ర కోణం ఉందని, జగన్ ఇంట్లో ఉండే కిరణ్ ఎవరో తేలాలి అని, తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.

sawang 19082019 2

అయితే ఈ విషయం పై చంద్రబాబు కూడా, డీజీపీకి ఫోన్ చేసి వివరణ అడిగారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటే, ఏమి చేస్తున్నారని నిలదీశారు. ఈ మొత్తం అంశం పై, డీజీపీ ఈ రోజు స్పందించారు. చంద్రబాబు ఇంటి పై డ్రోన్ ఎగిరిన విషయం పై, ఎలాంటి కుట్ర లేదని తేల్చి చెప్పారు. ఇరిగేషన్ డిపార్టుమెంటు వాళ్ళు, డ్రోన్ వీడియో తీసారని చెప్పారు. అయితే, ఈ విషయం పై లోకల్ పోలీసులకు చెప్పకపోవటంతో, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, ఆ రోజు ఏమి జరుగుతుందో, ఎవరికీ తెలియలేదని అన్నారు. ఇక పై ఎవరైనా డ్రోన్ ఎగరెయ్యాలి అంటే, కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. స్థానిక పోలీసుల పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలని, లేకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

sawang 19082019 3

మరో పక్క తెలుగుదేశం పార్టీ మాత్రం, ఈ అంశం పై దూకుడుగా వెళ్తుంది. ఇప్పటికే ఈ విషయం పై గుంటూరు ఐజీని కలిసి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేసారు. ఈ రోజు గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ ను కూడా కలిసి ఫిర్యాదు చేసారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు,అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని సహా ఇతర ముఖ్య నేతలు, గవర్నర్ ను కలిసి, అక్కడ జరిగిన విషయం పై క్లారిటీ ఇచ్చారు. అలాగే వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని, వారిని ఆదుకోవాలని కోరారు. అలాగే, చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరేసిన ఘటనపై ప్రయివేట్ కేసు దాఖలు చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఈ రోజుల్లో రాజకీయ నాయకులకు కృతజ్ఞత అనేది చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు విషయంలో అది మరీ తక్కువ అనే చెప్పాలి. ఆయన గ్రహపాటు అలాంటిదో ఏమో కాని, ఆయన వల్ల లాభపడిన అనేక మంది, ఆయన వల్ల రాజకీయంగా ఎదిగిన అనేక మంది, ఆయన్నే ఎదురు తిడతారు. ఇప్పుడు జగన్ క్యాబినెట్ తీసుకోండి, స్పీకర్ తమ్మినేని, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్, ఇంకా ఎంతో మంది ఎమ్మెల్యేలు, చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష. జూనియర్ ఎన్టీఆర్ రికమెండ్ చేస్తే, రాజకీయాల్లోకి వచ్చిన కొడాలి నాని, ఈ రోజు చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టటం చూస్తున్నాం. ఇక తెలంగాణాలో అయితే, అక్కడ ముఖ్యమంత్రి నుంచి 90 శాతం, చంద్రబాబు స్కూల్ లో నుంచి వచ్చిన వాళ్ళే. ఈ రోజు చంద్రబాబుని ఎలా తిడుతున్నారో చూస్తున్నాం. అయితే, ఇందుకు భిన్నంగా, ఈ రోజు తెలంగాణాలో పరిస్థితి నడుస్తుంది.

bjp 18082019 2

తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తూ, చంద్రబాబుని వదిలి వెళ్తున్నందుకు ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. రెండేళ్ళ క్రితం రేవంత్ రెడ్డి కూడా, ఇలాగే చంద్రబాబుని వదిలి వెళ్తూ, ఆయన పెట్టిన రాజకీయ భిక్షని గుర్తు చేసుకుంటూ, భావోద్వేగంతో పార్టీని వీడారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిన సీతక్క కూడా, ఇప్పటికీ చంద్రబాబు అంటే అభిమానం చూపిస్తూ, ఆయనకు రాఖీ కడుతూ ఉంటారు. అయితే ఈ రోజు, హైదరాబాద్ లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ముందే, చంద్రబాబు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు కొంత మంది నాయకులు. ఈ రోజు తెలంగాణా తెలుగుదేశం నాయకులు కొంత మంది, బీజేపీలో చేరారు. ఈ సందర్భంలో, రాజ్యసభ ఎంపీ గరికపాటి, మహిళా నాయుకులు శోభారాణి, పాల్వాయి రజనీ కుమారి, చంద్రబాబుని తలుచుకుని భావోద్వేగానికి గురైయ్యారు.

bjp 18082019 3

శోభారాణి, రెండు రోజుల క్రిందట చంద్రబాబుకి లేఖ రాసి, అధ్యక్షా అర్ధం చేసుకోండి, మీరు నాకు రాజకీయ జీవితం ఇచ్చారు, మిమ్మల్ని వదిలి వెళ్తున్నా అని అన్నారు. అలాగే ఈ రోజు మీటింగ్ లో కూడా మహిళా నేత పాల్వాయి రజనీ కుమారి కూడా, బీజేపీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబును వదిలిపోతున్నందుకు నోట మాటరావడం లేదని ఆమె ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ఇక గరికపాటి మోహన్ రావ్ అయితే, తెలంగాణాలో తెలుగుదేశం పరిస్థితి ఇలా అవ్వటానికి, అక్కడ చాలా మంది ఉన్నారని, చంద్రబాబు తప్పు ఏమి లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండగా చేసినా ఉద్యమాలు, బాబ్లీలో వీపులు పగులగొట్టించుకున్నామని, చంద్రబాబుతో కలిసి చేస్తున్న పాదయాత్రని తలుచుకుని, పార్టీ గొంతుకోయాలనుకునే వాళ్లు వేరే ఉన్నారని, వాళ్ల తీరును తాను ప్రశ్నిస్తున్నానని గరికపాటి మోహన రావు ఉద్వేగానికి లోనయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి, బీజేపీలోకి వలసలు మళ్ళీ మొదలయ్యాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో, నలుగుర రాజ్యసభ ఎంపీలు పార్టీ మారిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి, బీజేపీ పార్టీ, అదిగో ఇదిగో, అందరూ వచ్చేస్తున్నారు అంటూ హడావిడి చేసినా, ఎవరూ బీజేపీలో చేరలేదు. అయితే నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణాలో పర్యటన చేసారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. అయితే, ఇప్పటికే బీజేపీలో చేరిన సియం రమేష్, రాయలసీమలో బలమైన నేతలను బీజేపీలో చేర్పించే ప్రయత్నాల్లో భాగంగా, తెలుగుదేశం పార్టీ బిగ్ షాట్ అయిన, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని సంప్రదించి, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దృశ్యా, ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారు.

aadi 19082019 2

ఎన్నికల తరువాత రాజకీయ దాడులు పెరగటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతల పై, వైసిపీ చేస్తున్న దాడులతో, గ్రామాల్లో వాతావరణం చాలా ఉద్రిక్తతగా ఉంది. ఈ నేపధ్యంలోనే, రాయలసీమలో ప్రత్యర్ధుల పై దాడులు పెరిగాయి. ఆదినారాయణ రెడ్డి మెయిన్ టార్గెట్ అయ్యారు. ఈ రాజకీయ ఒత్తిళ్ళు నేపధ్యంలో, తెలుగుదేశం పార్టీలో కంటే, కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీలో చేరితే, తన వర్గాన్ని ఈ దాడులు నుంచి కాపాడుకోవచ్చని, ఆదినారయణ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆ దిశగా అలోచన చేసినా, ఎందుకో కాని ఆయన పార్టీ మారలేదు. ఇప్పుడు సియం రమేష్ మంత్రాంగం నడపటంతో, పార్టీ మారి, వైసిపీ రాజకీయ దాడులు నుంచి తన వర్గాన్ని కాపాడుకోవచ్చని, ఆది భావిస్తున్నారు.

aadi 19082019 3

ఈ నేపధ్యంలోనే, నిన్న హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆది నారాయణ రెడ్డి కలిసారు. సియాం రమేష్ దగ్గరుండి, తీసుకెళ్ళారు. అయితే, పార్టీ మారే విషయం మాత్రం, ఇంకా ఆది నారాయణ రెడ్డి ప్రకటించలేదు. గత ఎన్నికల్లో ఆది నారాయణ రెడ్డి, కడప ఎంపీగా పోటీ చేసి, ఓడిపోయారు. రామసుబ్బారెడ్డితో ఉన్న విభేదాలు పక్కన పెట్టి, చంద్రబాబు మాట విని, కలిసి పని చేసారు. అయినా అటు రామసుబ్బారెడ్డి, ఇటు ఆది నారాయణ రెడ్డి, ఇద్దరూ ఓడిపోయారు. మంత్రిగా ఉండగా, కడప జిల్లాలో, జగన్ కు సవాల్ విసురుతూ రాజకీయం చేసారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి రావటంతో, వైసీపీ నుంచి అన్ని విధాలుగా ఒత్తిడులు ఉండటం, రాజకీయ దాడులు, ఇవన్నీ తట్టుకునే శక్తి లేక, బీజేపీలో చేరారు. అటు బీజేపీ కూడా, జగన్ ను రాజకీయంగా ఎదుర్కోవటానికి, కోస్తాలో కమ్మ, కాపు సామజివర్గాన్ని, సీమలో రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గరకు తీస్తుంది.

Advertisements

Latest Articles

Most Read