రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయాదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖకు సమాధానం ఇస్తూ, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆమె రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ మూడు పేజీల లెటరులో ఎన్నికలను ఎందుకు వాయిదా వేయవలసి వచ్చిందో వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిని నమీక్షించి, అవసరమను కుంటే ఆరువారాలకన్నా ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోను, రాజ్ భవన్లో పైనాన్స్ వ్యవహరాల నిర్వహణలో పనిచేసిన అనుభవం తన కుందన్నారు. గతంలో ఎన్ని కలు నిలిపివేసినా కేంద్రం నిధులు వచ్చిన సందర్భాలున్నాయన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్ప టికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేసారన్నారు. గోవాలోను స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేసే విష యాన్ని చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రాంట్లు, నిధుల విడుదల విషయంలో అవగాహన ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారం ఉంటుందన్నారు.

నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శితో సంప్రదింపులు జరిపానన్నారు. వారి సూచనలు,హమీతో ఎన్ని కలు వాయిదా వేసామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నానన్నారు. అందరి కంటే ముందు నిర్ణయం తీసుకోవడం వల్లే విమర్శలు వచ్చాయన్నారు. కరోనా వైరస్ వివిధ దశల్లో వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడితే ఆరువారాల కంటే ముందే ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధమన్నారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ఆరువారాల తరువాత వరిస్థితులను సమీక్షి స్తామన్నారు. ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు ముడిపెట్టవద్దని సూచించారు. జరిగిన పరిస్థితులపై అపార్థాలకు తావులేకుండా ఉండేందుకే సీఎస్ కు లేఖ రాసినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం వాయిదా వేసారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.కరోనా వైరసే సాకుతో ఎన్నికలువాయిదా వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహరంలో ఎంతవరకైనా వెళుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయంపై ఆయన గవర్నర్‌ను కలుసుకుని ఎన్నికల కమీషనర్ పై ఫిర్యాదు చేసారు. ఈ పరిణామాల నడుమ రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ నీలం సాహ్ని ఎన్నికల అధికారి రమేష్ కుమార్‌కు లేఖ రాసారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని, నియంత్ర ణకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆ లేఖలో వివరించారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఉవసంహరించుకోవాలని విజృప్తి చేసారు. ముందుగా ప్రకటించిన తేది ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నీలం సాహ్ని రాసిన లేఖకు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖలో జాతీయ వివత్తుగా కరోనాను కేంద్రం ప్రకటించినందున ఆ దిశలోనే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వాయిదా వేసినట్టు స్పష్టం చేసారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదాపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్లో ప్రస్తావించిన అంశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఎన్నికల నిర్వహణ అంశంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష కూడా నిర్వహించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ఎన్నికలు వాయిదా వేయడానికి కరోనాను ఒక సాకుగా వాడుకున్నారని, నిజానికి కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా అవసరమని, ఎన్నికలు జరిగితేనే కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యలకు ఊతమిచ్చినట్టవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రస్తావించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఎన్నికలను నిర్వహిస్తుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టును సైతం సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. అందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయాలని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించేలా ఆదేశాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొబ్డే ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. అయితే, ప్రభుత్వ పిటీషన్ పై, రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కెవియట్ పిటిషన్​ను సుప్రీంలో దాఖలు చేసింది. తమ వాదన కూడా వినాలని.. తరువాతే నిర్ణయం తీసుకోవాలని పిటిషన్​లో కోరింది.

ఇక మరో పక్క, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ ప్రకటించడంపై హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. కరోనా వైరస్ ప్రభావం దేశమంతటా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే జరిపించాలని కోరుతూ తాండవ యోగేష్, జనార్దన్ అనే వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు నెల్లూరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాయిదా వేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని ఆయన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని పిటిషన్ తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

మరోవైపు కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేశారని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం కూడా తీసుకోలేదని, కనుక ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని ప్రభుత్వం వివరించింది. అయితే ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. మరో పక్క, స్థానిక సంస్థల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో వలంటీర్లను ఉపయోగిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వివరించారు. అయితే వలంటీర్లు ప్రచారం చేస్తున్నారన్న అభియోగంపై ప్రభుత్వానికి అందిన సమాచారాన్ని పరిశీలించడం జరిగిందని, అలా చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం సమగ్ర సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.

మా-చ-ర్ల-లో తమపై హ-త్యా-య-త్నం జరిగినప్పుడే, దా-డి-కి పాల్పడిన వారి వివరాలను మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేశామని, కానీ డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీనేతల కాల్ డేటాను పరిశీలించాల్సి ఉందని చెప్పడం చూస్తుంటే, తమపై జరిగిన హ-త్యా-య-త్నం ఎందుకు సఫలీకృతం కాలేదన్నబాధ పోలీసుల్లో ఉన్నట్లుగా అనిపిస్తోందని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుమానం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. తమపై జరిగిన హ-త్యా-య-త్నం-లో తమ కాల్ డేటాను పరిశీలిస్తామంటున్న డీజీపీ, దానితో పాటుగా మాచర్ల సీఐ, ఎస్సై, తమపై దా-డి చేసిన తురకా కిశోర్, గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విజయరావు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాల్ డేటాను కూడా పరిశీలించాలని ఉమా డిమాండ్ చేశారు. మాచర్ల సీఐ తాము ఎటువెళుతోంది, ఎక్కడుంది వంటి వివరాలను బయటకు వెల్లడించాడని, స్థానిక పోలీసుల సహాయసహాకారాలవల్లే తమపై దా-డి జరిగిందని బొండా తేల్చిచెప్పారు. తమపై అంతతీవ్ర స్థాయిలో హ-త్యా-య-త్నా-నికి పాల్పడితే, దానిపై తొలుత కేవలం రెండు కేసులు నమోదయ్యాయని, నిందితులకు శిక్ష పడేలా కఠినమైన సెక్షన్స్ పెట్టకుండా, తూతూమంత్రంగా కేసులు పెట్టి, నామ్ కే వాస్తేగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారన్నారు. తమపై జరిగిన హ-త్యా-య-త్నం, పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ కి ఫిర్యాదు చేశాక, అప్పుడు నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లకింద కేసులు నమోదు చేశారన్నారు.

సీఆర్పీసీ సెక్షన్ -160 కింద తమకు నోటీసు ఇచ్చి, విచారణ కోసం మాచర్ల రావాలని చెప్పడం జరిగిందన్నారు. ఒకసారి హ-త్యా-య-త్నం చేస్తే, తాము తప్పించుకున్నాము కాబట్టి, తిరిగి మరోసారి తమను హ-త-మా-ర్చా-ల-న్న ఉద్దేశంతోనే మళ్లీ మాచర్ల రమ్మంటున్నట్లుగా అనిపిస్తోందన్నారు. పోలీసలు తమకు పంపిన నోటీసుచూస్తుంటే, మమ్మల్ని హ-త-మా-ర్చ-డా-ని-కి మాచర్లలో అన్నిఏర్పాట్లు చేసుకున్నట్లుగా అర్థమవుతోందన్నారు. పోలీస్ వ్యవస్థ వైసీపీ జెండాలు చేతపట్టి, ఆపార్టీ చొక్కాలు వేసుకొని పనిచేస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. తమపై హ-త్యా-య-త్నం చేసిన కిశోర్, మరి కొందరిని ఎవరు పంపారు.. తమపై దా-డి చేయమని వారికి ఎవరు చెప్పారు... తాము మాచర్లకు వస్తున్నట్లుగా వారికి చెప్పిందెవరు... వారి వెనకున్నదెవరో చెప్పాలన్నారు. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి, ఇద్దరూ పథకం ప్రకారమే, ప్రణాళికబద్దంగా తమపై హ-త్యా-య-త్నం చేయించారని బొండా ఆరోపించారు. మాచర్లలో తమను చం-పి-తే, ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికలపై పడుతుంది తద్వారా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎన్నికల్లో పోటీకి టీడీపీ వారు ముందుకు రాకుండా చేయొచ్చనే సందేశం రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలన్న ఆలోచనతోనే తమపై దా-డి-కి పాల్పడ్డారన్నారు.

తనస్వార్థంకోసం, తాననుకున్నది నెరవేర్చుకోవడం కోసం ముఖ్యమంత్రి ఎంతకైనా తెగిస్తున్నాడన్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసుపై తమ అభిప్రాయం తెలియచేశామని, గుంటూరు పోలీసులపై తమకు నమ్మకంలేదని, తమ పర్యటనవివరాలను స్థానిక ఎమ్మెల్యేకు, అతని సోదరుడైన వెంకట్రామిరెడ్డికి తెలియచేసింది వారేనని చెప్పడం జరిగిందన్నారు. తమపై దా-డి చేయించిన వ్యక్తులైన మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిల పేర్లు లేకుండా కేసుల నమోదుచేశారన్నారు. హైకోర్టు న్యాయవాది సహా, తమను దారుణంగా చం-ప-డా-ని-కి యత్నించినవారిని వదిలేసి, అనామకులపై కేసులుపెట్టి, విచారణ పేరుతో తమను మాచర్లకు రమ్మనడం చూస్తుంటేనే, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో.. ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పోలీసులు పంపిన నోటీసుపై తాము హైకోర్టులో ప్రైవేట్ కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు బొండా తెలిపారు. వైసీపీ కార్యకర్తలకన్నా ఎక్కువగా అత్యుత్సాహంతో పనిచేస్తున్న గుంటూరు రూరల్ ఎస్పీ, మరికొందరు పోలీసులను నమ్మలేకే తాము కోర్టును ఆశ్రయిస్తున్నట్లు టీడీపీనేత స్పష్టం చేశారు. తమపై హ-త్యా-య-త్నం జరిగిన నాటినుంచి, పోలీసులు స్పందిచింన తీరు సహా, అన్ని వివరాలను హైకోర్టు దృష్టికి తీసుకెళతామన్నారు.

గుంటూరు రూరల్ ఎస్సీ, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కాల్ డేటాతో పాటు, తమ కాల్ డేటాను కూడా పరిశీలించి తీరాల్సిందేనని ఉమా స్పష్టంచేశారు. కాల్ డేటా వివరాలన్నీ మీడియా ముందు పెట్టి, డీజీపీ కార్యాలయంలో విచారణ జరిపితే, తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. ఆ విచారణలో రామకృష్ణారెడ్డి ప్రమేయం ఏమిటి... తురకా కిశోర్ ఎవరు.. అతనితో ఎవరు మాట్లాడారు అన్నీ తెలుస్తాయన్నారు. మాచర్లకు, తమకు సంబంధంలేదని, తామెవరమో.. తాము మాచర్లకు ఎందుకు వస్తున్నామో... ఆ వివరాలన్నీతురకా కిశోర్ కు ఎవరిచ్చారో తెలియాలన్నారు. తమపై దా-డి చేయడానికి మూడుచోట్ల స్కెచ్ లు వేసిందెవరు.. వెల్దుర్తి వాసులు మమ్మల్ని అడ్డుకోవడమేంటి.. పోలీస్ స్టేషన్ కి పర్లాంగు దూరంలోనే తమపై హ-త్యా-య-త్నం జరిగితే అవేమీ పట్టించుకోకుండా, మరలా విచారణకు రావాలని పోలీసులే చెప్పడం చూస్తుంటే, మరోసారి మమ్మల్ని చం-పేం-దు-కే-న-నే విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశించినా కూడా సదరు పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వంవిధుల్లో కొనసాగించడం చూస్తుంటే తమ అనుమానాలన్నీ నిజమేనని అనిపిస్తోందన్నారు. వ్యవస్థలను కాపాడేది న్యాయస్థానాలేనని, వాటిలో తమకు న్యాయం జరుగతుందున్న నమ్మకం ఉందని, అందుకే ప్రైవేట్ కేసు వేయాలని నిర్ణయించుకున్నామన్నారు.

జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి కులాన్ని అంటగట్టడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ, భర్తీచేసిన ప్రభుత్వ పదవుల్లో ఎంతమంది తనకులంవారిని నియమించాడో, స్థానికఎన్నికల కోసం ప్రభుత్వం తరపున నియమించిన 5గురు వ్యక్తుల్లో రెడ్లు తప్ప వేరేకులంవారు లేరని, తన ఇష్టానుసారం రెడ్లను ప్రోత్సహి స్తున్న ఆయన, ఇతరులకు కూడా దాన్నే ఆపాదించాలని చూడటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో మండలిలోకూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన రెడ్ల జాబితాను తాను చదివి వినిపించాన న్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి మరీ రౌ-డీ-యి-జం – పోలీస్ వ్యవస్థలను కలిపి ఎన్నికలను భ్రష్టు పట్టించాకనే రాష్ట్రంలో కరోనా వచ్చిందన్నారు. వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగాయని, డబ్యుహెచ్ వో (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేష న్) అన్ని దేశాలను హెచ్చరించి, గ్లోబల్ ఎమర్జన్సీ ప్రకటించడం జరిగిందన్నారు. దేశాలతో పాటు రాష్ట్రాలను కూడా హెచ్చరించారన్నారు. ఈనేపథ్యంలో ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికలను 6వారాలు వాయిదా వేయడంజరిగిందని,ఎస్ఈసీ (స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ముఖ్యమంత్రి జగన్ కు ఎక్కడిదని యనమల నిలదీశారు.

ఆర్టికల్ 243-కే గానీ, ఆర్టికల్ 243-జెడ్ (ఏ) గానీ చదువుకుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఏమాత్రం తక్కువకాదని అర్థమవుతోందన్నారు. రెండూ సంస్థలు కూడా ఒకేవిధమైన అధికారాలు కలిగి ఉంటాయని, ఎన్నికలవేళ వాటి పనితీరుని, నిర్ణయాధికారాలను తప్పుపట్టే అధికారం ఎవరికీ ఉండబోదన్నారు. అటువంటి వ్యవస్థను అవమానించేలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని, ఆయన వైఖరి చూస్తుంటే, రాజకీయనాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన పనికిరాడని స్పష్టమవుతోందన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే రాజ్యాంగవ్యవస్థలను అవమానపరుస్తుంటే, ఆయా వ్యవస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత అటురాష్ట్రపతికి, గవర్నర్ కు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తగిన సమాచారం తెప్పించుకొని, వెంటనే ఆయనపై గవర్నర్, రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని యనమల విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఏదయితే మాట్లాడారో.. దానికి అనుకూలంగానే సీఎస్ లేఖ రాశారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రితోపాటు, ఆమెకు కూడా ఏవిధమైన అధికారాలుండవని తెలిసీకూడా లేఖరాసి, ఎన్నికలకమిషనర్ ని ఒత్తిడిచేయాలని చూడ టం ద్వారా ఆమె కూడా తప్పుచేసిందన్నారు.

కొందరు అధికారులు, పోలీస్ వ్యవస్థ కలిసి ప్రభుత్వానికి సహకరిస్తూ, ప్రతిపక్షాలను అణచివేసే ధోరణితో ముందుకెళుతున్నారని, అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ల రూల్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని, వాటికి అనుగుణంగా పనిచేయకుండా, వ్యతిరేకంగా పనిచేస్తే వారిపై కూడా చర్యలు తీసుకునే అధికారం భారత ప్రభుత్వానికి ఉంటుందన్నారు. ఆ విథంగా నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన కేంద్ర సర్వీసులకు చెందిన ఉద్యోగుల వివరాలనుకూడా సేకరించి డీవోపీటీకి పంపుతున్నామని యనమల చెప్పారు. ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయి, చెప్పిందానికల్లా తలాడిస్తూ, ప్రతిపక్షంపై కక్షసాధింపులకు పాల్పడిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టేదిలేదని ఆయన తేల్చిచెప్పారు. డీవోపీటీకి అటువంటి అధికారుల జాబితాను తెలుగుదేశంపార్టీ తరుపున పంపిస్తామన్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించనంత మాత్రాన 14వ ఆర్థిక సంఘం నిధులేవీ రాష్ట్రానికి రాకుండా పోవని, ముఖ్యమంత్రి యొక్క తప్పుడు ఆలోచన, తప్పుడు విధానాలను ఆయన ప్రజలపై రుద్దాలని చూడటం దురదృష్టకరమన్నారు. కరోనాప్రభావం దృష్ట్యా ఎన్నికలు వాయిదావేస్తే, దాన్ని తప్పుపట్టేలా ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడటం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కేంద్రప్రభుత్వ నిధులు, కేంద్రానికి – రాష్ట్రాలకు సంబంధించినవి తప్ప, దానితో 14వ ఆర్థిక సంఘానికి ప్రమేయం ఉండదన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో స్థానిక ఎన్నికలను నిర్వహిస్తే, తమప్రభుత్వం వచ్చాక కేంద్రం నుంచి నిధులు వచ్చాయన్నారు. ఎన్నికలు నిర్వహిస్తేనే నిధులిస్తామని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్నారు. కేవలం వైసీపీ ప్రభుత్వం ఆ విధంగా అపోహలు సృష్టించి, తెలుగుదేశాన్ని దోషిగా చూపాలని చూస్తోందన్నారు. తెలిసీ తెలియకుండా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రికూడా పూర్తిగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని యనమల హితవుపలికారు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రభుత్వంచేసిన అక్రమాలన్నింటికీ, ఎన్నికల కమిషనర్ వత్తాసుల పలకలేదన్న అక్కసుతోనే జగన్ ప్రభుత్వం, ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. సుప్రీంకోర్టుకూడా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోదని తాను భావిస్తున్నానని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని అవమానించేలా మాట్లాడిన ముఖ్యమంత్రి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో దేశంలో బీహార్, పశ్చిమబంగా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు కూడా ఎన్నికలను వాయిదా వేసుకున్నాయన్నారు. తిరిగి ఎన్నికలు నిర్వహిస్తే, నష్టపోతామన్న భావన ముఖ్యమంత్రిలో ఉన్నందునే, ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లాడన్నారు.

Advertisements

Latest Articles

Most Read