ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేయగానే, ఆదరాబాదరగా మీడియాముందు కు వచ్చిన జగన్, తన అక్కసునంతా వెళ్లగక్కి, కరోనా రాష్ట్రంలో ఎక్కడుందంటూ విపరీత ధోరణితో మాట్లాడాడని, ఆయన తన వింతచేష్టలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా డని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదకరస్థాయిలో ఉందంటే రాష్ట్రప్రభుత్వంగానీ, ముఖ్యమంత్రిగానీ పట్టించుకోలేదన్నారు. ప్రజలను రక్షించాలన్న ఆలోచన చేయకుండా, ఎన్నికల కోసం, ఎన్నికల కమిషనర్ పై ముఖ్యమంత్రి నిందలేశాడన్నారు. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకుంటుందనే వివరాలను ఇంతవరకు ముఖ్యమంత్రిగానీ, మంత్రులు, ఇతర ప్రభుత్వపెద్దలు గానీ వెల్లడించలేదన్నారు. మనుషుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, ప్రపంచ దేశాధినేతలందరూ మీడియా ముందుకు వచ్చి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం, కరోనా జాగ్రత్తలు వారికి వివరించడం, తమ తమదేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవడం వంటివి చేస్తుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం, తనదారిలో తాను వింతపోకడతో ముందుకు సాగుతున్నాడ న్నారు. కరోనా ప్రభావం అంత సీరియస్ గా ఉంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కమాట కూడా దాని గురించి మాట్లాడలేదన్నారు. ఎన్నికల్లో ఎలా దౌ-ర్జ-న్యాలు- చేసి, తనపార్టీని గెలిపించుకోవాలన్న తాపత్రయం తప్ప, ముఖ్యమంత్రిలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచనలు లేవన్నారు.

సీఎం ఇంట్లో కూర్చొని, ఎవరు ఏ లేఖరాశారు.. ఎవరు చెబితే రాశారు.... తెలుగుదేశం ఏం చేస్తోందన్న ఆరాలు తీస్తున్నాడు గానీ, కరోనా ప్రభావంపై నామమాత్రం కూడా దృష్టి పెట్టడంలేదన్నారు. ఎన్నికల వాయిదాపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, తద్వారా ప్రభుత్వానికి చీవాట్లు మిగిలాయన్నారు. ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు అధికారపార్టీకే ఏకగ్రీవమయ్యాయని, అధికారులు, పోలీస్ వ్యవస్థ సహాయసహాకారాలతో కొన్నిప్రాంతాల్లో 75శాతం పైగా స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదెలా సాధ్యమవుతుందని యనమల ప్రశ్నించారు. ఈ ఏకగ్రీవాలు చూస్తుంటేనే వైసీపీ ఏ స్థాయిలో దౌ-ర్జ-న్యా-లు చేసిందో అర్థమవుతోందన్నారు. ఏకగ్రీవాలపై ప్రతిపక్షంనుంచి వచ్చిన ఎన్నికలఫిర్యాదులపై ఏవిధమైన చర్యలు తీసుకోలే దని, చాలాస్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడంపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల ను వాయిదా వేసే అధికారం ఎన్నికల కమిషన్ కే ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధిరాలేదన్నారు. ఎన్నికలు వాయిదావేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారనే భయంలో వైసీపీ ఉందన్నారు. అలా జరిగితే వైసీపీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన లేఖలో కేంద్ర బలగాల ప్రస్తావనతో పాటు, తన భద్రతగురించి కూడా చెప్పడం జరిగిందన్నారు.

ఏకగ్రీవమైన స్థానాలను అడ్డుపెట్టుకొని, ఏదోరకంగా ఎన్నికలు నిర్వహింపచేసుకోవాలన్న దురుద్దేశంలో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ తో, ఒక్క వైసీపీమినహా, అన్ని పార్టీలవారు నేడు గవర్నర్ ని కలవబోతున్నా రని, వారంతా కూడా తిరిగిఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ చేస్తారన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూశాక, తనకున్న విచక్షణాధికారంతో ఎన్నికలు వాయిదావేయాలని ఎన్నికల కమిషనర్ లేఖ రాస్తే, దానిపై వైసీపీ ఎందుకింతగా ఉలిక్కి పడుతుందని యనమ ల ప్రశ్నించారు. ఒకవేళ కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తే, రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదని, దాంతో తమఆటలుసాగవన్నభయంతోనే వైసీపీ బెంబేలెత్తిపోతుం దన్నారు. ఆభయంతోనే ఎన్నికల కమిషనర్ ని, ఎన్నికలసంఘాన్ని దుర్భాషలాడు తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగిన అ-రా-చ-కా-లు, దౌ-ర్జ-న్యా-లతో- పాటు, అనేకస్థానాలను ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రభుత్వం చేసిన దురాగతాలను ఎన్నికల కమిషనర్ తనలేఖలో ప్రస్తావించాడని, తనకు, తనకుటుంబానికి ము-ప్పు ఉన్నందున భద్రత పెంచాలనికూడా ఆయన విజ్ఞప్తిచేశాడన్నారు. దానిలో తప్పేముందో... ఈసీ లేఖపై ప్రభుత్వం ఎందుకింతలా గింజుకుంటుందో తెలియడంలేదన్నారు.

ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్లే, ఎన్నికల కమిషనర్ ఢిల్లీ తలుపుతట్టాడని, ఈసీ రాసిన లేఖపై ప్రశ్నించే అధికారం వైసీపీ ప్రభుత్వానికి, పార్టీకి ఎక్కడిదని యనమల నిలదీశారు. ప్రాధాన్యత పోస్టుల్లో 250మంది రెడ్లను పెట్టుకొని, ఎన్నికల నిర్వహణను కూడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలైన రెడ్లకు అప్పగించిన జగన్మోహన్ రెడ్డి, కులాల పేరుతో గిట్టనివారిపై దాడిచేయడం ఎంతవరకు సమంజసమని రామకృష్ణుడు నిలదీశారు. కుల రాజకీయాల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేనేలేదన్నారు. రాజ్యాంగంలో ప్రభుత్వ పరిధేమిటో తెలుసుకోకుండా, ఫా-సి-స్టు మనస్తత్వంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడన్నారు. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, దాన్ని అడ్డంపెట్టుకొని దోచేయడానికి, ప్రజలను నాశనం చేయడానికే ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు తప్ప, ప్రజల గురించి, వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా గురించి, ముఖ్యమంత్రిగానీ, ఆరోగ్యశాఖా మంత్రి, ఆరోగ్యశాఖ కార్యదర్శి గానీ ఎవరూ మాట్లాడటంలేదన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్నఅభివృద్ధి పనులను కొనసాగించవచ్చని, కొత్తగా వేటినీ ప్రారంభించడానికి అవకాశం లేదని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. వ్యక్తిగతలబ్ధి చేకూర్చే పథకాలు, కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టడానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగిందన్నారు. తాను స్పీకర్ ననే విషయం మర్చిపోయి, ఎన్నికల కమిషనర్ ని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని, ఆయనపై పై పరువునష్టం దావా వేయవచ్చన్నారు. వ్యవస్థలను కాపాడాల్సిన వ్యక్తే, రాజకీయ నాయకుడిలా మారిపోయి, స్పీకర్ ననే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తే, ఆయన్ని ప్రశ్నించే అధికారం ప్రతిపౌరుడికి ఉంటుందన్నారు.

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మ-ర-ణం వెనుక రిలయన్స్ పాత్ర ఉందని ప్రచారం చేసి,, గతంలో ఆయా సంస్థల ఆస్తుల వి-ధ్వం-సా-ని-కి కారణమైన జగన్మోహన్ రెడ్డి, నేడు ముఖ్యమంత్రయ్యాక ఆనాడు ఆస్తుల ధ్వం-సా-ని-కి పాల్పడిన వారిపై ఉన్న కేసులను ఎత్తివేయడం సిగ్గుచేటని టీడీపీనేత, ఆపార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు ఇష్టంలేనివారిపై కేసులు పెట్టడం, తనకు నచ్చినవారిపై కేసులు ఎత్తివేయడం ముఖ్యమంత్రికి ఫ్యాషన్ గా మారిందన్న బుద్దా, వి-ధ్వం-స-కా-రు-లపై ఉన్న కేసులు ఎత్తివేయడానికి వారేమన్నా స్వాతంత్ర్య సమరయోధులా అని నిలదీశారు. జగన్ చట్టానికి, న్యాయానికి విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నాడన్నారు. దాదాపు 95రోజులనుంచి రాజధాని అమరావతికోసం ఆందోళనలు చేస్తున్న మహిళలు, రైతులపై తప్పుడుకేసులు పెట్టించిన ముఖ్యమంత్రికి, ఆ కేసులు ఎత్తివేయాలన్న ఆలోచన రాకపోవడం దుర్మార్గమన్నారు. అమాయకులైన రైతులు, మహిళలు, యువతపై అరాచక చర్యలకు పాల్పడటం జగన్ కే చెల్లిందన్నారు. తాను సీఎం అవ్వగానే, తన స్వప్రయోజనాలకోసం రిలయన్స్ వారికి సన్మానంచేయడంతో పాటు, ఆసంస్థల ఆస్తులు ధ్వంసం చేసినవారిపై కేసుల ఎత్తివేయడం ద్వారా జగన్ తన వైఖరిని ప్రజలకుతెలియచేశాడన్నారు.

అమాయకులను లోపలవేయించడం, నేరస్తుల ను, రౌ-డీ-ల-ను బయటకు తీసుకురావడం వంటి అజెండాతోనే ఆయన పాలన సాగిస్తున్నాడన్నారు. ఆనాడు జరిగిన ఆస్తుల ధ్వం-సం-లో జగన్ మామ గంగిరెడ్డికి చెందిన పెట్రోల్ బంక్ పై దా-డి జరగలేదన్నారు. జీవో నెం-314 ద్వారా, రిలయన్స్ సంస్థలపై దా-డు-ల-కు పాల్పడిన వారిని బయటకు తీసుకురావడం జరిగిందన్నారు. ఎర్రచందనం స్మగ్లర్, మాజీ ముఖ్యమంత్ర చంద్రబాబునాయుడిపై అలిపిరివద్ద జరిగిన హ-త్యా-య-త్నం కేసులో ప్రధాన ముద్దాయి అయిన గంగిరెడ్డిపై ఉన్నకేసులను ఎత్తివేయడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని బుద్దా స్పష్టంచేశారు. వైసీపీకి రహస్య సలహాదారుగా కూడా గంగిరెడ్డి వ్యవహరిస్తున్నాడని, ఆయనపై ఉన్న కేసులు జగన్ ఎత్తివేయబోతున్నాడన్నారు. సొంతబాబాయి వై.ఎస్.వి-వే-కా-నం-ద-రె-డ్డి-ని దారుణంగా చం-పిం-చి, ఆయన హ-త్య కేసులో చంద్రబాబు పాత్ర ఉందని, దుష్ప్రచారం చేసిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక ఆకేసు విచారణను సీబీఐకి అప్పగించకుండా తప్పుకున్నాడన్నారు.

ప్రభుత్వ అరాచకాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన తొలుత స్పందించలేదని, అటువంటి వ్యక్తికి కులాన్ని ఆపాదించి, చంద్రబాబే ఆయనతో చెప్పి, ఎన్నికలు వాయిదా వేయించాడని నీచమైన ప్రచారం చేయడం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. శాసనమండలిలో కూడా ఛైర్మన్ పై దా-డి జరిగినప్పుడు వైసీపీ నేతలు ఎంతటి దుర్మార్గంగా ప్రవర్తించారో ప్రజలంతా చూశారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఘో-రా-లు, దా-రు-ణా-లు చూడటంతోపాటు, కరోనా వ్యాప్తి ఉధృతమవతున్న వేళ, విధిలేని పరిస్థితుల్లో ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదావేస్తే, ఆయనపై కులముద్ర వేసి నీచంగా మాట్లాడిన నీచజాతి వైసీపీవారని బుద్దా మండిపడ్డారు. తానొక స్పీకర్ నని, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నాననే ఇంగితం కూడా లేకుండా తమ్మినేని సీతారాం, ఎన్నికల కమిషనర్ ని ఉద్దేశించి కమ్మ వైరస్ అని వ్యాఖ్యానించడం ఎంతటి దిక్కుమాలిన తనమో స్పీకరే సమాధానం చెప్పాలన్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తనను కలిసేవరకు జగన్ కు వి-ధ్వం-స-కా-రు-ల భావోద్వేగాలు గుర్తురాలేదా అని వెంకన్న నిలదీశారు. జగన్ తక్షణమే తాను ఇచ్చిన జీవో-314ని రద్దుచేయాలని, ఒకవేళ అలా చేయకపోతే, అమరావతి ఆందోళనకారులపై పెట్టిన తప్పుడుకేసులను కూడా వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై, జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటలిజెన్స్ చీఫ్ మనీశ్ తో అత్యవసరంగా భేటీ అయ్యారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో, రాష్ట్రంలో పరిస్థితి పై చర్చించటానికి అని చెప్తున్నా, కరోనాకి పోలీసులుకు ఏమి సంబంధం అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిన్న స్టేట్ ఎలక్షన్ కమీషనర్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై, కేంద్రానికి లేఖ రాస్తూ, తన ప్రాణాలకి ముప్పు ఉంది,భద్రత కల్పించండి అంటూ రాసిన లేఖ పై, జగన్ వారితో చర్చిస్తున్నారని తెలుస్తుంది. కేంద్ర హోం శాఖకు ఈ లేఖ రాయటంతో, కేంద్ర హోం శాఖ నివేదిక కోరితే, ఏమి చెప్పాలి అనే దాని పై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే, డీజీపీ కూడా, కేంద్రానికి ఇవన్నీ తప్పు అని ఖండిస్తూ లేఖ రాస్తే ఎలా ఉంటుంది అనే దాని పై కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, రాజకీయ వాతవరణం పై కూడా, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ నుంచి, సమాచారం తెలుసుకున్నారని, తెలుస్తుంది. మరి దీని పర్యావసానాలు ఎలా ఉంటాయో చూడాలి.

మరో పక్క, కరోనా వైరస్ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేయడంతో తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని అందుకే కేంద్ర పోలీస్ బలగాలతో తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ఎన్నికలకమిషనర్ రమేష్ కమార్ రాసినట్లు చెబుతున్న లేఖ బుధవారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మీడియా వర్గాల్లో చక్కర్లు కొట్టిన లేఖలో సారాంశం ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన దగ్గర నుంచి అధికార పార్టీ ఇష్టానుసారం వ్యవహరిస్తుందని దీనికి కొంతమంది అధికారులు, పోలీసులు సహకరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా మారిన స్థానిక అధికార యంత్రాంగంతో చేయిదాటిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఎదురుండకూడదని ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే మంత్రులకు పదవీ గండం, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్ల గండం ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నట్లు తెలిపారు. సీఎం ఆ విధంగా వ్యవహరించడంతో ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందని, ప్రధాన ప్రతిపక్షాలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేనలకు చెందిన అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులు
పెట్టారన్నారు.

2014లో ఎంపీటీసీ ఎన్నికల్లో కేవలం 2 శాతం మాత్రమే ఏక్రగీవాలు ఉండగా ప్రస్తుతం 24 శాతం ఏకగ్రీవమయ్యాయని, అదే విధంగా 2014 జెడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం 0.09 శాతం ఏకగ్రీవాలు ఉండగా ఈసారి రికార్డు స్థాయిలో 10 శాతం ఏక్రగీవాలయ్యాయన్నారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలకు ఇదే నిదర్శనమన్నారు. కడప జిల్లాలో ఎంపీటీసీలకు సంబంధించి 79 శాతం, జెడ్పీటీసీలకు సంబంధించి 76 శాతం ఏకగ్రీవమవ్వడం పరిస్థితికి అద్దం పడుతుందని ఎస్ఈసీ పేర్కొన్నారు. 35 చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా 23 చోట్ల వేసిన నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపచేశారని ఆరోపించారు. అదే విధంగా 55 చోట్ల ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులు చేశారని లేఖలో స్పష్టం చేశారు. జాతీయ విపత్తు కారణంగానే.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాము ముందునుంచి చెబుతున్న జాగ్రత్తలను తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంశాఖకు పంపినట్లు ప్రచారంలో ఉన్న లేఖలో ఎఈసీ పేర్కొన్నారు. రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ సంచలనం సృష్టించిన ఎస్ఈసీలేఖకు సంబంధించి ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ ను స్పష్టత కోరేందుకు ప్రయత్నించినా ఆయన నేను ఈ లేఖ రాసాను అని కాని, రాయలేదు అని కాని చెప్పకపోవటం చూస్తుంటే, ఈ లేఖ ఆయనే రాసినట్టు అర్ధం అవుతుంది.

రాష్ట్ర ఎన్నికల కమీషనర్, తనకు కేంద్ర భద్రత కావాలి అంటూ నిన్న లేఖ రాసిన నేపధ్యంలో, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కార్యాలయానికి కేంద్ర బలగాలు చేరుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి భద్రత పెంచారు. ఎస్ఈసీ కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. బందర్ రోడ్డులోని రాష్ట్ర కార్యాలయానికి సీఆర్పీఎఫ్ పోలీసులు చేరుకున్న. ఎస్ఈసీ కార్యాలయం వద్ద 10 మంది సీఆర్పీఎఫ్ సీబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. గన్నవరం లోని 39బెటాలియన్ నుంచి వచ్చిన సీఆర్ పీఎఫ్ బలగాలు. 1ఎస్సై, 1 హెడ్ కానిస్టేబుల్ , 8మంది కానిస్టేబుళ్లతో ఎస్ఈసీ కార్యాలయానికి భద్రత కల్పిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, రమేశ్ కుమార్‌కు 1+1 నుంచి 4+4కి ప్రభుత్వం నిఘా పెంచింది. ఉదయం నుంచి 4+4 సెక్యూరిటీ విధుల్లో చేరింది. మరో పక్క, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, సీఎస్‌ నీలం సాహ్ని భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికలపై సుప్రీంతీర్పు అనంతరం తదుపరి పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే రమేష్ కుమార్ రాసిన లేఖ పై కూడా అనుమానాలు ఉన్నాయి అంటూ, చెప్తూ ఉండటంతో, వాటి పై కూడా చర్చించారు. మరో పక్క ఇదే అంశం పై, స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి నుంచి నిర్వహించాలని, రాజకీయ పక్షాల నేతలు గవర్నర్​ బిశ్వభూషణ్​ను కోరారు. ఏకగ్రీవాలు సహా అన్నింటిని రద్దుచేసి రీనోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాజకీయ పక్షాల నేతలు కలిశారు. స్థానిక ఎన్నికలు మళ్లీ మొదటినుంచి నిర్వహించాలని 10 పేజీల వినతిపత్రం అందజేశారు. ఏకగ్రీవాలు సహా అన్నింటిని రద్దు చేసి రీనోటిఫై చేయాలని కోరారు. ఎస్‌ఈసీ పేరిట వచ్చిన లేఖను ఈసీ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషనర్​ భద్రత విషయం కూడా గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లినట్లు విపక్ష నాయకులు తెలిపారు. రాష్ట్రంలో పరిణామాలన్నీ ఆయనకు వివరించినట్లు పేర్కొన్నారు.

అయితే వైసీపీ మాత్రం ఆ లేఖ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఎన్నికల కమిషనర్​ రమేష్ కుమార్ పేరిట ఉన్న ఓ జీ మెయిల్ ఖాతా నుంచి హోంశాఖకు రాసిన లేఖ రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన విధంగా ఉందని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖకు లేఖ ఎవరు రాశారన్న అంశం తక్షణమే తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసి, కుట్ర వెనుక ఎవరున్నారనేది బయటపెడతామని అన్నారు. కొందరు కావాలనే రాష్ట్రప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లేఖలో రాసిన విషయాన్ని ఎన్నికల కమిషనరే బయట పెట్టాలని డిమాండ్​ చేశారు. తెదేపాకు అనుకూలంగా వ్యవహరించిన ఎన్నికల సంఘం దారుణంగా విఫలమైందని వైకాపా ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ హోం శాఖకు లేఖ రాశారో లేదో కూడా చెప్పలేని స్థితిలో ఎన్నికల కమిషనర్ ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisements

Latest Articles

Most Read