తెలంగాణలో పార్టీల బలాబలాలపై ఏఐసీసీ పలు సర్వేలు చేయించింది. దీనికి సంబంధించి కీలకమైన సమాచారం పార్టీ అధినేత రాహుల్ గాంధీ వద్ద ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఐఏసీసీ దూతలు.. కాంగ్రెస్‌తో పాటు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై అంతర్గత సర్వే నిర్వహించారు. 35 నియోజకవర్గాల్లో గెలుపు నల్లేరుమీద నడకే అని సర్వేలో తేలినట్లు సమాచారం. ఈ స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుస్తారని సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. 35 నియోజకవర్గాల్లో ఎక్కువగా టీడీపీ బలంగా ఉందని సర్వేలో తేలినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

rahul 01112018

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వారు పార్టీ మారినప్పటికీ.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉనట్లు సమాచారం. అదేవిధంగా పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని నివేదికలో వెల్లడైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల జాబితాను పార్టీ నాయకులు ప్రత్యేకంగా రాహుల్ గాంధీకి అందజేశారు. సర్వే నివేదిక, మహాకూటమి పొత్తులు, తాజా పరిస్థితిపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లారు. సర్వేలో తేలిన 35 సీట్లలో గెలుపు ఖాయం కాబట్టి.. మరో 25 స్థానాలపై దృష్టి సారిస్తే అధికారం ఖాయం అని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

rahul 01112018

కాంగ్రెస్ సర్వేలో టీడీపీ బలంగా ఉందని తేలిన నియోజకవర్గాలు ఇవే... దేవరకద్ర, మక్తల్, వనపర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, పటాన్‌చెరు, జహీరాబాద్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, సిర్పూర్, ఖానాపూర్, జగిత్యాల, పెద్దపల్లి, నర్సంపేట్, ములుగు, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి, ఆలేరు, ఉప్పల్, ఎల్‌బీ నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, సనత్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది.

 

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సాయం ప్రకటించింది. రాష్ట్రానికి ఆర్ధిక సాయంగా 229 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అక్టోబర్ 11న తిత్లీ తుపాను కారణంగా విజయనగరం, శ్రీకాకుళం అతలాకుతలమయ్యాయి. దీంతో కేంద్రం సాయం ప్రకటించాలని ఏపీ సర్కారు కోరింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఈ సాయాన్ని విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి ఈ సాయాన్ని విడుదల చేశారు. కేంద్ర విపత్తు సహాయనిధి నుంచి రాష్ట్ర విపత్తు సహాయనిధికి ఈ నిధులు వచ్చాయి.

cycone 0112018

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా నిధులను ఖర్చు చేసేందుకు కేంద్రం అవకాశమిచ్చింది. తుపాను ధాటికి నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయని, వారిచ్చిన నివేదిక ఆధారంగా మరిన్ని నిధుల విడుదలకు అవకాశమున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. తిత్లీ తుపాను ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొబ్బరి, జీడి, మామిడి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపాను బాధితులకు తక్షణ సాయంగా రూ.1200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖరాసిన విషయం తెలిసిందే.

cycone 0112018

ఆ లేఖలో ‘రూ.1200 కోట్ల తక్షణ సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఈ నెల 13న మీకు నిదేదిక అందజేశాం. తుపాను నష్టం ప్రాథమిక అంచనాలు రూ.3,435.29 కోట్లుగా పేర్కొంటూ ఈ నెల 15న కేంద్ర హోం మంత్రికి, హోం శాఖ కార్యదర్శికి నివేదికలు ఇచ్చాం. తక్షణ సాయం ప్రకటించాలని నేను పదే పదే విజ్ఞప్తి చేసినా మీ కార్యాలయం నుంచి కనీస స్పందన లేకపోవడం, పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్రం ఎలాంటి బృందాన్ని పంపించకపోవడం విచారకరం. కేంద్రం ఇప్పటికైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన తక్షణ సహాయం ప్రకటించాల్సిన అవసరం ఉంది. తుపాను వల్ల దెబ్బతిన్న 2.25 లక్షల కుటుంబాలకు సహాయ, పునరావాస కార్యక్రమాలు అమలు చేసేందుకు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు రూ.1,200 కోట్ల తక్షణ సాయం ప్రకటించాల్సిందిగా మరోసారి కోరుతున్నాను’’ అని ఆ లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

జీవీఎల్‌ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నారని హీరో శివాజీ మండిపడ్డారు. మట్టి తప్ప ఏమీ లేని రాష్ట్రంలో లక్ష కోట్లు దోచుకుంటున్నారని జీవీఎల్‌ విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన అమెరికా నుంచి మాట్లాడారు. ‘‘కేంద్రాన్ని నిలదీయాల్సిన అంశాల్లోనూ రాష్ట్రాన్నే నిందిస్తున్నారు. హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని ఎందుకు విమర్శించడం లేదు?. ఇలాంటి విషయాల్లోనే ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రాన్ని ఎందుకు చొక్కా పట్టుకొని అడగడం లేదు.’’ అని శివాజీ అన్నారు.

lakshmiparavathi 31102018 2

వైసీపీ, జనసేన, బీజేపీ త్వరలో కలిసిపోతారేమోనని హీరో శివాజీ అనుమానం వ్యక్తం చేశారు. ‘గుమ్మడికాయ దొంగల్లా విడివిడిగా ఉండడం ఎందుకు?. జగన్‌ ఎపిసోడ్‌...ఆపరేషన్‌ సక్సెస్‌..పేషెంట్‌ డెడ్. నన్ను టార్గెట్‌ చేసిన వాళ్లు అబాసుపాలవుతారు. ఏపీ పోలీసులపై జగన్‌ నమ్మకం లేదనడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఏపీ విషయంలో కాంగ్రెస్‌ రియలైజ్ అయింది. అందుకే అధికారంలోకి రాగానే హోదా ఇస్తామంటోంది. ఆపరేషన్‌ గరుడపై నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతోంది. ఆపరేషన్‌ గరుడను ప్రజలు నమ్ముతున్నారు.’’ అని శివాజీ అన్నారు.

lakshmiparavathi 31102018 3

ఎన్నికల్లో పోటీ చేయాలని తనకు లేదని హీరో శివాజీ స్పష్టం చేశారు. ఒకవేళ పోటీ చేస్తే బీజేపీ అధ్యక్షుడిపై ఇండిపెండెంట్‌గా చేస్తానని ఆయన వెల్లడించారు. ‘‘ఓ జాతీయ పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని ఆహ్వానించింది..తిర్కసరించాను. ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు పోరాటాన్ని ఆహ్వానిస్తున్నా. హోదాపై నాడు టీడీపీని విమర్శించిన మాట వాస్తవం. తిట్టమంటే తిట్టడానికి పొగడమంటే పొగడటానికి నేనెవరీ చెంచాను కాదు. వైసీపీ, బీజేపీలకు భయపడే వ్యక్తిని కాదు.’’అని అన్నారు.

విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిపై సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. తనపై నెపం మోపడం వల్లే తాను ప్రతిపక్ష నేత జగన్‌ను పరామర్శించడానికి ఫోన్ చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కోడి కత్తి దాడితో ఏపీ ప్రభుత్వానికి ఏమిటీ సంబంధమని ప్రశ్నించారు. గవర్నర్ డీజీపీకి ఫోన్ చేస్తారని, బీజేపీ నన్ను ఏ-వన్ అంటుందని ఆరోపించారు. దాడి చేస్తే జగన్‌పై సానుభూతి వస్తుందని భావించానని నిందితుడే చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. బై ఎలక్షన్ వచ్చుంటే వైసీపీ ఎంపీ స్థానాలన్నీ టీడీపీ కైవసం చేసుకునేదని జోస్యం చెప్పారు.

jagan 0112018

అమరావతిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సభ్యత్వ రుసుంను కార్యకర్తలు తమ జేబు నుంచి చెల్లించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు సభ్యత్వ రుసుం చెల్లించిన 2 నిమిషాల్లోనే తనకు తెలుస్తుందన్నారు. ప్రకృతి సేద్యాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రోత్సహించాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసం చేసింది కనుక మోదీ ఆదుకుంటారని భావించామన్నారు.

 

jagan 0112018

కేంద్రంతో విభేదించామని, అందువల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తప్పడు విధానం వల్ల సీబీఐ పరువుపోయిందన్నారు. అవిశ్వాసం పెడితే పార్లమెంట్ సాక్షిగా సన్మానం చేస్తామంటూ మోదీ వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. మరో పక్క, తనపై జరిగిన దాడి కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కుట్ర కోణం బయటపడేలా విచారణ జరగడం లేదని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసారు. ఈ పిటిషన్ లో సీఎం చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisements

Latest Articles

Most Read